house pattas
-
టీడీపీ అడ్డుకున్నా ఆగలేదు..ఘనంగా జగనన్న ఇళ్ళ పట్టాల జాతర
-
ఒకే రోజు 25,000 ఇళ్ల పట్టాలు..
-
అంతరాలు అంతం
పేదలకూ పెద్దల తరహాలోనే ఇళ్ల పట్టాల విషయంలో ఆ రోజు నేను అధికారులందరినీ ఒకటే అడిగా. మీకు, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రముఖులకు ప్రభుత్వం ఎలా ఇస్తోందని అడిగితే దానికి వేరే పద్ధతి ఉందన్నారు. ప్రముఖులకు ఇచ్చే విధానంలో, పూర్తి హక్కులతో రాష్ట్రంలో ప్రతి నిరుపేదకూ ఇంటి పట్టాలివ్వాలని ఆదేశాలివ్వడమే కాకుండా చట్టంలో మార్పులు చేశాం. ఈరోజు అవే పూర్తి హక్కులతో పట్టాలన్నీ రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ నా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నాం. - ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పేదలకో న్యాయం.. పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని సమూలంగా మారుస్తూ 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పేదలకు ఉచితంగా అందించిన ఇళ్ల పట్టాల నుంచి విద్య, వైద్యం, సామాజిక రంగాలలో ఇదే ఒరవడిని అనుసరిస్తూ ధనిక – పేద అంతరాలను తొలగిపోయేలా విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు. నాడు – నేడుతో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ చదువులను పేదింటి పిల్లలకు చేరువ చేయడంతోపాటు ఖరీదైన, నాణ్యమైన వైద్యాన్ని సర్కారీ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద లబ్దిదారులకు సర్వ హక్కులతో రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పది రోజుల పాటు పండుగలా కొనసాగనున్నాయి. రెండు రకాల రూల్సా..? దేశ చరిత్రలో తొలిసారిగా 31 లక్షల మందికి ఇచ్చిన డీ పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్న కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి జరుగుతోంది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం, మంచి చేయడంలో గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో అంతా గమనించాలి. పేదల బతుకులు మారి వారి బిడ్డలు గొప్పగా ఎదిగేలా 58 నెలలుగా మన ప్రతి అడుగూ పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. ఐఏఎస్లు, ఎమ్మెల్యేలు, ఇతర పెద్దలకు ఇచ్చే ప్లాట్లకు విధించే నిబంధనలే పేదలకూ వర్తింపచేయాలనే ఉద్దేశంతో కన్వేయన్స్ డీడ్లతో రిజిస్ట్రేషన్ చేసి అందిస్తున్నాం. రాష్ట్రంలో రెండు రకాల నిబంధనలు ఉన్నట్లు తెలుసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. పేదలకు ఒక రకంగా, పెద్దలకు మరో రకంగా నిబంధనలు ఉండటం సరికాదు. అలాంటి విధానాలపై తిరుగుబాటు చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. 58 నెలల ప్రయాణంలో ప్రతి అడుగూ అలాగే వేస్తున్నాం. చదువుల్లో అంతరాన్ని తొలగిస్తూ.. పేదలకో న్యాయం, పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని మార్చేయాలనే తపనతో మన అడుగులు పడ్డాయి. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు పేద పిల్లలు గవర్నమెంట్ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుతుంటే డబ్బున్న వారి పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా మన గవర్నమెంట్ స్కూళ్లలో నాడు–నేడుతో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లిష్ మీడియంతో పాటు బైలింగ్యువల్ బుక్స్, బైజూస్ కంటెంట్, 8వ తరగతి నుంచి ట్యాబ్లు అందిస్తున్నాం. 6వ తరగతి నుంచి ప్రతి క్లాసు రూములో డిజిటల్ బోధన. ఐఎఫ్పీ ప్యానళ్లు అందుబాటులోకి తెచ్చాం. పేద పిల్లలు కాన్వెంట్ డ్రస్, షూస్ వేసుకుని చిరునవ్వుతో ప్రభుత్వ స్కూళ్లకు వెళుతున్నారు. సీబీఎస్ఈ నుంచి ఐబీ విద్యా విధానం స్థాయికి గవర్నమెంట్ బడులను తీసుకెళుతున్నాం. పెద్ద చదువులు చదివే పిల్లలకు వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ విద్యాదీవెన, వసతి దీవెనతో పాటు కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, ఎంఐటీ, హార్వర్డ్ లాంటి ప్రఖ్యాత వర్సిటీల నుంచి ఉచితంగా ఆన్లైన్లో కోర్సులు చదివేలా మనందరి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డబ్బులేని వారి పిల్లలకు, డబ్బున్న వారి పిల్లలకు మధ్య చదువుల పరంగా అంతరాన్ని చెరిపేయడం అంటే ఇదీ అని చెప్పడానికి గర్వపడుతున్నా. పేదలకు, పెద్దలకు ఒకే రకమైన వైద్యం ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం ఇవాళ పేదలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,000కి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు 3,300 ప్రొసీజర్లకు తీసుకెళ్లింది మన ప్రభుత్వమే. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షల వరకు ఉచితంగా విస్తరించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. అంతేకాకుండా శస్త్ర చికిత్సల తరువాత రోగి విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు చేతిలో పెడుతూ ఆరోగ్య ఆసరా తెచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష ద్వారా ఉచితంగా వైద్యంతోపాటు మందులు కూడా అందుతోంది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. నేను చెప్పే ప్రతి మాటా కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా. గతానికి, ఇప్పటికి మధ్య తేడాను గమనించండి. పేదలకు, పెద్దలకు ఒకే రకమైన వైద్యం అందించడం అంటే ఇదీ. బడుగు, బలహీన వర్గాలకు పదవులు గతంలో పెత్తందార్ల మనుషులు మాత్రమే అనుభవించిన నామినేటెడ్ పదవులను చట్టం చేసి ఏకంగా 50 శాతం బడుగు, బలహీన వర్గాల చేతుల్లో పెట్టింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. సామాజిక అంతరాలను చెరిపేయడం అంటే ఇదీ. సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత అంటే ఇదీ. పేదల ఆంధ్రప్రదేశ్ వేరు... డబ్బున్న వారి ఆంధ్రప్రదేశ్ వేరు అనే భావాలను పూర్తిగా తుడిచి వేస్తూ, పేదలకో న్యాయం – డబ్బున్న వారికో న్యాయం అనే విధానాలను రద్దు చేస్తూ మన అడుగులు పడ్డాయి. సచివాలయాల్లో సర్టిఫైడ్ కాపీలు.. రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ వల్ల ఆస్తిపై అక్కచెల్లెమ్మల హక్కులు భద్రంగా ఉంటాయి. దొంగ సర్టిఫికెట్లు సృష్టించేందుకు వీలుండదు. ఎప్పుడు పడితే అప్పుడు రద్దు చేయలేరు. సచివాలయాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆస్తికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఎన్నిసార్లైనా పొందవచ్చు. అందులో హక్కుదారు మీరే అన్న విషయం సచివాలయాల్లో శాశ్వతంగా, భద్రంగా ఉంటుంది. సరిహద్దు రాళ్లతో స్థలం వద్ద అక్కచెల్లెమ్మల ఫొటో తీసి జియోట్యాగింగ్ చేసి ఇస్తున్నాం కాబట్టి ఎవరూ కబ్జా చేయలేరు. పదేళ్లు కాగానే ఆ పట్టాలను అమ్ముకునేందుకు, వారసత్వంగా ఇచ్చేందుకు, గిఫ్ట్గా ఇచ్చేందుకు పట్టా భూములున్న వారితో సమానంగా ఆటోమేటిక్గా హక్కులు సంక్రమిస్తాయి. ఆ తేదీ వివరాలతో సహా స్పష్టంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో పొందుపరిచాం. ఎన్ఓసీ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. బ్యాంకు రుణాలు కావాలంటే సులభంగా తక్కువ వడ్డీకే అక్కచెల్లెమ్మలకు అందుతాయి. నా అక్కచెల్లెమ్మలు, పేదలకు ఇచ్చే స్థలాలు, హక్కులు, ఆత్మగౌరవం గురించి ఇంతగా ఆలోచన చేస్తున్న ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూశారా? అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, మంచి తమ్ముడిగా ముఖ్యమంత్రి స్థానంలో వారి బిడ్డ ఉన్నాడు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతున్నాం. ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఇవన్నీ చూస్తుంటే వంద మంది సినిమా విలన్ల కంటే, పురాణాల్లో రాక్షసులందరి కంటే ఒక్క చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అనిపిస్తుంది. చివరికి అమరావతిలో మనం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందంటూ ఆ పెద్దమనిషి నిస్సిగ్గుగా కోర్టుల్లో కేసులు వేసి తన లాయర్లతో వాదించాడు. ఇంత అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తి జంకు లేకుండా ప్రజల్లో తిరుగుతున్నాడంటే ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని వాదిస్తే తల్లిదండ్రులంతా గట్టి గుణపాఠం చెబుతారనే భయం లేకుండా చంద్రబాబు పాపిష్టి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దారుణమైన వ్యాఖ్యలు చేసి కూడా బరితెగించి తిరుగుతున్నారంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? బీసీల తోకలు కత్తిరిస్తా.. ఖబడ్దార్! అని వ్యాఖ్యానిస్తే బీసీలంతా బుద్ధి చెబుతారన్న భయం కూడా లేకుండా ఉండగలుగుతున్నాడంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను మోసగించిన ఈ మాయలోడు ఏ జంకూ గొంకూ లేకుండా ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాడంటే ఇంతకన్నా దారుణం ఉందా? 650 వాగ్దానాలిచ్చి కనీసం 10 శాతం కూడా అమలు చేయకుండా ఎన్నికలొచ్చేసరికి నిస్సిగ్గుగా మళ్లీ కొత్త మేనిఫెస్టోతో సిద్ధమయ్యాడంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా? మన ఖర్మ ఏమిటంటే ఇలాంటి వ్యక్తులతో ఈరోజు మనం రాజకీయాలు చేస్తున్నాం. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మంత్రులు ఆదిమూలపు సురే‹Ù, ధర్మాన ప్రసాదరావు, మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఐజీ రామకృష్ణ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సీనియర్ ఐఏఎస్ ముత్యాలరాజు, కలెక్టర్ ఏఎస్.దినేష్కుమార్, ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెంటు కూడా ఇవ్వకపోగా బాబు కుట్రలు.. 2020 ఉగాది నాటికే ఈ ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెమ్మలకు ఇవ్వాలనుకున్నా కొందరు రాక్షసుల మాదిరిగా అవరోధాలు సృష్టించారు. అధికారంలో ఉండగా పేదవాడికి ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపానపోని చంద్రబాబు ఇవాళ మనం ఇస్తుంటే అడ్డుపడి ఆయన మనుషుల ద్వారా ఏకంగా 1,191 కేసులు దాఖలు చేశారు. వీటిని అధిగమించి ఇవాళ ఒక్క ఒంగోలులోనే 21 వేల మంది పేదలకు సర్వ హక్కులతో ఇళ్ల పట్టాలిస్తున్నాం. ఒంగోలు అర్బన్లో నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం యర్రజర్ల హిల్స్లో 866 ఎకరాలను 2020లోనే గుర్తించి 24 వేల ప్లాట్లతో లే అవుట్లు సిద్ధం చేశాం. ఈ గొప్ప కార్యక్రమానికి అడ్డుపడి చంద్రబాబు, ఆయన మనుషులు కోర్టులో కేసు వేశారు. ఒక్క ఒంగోలే కాకుండా ఏ జిల్లాలో చూసినా చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలివ్వలేదు. మనం ఇస్తుంటే ఆయన అసూయ దాగటం లేదు. ఇవన్నీ దాటుకుంటూ మీ బిడ్డ అడుగులు వేశాడు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్లేశ్వరపురం, ఎన్.అగ్రహారం, వెంగముక్కపాలెం, యర్రజెర్ల గ్రామాలకు చెందిన 342 మంది రైతన్నల దగ్గర నుంచి 536 ఎకరాల భూమిని సేకరించేందుకు రూ.210 కోట్లు ఖర్చు చేసి ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మరో రూ.21.33 కోట్లు లే అవుట్ అభివృద్ధి కోసం వ్యయం చేస్తున్నాం. ఇదే ఎన్.అగ్రహారం, మల్లేశ్వరపురంలో 31 బ్లాక్స్లో, వెంగముక్కపాలెం, యర్రజెర్లలో మరో 32 బ్లాక్స్తో జగనన్న మోడల్ టౌన్ షిప్స్ను పూర్తి మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్నాం. ఎస్టీపీ ప్లాంట్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వాటర్ సప్లయ్ కోసం రూ.247 కోట్లు ఖర్చు చేసేలా ఆదేశాలు ఇచ్చాం. ఒంగోలుకు మంచి చేస్తూ పట్టణంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు మరో రూ.339 కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్కు కూడా ఈరోజే శంకుస్థాపన చేస్తున్నాం. బైబై బాబు అంటున్న బాబు సతీమణి చంద్రబాబును నేను ఇవన్నీ ప్రశి్నస్తే నన్ను సవాల్ చేస్తున్నావా? అంటాడే కానీ ఇంటింటికీ ఫలానా మంచి చేశాను అని మాత్రం చెప్పడు. గ్రామ గ్రామానికీ ఇదిగో ఈ ఈ మంచి చేశానని చెప్పలేడు. జగన్ మాదిరిగా బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి జమ చేశాననే మాటలు ఈ పెద్దమనిషి నోట్లో నుంచి రావు. ఆయన చేయలేదు కాబట్టే చెప్పలేడు. ఒకవైపు ఎన్నికలకు మనమంతా సిద్ధం అంటుంటే.. మరోవైపు చంద్రబాబు భార్య మా అయన సిద్ధంగా లేరని అంటున్నారు. ఏకంగా కుప్పంలోనే బైబై బాబు.. అంటూ ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తున్నాయి. ఇలాంటి చంద్రబాబును రాష్ట్రంలో ప్రజలెవరూ సమర్థించడం లేదు. కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించడంలేదు. ఏపీకి రానివారు, సొంత ఊరు ఏదంటే తెలియని వారు, రాష్ట్రంలో ఓటే లేని వారు, ఇక్కడ దోచుకున్నది పంచుకోవడానికి అలవాటైన నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబును సమర్థిస్తారు. నాకు ఆయన మాదిరిగా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి మద్దతు లేవు. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడాలని కోరుతున్నా. నేను పైన దేవుడిని, కింద మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నా. మధ్యలో దళారులను, బ్రోకర్లను నమ్ముకోలేదు. అడ్డంకులను అధిగమించి.. అధికారంలోకి రాగానే అందరికీ స్థలాలు ఇవ్వడానికి 71,811 ఎకరాలను సేకరించి పంపిణీ చేశాం. 17,005 లే అవుట్లలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు, కరెంటు, మంచినీరు, పార్కులు, కామన్ ఏరియాలు, ఇతర సదుపాయాల కోసం రూ.32 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించగా 8.90 లక్షల ఇళ్లను ఇప్పటికే పూర్తి చేశాం. మిగతావి వివిధ దశల్లో వేగంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఆ ఇంటి స్థలాల విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంది. ఒంగోలులో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలం విలువ గజం రూ.10 వేల పైచిలుకే ఉన్నట్లు ఇంతకు ముందే అధికారులు చెప్పారు. ఇక్కడ రెండు లే అవుట్లలో పేదలకు ఇచ్చిన ఒక్కో స్థలం విలువే రూ.6 లక్షలు కాగా రూ.2.70 లక్షలు ఖర్చు చేసి ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. రోడ్లు, డ్రెయినేజీ, కరెంటు సదుపాయాల కోసం మరో రూ.లక్ష దాకా వెచ్చిస్తున్నాం. ఇలా ఇల్లు పూర్తయ్యే సరికే ఒక్కో ఇంటి విలువ రూ.10 లక్షలు పైమాటే ఉంటుందని చెప్పడానికి సంతోషపడుతున్నా. అక్కచెల్లెమ్మలను మిలియనీర్లుగా చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రూ.7 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా విలువైన స్థిరాస్తిని పెడుతున్నాం. తద్వారా ఏకంగా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు కేవలం ఈ ఒక్క పథకం ద్వారా నా అక్కచెల్లెమ్మల కోసం ఖర్చు చేశామని చెప్పేందుకు గర్వపడుతున్నా. మహిళలకు ఆర్థిక సాధికారత, భద్రత పేదింటి అక్కచెల్లెమ్మల సాధికారత కోసం వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, అమ్మ ఒడి, ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాలతోపాటు దిశ యాప్, సచివాలయంలో మహిళా పోలీసుల ద్వారా అండగా నిలబడ్డాం. నా అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత, భద్రత రెండూ అందుతున్నాయి. ఇవన్నీ గతంలో లేవు. మన పథకాల ఫలితంగా మహిళా ఆర్థిక సాధికారత పెరిగింది. అంతరాలు తగ్గుతున్నాయని నేను చెప్పడం కాదు.. నిన్ననే విడుదలైన జాతీయ గణాంకాలే చెబుతున్నాయి. ఆర్థిక అంతరాలను చెరిపేయడం అంటే ఇదీ. గత 58 నెలల్లో డీబీటీతో ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేయగా ఇందులో 75 శాతం పైచిలుకు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అందించగలిగాం. -
ఇళ్ల పట్టాల్లో చారిత్రక ఘట్టం
సాక్షి, అమరావతి: పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తోంది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందించనుంది. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల జీవితాల్లో సంతోషాలు నింపుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఎన్ అగ్రహారంలో కన్వేయన్స్ డీడ్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన కన్వేయన్స్ డీడ్లు, ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ ద్వారా రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్లను లబ్దిదారులకు అందించనున్నారు. సచివాలయాల్లో సర్టిఫైడ్ కాపీ ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికి అందించడం, వాటిని సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేస్తుండడం దేశంలోనే ప్రథమం. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు ఉండేవి కాదు. “డి’ పట్టాలు కావడంతో అనుభవించడం మినహా హక్కులు లేనందున అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరిస్తూ ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందిస్తోంది. వారి పేరు మీద ఆ పట్టాలను రిజిస్ట్రేషన్ చేస్తోంది. ఈ డీడ్లు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. గతంలో ఇచ్చిన ‘డి’ పట్టాలను క్రమబద్దికరించుకోవడం ఎంత కష్టమో తెలిసిన విషయమే. రెవెన్యూ శాఖ ఎన్ఓసీ ఇవ్వడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ దాన్ని మార్చడం ఓ ప్రహసనమే. అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్లు ఇస్తోంది. రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టారు. ఈ రిజిస్ట్రేషన్ల డేటా మొత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లోని డేటాబేస్లో పదిలంగా ఉంది. లబ్దిదారులు ఎప్పుడైనా అక్కడి నుంచి తమ ఇళ్ల పట్టాకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని పొందే అవకాశం ఉంటుంది. దాన్ని ఫోర్జరీ గానీ, ట్యాంపర్ చేయడానికిగానీ ఆస్కారం ఉండదు. విలువైన స్థిరాస్తి.. ఇంటి స్థలాన్ని ఉచితంగా ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం ఇప్పిస్తోంది. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించడంతో ఇంకో రూ. 40 వేల మేర లబ్ది చేకూరుస్తోంది. మొత్తంగా ఒక్కో లబ్దిదారుడికి రూ. 2.70 లక్షల మేర ప్రయోజనం దక్కుతోంది. మౌలిక వసతుల కల్పనతో ప్రతి ఇంటికి సగటున మరో రూ.లక్ష వరకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ప్రాంతాన్ని బట్టి ఇంటి విలువ రూపేణా కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువ చేసే విలువైన స్థిరాస్తిని సమకూర్చుతోంది. ఇలా సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లో కనీసం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్ల సంపదను పెడుతున్నారు. కుటుంబ సమేతంగా లబ్దిదారులు. ఒంగోలులోని ఎన్ అగ్రహారం వద్ద నేడు సీఎం జగన్ పాల్గొంటున్న బహిరంగ సభకు ఇళ్ల లబ్ది దారులు కుటుంబ సమేతంగా తరలి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఎన్.అగ్రహారంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఒంగోలు వాసుల మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.339 కోట్లు మంజూరు కాగా రోజూ తాగునీరు అందించేలా నగరంలోని పైపులైన్ వ్యవస్థను సమూలంగా మార్పు చేయనున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ పథకానికి సంబంధించి కార్పొరేషన్పై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. 17,005 లేఅవుట్లు.. 71,811 ఎకరాలు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కోసం దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని రీతిలో సీఎం జగన్ ప్రభుత్వం నిధులు వెచ్చించింది. 71,811 ఎకరాలను సేకరించి 31.19 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17,005 లేఅవుట్లు నిర్మించింది. 71,811 ఎకరాల్లో ప్రైవేట్గా 25,374 ఎకరాలు సేకరించారు. ఇందుకు భూసేకరణకు రూ.11,343 కోట్లు ఖర్చు చేసింది. పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల కోసం ఇంత భారీగా భూసేకరణ చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఒక్కో ప్లాట్ విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా పలుకుతోంది. కనీస విలువ రూ.2.5 లక్షల చొప్పున లెక్కించినా ఇళ్ల పట్టాల విలువ రూ.76,000 కోట్లకుపైనే ఉంటుంది. అలాగే సుమారు రూ.60,000 కోట్ల వ్యయంతో 22 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో ఇప్పటికే 8.9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 17,005 జగనన్న లేఅవుట్లలో రూ.32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ, సీవరేజ్, రోడ్లు వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. -
రేపు 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: ఒకేసారి 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టడం ఒక చరిత్ర అని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయ మీడియాతో మాట్లాడుతూ, పూరి గుడిసె లేని ఇంటిని చూడాలనిదే లక్ష్యమన్నారు. 536 ఎకరాల్లో సుమారు 25 వేల మందికి ఇంటి స్థలం లేని పేదలకు రేపు రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. సీఎం జగన్ మాట ఇచ్చాడంటే తప్పడు అనడానికి ఈ బృహత్తర కార్యక్రమం నిదర్శనమన్నారు. కష్ట కాలంలో కూడా 231 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన సీఎం జగన్కు ఎప్పటికీ రుణపడి ఉంటా. టీడీపీ ఇన్ని కుట్రలు చేసినా పేదల పక్షాన ముందుకెళ్తూనే ఉంటాం. సీఎం జగన్ చేతుల మీదుగా రేపు లబ్ధిదారులకు స్థల రిజిస్ట్రేషన్ పత్రాలు అందిస్తాం. అలాగే 339 కోట్ల రూపాయలతో నిర్మించే తాగునీటి ప్రాజెక్టుకి సీఎం శంకుస్థాపన చేస్తారు. పేద, మధ్యతరగతి వర్గాల పక్షాన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధిని, సేవను ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. -
10 లక్షలు దాటిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. రోజుల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. శుక్రవారం సాయంత్రానికి 10.31 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 79,953 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాకినాడ జిల్లాలో 79,892 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. పల్నాడు, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 50 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. మిగిలిన రిజిస్ట్రేషన్లను వారం రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లు పూర్తయిన లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్ల పంపిణీని త్వరలో చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పేదలకు స్థలాలు ఇచ్చినా వాటిపై పూర్తి హక్కులు ఇవ్వకుండా డి–పట్టాలు మాత్రమే జారీ చేశారు. తొలిసారిగా వైఎస్ జగన్ అన్ని హక్కులతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించి ఆ దిశగా అడుగులు వేశారు. ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడే వాటికి వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలని చూసినా చట్టపరమైన ఇబ్బందుల వల్ల ఆ పని ఆలస్యమైంది. అన్ని సమస్యలను అధిగమించి, అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ల తర్వాత జారీ చేసే కన్వేయన్స్ డీడ్లు పదేళ్ల తర్వాత సేల్ డీడ్లుగా మారనున్నాయి. అప్పుడు రెవెన్యూ శాఖ ఎన్ఓసీ అవసరం లేకుండానే పేదలు వాటిని నిరభ్యంతరంగా అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ అయిన నాటి నుంచి వాటిపై ప్రైవేటు భూముల మాదిరిగానే రుణాలు, ఇతర సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది. -
శరవేగంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం రికార్డు స్థాయిలో జరుగుతోంది. 4 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. 2వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. తొలిరోజు 5,000 రిజిస్ట్రేషన్లు జరగ్గా క్రమంగా వాటి సంఖ్య పెరిగింది. సోమవారం ఒక్కరోజే 90,000 రిజిస్ట్రేషన్లు చేశారు. మంగళవారం రాత్రికి లక్ష రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల సమయానికే 60 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన లబ్ధిదారులు.. సాయంత్రం ఇంటికి వచ్చాక రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం వేగంగా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగిన 3 లక్షల రిజిస్ట్రేషన్లలో అత్యధికంగా పల్నాడు జిల్లాలో 24 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత బాపట్ల, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, నంద్యాల జిల్లాల్లో 17 నుంచి 20 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రభుత్వం తరఫున వీఆర్వోలు లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రోజుకు లక్ష రిజిస్ట్రేషన్లు మొత్తం 30.61 లక్షల రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 15.33 లక్షల ఇళ్ల పట్టాల డేటాను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎంటర్ చేశారు. త్వరలో మిగిలిన డేటాను కూడా ఎంటర్ చేయనున్నారు. రోజుకు లక్ష రిజిస్ట్రేషన్లు చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీనిప్రకారం సాధ్యమైనంత త్వరగా మొత్తం రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఆదివారాల్లోనూ రిజిస్ట్రేషన్లు ఆగకూడదని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కన్వేయన్స్ డీడ్ల ముద్రణకు ఏర్పాట్లు రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత కన్వేయన్స్ డీడ్స్ను ముద్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లకు ఈ బాధ్యత అప్పగించారు. ఈ డీడ్లను త్వరలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అన్ని జిల్లాల్లోనూ వాటిని పంపిణీ చేయనున్నారు. దేశ చరిత్రలో పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేస్తున్న ఏకైక ప్రభుత్వంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిలిచింది. ఇప్పటివరకు పేదలకు ఇచ్చిన స్థలాలకు గత ప్రభుత్వాలు డీ పట్టాలు ఇచ్చేవి. వాటిపై పూర్తి హక్కులు లేకపోవడంతో లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడేవారు. అందుకే తొలిసారిగా వారికి హక్కుల ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టా ఇస్తున్నారు. పదేళ్ల తర్వాత ఈ పట్టా (కన్వేయన్స్ డీడ్స్) ఆటోమేటిక్గా సేల్ డీడ్గా మారుతుంది. గడువు తీరిన తర్వాత తహశీల్దార్ నుంచి నిరభ్యంతర పత్రం అవసరం ఉండదు. కన్వేయన్స్ డీడ్స్ సేల్ డీడ్గా మారాక దాన్ని ప్రైవేటు పట్టా మాదిరిగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. కన్వేయన్స్ డీడ్స్ పొందినప్పటి నుంచి దానిపై బ్యాంకు రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. -
లైన్ క్లియర్.. ఒంగోలు ప్రజలకు సీఎం జగన్ శుభవార్త...
-
ఏళ్ల నిరీక్షణకు తెర.. పేదలకు పెద్ద మేలు!
నివేశన స్థలాల కోసం అనేక ఏళ్లుగా నిరీక్షిస్తున్న పేదలకు జగన్ సర్కార్ ఊరట కలిగించింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలాలను క్లియరెన్స్ చేసి పట్టాలు మంజూరు చేసింది. వారి సొంతింటి కల సాకారానికి బాటలు వేసింది. గత టీడీపీ ప్రభుత్వం చేసిన మోసంతో ఆశలు వదులుకున్న పేదలు ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో న్యాయం జరగడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉరవకొండ: టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 సార్వత్రిక ఎన్నికల వేళ ఓట్ల కోసం గిమ్మిక్కులు చేశారు. ఏకంగా 15 సర్వే నంబర్లు పొందుపరచి.. హద్దులు పేర్కొనకుండానే తయారు చేసిన ఇంటి పట్టాలను ఉరవకొండలో పేదలకు పంపిణీ చేశారు. పేదలకు పట్టాలు తన ఘనతేనంటూ పయ్యావుల కేశవ్ పబ్లిసిటీ చేసుకున్నారు. కానీ అస్పష్టంగా ఉన్న ఆ పట్టాలన్నీ చెల్లవని తేలింది. తాము నిలువునా మోసపోయామని బాధితులు లబోదిబోమన్నారు. ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ పేదల ఇంటి పట్టాల సమస్యను పట్టించుకోలేదు. విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు, టీవీ చానెళ్లు, సోషల్ మీడియాకు పరిమితమయ్యారు. పైగా నియోజకవర్గ టీడీపీ నేతలు పేదలకు స్థలాలు అందకూడదనే ఉద్దేశంతో సదరు సర్వే నంబర్ల భూయజమానులపై ఒత్తిడి తెచ్చి పరిహారం పెంచాలంటూ కోర్టులో కేసులు వేయించారు. జగన్ సర్కారు చొరవ.. ఉరవకొండలోని పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు వైఎస్సార్సీపీ సర్కారు చొరవ తీసుకుంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద అర్హత కల్గిన వారందరికీ స్థలాల కేటాయింపునకు చర్యలు చేపట్టింది. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రత్యేక చొరవతో ఉరవకొండ పట్టణంలో ఏకంగా 3,500 మంది పేదలకు ఇంటి పట్టాలు మంజూరయ్యాయి. ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఏళ్లుగా ఉన్న భూవివాదం హైకోర్టులో పరిష్కారమయ్యేలా శ్రద్ధ చూపడంతో తొలి విడతగా 560 ఇంటిపట్టాలను వై.విశ్వేశ్వరరెడ్డి చేతుల మీదుగా ఇటీవలే పంపిణీ చేశారు. స్థలాలను కూడా చూపించారు. మిగిలిన వారికి కూడా పట్టాలు సిద్ధం చేశారు. వారికి త్వరలోనే అందించనున్నారు. నాడు ఎమ్మెల్యే కేశవ్ దొంగపట్టాలతో తమను మోసం చేస్తే.. నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విశ్వేశ్వరరెడ్డి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా పట్టాలు మంజూరు చేయించారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేలు చేసిన వారిని మరువం గతంలో ఓట్ల కోసం బోగస్ పట్టాలు పంపిణీ చేసి మోసం చేశారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గెలిచిన తర్వాత కూడా పట్టాల గురించి పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మా పక్షాన నిలబడ్డారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం హామీ పత్రాలు అందించి.. కోర్టు వివాదం పరిష్కరించి ఇంటి స్థలం చూపించారు. మేలు చేసిన వారిని ఎన్నటికీ మరచిపోము. – షాకీరా, లబ్ధిదారు, ఉరవకొండ సంతోషంగా ఉంది నాడు 15 సర్వే నంబర్లతో ప్రభుత్వం పట్టా ఇచ్చింది. అయితే అందులో హద్దులు చూపకుండా నిలువునా మోసం చేసింది. జనంతో మమేకమయ్యే విశ్వ అన్న సీఎం జగనన్నతో మాట్లాడి మాకు సమగ్ర వివరాలతో కూడిన పట్టా ఇప్పించి, పక్కాగృహం మంజూరు చేయించారు. చాలా సంతోషంగా ఉంది. – ఈశ్వరమ్మ, రంగావీధి, ఉరవకొండ రుణపడి ఉంటాం 15 ఏళ్లుగా బాడుగ ఇంట్లో ఉంటూ అవస్థలు పడ్డాం. కోర్టు వివాదంలో ఉన్న స్థలాలు జగన్ ప్రభుత్వంలో విశ్వ అన్న కృషితో పరిష్కారం అయ్యాయి. నాకు పట్టా ఇచ్చి పక్కా ఇల్లు కూడా మంజురు చేశారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. – కురసాల లావణ్య, చౌడేశ్వరి కాలనీ, ఉరవకొండ పేదల కళ్లల్లో ఆనందం కన్పిస్తోంది ఎమ్మెల్యే కేశవ్ అప్పట్లో ఓట్ల కోసం చెల్లని పట్టాలు ఇచ్చి ప్రజలను మోసగించాడు. అప్పట్లోనే నేను పేదల ఇంటి పట్టాల కోసం భారీ స్థాయిలో ఉద్యమించాను. రోడ్ల దిగ్బంధం, తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు చేపట్టి అరెస్టయ్యాం. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో రికార్డు స్థాయిలో ఉరవకొండ పట్టణానికి 3,500 పట్టాలు, నియోజకవర్గ వ్యాప్తంగా 21 వేల పక్కా ఇళ్లు మంజూరు చేయించాం. సొంతింటి కల సాకారమవుతున్న వేళ పేదల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం నాకు ఎంతో తృప్తినిస్తోంది. – వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఉరవకొండ రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం.. పేదలందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయించాలని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఆయన కృషితో జిల్లాలోనే రికార్డుస్థాయిలో ఉరవకొండ నియోజకవర్గానికి 21 వేల పక్కా ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. -
92 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
-
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: సీఎం జగన్
సాక్షి, ఏలూరు: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని అన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారని ప్రస్తావించారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయన్న సీఎం జగన్.. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మేనిఫెస్టోలపై కమిట్మెంట్ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామంటారు.. నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. 2014 చంద్రబాబు, పవన్ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ఆలోచించాలని సూచించారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు. చదవండి: నిమ్మగడ్డ రమేష్ కొత్త పన్నాగం.. దానికి సమాధానముందా? సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీని సీఎం జగన్ ఈ సభలో ప్రారంభించారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ.. కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తున్నామని తెలిపారు. చుక్కుల భూములకు సైతం పరిష్కారం చూపించామని, అసైన్డ్ భూములు, లంక భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్డేట్ చేస్తున్నామన్నారు. వేలమంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నామని తెలిపారు. ‘మొదటి దశలో 18 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండవ దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. మొత్తంగా 45 లక్షల ఎకరాల సరిహద్దు అంశాలు పరిష్కరించాం. 4 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించాం లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం. గ్రామ ఇనామ్ సర్వీస్ భూములనునిషేధిత జాబితా నుంచి తొలగించాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకూ హక్కులు కల్పిస్తున్నాం. దళిత వర్గాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్మశానవాటికలకు స్థలాలు కేటాయించాం. సామాజిక న్యాయాన్ని ఒక విధానంగా అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చాక 2 లక్షల 7 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబుకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ -
గతంలో అద్దె ఇళ్లలో చాలా కష్టాలు పడ్డాం..కానీ ఇప్పుడు మా కల నెరవేరింది..!
-
TTD: నాడు వైఎస్సార్.. నేడు సీఎం జగన్: భూమన
తిరుపతి: టీటీడీ ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్ చారిత్రక నిర్ణయం అని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అన్నారు.ఇవాళ్టి ఇళ్ల పట్టాల పంపిణీతో టీటీడీ ఉద్యోగుల 60 ఏళ్ల కల సాకారమైందని భూమన అన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి నిర్ణయించారని గుర్తు చేసిన భూమన.. సీఎం జగన్ ఇప్పుడు దాన్ని పూర్తి చేశారని అన్నారు. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పూర్తి చేయడం సీఎం జగన్ వల్లే సాధ్యమయిందని చెప్పారు. పేదల పట్ల గౌరవం ఉన్న ముఖ్యమంత్రి ఒక్క జగనే అని భూమన కొనియాడారు. దాదాపు మూడు వేల మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు వస్తున్నాయి.. మిగిలిన వారికి కూడా త్వరలో ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు భూమన వెల్లడించారు. సీఎం జగన్ హయాంలో ఇంత అభివృద్ధిలో భాగం అయినందుకు భూమన సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇన్ని వందల ఎకరాల భూమిని టీటీడీ ఉద్యోగుల ఇళ్ల కోసం కేటాయిస్తూ సీఎం జగన్ మహత్తర కార్యక్రమం చేపడుతున్నారని భూమన అన్నారు. వైయస్ఆర్ హయాంలో తాను టీటీడీ అధ్యక్షునిగా ఉన్నప్పుడే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించినట్లు భూమన పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల ఇంత అభిమానం ఉన్న సీఎం జగన్ను ఉద్యోగస్థులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. ఇదీ చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలు: తిరుమలకు సీఎం జగన్.. అప్డేట్స్ -
టీటీడీ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, తిరుపతి: టీటీడీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. టీటీడీ ఉద్యోగుల చిరకాల స్వప్నం సాకారం కానుంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఇంటి స్థలాల సమస్యకు పరిష్కారం లభించనుంది. ఈ నెల 18వ తేదిన టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పత్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పంపిణీ చేయనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో పట్టువస్త్రాల సమర్పణకు విచ్చేస్తూన్న సమయంలో ఉద్యోగులుకు ఈస్థలాలు పంపిణీ చేయనున్నారు. చదవండి: ఈనెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు -
భూమిని నమ్ముకున్నందుకు న్యాయం...రైతులుగా మారనున్న 46 వేల మంది
-
రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టా రావడం సంతోషంగా ఉంది.. జగనన్న పాలనలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు..
-
టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ
-
రోడ్డు పక్కన గుడిసెలో ఉంటున్న మేము సొంత ఇంటికి వెళ్తున్నామంటే జగనన్నే కారణం..!
-
ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి వేణుగోపాలకృష్ణ
-
ఇది సీఎం జగన్ పట్టుదల, దక్షతలకు నిదర్శనం
పేదలకు మేలు జరుగుతుందన్న విశ్వాసం కలిగితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతదాకా అయినా వెళ్లడానికి వెనుకాడరు అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లేదేమో. తను నమ్మిన న్యాయం కోసం ఆయన పోరాడతారు. సాధించి తీరుతారు.రాజధాని అమరావతి గ్రామాలలో పేదలకు 50 వేలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన తీరు, తదుపరి వారందరికి ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించిన వైనం చూసిన తర్వాత ఏపీలో పేద వర్గాలకు మరింత భరోసా దక్కినట్లయింది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ, మరో పక్క ఈనాడు వంటి మీడియా సంస్థలు వేటకుక్కల మాదిరి వెంబడిస్తున్నా జగన్ ఎక్కడా తొణకలేదు. బెణకలేదు. పేదల పట్టాల పంపిణీ కి పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడితే దానిని చెడగొట్టాలని కొందరు ప్రయత్నం చేయకపోలేదు. కాని పోలీసులు సమర్ధంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చేశారు.కాని రైతుల ముసుగులో కొంతమంది నల్లజెండాలు, నల్ల బెలూన్లు వంటివాటితో నిరసన తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిరసనగా కూడా సరిగ్గా ఇలాగే బెలూన్ లు ఎగురవేశారు. కాని ఆ తర్వాత ఏమైందో అంతా చూశారు. మోదీ మరోసారి ఎన్నికై దేశానికి ప్రదానమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా కూడా జరిగే ప్రయత్నాలు అలాగే ఉన్నాయి. అమరావతిలో పేదలకు భూములు ఇవ్వడానికి అడ్డుతగులుతున్నారన్న విషయం రాష్ట్రం అంతా తెలిసిపోవడం వల్ల టీడీపీకి భారీగా నష్టం వాటిల్లిందట. ఈ విషయం వారి సొంత సర్వేలలో తేలిందట. దాంతో అమరావతి గ్రామాలలో శుక్రవారం చాలా తక్కువ స్థాయిలోనే ఈ నిరసనలు జరిగాయని చెప్పాలి. టీడీపీ నేతలు నేరుగా రంగంలోకి రాకుండా కొంతమేర జాగ్రత్తపడ్డారని అనుకోవచ్చు. జెఎసి నేతల పేరుతోనో, ఊరు,పేరు లేని రాజకీయ పార్టీ నేత పేరుతోనో ఆందోళన చేయించాలని చూశారు. వారి దీక్ష శిబిరాల వద్ద ఉద్రిక్తత సృష్టించాలని యత్నించారు. పోలీసు అధికారులు మహిళలను ఏదో అన్నారని ప్రచారం చేశారు. వాటిని పెద్ద,పెద్ద అక్షరాలతో ఈనాడు పత్రికలో అచ్చేయించారు. అయినా ప్రజలలో పెద్ద కదలిక రాలేదు. యధాప్రకారం పది, ఇరవై మంది వారి శిబిరంలో కనిపించారు. పేదల పట్టాల విషయంలో తెలుగుదేశం కు కొమ్ముకాసిన వామపక్షాలు కూడా కాస్త సిగ్గుపడినట్లుగా ఉంది. వారు ఎక్కడా ప్రత్యక్ష నిరసనలలో కనిపంచలేదు. మరో వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలకు పట్టాల పంపిణీకి కార్యక్రమం నిర్వహిస్తే వేలాది మంది తరలివచ్చి ఆయనకు జేజేలు పలికారు. జగన్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సామాజిక అమరావతికి శ్రీకారం చుట్టామని అన్నారు. అంటే ఏదో ఒక కులం, ఒక వర్గం ప్రాధాన్యత కాకుండా, అందరికి సమప్రాతినిద్యం లబించేలా పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వడం అన్నమాట. గతంలో పేదలకు పట్టాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రైతుల పేరుతో తెలుగుదేశం నేతలు కోర్టుకు వెళ్లినప్పుడు సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వాదించారు. దానికి జగన్ ఇప్పుడు సమాదానం ఇచ్చినట్లయింది.పేదలకు, పెత్తందార్లకు మద్య పోరాటంగానే జగన్ తీసుకువెళుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సెంటు స్థలం స్మశానం, అని సమాధి అని చేసిన తెలివితక్కువ వ్యాఖ్యల ప్రభావం కూడా బాగానే ఉందనిపించింది. లబ్దిదారులు కొందరు దీనిపై ఆయన మీద మండిపడ్డారు. ఒక మహిళ అయితే ముసలినక్కలు తమకు స్థలాలు రాకుండా అడ్డుకోవాలని చూశాయని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం నేతలు కాని, జెఎసి నేతలు కాని గతంలో హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పులు వస్తే తమదే విజయం అని, ప్రభుత్వం దానిని పాటించాలని అంటుండేవారు. కాని ఇప్పుడు ఇళ్ల పట్టాల కేసులో సుప్రింకోర్టు తీర్పు పేదలకు అనుకూలంగా అంటే ప్రభుత్వ వాదనను బలపరిచేలా వచ్చినా వీరు ఆందోళన వీడడం లేదు. విమర్శలు ఆపడం లేదు. పేదల స్థలాల పంపిణీని ఏదో రకంగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.ఇదంతా చంద్రబాబు చేసిన నిర్వాకమే అని చెప్పాలి. ఆయన అనవసరంగా వేల ఎకరాల పచ్చని పంటల భూమిని సమీకరించి ,రైతులకు పని లేకుండా ఏడాదికి ఏభైవేల రూపాయల కౌలు ఇవ్వడానికి అంగీకరించిన ఫలితమే ఈ తలనొప్పి అని చెప్పాలి. అదే ఏ వెయ్యో, రెండువేల ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధానికి అవసరమైన భవనాలు నిర్మించుకుంటే ఏ గొడవ ఉండేదికాదు. అప్పుడు ఏ పేదలకు ఎక్కడ నివాస స్థలాలు ఇచ్చినా ఎవరూ కాదనేవారు కాదు. అలాకాకుండా మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చడంతో వచ్చిన చిక్కు ఇదంతా. తను తీసుకు వచ్చిన చట్టంలోనే ఐదు శాతం భూమి పేదలకు ఇవ్వాలని ఉంది. దానిని అమలు చేస్తుంటే ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు.పట్టాల పంపిణీ సభలో మాట్లాడిన ఇద్దరు మహిళలు తమ ఆవేదనను పంచుకుంటూ సొంత ఇల్లు అన్నది తమ చిరకాల వాంఛ అని, దానిని జగన్ తీర్చారని చాలా సంతృప్తిగా మాట్లాడారు. ఒకరైతే కన్నీటి పర్యంతం అయ్యారు. కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుపడుతున్నా, జగన్ తమకోసం పోరాడారని వారు అభిప్రాయ పడ్డారు. ముఖ్యమంత్రి కూడా వచ్చే జూలై ఎనిమిది అంటే దివంగత తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నాటికి ఈ స్థలాలలో ఇళ్ల నిర్మాణం ఆరంభం అవుతుందని ప్రకటించడం లబ్దిదారులలో ఎంతో సంతోషం కలిగించింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నరకాసురుడిని అయినా నమ్మవచ్చేమో కాని, నారా చంద్రబాబును మాత్రం నమ్మవద్దని కొత్త డైలాగు విసిరారు. యదా ప్రకారం ఎల్లో మీడియా తన ప్రభుత్వానికి సృష్టిస్తున్న అడ్డంకులను ప్రజలకు వివరించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం చానల్ ఒకటి టీడీపీ అధికారంలోకి రాగానే ఈ పట్టాలు రద్దు అవుతాయని దుర్మార్గంగా ప్రచారం చేసిందని వ్యాఖ్యానించారు.వైసిపి ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాజదానిలో ఇళ్ల స్థలాల పంపిణీని ఒక వారం రోజుల కార్యక్రమంగా రూపొందించింది. తద్వారా రాష్ట్రవ్యాప్త ప్రజలపై ఒక ప్రభావం పడాలని యత్నిస్తోంది. తెలుగుదేశం పార్టీ పేదల వ్యతిరేక పార్టీ అని, వారికి మేలు చేస్తుంటే చూడలేకపోతోందని వైసిపి ప్రచారం చేయడానికి ఈ అవకాశం వినియోగించుకుంటుంది. అందుకు తెలుగుదేశం పార్టీనే చాన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా జగన్ పట్టుదల, దక్షతలకు ఈ ఇంత వేగంగా ఈ ఇళ్ల స్థలాల పంపిణీ నిదర్శనం అని చెప్పవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
నవ్వులూరు లేఔట్ లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆర్కే
-
ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సుదీర్ఘ న్యాయపోరాటం
-
ఇది గొప్ప సంకల్పం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలు ఉండకూడదు అన్న గొప్ప సంకల్పంతో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి చెప్పారు. శుక్రవారం వెంకటపాలెంలో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో స్వాగతోపన్యాసం చేసిన ఆయన గుంటూరు జిల్లాలో ఇప్పటికే లక్షా 17,108 మందికి ఇళ్ల పట్టాలు అందచేసినట్టు వివరించారు. దీనికోసం 276 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు రూ.1,452 కోట్ల రూపాయలు వెచ్చించి 2,512 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించామని వెల్లడించారు. మొత్తం 2,789 ఎకరాలలో 284 జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని, ఆ భూములు చదునుచేసి సరిహద్దురాళ్లు, గ్రావెల్ రోడ్ల కోసం 81.56 కోట్ల రూపాయలు, తాగునీరు, విద్యుత్ సరఫరా కోసం రూ. 47.57 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. మొదటి దశలో 209 కాలనీలలో 66,125 ఇళ్లు ప్రారంభమై వేగవంతంగా జరుగుతున్నాయని, జిల్లాలో 18,448 టిడ్కో ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయిందని వివరించారు. మంగళగిరి, తెనాలి, పొన్నూరులో అన్ని మౌలిక వసతులతో ప్రారంభోత్సవాలు కూడా చేశామని, అమరావతిలో ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా సీఆర్డీఏ పరిధిలోని పది గ్రామాలలో 5,024 ఇళ్లు ప్రారంభోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈరోజు 23,762 మంది లబ్ధిదారులకు 10 లేఅవుట్లలో 1402.58 ఎకరాల భూమిలో పట్టాలు ఇస్తున్నామని వివరించారు. -
మనసున్న నాయకుడు.. పిలిచి మరీ ఇంటి పట్టా ఇచ్చారు..
సాక్షి, వెంకటపాలెం:ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 50,793 మంది నిరుపేద అక్కచెల్లెమ్మలకు సీఆర్డీఏ పరిధిలో కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టాలను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. దీంతోపాటు ఇక్కడ నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్ల పత్రాలను సైతం లబ్ధిదారులకు అందజేశారు. దీనిలో భాగంగా లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. 23 ఏళ్లుగా ఇల్లు లేక కష్టాలు పడ్డామన్నా నాకు పెళ్లయినప్పటి నుంచి 23 ఏళ్లుగా రైల్వే స్థలంలో గుడిసె వేసుకుని ఉంటున్నామన్నా. మాతోపాటు అక్కడ 750 కుటుంబాలదీ అదే పరిస్థితి. ఎన్నోసార్లు రైల్వే వారు నోటీసులిచ్చారు. ఇల్లు అద్దెకు తీసుకునే శక్తి లేదు. ఇద్దరు పిల్లలతో ఎక్కడికి పోవాలో తెలియదు. ఎండకు ఎండాం, వానకు తడిచాం. గజం స్థలం కూడా కొనలేని నాకు జంటనగరాల మధ్య పిలిచి మరీ మీరు ఇంటి స్థలం ఇచ్చారు. రాజకీయ కుట్రలు పన్ని అడ్డుకోవాలని చూసినా, మీరు ఆడపడుచులను ఆస్తి పరులు చేశారన్నా. మీ సాయాన్ని జీవితంలో మరిచిపోలేను. ఈ రోజు నాలాంటి వారికి పెద్ద పండగ. అన్నా.. నా గృహ ప్రవేశానికి మీరు రావాలి. – గొట్టుముక్కల హైమావతి, తాడేపల్లి అద్దె పెంచినప్పుడల్లా ఇల్లు మారే పరిస్థితి అన్నా.. నాకు ముగ్గురు పిల్లలు. భర్త హోటల్లో పని చేస్తారు. 25 ఏళ్లుగా చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నాం. చాలీచాలని ఆదాయం. ఇంటి అద్దె పెంచినప్పుడల్లా పిల్లి తన పిల్లల్ని తిప్పినట్టు ఇల్లు మారేదాన్ని. ఓసారి అత్తగారి అమ్మ చనిపోతే శవాన్ని కూడా ఇంటికి తీసుకురానీయలేదు. ఆ క్షణంలో ఎంతో మానసిక క్షోభ అనుభవించాను. సొంతిల్లు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదనిపించింది. నాలాంటి మహిళకు సొంతిల్లు కలగానే మిగిలిపోతుందనుకున్నా. కానీ మీరు పెట్టిన వలంటీర్ మా ఇంటికి వచ్చి.. జగనన్న ఉచితంగా ఇల్లు ఇస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు ఎంతగా అడ్డుపడినా మీరు శ్రీరాముడిలా వారిని జయించి మాకు యాగ ఫలాన్ని అందించారన్నా. – లక్ష్మి, గుణదల, విజయవాడ గత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? పేదలకు సీఎం వైఎస్ జగన్ మంచి చేస్తుంటే.. హడావుడి చేస్తున్న వ్యక్తులు, గత ప్రభుత్వంలో భూములు లాక్కుని కనీసం పరిహారం చెల్లించని చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు? రైతులకు సీఎం జగన్ మేలు చేస్తున్నారే తప్ప ఎటువంటి అన్యాయం చేయటం లేదు. కావాలనే పేదలకు మేలు జరగకుండా అడ్డుకుంటున్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే సీఎం జగన్కు మంచి పేరు వస్తుందని కుళ్లు బుద్ధితో కోర్టుకు వెళుతున్నారు. ఇక్కడి అభివృద్ధిపై రైతులు నిలదీయాల్సింది చంద్రబాబును. – పి.గంగా భవాని, విజయవాడ మంచి మనసున్న నాయకుడు మాకు ఇల్లు లేదు. ఎన్నో ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. సీఎంగా జగన్ పరిపాలన ప్రారంభించాక పేదలకు మంచి జరగటం మొదలైంది. మాకు ఇంటి స్థలం కేటాయించారు. కచ్చితంగా ఇల్లు కట్టించి అందజేసే మంచి మనసున్న నాయకుడు సీఎం జగన్. పేదలకు అండగా నేనున్నానే భరోసా కల్పించారు. – షేక్ మస్తాన్బీ, మెల్లెంపూడి, గుంటూరు జిల్లా ఒకే ఇంట్లో మూడు కుటుంబాలు మూడు కుటుంబాల వాళ్లం ఒకే ఇంట్లో తలదాచుకుంటున్నాం. సీఎం జగన్ ఇంటి స్థలాలు ఇవ్వటం ద్వారా అందరికీ జాగా వచ్చింది. పేదలకు మంచి చేసేందుకు ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. పేదోళ్ల కష్టం తెలుసు కాబట్టే.. స్థలాలు అందజేస్తున్నారు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. – జాలాది రత్నకుమారి, ఆత్మకూరు, గుంటూరు జిల్లా జగనన్న భరోసా కల్పించారు మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు వచ్చిన స్థలం భవిష్యత్లో మా బిడ్డలకు అండగా ఉంటుంది. కరోనా సమయంలో నాకు పనిలేదు. అప్పుడు ప్రభుత్వ పథకాలు మమ్మల్ని ఆదుకుని నిలబెట్టాయి. అన్నీ చెప్పిన సమయంలోనే చేస్తున్నారు. భగవంతుని చల్లని చూపు ఈ ప్రభుత్వానికి ఉంటుంది. – అబ్దుల్ వసీమ్, రేష్మా, మంగళగిరి, గుంటూరు జిల్లా మా కోసం యుద్ధమే చేశారు మా పొట్టకొట్టేందుకు చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మా అందరి కోసం యుద్ధం చేసి విజయం సాధించారు. తాను గెలిచి మమ్మల్ని గెలిపించిన తీరు ఆధ్యంతం స్ఫూర్తిదాయకం. జగనన్న దయవల్ల మాకు ప్లాట్ వచ్చింది. అది తీసుకునేందుకు వచ్చాం. – ఎ.భారతి, విజయవాడ సమానత్వానికి నాంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా రాజధానిలో సామాజిక సమానత్వానికి నాంది పలికినట్లయింది. పేదలు రాజధానిలో నివాసముంటే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందనేది తప్పు అని దీని ద్వారా తేటతెల్లమైంది. ఇప్పటి వరకు కొందరిదిగా ఉన్న అమరావతి ఇప్పుడు అందరిదైంది. ఏకంగా 50 వేలకు పైగా ఇళ్ల పట్టాలివ్వడం అంటే మామూలు విషయం కాదు. తద్వారా లబ్ధిదారులకు వ్యక్తిగత లాభంతో పాటు ఇక్కడ ఏర్పడే ఇళ్ల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా రాజధాని ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. పాలకులకు ఎంతో గొప్ప మనసు ఉంటే కానీ ఇలాంటి నిర్ణయాలు సాధ్యం కావు. – కె మధుబాబు, సీడీసీ డీన్, ఏఎన్యూ ఈ అవకాశం ఎవరికీ రాలేదేమో.. 35 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలపై సంతకం పెట్టే అవకాశం బహుశా ఇప్పటి వరకు ఎవరికీ రాలేదేమో. ఆ అవకాశం నాకు మాత్రమే దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉంది. నేను ఉద్యోగంలో చేరి 35 సంవత్సరాలు. ఇన్ని ఏళ్లలో అత్యంత సంతోషకరమైన రోజు ఇది. ఈ అవకాశం రాష్ట్రంలో, దేశంలో ఏ అధికారికీ లభించి ఉండకపోవచ్చు. – రామ్ప్రసాద్, తహసీల్దార్, మంగళగిరి, గుంటూరు జిల్లా ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంలో అల్పాదాయ వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎంతో ఆనందించాల్సిన, అభినందించాల్సిన విషయం. అన్ని సామాజిక వర్గాలకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుంది. ప్రభుత్వం ఎంతో శ్రమపడి పేదల కల సాకారం చేసింది. గతంలో ఎప్పడూ ఇటువంటి ప్రయత్నం జరగలేదు. ఈ అంశంలో అందరూ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే. – కె.శ్రీరామమూర్తి, పూర్వ ప్రిన్సిపాల్, ఏయూ ఆర్ట్స్, కామర్స్ కళాశాల -
‘జీవితాంతం రుణపడి ఉంటా’.. ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: సీఆర్డీయే పరిధిలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాల పంపిణీతో పాటు, సీఆర్డీయే ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త చరిత్ర సృష్టించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ శుక్రవారం పండగలా జరిగింది. ఈ క్రమంలో ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘‘అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మన ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడింది. నేడు అదే అమరావతిలో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇళ్ల స్థలాలకు 50,793 మంది అక్కచెల్లెమ్మలను యజమానులను చేసింది మన ప్రభుత్వం. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించే అవకాశాన్ని నాకు కల్పించిన దేవుడికి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అంటూ సీఎం జగన్ ట్విటర్లో పేర్కొన్నారు. చదవండి: లబ్ధిదారుల భావోద్వేగం.. మా ‘బలగం’ మీరే జగనన్నా.. అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు మన ప్రభుత్వం సుప్రీంకోర్ట్ వరకూ వెళ్ళి పోరాడింది. నేడు అదే అమరావతిలో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇళ్ళ స్థలాలకు 50,793 మంది అక్కచెల్లెమ్మలను యజమానులను చేసింది మన ప్రభుత్వం. ఇంత మంచి కార్యక్రమం నిర్వ… pic.twitter.com/72QEY09aTn — YS Jagan Mohan Reddy (@ysjagan) May 26, 2023 -
లబ్ధిదారుల భావోద్వేగం.. మా ‘బలగం’ మీరే జగనన్నా..
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ శుక్రవారం పండగలా జరిగింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన వేదికపై ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఎమ్మెల్యే, మంత్రులు, లబ్ధిదారులు ఏమన్నారంటే…వారి మాటల్లోనే.. మీరు గృహ ప్రవేశానికి రావాలి జగనన్నా.. అన్నా నాది పేద కుటుంబం, మేం రైల్వే పోరంబోకు స్ధలంలో ఇల్లు వేసుకుని ఉంటున్నాం. మాలాగే 750 కుటుంబాలు ఉన్నాయి, రైల్వే వారు నోటీసులు ఇచ్చారు. ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఎండకు ఎండి వానకు తడిశాం. నాకు ఇంటి స్ధలం వచ్చిందని చాలా ఆనందపడ్డాం. గజం భూమి కూడా కొనుక్కోలేని మాకు గుంటూరు-విజయవాడ మధ్యలో లక్షల విలువైన భూమిని ఇస్తున్నారు. మీరు లక్షల మందికి పట్టాలివ్వడమే కాదు వారిని ఆస్తిపరులను చేశారు. కుట్రలు, రాజకీయంతో మాకు రాకుండా చేశారు.పేదలు ఉంటే స్లమ్ లుగా మారుతాయన్నారు. అవన్నీ మీరు ధీటుగా ఎదుర్కొన్నారు. మాకు ఇది గొప్ప పండుగ. మీ మధ్యలో ఈ పండుగ చేసుకుంటున్నాం. నవులూరులో నాకు వచ్చిన స్ధలం చూడగానే సంతోషమేసింది. అక్కడ ఉన్న ఏర్పాట్లు చాలా బావున్నాయి. నేను ఇల్లు కట్టగానే మీరు గృహ ప్రవేశానికి రావాలని కోరుతున్నాను. మా పేదలకు మీరు తోడుగా ఉన్నారు. మీ చెరగని చిరునవ్వు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. దుష్టశక్తులకు తగిన బుద్దిచెబుతాం. మా మహిళలంతా మీ వెంటే నడుస్తామని చెబుతున్నాను, మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ని ప్రార్ధిస్తున్నాను. -గొట్టిముక్కల హైమావతి, లబ్ధిదారు, తాడేపల్లి మున్సిపాలిటీ ఆ యాగ ఫలితమే ఈ పండుగ.. అన్నా, నేను ఒక బీసీ వర్గానికి చెందిన మధ్యతరగతి మహిళను, నాకు వివాహం అయి 25 ఏళ్లు అయింది. నా భర్త హోటల్లో పనిచేస్తారు. నాకు ముగ్గురు పిల్లలు. నాకు వివాహం అయిన కొత్తలో ఎదుర్కున్న సమస్యను చెప్పాలనుకున్నాను. మా అత్తగారి అమ్మ చనిపోతే ఆ అద్దె ఇంటి యజమాని శవాన్ని ఉంచనీయలేదు, అప్పుడు చాలా క్షోభను అనుభవించాను. అద్దె పెరిగినప్పుడల్లా ఇల్లు మారుతూ జీవనం కొనసాగించాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ మా ఇంటికి వచ్చి మీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇస్తారు మీరు దరఖాస్తు చేసుకోండని చెప్పారు. మేం నమ్మి దరఖాస్తు చేశాం. మీరు పేదలకు ఇళ్లు అనే మహాయాగం ప్రారంభిస్తే ప్రతిపక్ష నాయకులు మారీచుడిలా అడ్డపడినా మీరు శ్రీరాముడిలా జయించి, వారిని ఎదిరించి మాకు యాగఫలం అందించారు. ఆ యాగ ఫలితమే ఈ పండుగ. నాతో పాటు యాభై వేల మంది మహిళలు ఇక్కడికి వచ్చారు. ఏ అన్నైనా పుట్టింటికి వెళితే ఒక చీర పెడతారు లేక ఒకరోజు భోజనం పెడతారు కానీ ఏ అన్నైనా ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి మరీ పట్టాల పంపిణీకి ఆహ్వనించి మీ సొంతింటి కల సాకారం చేసుకోమనే అన్న ఎవరైనా ఉన్నారా. అలాంటి అన్న నాకు ఉన్నారు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాకు ముగ్గురు పిల్లలు, వారిని బాగా చదివించడం కత్తి మీద సాము. నా పెద్దపాప పీజీ చదువుతుంది. చిన్నపాప బీటెక్ చదువుతుంది. విద్యాదీవెన, వసతిదీవెన ద్వారా నేను చదివించగలుగుతున్నాను. మీరు అమ్మలా ఆదరిస్తున్నారు. నాన్నలా మా భారం మోస్తున్నారు. అన్నలా మీ అనురాగం పంచుతున్నారు. మీ చల్లని నీడలో మేం సుస్ధిరంగా ఉండాలనుకుంటున్నాం. మాకు కేటాయించిన స్ధలం చూసినప్పుడు చాలా సంతోషమేసింది. చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా గృహ ప్రవేశాల పండుగకు రావాలి. దేవుడంటే ఎవరు అడిగిన వరాలిచ్చేవారు కానీ నా కుటుంబంలో నేను ఏదీ అడక్కుండానే, ఏదీ కోరుకోకుండానే అన్ని వరాలిచ్చిన మీరే నా ప్రత్యక్ష దైవం, మీరు ఉదయించే సూర్యుడు.. మీరు ఒక ప్రభంజనం.. మా మహిళలకు ఒక ధైర్యం, భరోసా, బలగం మీరు. మీరే మళ్లీ సీఎంగా రావాలి. మా ఓట్లు మీకే, మీ చల్లని పాలన సుస్ధిర కాలం ఉండాలి. లక్ష్మీ, లబ్ధిదారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పేదల జీవితాల్లో మీరు కాంతిరేఖలా నిలబడ్డారు: ఎమ్మెల్యే ఆర్కే అందరికీ నమస్కారం, అన్నా ఈ రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదలు 32 లక్షల మందికి ఇళ్ళస్ధలాలు ఇచ్చి అందులో లక్షల మంది నివాసాలు ఉంటుంటే, మా రాజధాని ప్రాంతంలో సొంత ఇల్లు లేదని పేదలు ఎదురుచూశారు, వీరందరికీ మీ దయ వల్ల పట్టాలు అందుతున్నాయి, ఈ పేదలంతా మీకు శాశ్వతంగా రుణపడి ఉంటారు. చంద్రబాబు ఈ రోజు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు సీఆర్డీఏ చట్టం ప్రకారం 5 శాతం ఈడబ్యూఎస్ కి ఇవ్వాలని పెట్టినా, ఆయనకు పేదల మీద ప్రేమ, అభిమానంతో పెట్టలేదు. తప్పనిసరిగా ఇవ్వాలని కాబట్టి 5 శాతం రిజర్వ్ చేసి కట్టలేదు. దళితుల్లో పుట్టాలా అని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు, బీసీల తోకలు కత్తిరిస్తాం అన్న చంద్రబాబు ఈ రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇల్లు ఎందుకు కట్టించాలి, ఇక్కడ పేదలు దళితులు ఉంటే ఇది రాజధాని కాదన్నాడు, చివరికి సమాధులతో సైతం పోల్చాడంటే ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. మీరు పట్టాలిస్తున్న వారంతా త్వరలోనే గృహప్రవేశం చేస్తారు. ఈ పేదలంతా సంక్రాంతి నాటికి ఆ పండుగ ఈ ఇళ్ళలో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను, మీ చేతుల మీదుగా సంక్రాంతినాడు గృహప్రవేశం జరుపుకునేలా ఉండాలి, ఈ రాజధాని ప్రాంతంలో కులం, మతం గురించి మాట్లాడారు, నా కులం మానవత్వం. నా మతం సమానత్వం అనే ధైర్యాన్ని ఈ పేదలలో నింపాలని కోరుకుంటున్నాను. పేదల జీవితాల్లో మీరు కాంతిరేఖలా నిలబడ్డారు. ఇల్లు లేని నిరుపేదలకు తెలుసు ఆ భాదలేంటో, ఇల్లు లేని పేదవాడు ఉండకూడదన్న మాటను నిలబెట్టుకుంటూ దేశానికి మీరు ఆదర్శంగా నిలవాలి. ఎల్లో మీడియా దారుణంగా ప్రవర్తిస్తుంది, ఏబీఎన్ చానల్లో ఆర్ 5 జోన్ ఆరిపోయే జోన్ అన్నారు, వారికి సంక్రాంతి పండుగ ఈ ఇళ్ళలో జరుపుకుని నిరూపించాలి. శాసన రాజధానికి నిండైన అర్ధం తీసుకొచ్చారు, ధన్యవాదాలు. -ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), మంగళగిరి ఎమ్మెల్యే అణగారిన వర్గాల వారంటే చంద్రబాబాబుకు పగ: మంత్రి ఆదిమూలపు సురేష్ అందరికీ నమస్కారం, పేదలను పెద్దోళ్ళుగా చూడాలన్న సీఎంగారి సంకల్పం ముందు కుళ్ళు కుతంత్రాలు కుట్రలు పటాపంచలు అయిన రోజు, పేదలకు పట్టాలతో పట్టాభిషేకం, ఇది ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు, 51 వేల పట్టాలు అన్ని హంగులతో ఇస్తున్న రోజు, వీటితో పాటు పట్టణ ప్రజలకు రూపాయికే ఇల్లు అని ప్రకటించిన విధంగా లక్ష ఇళ్ళు సిద్దం చేయడంతో పాటు 2,63,000 ఇళ్ళు ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకెళుతున్నాం. 8 లొకేషన్లలో 5,000 ఇళ్ళను సీఎంగారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తున్న పండుగ రోజు. ఇవి ఇళ్ళు కాదు ఊళ్ళు, జగనన్న తలపెట్టిన మహాయజ్జాన్ని భగ్నం చేయాలని చంద్రబాబు ప్రయత్నించారు. పేదలకు పట్టాలివ్వడంపై సుప్రిం ఉత్తర్వులే ఒక నిదర్శనం. చదవండి: మోసాల నారా చంద్రబాబును మాత్రం నమ్మొద్దు: సీఎం జగన్ పేదల కోసం ఎంతదూరమైనా వెళతాననే జగనన్న మరోసారి నిరూపించారు. బడుగు బలహీనవర్గాలు, అణగారిన వర్గాల వారంటే చంద్రబాబాబుకు పగ. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, చంద్రబాబు వ్యాఖ్యలు ఎవరూ మరిచిపోరు, అమరావతి పరిధిలో సామాజిక సమతుల్యం జరుగుతుంది. ఇది జగనన్నకు మాత్రమే చెల్లింది, రాబోయే రోజుల్లో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగనన్న ఉక్కు సంకల్పం ముందు అవన్నీ పటాపంచలు అవుతాయి, ఈ స్ధలాలను సమాధులతో పోలుస్తున్నారు, చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో మీకు దళితులు రాజకీయ సమాధి కడతారు. జగనన్నే మా నమ్మకం. మా భవిష్యత్, మళ్ళీ మళ్ళీ మీరే సీఎం అని మనం ఎలుగెత్తి చాటుదాం. ధ్యాంక్యూ. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు: మంత్రి మేరుగ నాగార్జున నమస్కారం, ఈరోజు సామాజిక న్యాయానికి పండుగ రోజు, సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. గతంలో ఇళ్ళస్ధలాల కోసం కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమాలు, ధర్నాలు చేసేవి, కానీ అవి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయో తెలీదు, వారు చంద్రబాబు పంచన చేరి ఇళ్ళస్ధలాలు ఇక్కడ వద్దంటున్నారు. ఈ ప్రాంతంలో రైతులను చంద్రబాబు నిలువునా ముంచారు, ఆయన్ను రాబోయే రోజుల్లో ఈ పేదలు వెంటబడి తరుముతారు. పేదల ఇళ్ళ స్ధలాలు ఇవ్వకూడదని కోర్టులకెళ్ళారు, పేదలకు అండగా ఉండాలని సీఎంగారు ముందుకెళుతున్నారు, టీడీపీ అధికారంలోకి వస్తే ఈ పట్టాలు క్యాన్సిల్ చేస్తామంటున్నారు, ఆరునూరైనా మళ్ళీ జగన్ గారు సీఎం అవుతున్నారు, ప్రజాస్వామ్యవాదులంతా జగన్ గారిని బలపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగనన్నా మేమంతా మీ వెంటే: మంత్రి జోగి రమేష్ పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగిన యుద్దంలో సుప్రిం సైతం పేదల పక్షాన నిలబడితే, పేదలకు ఇళ్ళస్ధలాలు వద్దు అని పెత్తందార్ల పక్షాన నిలబడ్డ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చంద్రబాబు. 31 లక్షల మందికి ఇళ్ళు కట్టిస్తుంటే దానిని అడ్డుకుంటున్నారు, రాజధానిలో పేదలు నివసించకూడదని, పేదలు పాలేర్లుగా ఉండాలనే విధంగా సుప్రింకు వెళ్ళారు. చంద్రబాబు పెత్తందార్ల పక్షాన ఉంటే మన జగనన్న పేదల వెంట ఉన్నారు, జగనన్నా మేమంతా మీ వెంటే ఉంటాం. 2024లో మరోసారి సీఎం చేద్దాం, మనమంతా జగనన్న వెంట ఉందాం. -
లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణి చేసిన సీఎం వైఎస్ జగన్
-
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు హర్షం
-
‘38 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఇది’
సాక్షి, తాడేపల్లి: 38 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు. గుంటూరు, విజయవాడలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చామన్న సంగతి మాణిక్య వరప్రసాద్ మరోసారి తెలిపారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ..‘పేదలకు అమరావతిలో ఇల్లు కట్టడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. పేదల పక్షాన పోరాడుతున్నానని జగన్ చెప్తున్నారు.అమరావతిలో కేవలం ఒక వర్గం మాత్రమే ఉండాలని మీ ఉద్దేశమా?, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను సీఎం జగన్ ప్రభుత్వం శిరసావహిస్తోంది. ప్రతీ పేదవాడికి ఇంటి స్థలం ఉండాలనేది సీఎం జగన్ ఉద్దేశం. పేదలకోసం పోరాడతామనే వామపక్షాలు, ప్రజాసంఘాలు ఈ జడ్జిమెంట్పై కిమ్మనలేదు. రాజ్యాంగం ప్రకారం ప్రతీ వ్యక్తికి సమానత్వం ఉండాలి. పేదలకు మంచి జరుగుతున్నప్పుడు అడ్డుకునే సంస్కృతిని టీడీపీ మానుకోవాలి’ అని పేర్కొన్నారు. -
Hyderabad: నవంబర్ 23న ఛలో రామోజీ ఫిల్మ్సిటీ
సాక్షి, రంగారెడ్డి: నవంబర్ 23న ఛలో రామోజీ ఫిల్మ్సిటీ కార్యక్రమం చేపట్లనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ ప్రకటించారు. ఆర్ఎఫ్సీలో పట్టా సర్టిఫికెట్లు వచ్చిన లబ్ధిదారులు ఇంటి స్థలం లేని పేదలతో ఆదివారం రాయపోల్లో సమావేశం నిర్వహించారు. రాయపోల్ నుంచి రామోజీ ఫిల్మ్సిటీ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఫిల్మ్సిటీలో పట్టాలిచ్చిన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. చదవండి: (Hyderabad: నేను డిప్యూటీ సీఎం అయ్యాక అంతు చూస్తా...) -
గిరిజనులకు 'పట్టా'భిషేకం
సాక్షి, అమరావతి: గిరిపుత్రులకు పట్టాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది. ఈ మూడేళ్ల కాలంలో 1,33,342 మందికి 2,47,595 ఎకరాల భూమికి ఆర్ఓఎఫ్ఆర్, డీకేటీ పట్టాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ పట్టాల పంపిణీ తీరును అధ్యయనం చేయడం మన రాష్ట్రానికి గర్వకారణం. గతేడాది తెలంగాణ అధికారుల బృందం మన రాష్ట్రానికి వచ్చి అధ్యయనం చేసి.. నివేదికను తమ ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా గిరిజనులకు భూపంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టిన వైఎస్ స్వాతంత్య్రానికి ముందు నుంచే గిరిజనులు అటవీ ప్రాంతంలోని భూముల్లో పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవారు. బ్రిటీష్ ప్రభుత్వం రక్షిత అటవీ ప్రాంతం అనే పేరుతో 18వ శతాబ్దంలో పోడు వ్యవసాయాన్ని రద్దు చేసింది. పోడు వ్యవసాయం చేసేవారిపై బ్రిటీషు వారు దురాగతాలకు పాల్పడేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న ఆదివాసీలకు అల్లూరి సీతారామరాజు అండగా నిలిచారు. స్వాతంత్య్రానంతరం కూడా పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనుల పరిస్థితి మెరుగుపడలేదు. తరతరాలుగా వారు సాగు చేసుకునే అటవీ భూములపై వారికి ఎలాంటి హక్కులు లేకుండా పోయాయి. అటవీ అధికారులు సైతం పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులపై కేసులు పెట్టి, పంటలను ధ్వంసం చేసిన సందర్భాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గిరిజనులకు పట్టాల పంపిణీకి ఉన్న అడ్డంకులు తొలగించి వారికి హక్కు కల్పించేలా వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనుల కష్టాలను తన పాదయాత్రలో తెలుసుకున్న వైఎస్సార్.. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి 2006లో దేశ వ్యాప్తంగా అటవీ హక్కుల చట్టం(ఆర్ఓఎఫ్ఆర్) అమల్లోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. ఆ చట్టం ప్రకారం పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులకు వ్యక్తిగతంగాను, సామూహికంగాను అటవీ భూములపై హక్కు కల్పించే మహోన్నత కార్యక్రమానికి 2008లో వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. అప్పట్లో 56 వేల గిరిజన కుటుంబాలకు 1.30 లక్షల ఎకరాల భూమిని వ్యక్తిగత పట్టాలుగా పంపిణీ చేశారు. దీంతో పాటు గిరిజన కుటుంబాలకు సామూహిక సాగు హక్కు పత్రాలనూ అందించారు. సీఎం జగన్ చేస్తున్న కృషి అభినందనీయం : తెలంగాణ అధికారుల బృందం పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గిరిజనులు తమకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలివ్వాలని గత కొన్నేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. అక్కడ పట్టాల పంపిణీ విషయంలో ప్రభుత్వం అనేక అవరోధాలను ఎదుర్కొంటోంది. అలాంటిది ఏపీలో అంత పెద్ద ఎత్తున పట్టాల పంపిణీ ఎలా సాధ్యమైందనే విషయంలో తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేసింది. గతేడాది సెప్టెంబర్ 18న ఆ రాష్ట్ర అధికారుల బృందం ఏపీకి వచ్చి ఇక్కడ గిరిజనులకు పట్టాల పంపిణీ తీరుపై అధ్యయనం చేసింది. ఏపీ సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు దిలీప్కుమార్, ప్రవీణ్కుమార్, టి.మహేష్, టి.శ్రీనివాసరావులు సమావేశం నిర్వహించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత కలిగిన గిరిజనులందరికీ అటవీ హక్కుల చట్టం(ఆర్ఓఎఫ్ఆర్) పథకం ద్వారా భూమి పట్టాలు అందించిన ఆంధ్రప్రదేశ్ విధానం.. అన్ని రాష్ట్రాలకూ ఆదర్శప్రాయమని ప్రశంసించారు. ఈ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషి, తీసుకుంటున్న చొరవ అభినందనీయమని కొనియాడారు. సీఎం వైఎస్ జగన్ రికార్డ్ వైఎస్సార్ చేపట్టిన గిరిజనులకు పట్టాల పంపిణీ మహోన్నత యజ్ఞాన్ని సీఎం వైఎస్ జగన్ అదే స్థాయిలో కొనసాగించి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి గిరిజనుడికీ ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా హక్కు పట్టాలను అందిస్తున్నారు. 2020 అక్టోబర్ 2 నుంచి ఇప్పటి వరకు 1,07,769 మంది గిరిజనులకు 2,08,794 ఎకరాల అటవీ భూములకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేశారు. మరో 25,573 మంది గిరిజన కుటుంబాలకు 38,801 ఎకరాల భూములకు డీకేటీ పట్టాలను అందించారు. మొత్తంగా 1,33,342 మంది గిరిజనులకు మొత్తం 2,47,595 ఎకరాల భూమికి ఆర్ఓఎఫ్ఆర్, డీకేటీ పట్టాలను పంపిణీ చేయడం విశేషం. మార్పు మొదలైంది.. ఏజెన్సీ ప్రాంతాల్లో సాగుదార్లకే భూమిపై హక్కు కల్పించడం అంటే గొప్ప సామాజిక మార్పునకు ఊతమిచ్చినట్టే. ఇదే ఆశయంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి శ్రీకారం చుడితే.. ఆయన తనయుడిగా సీఎం వైఎస్ జగన్ మరో రెండు అడుగులు ముందుకేసి మరిన్ని ఎకరాలకు పట్టాలిచ్చి రికార్డు సృష్టించారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వడంతో వారి జీవితాల్లో మార్పు మొదలైంది. సొంత భూమి ఉండడంతో వారికి ఆత్మవిశ్వాసంతో పాటు సమాజంలో గౌరవం దక్కుతోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి -
విశాఖలోని పేదల చేతికి పదివేల కోట్ల ఆస్తి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లోని పేద ప్రజల సొంతింటి స్వప్నం నిజం కాబోతోంది. ఎన్నో ఏళ్లుగా తాము ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాల మంజూరు కార్యక్రమానికి ఈ నెల 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. జీవీఎంసీ పరిధిలోని 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాలను అందించనున్నారు. విశాఖపట్నం పరిధిలో భారీగా పెరిగిన భూమి ధరలను పరిగణనలోకి తీసుకుని ఈ ఇళ్ల పట్టాల విలువను లెక్కిస్తే.. ఆ ఆస్తి విలువ రూ. 10 వేల కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గతంలో టీడీపీ హయాంలో అంటే 2014–19 మధ్యకాలంలో కేవలం 13,686 మందికి మాత్రమే పట్టాలను జారీచేశారు. అది కూడా కేవలం తమ పార్టీ వారికేనన్న విమర్శలున్నాయి. అయితే, ఇందుకు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పట్టాలను మహిళల పేరు మీద అందించనుంది. ఇందుకోసం అర్హుల జాబితాను ఒకటికి రెండు సార్లు పరిశీలించి మరీ లబ్ధిదారుల జాబితాను అధికారులు తయారుచేశారు. జీవీఎంసీ పరిధిలో ఇంత భారీగా గతంలో ఎన్నడూ ఇంటి పట్టాల పంపిణీ జరగలేదు. మొత్తంగా విశాఖ చరిత్రలో ఈ ఇంటి పట్టాల పంపిణీ గొప్పగా నిలిచిపోనుందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. కుట్రలపై విజయం.. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లులేని పేదలకు ఇంటి పట్టాలతో పాటు ఇళ్లను కూడా మంజూరు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా పనులు చేపట్టారు. అయితే, జీవీఎంసీ పరిధిలో మాత్రం ఇంటి పట్టాల పంపిణీ జరగకుండా తప్పుడు పేర్లు, ఫిర్యాదులతో హైకోర్టులో ప్రతిపక్షాలు కేసులు వేశాయి. ఫలితంగా గతంలో ఇంటి పట్టాల పంపిణీ జరగలేదు. అయితే, కోర్టులో విచారణలో అసలు కేసులో పేర్కొన్న వ్యక్తులు కనీసం ఫిర్యాదు కూడా చేయలేదని, వారి పేరుతో తప్పుడు కేసును వేశారని పూర్తి ఆధారలతో స్పష్టమైంది. హైకోర్టులో కేసు వీగిపోవడంతో పట్టాల పంపిణీకి మార్గం సుగమం అయ్యింది. వాస్తవానికి విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఇంటి స్థలం కొనుగోలు చేయడం సాధారణ ప్రజలకు సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల అనేక మంది అద్దె ఇళ్లల్లో, ఇరుకు గదుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. జీవీఎంసీ పరిధిలోని పేదలకు ఇచ్చేందుకుగానూ 4,661.42 ఎకరాల్లో 71 లేఅవుట్లలో 1.23 లక్షల మందికి ఇంటి పట్టాలను సీఎం చేతుల మీదుగా అందించనున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో సెంట్ చొప్పున స్థలం అందనుంది. పూర్తిగా అభివృద్ధి చేసిన ప్లాట్లు అంతర్గత డ్రైనేజీ, తాగునీటి సదుపాయం, 30 అడుగుల రోడ్లు, ఇతర సదుపాయాలతో మొత్తం 71 లేఅవుట్లలో పూర్తిగా అభివృద్ధి చేశారు. ఈ లేఅవుట్లు ఒక్కో చోట ఒక్కో ధర ఉంది. ఉదాహరణకు ఆనందపురం మండలంలో తంగుడుబిల్లి వంటి చోట్ల సెంటు ధర ఏకంగా రూ. 10 లక్షలు పలుకుతోంది. ఇక పద్మనాభం మండలం రెడ్డిపల్లి లేఅవుట్లో సెంటు ధర రూ. 8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. సగటు ధర లెక్కిస్తే సెంటు రూ. 5.70 లక్షలు ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. మొత్తం 1.23 లక్షల మందికి లెక్కిస్తే సుమారు ఈ మొత్తం రూ. 8,270 కోట్లు అవుతుంది. ఇక ఇందులో లక్ష మందికి ఇళ్లను మంజూరు చేయగా.. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ. 1.80 లక్షలు ప్రభుత్వం అందించనుంది. ఈ మొత్తం మరో రూ. 1,800 కోట్లు అవుతుంది. అంటే మొత్తం రూ.10,070 కోట్ల ఆస్తిని జీవీఎంసీలోని పేద ప్రజలకు సీఎం అందించనున్నారని అధికారులు చెబుతున్నారు. -
సీఎం జగన్కు మంచి పేరు వస్తోందని టీడీపీ కుట్రలు: అసెంబీల్లో మంత్రి కృష్ణదాస్
సాక్షి, అమరావతి: ఇప్పటివరకు 29.18 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అసెంబ్లీలో గురువారం ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో 71,811 ఎకరాల భూ సేకరణ జరిగిందన్నారు. పేదలకు సొంతిల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయం అన్నారు. కుల,మతాలకు అతీతంగా అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందన్నారు. సంక్షేమ పథకాలకు టీడీపీ మోకాలడ్డుతోందన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చారిత్రాత్మక పథకం. ఈ పథకానికి సహకరించకపోగా టీడీపీ అడ్డంకులు సృష్టిస్తోంది. రాజధాని ప్రాంతంలో దళితులకు ఇళ్ల పట్టాలు దక్కకుండా అడ్డుకుంటున్నారు. సీఎం జగన్కు మంచి పేరు వస్తోందని టీడీపీ కుట్రలు చేస్తోంది. కోర్టులు స్టేలు తెచ్చి ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకుంటున్నారని’’ మంత్రి కృష్ణదాస్ మండిపడ్డారు. -
ఇళ్ల స్థలాల మంజూరు నిరంతర ప్రక్రియ
30,06,673 ఇళ్ల స్థలాల పట్టాలకు గాను ఇప్పటి వరకు 26,21,049 పట్టాల పంపిణీ పూర్తి చేశారు. అంటే 87.17 శాతం పట్టాల పంపిణీ పూర్తి అయింది. ప్రత్యేకంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఏకంగా 90.28 శాతం పట్టాల పంపిణీ పూర్తయింది. మిగిలిన వాటిని రెండు మూడు రోజుల్లో పంపిణీ చేయాలి. సాక్షి, అమరావతి: ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు, పంపిణీ అన్నది నిరంతర కార్యక్రమం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దీనిని నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఇంటి స్థలం పట్టా కోసం దరఖాస్తు అందుకున్న రెండు మూడు వారాల్లో భౌతిక తనిఖీ, అర్హతల పరిశీలన, సోషల్ ఆడిట్ ప్రక్రియనంతా పూర్తి చేయాల్సిన బాధ్యత వలంటీర్, గ్రామ సచివాలయ సిబ్బందిదేనని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన వారు అర్హులని తేలితే కచ్చితంగా 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ పురోగతితో పాటు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సామాజిక తనిఖీల ద్వారా లబ్ధిదారులను గుర్తించాలన్నారు. నిర్మాణాల్లో ఏక రూపత, నాణ్యత కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కల్పిస్తున్న సదుపాయాలు, వాటి నిర్మాణ రీతులు తదితర అంశాలపై పూర్తి వివరాలను ఆయా కాలనీల వారీగా వేర్వేరుగా నివేదించాలని చెప్పారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించాలని, ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. డంపింగ్ యార్డుల్లో బయో మైనింగ్ చేయాలని, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను మొదలు పెట్టాలని ఆయన సూచించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మౌలిక సదుపాయాలపై డీపీఆర్ ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం జగన్కు వివరించారు. మార్చి 31 నాటికి ఈ కాలనీల్లో కల్పించే మౌలిక సదుపాయాలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేస్తామని తెలిపారు. ► వివిధ ప్రభుత్వ శాఖలు ఇందులో భాగస్వాములవుతాయని చెప్పారు. కాలనీల్లో జనాభాను అనుసరించి అంగన్వాడీ కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, బస్టాపులు తదితర నిర్మాణాలపై అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. ► ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సమగ్ర భూ సర్వేలో వైఎస్సార్ జగనన్న కాలనీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం కొత్తగా నిర్మించనున్న వైఎస్సార్ జగనన్న కాలనీలను కూడా సమగ్ర భూ సర్వేలో చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మ్యాపుల తయారీలో ఈ కాలనీలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రతి ఇంటికీ యూనిక్ ఐడీ నంబరు ఇవ్వాలని సూచించారు. ఒక గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తయిన తర్వాత సంబంధిత గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియకు సంబంధించి సర్వేయర్ నుంచి జేసీ వరకూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) లు ఉండాలని, వారు కచ్చితంగా బాధ్యత వహించాలన్నారు. మొబైల్ ట్రిబ్యునల్స్పై ఎస్ఓపీలను రూపొందించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమర్ధత పెంపొందించేందుకు శిక్షణ, పరీక్షలు నిర్వహించాలన్నారు. లంచాలకు తావులేని వ్యవస్థను తెచ్చే ప్రయత్నంలో భాగంగానే సరికొత్త విధానాలని తెలిపారు. సచివాలయ సిబ్బంది సర్వేలో పాల్గొంటున్న సమయంలో రోజూ కనీసం 2 గంటల పాటు ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 30వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షలతో మెరుగైన పనితీరు.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం, సమర్థత పెంచేందుకు క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ, పరీక్షలు నిర్వహించాల్సిందిగా సీఎం సూచించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యే వరకూ శిక్షణ ఇవ్వడం వల్ల పనితీరులో సమర్థత పెరిగి ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగైన ప్రతిభ కనపరుస్తారన్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కార్యాచరణను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనితీరును గ్రామ సచివాలయాల సిబ్బంది స్వయంగా పరిశీలించి నేర్చుకునేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే సిబ్బంది సందేహాల నివృత్తికి నిపుణులు, సీనియర్ అధికారులతో కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 30 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ పొడిగింపు.. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నేరుగా పట్టా పత్రం అందిస్తున్నామని, ఇంటి స్థలం ఎక్కడుందో చూపిస్తున్నామని దీనికి కొంత సమయం పడుతోందని అధికారులు వివరించారు. లబ్ధిదారులకు సంతృప్తి కలిగేలా కార్యక్రమం కొనసాగాలని, ఇళ్ల పట్టాల పంపిణీని జవనరి నెలాఖరు వరకూ పొడిగించాలని సీఎం సూచించారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియని, అర్హులైన వారికి దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా పట్టా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ విధానం సమర్థంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దఫాలుగా సర్వే సిబ్బందికి శిక్షణ సమగ్ర సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి దఫాలుగా శిక్షణ ఇస్తున్నామని, రెండో స్థాయిలో 92 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని అధికారులు వివరించారు. మిగిలినవారికి అవగాహన కల్పించేలా, పరిజ్ఞానం పెంచేలా శిక్షణ ఇస్తున్నామని, ఫిబ్రవరిలో మూడో స్థాయి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, సీఎస్ ఆదిత్యనాథ్దాస్, సీఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఎం.గిరిజా శంకర్, సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ జైన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘పట్టా’భిషేకాల కోలాహలం
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన సంబరాలు అక్కచెల్లెమ్మల సంతోషాల మధ్య ఉత్సాహపూరితంగా, కోలాహలంగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పేదలంతా ఇళ్ల స్థల పట్టాలు తీసుకుంటూ.. దశాబ్దాల నుంచి కలగానే మిగిలిపోయిన సొంతిల్లు సాకారమవుతున్న వేళ ఆనందంతో భూమి పూజల్లో పాల్గొంటున్నారు. శంకుస్థాపనల సందర్భంగా జగనన్న కాలనీలను అరటి పిలకలు, మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు. పట్టాల పంపిణీ, శంకుస్థాపన సందర్భంగా కాలనీలకు వస్తున్న ప్రజాప్రతినిధులకు మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలుకుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులు 80 శాతం కాలనీల్లో పట్టాల పంపిణీ పూర్తి గత నెల 25వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి వైఎస్సార్ జగనన్న కాలనీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయగా.. అప్పటినుంచి ప్రతిరోజూ రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా ఈ కార్యక్రమాలు పండుగలా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం నాటికి 21.96 లక్షల మందికి ఇళ్ల స్థలాలు/టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 17,054 వైఎస్సార్ జగనన్న కాలనీలను రూపొందించగా.. 13,595 కాలనీల్లో పట్టాలు పంపిణీ చేశారు. అంటే 80 శాతం కాలనీల్లో పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. కోర్టు కేసులున్న చోట్ల త్వరగా వాటిని పరిష్కరించి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వనున్నారు. కోర్టు కేసులు ఉన్నచోట్ల ఎంపికైన 3.79 లక్షల మంది లబ్ధిదారులకు లేఖలు అందజేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో సోమవారం నాటికి 2.95 లక్షల మందికి లేఖలు ఇచ్చారు. మహాక్రతువు ముందుకే.. రాష్ట్రంలో ఇళ్లు్ల లేని పేదలందరికీ వచ్చే మూడేళ్లలో గృహ సౌకర్యం కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకుని మహా క్రతువుకు శ్రీకారం చుట్టి ప్రజల్లో సంతోషం నింపారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదకూ ఇల్లులేని పరిస్థితి లేకుండా చేయాలని ఉక్కు సంకల్పం పెట్టుకున్న ఆయన ఇళ్ల నిర్మాణాన్ని కూడా స్వల్పకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి సంకల్ప సాధన కోసం అధికార యంత్రాంగం 30.76 లక్షల మందిని ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. కొత్తగా దాదాపు అదే సంఖ్యలో కొత్త కాలనీలను ప్రణాళికాబద్ధంగా రూపొందించింది. ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం సకల సౌకర్యాలతో రూపొందించిన 17,054 వైఎస్సార్ జగనన్న కాలనీలు భవిష్యత్లో సకల సౌకర్యాలతో కూడిన ప్రణాళికాబద్ధమైన గ్రామాలు, పట్టణాలు, నగరాలుగా విలసిల్లనున్నాయి. సకల సదుపాయాలతో.. కాలనీల్లో చక్కటి రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సదుపాయాలతోపాటు ఉద్యాన వనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు తదితరాల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారు. ఎక్కడా వంకర్లు లేకుండా సరళరేఖల్లా ఇళ్లు ఉండనున్నాయి. కొత్తగా రూపొందించిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 24 చోట్ల 5వేలకు పైగా ఇళ్లు రానున్నాయి. ఒక్కో ఇంట్లో సగటున నలుగురు జనాభా లెక్కవేసుకుంటే 24 కాలనీల్లో ఒక్కోచోట కనీసం 20 వేల చొప్పున జనాభా ఉండనున్నారు. విజయనగరం జిల్లా గుంకలాం, తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి, గుంటూరు జిల్లా పేరేచెర్ల లాంటి కాలనీల్లో తొమ్మిది వేల పైగా ఇళ్లు రూపుదిద్దుకోనున్నాయి. ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు చేసేసరికే ఇవి పట్టణాలు కానున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో అనువైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడంతోపాటు ఇళ్లు కట్టుకోవడానికి వీలుగా వారికి నచ్చేవిధంగా ఐచ్ఛికాలు ఇవ్వడంతో లబ్ధిదారుల మోముల్లో చెప్పలేనంత సంతోషం కనిపిస్తోంది. వారంతా ఆనందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను వేనోళ్ల ఆశీర్వదిస్తున్నారు. -
కోలాహలంగా పట్టాల పంపిణీ
సాక్షి నెట్వర్క్: ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరుస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాల పంపిణీ కొనసాగుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా 25వ రోజు సోమవారం కూడా ఈ కార్యక్రమం కోలాహలంగా సాగింది. ఇది జగనన్న మాకిచ్చిన స్థలం.. ఇక్కడ ఇల్లు కూడా కట్టిస్తారు.. అంటూ లబ్ధిదారులు ఆనందంగా చెప్పుకోవడం కనిపించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 12,722 పట్టాలు, పత్రాలు పంపిణీ చేశారు. ఏలూరు మండలం కొమడవోలు, పాలకొల్లు మండలంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, రాపాక వరప్రసాద్, ముదునూరి ప్రసాదరాజు, తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, కొఠారు అబ్బయ్యచౌదరి, ఎలీజా పాల్గొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 9,911 మందికి ఇంటిస్థలం పట్టాలు, ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. కృష్ణాజిల్లాలో 6,894 పట్టాలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లాలో 5,297 పట్టాలు, పత్రాలను పంపిణీ చేశారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్యేలు షేక్ మొహమ్మద్ ముస్తఫా, అన్నాబత్తుని శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 4,979 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. విశాఖ జిల్లాలో 2,890 మందికి పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్గణేష్, గుడివాడ అమర్నాథ్, గొల్ల బాబూరావు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 2,460 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో 520 మందికి, విజయనగరం జిల్లాలో 251 మందికి పట్టాలు అందజేశారు. శ్రీకాకుళం జిల్లాలో 153 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. -
ఇది.. జగనన్న పాదయాత్ర కాలనీ
సాక్షి, అమరావతి: ప్రజల సమస్యల్ని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన 3,648 కిలోమీటర్ల చారిత్రాత్మక పాదయాత్రకు గుర్తుగా 3,648 ఇళ్లతో ఒక కాలనీ రూపుదిద్దుకోనుంది. ప్రజల కష్టాలు తీర్చడానికి, వారి సంక్షేమం కోసం చేపట్టే అనేక పథకాల ఆలోచనలకు పురుడుపోసిన పాదయాత్ర తీపి గుర్తు.. ‘జగనన్న పాదయాత్ర కాలనీ’గా ల్యాండ్మార్క్ కానుంది. విజయవాడ నగరానికి సమీపంలోని గొల్లపూడిలో ఈ కాలనీ ఏర్పాటు కానుంది. ‘నవరత్నాలు–అందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడిలో సోమవారం 3,648 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఇంటి పట్టాతో పాటు చీర, గాజులు, పసుపు, కుంకుమ అందజేశారు. జగనన్న మాకోసం నడిచింది 3,648 కిలోమీటర్లు.. మా కాలనీలో ఇళ్లు 3,648.. అంటూ లబ్ధిదారులు ఆనందంతో చెప్పుకోవడం వినిపించింది. నిరంతరం ప్రజల కోసం ఆలోచించే సీఎం వైఎస్ జగన్: మంత్రి పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 3,648 కిలోమీటర్ల పాదయాత్రచేసి ప్రజలతో మమేకమయ్యారని, గొల్లపూడి లేఅవుట్లో 3,648 మందికి పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందని పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పాదయాత్ర సాగిన దూరం, ఈ లేఅవుట్లో పేదలకు ఇస్తున్న పట్టాల సంఖ్య కలవడం బాగుందన్నారు. ఇది ‘జగనన్న పాదయాత్ర కాలనీ’గా ల్యాండ్మార్క్ అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గొల్లపూడిలో జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో 90 శాతం ఎన్నికల హామీలను అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కు దక్కుతుందని, దేశ చరిత్రలో ఈ రకంగా హామీలను అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి కూడా ఆయనేనని చెప్పారు. ఎన్నికల్లో ఆరువేలకు పైగా హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేకపోయారని, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే హామీలన్నీ దాదాపుగా అమలు చేశారని తెలిపారు. పోలవరం, ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సుమారు 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర అని చెప్పారు. అమరావతి ప్రాంతంలో 50 వేలమంది పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తామంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం ప్రజల కోసమే ఆలోచన చేస్తుంటారని పేర్కొన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని, హోం మంత్రి మేకతోటి సుచరిత, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. యాదృచ్ఛికంగానే.. పాదయాత్రలో వైఎస్ జగన్ 3,648 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర కో ఆర్డినేటర్గా వ్యవహరించిన తలశిల రఘురాం స్వగ్రామం గొల్లపూడి. ఆ ఊళ్లో ఏర్పాటు చేసిన లేఅవుట్లో 3,648 ప్లాట్లు ఉన్నాయి. ఇది యాదృచ్చికంగానే జరిగిందని రఘురాం ‘సాక్షి’కి చెప్పారు. -
‘పట్టా’లతో పట్టలేని ఆనందం
సాక్షి నెట్వర్క్: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యజ్ఞం మంగళవారం కూడా లబ్ధిదారుల ఆనందోత్సాహాల మధ్య పండుగ వాతావరణంలో సాగింది. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 30.75లక్షల మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుండడంతో తమ కల సాకారమవుతోందని అక్కచెల్లెమ్మలు పట్టలేని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఎక్కడికక్కడ.. తమకు కేటాయించిన స్థలాలను చూసుకునేందుకు వారంతా లేఅవుట్ల వద్దకు బంధుమిత్రులతో పెద్ద ఎత్తున వస్తుండడంతో అక్కడంతా కోలాహలంగా ఓ జాతరను తలపిస్తోంది. ఎవరికి వారు సెల్ఫీలు దిగుతున్నారు. కొందరైతే పట్టాలు తీసుకున్న వెంటనే శంకుస్థాపన చేసుకుంటున్నారు. ► అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలో 19వ రోజు మంగళవారం 2,474 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 14 నియోజకవర్గాల పరిధిలో 85,761 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలంతో పాటు పట్టాలను పంపిణీ చేశారు. ► చిత్తూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం నాటికి 8,158 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ► కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలో మంగళవారం 1,233 మందికి ఇంటి స్థలాల పట్టాలను అందజేశారు. అలాగే, ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. మిగిలిన ప్రాంతాల్లో అధికారులు పట్టాల పంపిణీ చేపట్టారు. ► వైఎస్సార్ కడప జిల్లాలో మంగళవారం 3,901 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో మొత్తం 1,10,001 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయింది. ► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం 1,582 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు, 261 మందికి టిడ్కో ఇళ్లు పంపిణీ చేశారు. ► ప్రకాశం జిల్లాలో మంగళవారం 762 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 84,027 మందికి పట్టాలివ్వాల్సి ఉండగా 63,360 మందికి పట్టాలిచ్చారు. అలాగే, జిల్లాలో మొత్తం 9,568 టిడ్కో ఇళ్ల సేల్ అగ్రిమెంట్లు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 3,004 మందికి ఇచ్చారు. ► గుంటూరు జిల్లాలో మంగళవారం 530 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ► తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం వరకు 2,45,911 మందికి ఇళ్లు పట్టాలను పంపిణీ చేశారు. 1,93,506 మందికి ఇళ్ల పట్టాలు, 19,981 మందికి టిడ్కో గృహాలు, 32,424 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేసినట్లు తెలిపారు. మంగళవారం ఒక్కరోజు 3,094 ఇళ్ల స్థలాల పట్టాలు అందించినట్లు వివరించారు. అదే విధంగా 1,33,540 మందికి గృహనిర్మాణం చేపట్టేందుకు మంజూరు ఉత్తర్వులు ఇచ్చామన్నారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో మంగళవారం మొత్తం 1,403 మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ► శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంగళవారం 1,293 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 19 రోజుల్లో 61,394 పట్టాలను అందజేశారు. -
ఎటుచూసినా ఆనందమే
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో పండుగలా జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం 11వ రోజు సోమవారం ఉత్సాహంగా సాగింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇంటి స్థలాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తమ వద్దకే వచ్చి ఇళ్ల పట్టాలు ఇస్తుండటంతో లబ్ధిదారుల ఆనందం వర్ణనాతీతంగా ఉంది. సొంతిల్లు లేక ఏళ్ల తరబడి పడిన కష్టాలు తీరుతున్నాయన్న సంతోషం వారి మాటల్లో వ్యక్తమవుతోంది. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు కుటుంబసభ్యులతో కలిసి తమ స్థలం వద్ద ఫొటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు. కొందరైతే పట్టా తీసుకున్న వెంటనే ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం కనిపించింది. తూర్పుగోదావరి జిల్లాలో 44,458 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో 33,639 ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల అగ్రిమెంట్ పత్రాలు అందజేశారు. శాసనమండలి చీఫ్విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మోపిదేవి వెంకటరమణారావు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు నంబూరు శంకరరావు, ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 14,631 మందికి ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇంటి పత్రాలు పంపిణీ చేశారు. శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో 12,300 ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), శాసనమండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అసెంబ్లీలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో 10,484 మందికి ఇంటిస్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల ఒప్పందపత్రాలు, ఆస్తిహక్కుపత్రాలు పంపిణీ చేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్రాజ్, కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావు, గుడివాడ అమర్నాథ్, భాగ్యలక్ష్మి, యూవీ రమణమూర్తిరాజు, ఉమాశంకర్గణేశ్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో 9,527 స్థల పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లాలో 8,335 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆర్కే రోజా, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కోనేటి ఆదిమూలం, చింతల రామచంద్రారెడ్డి, ఎం.ఎస్.బాబు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో 7,957 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. వైఎస్సార్ జిల్లాలో 7,416 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో 6,316 మందికి పట్టాలను పంపిణీ చేశారు. మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పాల్గొన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 5,463 మందికి ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. మంత్రి అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యేలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్రావు, కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో 5,379 ఇళ్ల పట్టాలు, శ్రీకాకుళం జిల్లాలో 3,138 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కష్టాలు కడతేరాయి పదిహేనేళ్లుగా అద్దె ఇంట్లోనే గడుపుతున్నాం. టీడీపీ పాలనలో ఇంటిస్థలం కోసం దరఖాస్తు చేసుకుని నేతలు, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రిగా జగనన్న అధికారం చేపట్టిన తరువాత దరఖాస్తు చేసిన వెంటనే ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మాణానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడంతో మా కుటుంబ కష్టాలు కడతేరాయి. ఇందుకు జగనన్నకు మా కుటుంబం రుణపడి ఉంటుంది. – వీరాబత్తిన సంధ్య, పేరూరు, కృష్ణా జిల్లా సొంతింటి కల నెరవేరింది మాది చాలా పేద కుటుంబం. ఇద్దరు పిల్లలతో అద్దె ఇంటిలో ఉంటున్నాం. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం కాళ్లరిగేలా తిరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. పిల్లలతో మా భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడేదాన్ని. జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటిస్థలం కోసం దరఖాస్తు చేసుకోగా స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేస్తూ పత్రాలు అందించడంతో మా సొంతింటి కల నెరవేరింది. ఇందుకు జగనన్నకు కృతజ్ఞతలు. – వీర్ల సత్యవతి, పేరూరు, ముదినేపల్లి మండలం, కృష్ణాజిల్లా మా కుటుంబానికి వెలుగు వచ్చింది ఇంటి పట్టా మా కుటుంబానికి వెలుగు తెచ్చింది. కూలి పనులు చేసుకుంటూ కుమార్తె, కొడుకును చదివించుకుంటున్నాను. ఇప్పుడు ఇంటి స్థలంతో పాటు ఇళ్లు కూడా మంజూరైంది. సోమవారం పట్టా తీసుకుని ఇంటి నిర్మాణానికి భూమిపూజ కూడా చేశాం. సీఎం జగన్ వల్ల మాకు సొంత స్థలం వచి్చంది. దేవుడు లాంటి వైఎస్ జగన్కి జీవితకాలం రుణపడి ఉంటాం. – కొత్తపల్లె సువార్తమ్మ, మొర్రాయిపల్లె, వైఎస్సార్జిల్లా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ నరసాపురం రూరల్: ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సోమవారం జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదవాళ్లకు స్థలం ఇవ్వడమే కాకుండా, ఇల్లు కట్టకోవడానికి సహకరించే ఓ చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం దేవుడిచ్చిన వరంగా, అల్లా ఇచ్చిన బ్రహా్మండమైన అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ స్థలాలను అమ్ముకునే ప్రయత్నం చేయవద్దని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం పట్టాలు పంపిణీ చేశారు. -
అర్హులైతే చాలు... ఇంటి పట్టా చేతికి
ఇదో మహా యజ్ఞం.. వడివడిగా నిర్విఘ్నంగా సాగుతున్న గొప్ప సంకల్పం... మరి దానికి సన్నద్ధత కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. అందుకే 30 లక్షల పైచిలుకు ఇళ్ల పట్టాలివ్వటం,వాటిని నిర్మించి ఇవ్వటం అనే భగీరథ లక్ష్యాన్ని తలకెత్తుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. నిర్దేశించుకున్న సమయంలోగా అందుకోవాలంటే వినూత్న ఆలోచనలు, ప్రణాళికలతో పాటు కార్యాచరణ కూడా విభిన్నంగా ఉంటే తప్ప సాధ్యం కాదనేది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశం. అందుకే అనితర సాధ్యమైన ఈ లక్ష్యాన్ని అందుకోవటానికి ఇబ్బందులుండకూడదని.. కావాల్సిన భూమి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందే కొనుగోలు చేసింది. మొత్తం 68,677 ఎకరాల్లో 25,433 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి. మిగిలిన భూమి మొత్తం ప్రైవేట్ వర్గాల నుంచి సేకరించిందే. సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లుగానే ఎలాంటి వివక్షకు తావులేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ పండగ వాతావరణంలో కొనసాగుతోంది. అర్హులందరికీ పిలిచి మరీ ఇంటి పట్టాను అందచేస్తుండటం పట్ల అక్క చెల్లెమ్మలలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. తెనాలిలో కౌన్సిలర్ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తోన్న కొర్రా లక్ష్మీ కృష్ణవేణి ఇందుకు నిదర్శనం. పట్టణంలోని 13వ వార్డులో నివాసం ఉండే ఆమె ప్రభుత్వం మంజూరు చేసే నివేశన స్థలం కోసం అర్జీ పెట్టుకున్నారు. అధికారుల పరిశీలనలో ఆమె అర్హురాలిగా తేలడంతో అదే వార్డు నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థిని కుర్రా సుజాత, శ్రీను దంపతుల సమక్షంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా శనివారం ఇంటి పట్టాను అందుకున్నారు. కేవలం పేదలా.. కాదా? అన్న అంశాన్ని మాత్రమే పరిశీలించి పార్టీ గురించి పట్టించుకోకుండా తనకు ఇంటి పట్టా ఇవ్వడంపై లక్ష్మీ కృష్ణవేణి హర్షం వ్యక్తం చేస్తున్నారు. 7 వరకు కొనసాగనున్న కార్యక్రమాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమాలు సంక్రాంతి సంబరాలతో పోటీపడి సాగుతున్నాయి. దేశ చరిత్రలోనే ఎక్కడా, ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 30.75 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం నివాస స్థలాలు / ఇళ్లు మంజూరు చేయడంతో తమ జీవితకాల స్వప్నం సాకారమైందంటూ లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా తమకు గతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఇప్పుడు ఎవరినీ అడక్కుండానే ప్రభుత్వం నివాస స్థలాలు ఇవ్వడంతోపాటు ఇళ్లు కూడా మంజూరు చేసిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల వద్దకు వెళ్లి చూసుకోవడం ద్వారా సొంతింటి కల నెరవేరిందన్న ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఏ ఒక్క అర్హుడికీ ఇంటి స్థలం రాలేదనే మాట వినిపించరాదని సీఎం జగన్ పదేపదే చెప్పడం, అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయడమే కాకుండా ప్లాట్ల కేటాయింపు కూడా లాటరీల ద్వారా జరపడం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు సగం వరకు పట్టాల పంపిణీ పూర్తైనట్లు అనధికారిక అంచనా. పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలు ఈనెల 7వతేదీ వరకు కొనసాగనున్నాయి. విజయవాడ పడమటలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులు రాష్ట్రవ్యాప్తంగా పట్టాల పంపిణీ.. గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండల పరిధిలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేదలకు శనివారం పట్టాలు అందజేశారు. మిగిలిన చోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పట్టాల పంపిణీ కొనసాగింది. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా 2,559 మంది లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. తొమ్మిది రోజుల వ్యవధిలో 35,151 మందికి పట్టాలు అందాయి. విశాఖ జిల్లాలో పెందుర్తి, భీమిలి, గాజువాక నియోజకవర్గాల్లో నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 22,256 మందికి పట్టాలు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 9,697 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వగా తొమ్మిది రోజుల్లో మొత్తం 69,659 మందికి ఇళ్ల పట్టాలు అందచేశారు. ఏలూరు నియోజకవర్గం పోణంగిలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని 3,385 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆచంట నియోజకవర్గంలో గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు 1,248 మందికి పట్టాలు అందజేశారు. కృష్ణా జిల్లాలో 8,638 మందికి ఇళ్ల పట్టాలను అందచేశారు. మచిలీపట్నం నియోజకవర్గం తపసిపూడిలో సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పట్టాలు అందజేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురం లేబర్ కాలనీలో దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్నారు. గుడ్లవల్లేరు మండలంలో మంత్రి కొడాలి నాని ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయిగూడెం, వెంకటాపురం, మండలపాడులో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పేదలకు పట్టాలు అందించారు. విజయనగరం జిల్లాలో 17,438 పట్టాలు పంపిణీ చేశారు. ఇందులో ఇళ్ల పట్టాలు 12,479 కాగా టిడ్కో ఇళ్లు 2664, పీసీ/ఈఆర్ పట్టాలు 2295 ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 36,307 పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 1,08,830 పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో 4,150 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా ఇప్పటి వరకు మొత్తం 36,744 మందికి పట్టాలిచ్చారు. మొత్తం 84,027 పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంది. అనంతపురం జిల్లాలో తొమ్మిదో రోజు 6,021 మందికి పట్టాలు ఇచ్చారు. కర్నూలు జిల్లాలో శనివారం 9,988 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా 13,661 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మదనపల్లి నియోజకవర్గంలో రాజంపేట ఎంపీ మిధున్రెడ్డి లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 3,917 మందికి ఇళ్ల పట్టాలు, 20 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలను అందజేశారు. వైఎస్సార్ జిల్లాలో శనివారం 5,696 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 60,152 మందికి పట్టాల పంపిణీ పూర్తయింది. -
పేదల కళ్లల్లో ఆనందం
సాక్షి నెట్వర్క్: పేదల జీవితాల్లోకి వేవేల సంక్రాంతి వెలుగులు ఒక్కసారిగా వచ్చినట్లుంది. సొంతింటి కల సాకారం అవుతోందన్న ఆనందం అక్కచెల్లెమ్మల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించినప్పటి నుంచి పట్టాల పంపిణీ నిర్విఘ్నంగా సాగుతోంది. ఏడో రోజైన గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింది. గురువారం పంపిణీ చేసిన పట్టాలతో సహా ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో 86,488 , కృష్ణాజిల్లాలో, 62,670 పట్టాలను పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లాలో 26,476, తూర్పుగోదావరి జిల్లాలో 63,384 మందికి పట్టాలు పంపిణీ పూర్తయింది. పశ్చిమగోదావరి జిల్లాలో 59,177 మందికి ఇళ్ల పట్టాలు అందించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 32,560, విశాఖ జిల్లాలో 26,345 మందికి పట్టాలు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లాలో 17,165 పట్టాల పంపిణీ పూర్తయ్యింది. కర్నూలు జిల్లాలో 14,193 మంది లబ్ధిదారులు పట్టాలు అందుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో 54,421 మంది ఇళ్ల పట్టాలు అందుకున్నారు. కాగా, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 7వ రోజు గురువారం 8,498 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం 2,839 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో గురువారం 3,889 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి మంత్రులు మేకతోటి సుచరిత ,కొడాలి నాని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పేర్ని నాని, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బంధువులు వస్తారేమో! నా భర్త 40 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఇద్దరు ఆడబిడ్డల్లో పెద్ద బిడ్డ అనారోగ్యంతో మృతి చెందింది. మనవడు ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కూతురి కుటుంబం ఊరు వదిలి వెళ్లిపోయింది. రెక్కల కష్టం చేసే ఓపిక లేదు. పింఛనే ఆధారం. చిన్న ఇంటిలో ఒక్కదాన్నే అద్దెకు ఉంటున్నాను. ఇప్పుడు నాకు ఇంటి పట్టా ఇచ్చి ఇల్లు కట్టిస్తామని జగనయ్య చెప్పాడు. చాలా సంతోషంగా ఉంది. నా సొంత ఇంట్లోనే తనువు చాలిస్తానన్న ధైర్యం వచ్చింది. ఇంటి కోసమైనా దూరంగా ఉన్న బంధువులు వచ్చి నా కర్మకాండలు సక్రమంగా చేస్తారేమో. నాకు ఇల్లు కట్టిస్తున్న ఆ మహానుభావుడు చల్లగా ఉండాలి. – తమ్మిశెట్టి చినకాకమ్మ, నరమాలపాడు, గుంటూరు జిల్లా. -
అర్హులందరికీ ఇంటి పట్టాలు అందాలి
సాక్షి, అమరావతి: అర్హత ఉన్నప్పటికీ ఇంటి పట్టా రాలేదనే మాట ఎక్కడా వినిపించకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. అర్హులందరికీ ఇంటి పట్టాలు అందాల్సిందేనని స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సమావేశం సందర్భంగా అర్హులందరికీ ఇంటి పట్టాలు, విగ్రహాల విధ్వంసం తదితర విషయాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దేవుడితో చెలగాటమాడితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని పేర్కొన్నారు. విగ్రహాల విధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. పేదల సంక్షేమం కోసం యజ్ఞం చేస్తున్నాం ► పొరపాటున ఎక్కడైనా అర్హులు మిగిలిపోయి ఉంటే వారికి వెంటనే ఇంటి పట్టాలు ఇప్పించాలి. మనది అర్హులకు పథకాలను కత్తిరించే ప్రభుత్వం కాదు. మనం పేదల సంక్షేమం కోసం యజ్ఞం చేస్తున్నాం. అర్హులకు పథకాలన్నీ అందాల్సిందే. అదే సమయంలో అనర్హతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ► పెన్షన్, బియ్యం కార్డు, ఇంటి పట్టాకు సంబంధించి సచివాలయాల్లో పెండింగులో దరఖాస్తులు లేకుండా చూసుకోవాలి. అర్హులైన వారికి 10 రోజుల్లో బియ్యం కార్డు, 10 రోజుల్లో పెన్షన్, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇంటి పట్టా ఇస్తామని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. ► ఈ లక్ష్యాలను కచ్చితంగా అందుకుంటూ ముందుకు సాగాలి. ఎప్పటికప్పుడు వస్తున్న దరఖాస్తులను పరిష్కరించాలి. ఇన్ని రోజుల్లో ఈ సేవలు అందిస్తామన్న విషయాన్ని తెలిపేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో బోర్డులు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఉన్నాయా? లేవా? అనేది మరోసారి పరిశీలించండి. ► అమ్మ ఒడి పథకానికి సిద్ధం కావాలి. -
25న చిత్తూరు జిల్లాకు సీఎం జగన్
సాక్షి, తిరుపతి: నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 25న చిత్తూరు జిల్లాలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. తిరుపతి లేదా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. తిరుపతిలో సోమవారం పీఎల్ఆర్ కన్వెన్షన్లో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు మిథున్రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బియ్యపు మధుసూదన్రెడ్డి, ద్వారకనాథ్రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, వెంకటేశ్గౌడ్, నవాజ్ బాషా, ఆదిమూలం ఇతర పార్టీ నాయకులు సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. పంపిణీ కార్యక్రమం పూర్తిచేసిన వెంటనే పక్కాగృహాల నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో 15 లక్షల పక్కాగృహాలను నిరి్మంచనున్నట్లు వివరించారు. రెండో విడతలో మిగిలిన ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేస్తామన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ, ఆ వెంటనే పక్కాగృహాల నిర్మాణ కార్యక్రమాలపై పార్టీ నేతలు చర్చించారు. ఇక్కడ ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమైన మరుసటి రోజు నుంచి 15 రోజుల పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి వారి ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ, పక్కాగృహాల నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించాలని సూచించారు. -
ప్రజాబలం ఈ ప్రభుత్వానికి ఉంది
-
ఆస్తుల కోసమే రైతుల పేరుతో కృత్రిమ ఉద్యమం
సాక్షి, అమరావతి: అధికార వికేంద్రీకరణ బిల్లు ఆమోదం సందర్భంగా రాజధాని నడిబొడ్డున మందడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సోమవారం రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ప్రజా మహిళా సంఘాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా దేవుడి ఆశిస్సులు, ప్రజాబలం ఈ ప్రభుత్వానికి ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికార వికేంద్రీకరణ బిల్లు తీసుకు వచ్చిన సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు. ఆస్తుల్ని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు రైతుల పేరుతో కృత్రిమ ఉద్యమం చేస్తున్నాడు. పేద ప్రజలకు రాజధానిలో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే చంద్రబాబు కోర్టుకు వెళ్లి దాన్ని అడ్డుకున్నారు. పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇక్కడి నుంచి హైకోర్టు దాకా వెళ్లి కోర్టును అభ్యర్థిస్తామని పేర్కొన్నారు. కాగా అమరావతిలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడాన్ని దళిత ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
అది ప్రపంచ రికార్డే..!
సాక్షి, కాకినాడ: ఉగాదికి ‘అందరికి ఇళ్లు’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాకినాడ నుంచి ప్రారంభిస్తారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా దేశంలో ఏ రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఇళ్లు ఇచ్చిందిలేదన్నారు. 25 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇవ్వడం ప్రపంచ రికార్డు అవుతుందన్నారు. తప్పనిసరి అయితే తప్ప.. అసైన్డ్ భూములను తీసుకోవద్దని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. స్వచ్ఛందం గా భూములు ఇచ్చేవారికి పరిహారం ఇచ్చి భూ సేకరణ చేస్తున్నామని వివరించారు. గోదావరి డెల్టాకు రబీకి కావాల్సిన నీరు ఉందన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యామ్ వద్ద ఏర్పాటు చేసిన పైపుల వల్ల నీరు దిగువకు తక్కువగా వస్తుందన్నారు. ఈ సమస్య పరిష్కారం అయిందన్నారు. జిల్లాలో ఇసుక సమస్యను తీర్చేందుకు అనుమతులు ఉన్న రీచ్ లను ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. 3.50 లక్షల మంది లబ్ధిదారులు గుర్తింపు.. అందరికి ఇళ్లు పథకంలో జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో 7,700 ఎకరాల భూమి అవసరం అవుతుందన్నారు. 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ భూసేకరణ జరపలేదని పేర్కొన్నారు. విద్య, వైద్య, దేవాదాయ, వక్ఫ్ బోర్డు భూములను సేకరించలేదని వివరించారు. అసైన్డ్ భూములను రైతుల అంగీకారంతోనే అవార్డు ప్రకటించామని చెప్పారు. అది వాస్తవం కాదు.. తెలుగు యునివర్సిటీలో 10 మంది విద్యార్థులు, 14 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని, ఆ యూనివర్శిటీకి 25 ఎకరాల భూమి అవసరం ఉందా లేదా అనేది పరిశీలిస్తున్నామన్నారు. యునివర్శిటీకి నన్నయ్య యునివర్శిటీలో 5 ఎకరాలు కేటాయించాలని ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. యునివర్సిటీ భూములపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. బలవంతపు భూసేకరణ చేస్తున్నామనేది వాస్తవం కాదని.. మీడియా ఇలాంటి వార్తలు రాసేటపుడు అధికారుల నుండి వివరణ తీసుకోవాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి కోరారు. -
అర్హులైన పేదలందరికీ ఇంటిస్ధలం
-
‘ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్లు’
సాక్షి, అనంతపురం: అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగాదికి ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ వెంటనే స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డులను సమూల ప్రక్షాళన చేయాలని తెలిపారు. అదేవిధంగా పెండింగ్ కేసులన్నీ వెంటనే పరిష్కరించాలని, భూ ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. -
'కేసులు వల్లే పట్టాలు ఇవ్వలేకపోతున్నాం'
హైదరాబాద్: కేసులు ఉండడం వల్లే అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. త్వరలోనే సమస్యలు పరిష్కరించి అందరికీ పట్టాలు ఇస్తామన్నారు. శుక్రవారం మల్కాజ్ గిరిలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేకాట, రేసు క్లబ్బులకు వేల ఎకరాలు కట్టబెట్టారని... పేదలకు ఇళ్లు కడదామంటే స్థలాలు లేవన్నారు. జంట నగరాల్లో దాదాపు 2 లక్షల మంది అధ్వాన్నంగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీయిచ్చారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని పునరుద్ఘాటించారు. పేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. పేదలకు న్యాయం జరిగినప్పుడే తన జన్మ ధన్యమవుతుందన్నారు. -
'కేసులు వల్లే పట్టాలు ఇవ్వలేకపోతున్నాం'
-
బడుగుకు భరోసా
* ప్రభుత్వ స్థలాల్లోని పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు * ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణపై కేసీఆర్ సమీక్ష * ఉత్తర్వులు వచ్చిన 20 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి * 25 గజాలు మించితే రిజిస్ట్రేషన్ ధరలో ముందుగా 25 శాతం డీడీ రూపంలో చెల్లించాలి * గత జూన్ 2 లోపు ఉన్న నివాసాలకే వర్తింపు, నివాస ధ్రువీకరణ తప్పనిసరి.. 90 రోజుల్లోగా ప్రక్రియ పూర్తికి కేసీఆర్ నిర్దేశం సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న పేదలకు ఆయా స్థలాల(125 గజాల్లోపు)ను ఉచితంగానే క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్రావు తాజాగా ఆదేశించారు. క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను రూపొందించేందుకు మంగళవారం సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. భూముల క్రమబద్ధీకరణపై ఇటీవల అసెంబ్లీలో చేసిన తీర్మానం, అఖిలపక్ష భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నిబంధనలు ఉండాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకట్టవేయడం, ప్రతి భూమికి టైటిల్ కలిగి ఉండడం వంటి లక్ష్యాలను సాధించడమే క్రమబద్ధీకరణ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. నిరుపేదలు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చి తల దాచుకోవడానికి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు, షెడ్లు, ఇళ్లు నిర్మించుకున్నారని, ఆక్రమిత భూములకు పట్టాలు లేకపోవడంతో వారు నిత్యం అవస్థలు పడుతున్నారని సీఎం పేర్కొన్నారు. అలాంటి వారు నివాసముంటున్న స్థలాలను ఉచితంగానే క్రమబద్ధీకరించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్గౌడ్, రాజ్యసభ సభ్యుడు కేశ వరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్రెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్మీనా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్, సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్ జి.డి.అరుణ తదతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో పొందుపరచాల్సిన మార్గదర్శకాలను అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు. ఇవీ మార్గదర్శకాలు.. * ఈ ఏడాది జూన్ 2లోపు ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి మాత్రమే క్రమబద్ధీకరణ అవకాశం కల్పించాలి. దీనికి సంబంధించి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వంటి ధ్రువీకరణ పత్రాలను జతపరచాలి. * పట్టణ ప్రాంతాల్లో పేద కుటుంబాల ఆదా య పరిమితిని రెండు లక్షలకు పెంచినందున, ఆలోపు ఆదాయమున్న వారిని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలుగా గుర్తించాలి. * దరఖాస్తు చేసుకోవడానికి 20 రోజుల గడవు ఇవ్వాలి. దరఖాస్తుతోపాటు భూమికి నిర్ణయించిన ధరలో 25 శాతాన్ని డీడీ రూపంలో చెల్లించాలి. * ఆసుపత్రులు, విద్యా సంస్థలను కూడా వ్యాపార సంస్థలుగానే పరిగణించాలి. * జాయింట్ కలెక్టర్, ఆర్డీవోల పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన, ఫిర్యాదులపై విచారణ తదితరాలను చేపట్టాలి. * క్రమబద్ధీకరణను 90రోజుల్లో పూర్తి చేయాలి. * ఎటువంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉన్న భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని వేలం నిర్వహించాలి. విచారణ సందర్భంలో ఏ ప్రాంతంలో, ఎంత స్థలంలో, ఏ ఇంట్లో, ఎవరు నివాసముంటున్నారో గుర్తించి ఫొటోలను కూడా అధికారులు తీసుకోవాలి. * రెగ్యులరైజేషన్ ప్రక్రియలో సహకరించడానికి పదవీ విరమణ చేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలి. * క్రమబద్ధీకరణ చేసిన తర్వాత ఆ కుటుంబంలోని మహిళల పేరిటే పట్టాలు ఇవ్వాలి. భూముల వేలానికి ఓకే జిల్లాల్లోని ప్రభుత్వ భూముల వేలానికి సం బంధించి కూడా సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు. చిన్న చిన్న బిట్లుగా ఉన్న భూమిని ప్రభుత్వం వినియోగించుకోలేకపోతున్నందున అవి కబ్జాకు గురవుతున్నాయని, అలాంటి వాటిని వేలం వేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాల్లో కలెక్టర్లు ప్రతిపాదించిన భూములను వేలం వేసేందుకు అనుమతించారు. అలాగే హైదరాబాద్ నగరంలో నాలాల నిర్వహణ సరిగా లేదని, అవి ఆక్రమణకు గురవుతున్నాయని సీఎం ప్రస్తావించారు. వర్షపు నీరు, మురుగునీరు రోడ్లపై ప్రవహించడానికి ఇదే కారణమన్నారు. నాలాలపై ఆక్రమణలను తొలగించే విషయంలో, వాటిని సక్రమంగా నిర్వహించే విషయంలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.