Krishna puskaras
-
కృష్ణమ్మా.. మళ్లీ వస్తాం..
-
కృష్ణమ్మకు మలి హారతి
-
పుష్కర వీడ్కోలు
-
యువక.. మునక..
-
దారులన్నీ కృష్ణమ్మ దరికే..
-
దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
విజయవాడ: నగరంలోని కనకదుర్గ అమ్మవారిని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో చినరాజప్పకు దేవస్థానం ఈవో స్వాగతం పలికారు. అనంతరం బెంజిసర్కిల్లో జరుగుతున్న విశ్వశాంతి ఉద్గీద మహామృత్యుంజయ హోమం కార్యక్రమంలో చినరాజప్ప దంపతులు పాల్గొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. కృష్ణా పుష్కరాలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాల ముగింపు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం 12వ రోజుతో కృష్ణా పుష్కరాలు ముగియనున్నాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడలోనూ ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లను చేసింది. సంగమం ఘాట్ వద్ద సందర్భంగా ప్రత్యేక హారతి కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. వెయ్యిమంది కూచిపుడి కళాకారులతో నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. మరోవైపు తెలంగాణలోనూ ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల, రంగాపూర్ ఘాట్లలో ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. కృష్ణా పుష్కరాలు అఖరి రోజు కావడంతో పుష్కర ఘాట్ల వద్ద భక్తులు భారీసంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడలో సంగమం, పద్మావతి, కృష్ణవేణి, వేదాద్రి ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. గుంటూరులో అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం, పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లకు భక్తులు పోటెత్తుతున్నారు. నల్లగొండ జిల్లాలో మట్టపల్లి, వాడపల్లి, నాగార్జున సాగర్ ఘాట్లలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తుల రద్దీ పెరుగుతోంది. -
భానుడి భగభగ.. భక్తులు విలవిల
పుష్కరాలకు ఆదివారం భక్తుల తాకిడితో పాటు ఎండ వేడి కూడా బాగా పెరిగింది. ఘాట్లలో భక్తులు ఎండ తాకిడికి విలవిల్లాడిపోయారు. భానుడి భగభగలను తట్టుకోలేక గొడుగులు, తువ్వాళ్లు, చెట్ల నీడలను ఆశ్రయించారు. అమరావతి ఘాట్లో కనిపించిన దృశ్యాలివి. – తాడేపల్లి రూరల్ -
ఇన్నోవా- లారీ ఢీ: ముగ్గురి మృతి
తిరుపతి: తిరుపతి రూరల్ మండలం గాంధీపురం వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఇన్నోవాను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. కృష్ణా పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. మృతులు మదనపల్లెకి చెందిన నాగరాజు, భారతి, కృష్ణమూర్తిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పుష్కర రూట్లలో భారీ ట్రాఫిక్ జాం
నల్లగొండ/శంషాబాద్: కృష్ణా పుష్కరాలు ముగుస్తున్న సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. ఆదివారం కావడంతో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున కృష్ణా తీరానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది. నల్లగొండ జిల్లాలోని మట్టంపల్లి, వాడపల్లి ఘాట్లలో స్నానం ఆచరించడానికి వెళ్తున్న భక్తుల రద్దీ వల్ల నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మాడ్గులపల్లి టోల్ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జాం అయింది. మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద మండలంలోని పాల్మాకుల శివారులోని బెంగళూరు జాతీయ రహదారిపై పుష్కరాలకు వెళ్లే భక్తుల వాహనాలతో భారీ ట్రాఫిక్ జాం అయింది. -
కృష్ణమ్మకు భక్త నీరాజనం!
-
‘శోభా’యమానం!
పుష్కరాలు ఇంకా మూడు రోజులే! మూడొంతులు పూర్తయిన మహా క్రతువు చివరి రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం సాక్షి, గుంటూరు : పుష్కరాలు మూడొంతులు పూర్తయ్యాయి. మహాక్రతువు ఇంకా మూడు రోజులే కొనసాగుతుంది. తొమ్మిది రోజుల్లో 45 లక్షల మంది భక్తులు జిల్లాలోని వివిధ ఘాట్లలో పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. చివరి రోజుల్లో భక్తుల తాకిడి పెరిగే అవకాశముందని వారు భావిస్తున్నారు. జిల్లాలో ఘాట్లకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రధానంగా అమరావతిలోని పుష్కర ఘాట్లు భక్తుల తాకిడితో కళకళలాడుతున్నాయి. జిల్లాలోని మిగిలిన ఘాట్లలో తొమ్మిదోరోజైన శనివారం భక్తుల తాకిడి కొంత తగ్గింది. వారం రోజులుగా ఎండలు మండిపోతుండటం, ఉష్ణోగ్రతలు వేసవిని తలపించేలా నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. అటు అధికారులు, ఇటు పుష్కరాలకు వచ్చిన భక్తులు ఎండ తాకిడికి ఆపసోపాలు పడాల్సి వస్తోంది. అధికారుల పరిశీలన... అమరావతి పుష్కర ఘాట్లను శనివారం పంచాయతీరాజ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్రెడ్డి, కలెక్టర్ కాంతిలాల్ దండేతో కలిసి సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ శనివారం అమరావతిలోని పుష్కర ఘాట్లో పుణ్యస్నానం చేశారు. రెంటచింతల మండలం సత్రశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆర్డీ డాక్టర్ షాలినీదేవి, డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజారాణి పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు నీరసించే అవకాశం ఉందని, అందుకు తగిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విజయపురిసౌత్లోని ఘాట్కు శనివారం భక్తుల రద్దీ పెరిగింది. డ్యామ్పై నుంచి రాకపోకలను పోలీసులు సడలించడంతో తెలంగాణ వైపు నుంచి భక్తులు అధిక సంఖ్యలో కష్ణవేణి ఘాట్కు రావడంతో రద్దీ పెరిగింది. జిల్లాలోని అమరావతి, సత్రశాల, విజయపురి సౌత్లోని ఘాట్, తాళాయపాలెం, సీతానగరం ఘాట్లలో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. మధ్యాహ్నం నుంచి మాత్రం ఘాట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కొనసాగుతున్న ఇబ్బందులు... జిల్లాలోని అనేక ఘాట్ల వద్ద పిండప్రదానం చేసే షెడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన షెడ్లు సరిపోక భక్తుల ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా కొన్నిచోట్ల అధికారులు తాత్కాలికంగా టెంట్లు వేస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో భక్తులకు ఉపయోగపడడం లేదు. జిల్లాలో శనివారం 38 నుంచి 40 డిగ్రీ వరకు ఉష్ణోగ్రత నమోదు కావడంతో భక్తులు, అధికారులు అల్లాడిపోయారు. అనేక ఘాట్ల వద్ద నీరు కలుషితం కావడంతో అధికారులు, భక్తులు వందల సంఖ్యలో విషజ్వరాలు, డయేరియా బారిన పడుతున్నారు. అధికారులు పుష్కర ఘాట్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ నీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ చేయడంలో వైద్య అధికారుల సూచనలను పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పుష్కర వాహిని.. పుణ్యవేణి
సాక్షి, అమరావతి/ గుంటూరు : శ్రావణ శోభతో పుష్కర కృష్ణమ్మ శుక్రవారం కళకళలాడింది. మహిళలు పుష్కర స్నానా లు చేసి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలో ఎనిమిదో రోజు అమరావతి మినహా మిగిలిన ఘాట్లలో భక్తుల రద్దీ కొద్దిమేర తగ్గింది. తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్లో సుమారు 10వేల మంది భక్తులతో కలిసి చినజీయర్ స్వామి పుష్కర స్నానం చేశారు. అనంతరం శుక్రవారం రాత్రి కృష్ణమ్మకు హారతి ఇచ్చారు. జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉన్న పొందుగల, దైద, సత్రశాల, కృష్ణవేణి, అణుపు ఘాట్లను శుక్రవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కాంతిలాల్ దండే సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ తాళ్ళాయపాలెం పుష్కరఘాట్ వద్ద పడవలో తిరిగి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ నెల 21న గురజాల నియోజకవర్గంలోని ఘాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నట్లు సమాచారం. అమరావతిలో కొనసాగిన రద్దీ.. అమరావతిలో పుష్కర భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. పుష్కరాల ఎనిమిదో రోజూ రద్దీ కొనసాగింది. ఘాట్లన్నీ భక్తులతో కళకళలాడాయి. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు కృష్ణమ్మకు ప్రత్యేకంగా సారె పెట్టి పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. అమరావతి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో ఎక్కువమంది భక్తులు ఇక్కడే పుణ్య స్నానాలు చేసేందుకు ఆసక్తి చూపారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఎనిమిది రోజుల్లో శుక్రవారం మధ్యాహ్నానికి 29,38,611 మంది పుణ్య స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో ఒక్క అమరావతిలోనే 13,53,594 మంది స్నానాలు చేసినట్టు చెబుతున్నారు. శుక్రవారం ఒక్కరోజు మధ్యాహ్నం సమయానికే లక్షా 25 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి సీసీ కెమెరాల ద్వారా ఘాట్లను పరిశీలిస్తూ ఘాట్ ఇన్చార్జిలు, పోలీసులు, దేవదాయ శాఖ, ఆర్టీసీ, రైల్వే అధికారుల సమన్వయంతో భక్తుల సంఖ్యను అంచనా వేస్తున్నారు. ఈ నెల 14న అత్యధికంగా 3,22,500 మంది భక్తులు అమరావతికి వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అమరావతిలోని ధ్యానబుద్ద ఘాట్లోనే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. అమరావతిలోనే అధికారుల మకాం.. అమరావతిలో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఇన్చార్జి జేసీ ముంగా వెంకటేశ్వరరావుతో పాటు జిల్లాలోని ఉన్నతాధికారులందరూ ఇక్కడే మకాం వేసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శానిటేషన్ బాధ్యతను జెడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య, డీపీవో శ్రీదేవిలకు అప్పజెప్పారు. శానిటేషన్ పర్యవేక్షణ బాధ్యతను గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ నాగలక్ష్మికి శుక్రవారం నుంచి అదనపు బాధ్యతగా అప్పగించారు. మత్స్యశాఖ డీడీ బలరాం, డీఎంహెచ్ఓ పద్మజ, ధ్యానబుద్ధ ఘాట్ ఇన్ర్జి సబ్కలెక్టర్ హిమాంశుక్లా, అమరేశ్వర ఘాట్ ఇన్చార్జి సబ్కలెక్టర్ కృత్రికా బాత్రా, రూరల్ ఎస్పీ నారాయణనాయక్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అమరావతి పుష్కర ఘాట్లు, పరిస ర ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగ్గా లేకపోవడంతో గుంటూరు నగరపాలక సంస్థ నుంచి 200మంది పారిశుధ్య కార్మికులను శుక్రవారం అక్కడకు పంపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు పుష్కర నగర్ల వద్ద బస్సులు దిగి ఉచిత బస్సులు ఎక్కాల్సి రావడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా చట్టిబిడ్డలతో వెళ్లేవారు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు అవస్థల పాలవుతున్నారు. ఆర్టీసీ బస్సులను నేరుగా పుష్కర ఘాట్ల వరకు వెళ్లేలా జిల్లా ఉన్నతాధికారలు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. పుష్కర స్నానాలకు వెళ్తూ జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది యాత్రికులు గాయాలపాలయ్యారు. శావల్యాపురం మండలం వైకల్లు గ్రా మానికి చెందిన 12మంది భక్తులు ఆటోలో వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. గురజాల మండలం జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన పది మంది ఆటోలో సత్రశాల పుష్కరఘాట్లో స్నానాలు చేసి వస్తుండగా రెంటచింతల మండలం గోలి గ్రామం వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం పుష్కర ఘాట్ వద్ద పనుల్లో నాణ్యత లేక అనేక చోట్ల టైల్స్ ఊడిపోయాయి. ఎండ తీవ్రత కొనసాగుతుండటంతో మధ్యాహ్నం వేళ భక్తుల తాకిడి కనిపించటం లేదు. ప్రయాణాలు చేసేందుకు ప్రజలు సాహసం చేయటం లేదు. -
కృష్ణమ్మ ఆశీర్వచనం
కృష్ణలో స్నానమాచరిస్తే సకల సౌభాగ్యాలూ దక్కుతాయని భక్తుల నమ్మకం.. ఆ తలంపుతో సత్తెనపల్లికి చెందిన చిత్రకారుడు జింకా రామారావు కృష్ణమ్మ ఆశీర్వదిస్తున్నట్లుగా చిత్రం గీసి మంత్రముగ్ధుల్ని చేశారు. పలువురి ప్రశంసలు పొందుతున్నారు. – సత్తెనపల్లి -
తనిఖీలకు జాగిలాలూ సై..
కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ధరణికోట, ధ్యానబుద్ధ, అమరేశ్వర ఘాట్ల్లో జాగిలాలు, మెటల్ డిటెక్టర్లతో నిర్విరామంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. – అమరావతి (పట్నంబజారు) -
కృష్ణమ్మకు ‘కళా’భివందనం
-
నిండు చంద్రుడూ వీక్షించెనా..!
-
వైఎస్సార్కు పిండ ప్రదానం
అచ్చంపేట: మండలంలోని కస్తల పుష్కర ఘాట్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురువారం సాయంత్రం పిండప్రదానం చేశారు. ఘాట్లో స్నానం చేసి తల్లిదండ్రులు, గురువులు, పితృ సమానులైన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదానం చేశానన్నారు. కస్తల ఘాట్లో నీరు స్వచ్ఛంగా ఉన్నాయని, రద్దీ తక్కువగా ఉంటుందని తెలిసి వచ్చానన్నారు. అనంతరం ఆయన శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట గ్రామపార్టీ కన్వీనర్ చెన్నమల్లు రవి, పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి, జాన్పీరా, వైఎస్సార్ సీపి అభిమానులు ఉన్నారు. -
కృష్ణమ్మ సన్నిధిలో భక్తజనం
-
హారతి గైకొనుమా..
-
అరకొర భక్తులతో వెలవెల
కళతప్పిన పెనుమూడి ఘాట్ భక్తుల సంఖ్య కన్నా అధికారుల సంఖ్యే ఎక్కువ రేపల్లె: పుష్కరాల సందర్భంగా మండలంలో ఎనిమిది పుష్కరఘాట్లలో ఐదో రోజు మంగళవారం పెనుమూడి, మోర్తోట పుష్కరఘాట్లలో నామమాత్రంగా తరలి వచ్చారు. దీంతో ఆ యా ఘాట్లు వెలవెలపోయాయి. మిగిలిన రావిఅనంతవరం, పెనుమూడి వీఐపీ, మైనేనివారిపాలెం, గంగడిపాలెం, చెన్నుపల్లివారిపాలెం, రాజుకాల్వ పుష్కరఘాట్లలో నామమాత్రంగా కూడా భక్తులు కనిపించలేదు. ఘాట్లలో భక్తుల సంఖ్య కన్నా రెవెన్యూ, పోలీసు, పంచాయతీ, ఆరోగ్య, అగ్నిమాపక సిబ్బం దితో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అధిక శాతం లో కనిపించారు. దీంతో ఘాట్లు బోసిపోతున్నాయి. శ్రావణ మంగళవారం కావటంతో పితృదేవతలకు తర్పణాలు వదిలేం దుకు భక్తులు ఆసక్తి చూపరని, దీంతో భక్తుల సంఖ్య కనిపించలేదని అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. మహిళల ప్రత్యేక పూజలు.. కృష్ణా పుష్కరాలలో భాగంగా 5వరోజు మండలంలోని మోర్తోట, పెనుమూడి పుష్కరఘాట్ల వద్ద మహిళలు పుణ్యస్నానాలను ఆచరించారు. పసుపు, కుంకుమ, పువ్వులను సమర్పించి నమస్కారాలు చేశారు. -
పుష్కర హేల.. ఆనంద డోల
-
సేవకులే.. సైనికులై..
-
పుష్కరాలపై మరింత ప్రచారం
రంగంలోకి దిగిన సీఆర్డీఏ జాతీయ రహదారులపై స్వాగతబోర్డులు రూ.25 లక్షలతో ఏర్పాటు మంగళగిరి: పుష్కరాలకు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆర్భాటంగా ప్రచారం నిర్వహించినా ప్రభుత్వ పెద్దలు అనుకున్న స్థాయిలో ప్రజల నుంచి స్పందన కొరవడడంతో మరింత ప్రచారానికి ప్రజాధనాన్ని వృ«థా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సెలవు రోజులైన శని, ఆదివారాలలోను పుష్కరాలకు ఆశించిన స్థాయిలో జనస్పందన కనిపించలేదు. దీంతో రానున్న రోజుల్లో ప్రజల నుంచి స్పందన కరువవుతుందని భావించిన ప్రభుత్వ పెద్దలు సీఆర్డీఏ(రాజధాని ప్రాధికారిక అభివృద్ధి సంస్థ) పేరుతో స్వాగతద్వారాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు ఆదివారం జాతీయ రహదారిపై ద్వారాలను ఏర్పాటు పనులు ప్రారంభించారు. విజయవాడకు చేరుకునే జాతీయ రహదారుల వెంట సుమారు నాలుగు వందల ద్వారాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ద్వారం ఖర్చు రూ.40 వేలకు పైగా అవుతోంది. మొత్తం ద్వారాలకు సుమారు రూ.25 లక్షల ప్రజాధనం వృధా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కరాలు ప్రారంభమైన మూడు రోజుల తర్వాత జాతీయ రహదారులపై స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయాలని సీఆర్డీఏ అధికారులకు ఎందుకు ఆసక్తి కలిగిందో అంతుచిక్కడం లేదు. ఇప్పటికే అవసరం లేని చోట్ల, నీరు లేని చోట్ల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ఘాట్లు నిర్మించి విమర్శలపాలయిన ప్రభుత్వం మాత్రం ప్రచారంలో వెనక్కి తగ్గకపోవడం విశేషం. గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు, హైదరాబాద్ల నుంచి విజయవాడకు చేరుకునే రహదారులలో ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. -
కృష్ణవేణి తరంగిణిలో పవిత్ర స్నానం
-
'21.96 లక్షల మంది పుణ్యస్నానాలు'
విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 21.96 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు. పుష్కరాల సందర్భంగా డ్రోన్, సెల్ఫోన్ కెమెరాలతో ట్రాఫిక్, రద్దీని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. రేపటి నుంచి 4 లక్షల మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ చేయనున్నట్టు చంద్రబాబు చెప్పారు. -
టెక్నాలజీతో చెంతకు చేర్చుతారట!
హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు వెళ్తున్నారా? మీ వెంట పిల్లలు, వృద్ధులను తీసుకెళ్తున్నారా? అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భక్తజన రద్దీలో వీరు తప్పిపోయే ప్రమాదం ఉంది. ఇలా తప్పిపోయిన వారిని వారి కుటుంబీకుల దగ్గరికి చేర్చేందుకు పుష్కర పర్యవేక్షణాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకు వలంటీర్ల సేవలు వినియోగించుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ‘ కృష్ణా పుష్కరాలు చైల్డ్ ట్రాకింగ్’ అనే యాప్ ద్వారా సేవలందిస్తున్నారు. ఈ యాప్ వివరాలు మీకోసం.. వివరాల నమోదు..పుష్కర ఘాట్ల వద్ద ఉన్న హెల్ప్డెస్క్లో సంప్రదించి మీ ఫోన్లోని ‘కృష్ణా పుష్కరాలు చైల్డ్ ట్రాకింగ్’ యాప్లో వివరాలు నమోదు చేయాలి. యాప్ ఓపెన్ చేయగానే పిల్లలు, వృద్ధులు అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని గార్డియన్, చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేయాలి. అనంతరం అక్కడి హెల్ప్డెస్క్ సిబ్బంది పిల్లలు/వృద్ధుల చేతికి ఒక రిస్ట్ వాచ్ బ్యాండ్ వేస్తారు. ఇది తడవదు, చినగదు. ఒకవేళ మీ దగ్గర యాప్ లేకపోయినా పర్వాలేదు. నేరుగా హెల్ప్డెస్క్కు వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవచ్చు. అప్పగిస్తారిలా.. తప్పిపోయిన పిల్లలు/వృద్ధులను పుష్కర ఘాట్లలో పనిచేస్తున్న వలంటీర్లు వాకబు చేస్తారు. వారి చేతికున్న బ్యాండ్ సహాయంతో గార్డియన్ వివరాలు సేకరిస్తారు. సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేసి సందేశం ఇస్తారు. ఒకవేళ ఫోన్ పోతే అడ్రస్ ఆధారంగా వారిని కుటుంబీకులకు అప్పగిస్తారు. -
సలహాలు, సూచనలు ఇస్తే సవరించుకుంటాం'
గుంటూరు: పుష్కర ఘాట్ ఏర్పాట్లలో ఎక్కడైనా తప్పులు జరిగితే.. మీడియా సలహాలు, సూచనలు ఇస్తే సవరించుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం సీతానగరం పుష్కర ఘాట్లను వారు పరిశీలించారు. పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 12 రోజుల పాటు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పుష్కర ఘాట్ల వరకు అన్ని జిల్లాల నుంచి వచ్చే బస్సులను అనుమతిస్తున్నామని చెప్పారు. బస్సులకు ఎలాంటి అసౌకర్యం కలగదన్నారు. ఒకే రోజు 50 లక్షల మంది వచ్చిన సరిపడే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్టు 14, 15 సెలవు దినాలు కావడంతో రెట్టింపు మంది భక్తులు పుష్కర స్నానాలకు వచ్చే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. -
పుష్కర స్నానం కరిష్యే..!
-
పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన రైల్వే జి.ఎం
విజయవాడ (రైల్వేస్టేçÙన్) : కృష్ణా పుష్కరాలకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది యాత్రికులు తరలి రానున్న నేపథ్యంలో విజయవాడ స్టేషన్లో చేసిన ఏర్పాట్లను రైల్వే జి.ఎం కె.రవీంద్రగుప్తా బుధవారం పరిశీలించారు. పార్శిల్ కార్యాలయం, తారాపేట టెర్మినల్లో ఏర్పాటు చేసిన పుష్కర నగర్లను ఆయన పరిశీలించారు. ప్రయాణికుల వసతి, తాగునీరు తదితర ఏర్పాట్లను పరిశీలించి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డి.ఆర్.ఎం అశోక్కుమార్, ఏ.డీ.ఆర్.ఎం కె.వేణుగోపాలరావు, సీనియర్ డీ.సి.ఎం షిఫాలి, ఇన్చార్జ్ పి.ఆర్వో జే.వి.ఆర్కే రాజశేఖర్, స్టేషన్మేనేజర్ సి.హెచ్.సురేష్లు పాల్గొన్నారు. -
పుష్కరాల ఆంక్షలపై హైకోర్టు ఆగ్రహం
విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా పురోహితులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన ఆంక్షలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం ఆంక్షలు ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆదేశించింది. పిండ ప్రదానాలు ఎక్కడైనా నిర్వహించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఏపీ సర్కార్ పురోహితులపై ఆంక్షలు విధించడంతో ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
'పుష్కరాలకు 31,400 మంది పోలీసులతో భద్రత'
విజయవాడ: కృష్ణా పుష్కరాలకు 31, 400 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. ఇందులో భాగంగా 30 మంది ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిపారు. విజయవాడలో రూ. 20 కోట్లతో కమాండ్ కంట్రోల్.. 1300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. చెన్నై- కోల్కతా- హైదరాబాద్ జాతీయ రహదార్లపై ట్రాఫిక్ పర్యవేక్షణ బాధ్యతలు ఐజీలు రామకృష్ణ, సంజయ్ జైన్కు అప్పగించినట్టు తెలిపారు. విజయవాడలో భక్తుల కోసం 65 చోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. విజయవాడ, గుంటూరులో 740 ఉచిత బస్సులును ఏర్పాటుచేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. -
'పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి'
విజయవాడ: కృష్ణా పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్ వెల్లడించారు. పులిచింతల నుంచి 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. మంగళవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేపు (బుధవారం) సాయంత్రం వరకు ప్రకాశం బ్యారేజ్కు నీళ్లు చేరుతాయని అన్నారు. ఈ నెల 11న సాయంత్రం 4 గంటలకు ఇబ్రహీంపట్నం నుంచి పవిత్ర సంఘమం వరకు పుష్కర శోభాయాత్ర కొనసాగుతుందని చెప్పారు. పుష్కరాలలో రోజుకు 11 లక్షల మందికి ఉచిత భోజనం సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పుష్కరాలలో లక్షమంది ఉద్యోగులు, 35వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని రాజశేఖర్ పేర్కొన్నారు. -
దైవభక్తితో రాజకీయాలు తగదు
చినజీయర్ స్వామి సీతానగరం (తాడేపల్లి రూరల్): దైవ భక్తితో రాజకీయాలు చేయకుండా మన సంప్రదాయాలను, కట్టుబాట్లను కాపాడాలని చినజీయర్ స్వామి అన్నారు. సీతానగరం ఆశ్రమంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దైవ కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు ప్రవేశించి తమ రాజకీయాలు చూపిస్తున్నారని అన్నారు. ఉత్తర భారతదేశంలో ఈ మధ్య జరిగిన కుంభమేళాలో ప్రతి రోజూ కోటి మంది పుణ్యస్నానాలు ఆచరించినా ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించారన్నారు. దక్షిణ భారతదేశంలో మాత్రం చిన్న కార్యక్రమం నిర్వహించినా వివాదాలకు కారణమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు కృష్ణా పుష్కరాలలో 12 రోజులలో ఎప్పుడైనా స్నానం ఆచరించవచ్చని చెప్పారు. విజయవాడ, సీతానగరం ఘాట్లలోనే స్నానం ఆచరించాల్సిన అవసరం లేదని, కృష్ణా తీరం వెంబడి ఎక్కడైనా స్నానమాచరించవచ్చని స్పష్టం చేశారు. -
నేడు మోదీని కలవనున్న చంద్రబాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో జరిగే కృష్ణా పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, న్యాయమూర్తులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించనున్నారు. నేటి ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు. ఉదయం 10.30 గంటలకు లోక్సభ స్పీకర్ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులు, న్యాయమూర్తులను చంద్రబాబు కలవనున్నారు. మరోవైపు టీడీపీ ఎంపీలు మధ్యాహ్నం 12.20 కి ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ ఎంపీలు ప్రధానితో చర్చించనున్నారు. -
పుష్కర స్నానాలు అశాస్త్రీయం
డాక్టర్ సమరం పటమట(ఆటోనగర్): పుష్కర స్నానాలు మూఢత్వానికి పరాకాష్ట, మూఢత్వానికి ఖరీదు అనేక ప్రాణాలని నాస్తిక కేంద్రం నిర్వాహకులు డాక్టర్ జి.సమరం అన్నారు. ఆదివారమిక్కడ ఆయన మాట్లాడుతూ పుష్కరాల సమయంలో దేవతల గురువు బృహస్పతితో పాటు పుష్కరుడు మూడున్నర కోట్ల మంది దేవతలు నదిలో కొలువై ఉంటారనేది అభూత కల్పన అని అన్నారు. పుక్కిటి పురాణాలతో జనాలను మూఢులుగానూ అజ్ఞానులుగానూ తయారుచే శారని అన్నారు. పుష్కర స్నానంతో వేయి జన్మల పాపమైనా నశించిపోతుందనటం మానవ వివేకాన్ని తాకట్టుపెట్టడమని అన్నారు. భారత రాజ్యాంగంలోని 51ఎ(హెచ్) ప్రకారం శాస్త్రీయ దృష్టిని,పరిశోధించే గుణాన్ని, సంఘ సంస్కరణను పెంపొందించి ప్రతి పౌరుని ప్రా«థమిక విధి అని అన్నారు. తండోపతండాలుగా పుష్కర స్నానాలు చేయటం అశాస్త్రీయమన్నారు. ’పుష్కర స్నానాలు మూఢత్వానికి పరాకాష్ఠ– కృష్ణా పుష్కరాలు–తెలుసుకోవలసిన నిజాలు’ అన్న కరపత్రాన్ని విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో హరిసుబ్రమణ్యం, రశ్మి, కీర్తి, డాక్టర్ మారు, డాక్టర్ విజయం, డాక్టర్ దీక్ష, డాక్టర్ జగతి పాల్గొన్నారు. -
గుడులకు సీఎం అపచారం
ఇన్బాక్స్: ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో విజయవాడలో కూల్చిన ఆలయాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. కానీ కృష్ణా పుష్కరాలకు అవి అడ్డుగా ఉన్నాయని ఆయనకు మాత్రమే అనిపించింది. ఎన్నో పుష్కరాలు వచ్చాయి. కానీ ఏ ముఖ్యమంత్రీ, ఏ తీర్థయాత్రికుడు, అధికారీ ఆలయాలు అడ్డుగా ఉన్నాయని భావించలేదు. చంద్రబాబు గోదావరి పుష్కరాలకి మనుషులను బలితీసుకున్నారు. కృష్ణా పుష్కరాలకు ఘన చరిత్ర కలిగిన దేవాలయాను బలిచేశారు. కూల్చివేసి ఇప్పుడు మళ్లీ వాటిని కట్టిస్తారట. అడుసు తొక్కనేల? కాలు కడగనేల? ప్రజాధనంతో ఎందుకీ కుప్పిగంతులు? విశ్వనాథ వారికి జ్ఞానపీఠం ప్రకటించినప్పుడు, వచ్చిన లక్ష రూపాయలు ఏం చేయబోతున్నారని అడిగితే, ఇందులో కొంత మా ఊరిలో ఆలయం జీర్ణోద్ధరణకు ఇస్తానని చెప్పారు. తక్కిన సొమ్ము సంగతేమిటంటే, ఎన్నో చిల్లులు ఉన్న నా జేబులో వేసుకుంటాను అన్నారట. ఇలాంటి దృష్టి చంద్రబాబుకు సాధ్యమా? కూల్చిన ఆలయాలను తక్షణం నిర్మించాలని వీహెచ్పీ అంతర్జాతీయ కార్యదర్శి రాఘవులు కోరడం న్యాయమే. ఆధునిక యుగం గురించి ఎప్పుడూ మాట్లాడే చంద్రబాబు అంధయుగాలలో విధ్వంసకారులు చేసిన పనినే చేశారు. పుష్కర స్నానం చేసిన తరువాత ప్రజలు ఆలయాలను సందర్శిస్తారు? ఇప్పుడు విజయవాడలో ఆలయాల శిథిలాలకి మొక్కుకుని వెళ్లాలి కాబోలు! - కేవీ రమణమూర్తి, కాకినాడ ప్రభుత్వ భూదాహానికి అంతులేదా? రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే విజయవాడ, అమరావతి ప్రాంతంలో 33 వేల ఎకరాల పంట భూములను చంద్రబాబు ప్రభుత్వం కైవసం చేసుకుంది. భోగాపురంలో విమానాశ్రయం కోసం కొన్ని వందల ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఆక్వా పరిశ్రమ కోసం భీమవరం ప్రాంతంలో వందలాది ఎకరాలు తీసుకునే యత్నంలో ఉంది. ఇప్పుడు మచిలీపట్నం వద్ద పంటభూములను ఏకపక్షంగా తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందట. ఇది కూడా గతంలో మాదిరిగానే లక్షలలోనే సేకరించే ప్రయత్నంలో ఉంది. ఇవేకాకుండా ప్రతి నియోజకవర్గంలోను వందల ఎకరాలలో భూమిని వివిధ అవసరాల కోసం సేకరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా చెబుతున్నారు. పురాణాలలో చెప్పే బకాసురుడి తిండికైనా ఒక పరిమితి కనిపిస్తుంది కానీ, చంద్రబాబు ప్రభుత్వం భూదాహానికి పరిమితి కనిపించడం లేదు. అధికార జులుంతో, పరిశ్రమల పేరుతో పంట భూములను నాశనం చేసుకుంటూ పోతే ఇక తిండి గింజలు అందించే భూమి ఎంత? ఈ భూములన్నీ తమకు నచ్చిన విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేయడానికేనని ఇప్పటికే రుజువైంది. చంద్రబాబు నాయుడు వ్యవసాయానికే కాదు, పచ్చదనానికి కూడా శత్రువే. అలాగే విపక్షానికి చెందిన ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అన్ని నైతిక విలువలకు కూడా ఆయన తిలోదకాలు ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి. కేవలం ప్రభుత్వమే కాదు, ప్రభుత్వాన్ని నడుపుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా భూదాహంతో అలమటించిపోతున్నారు. వీరి బెడద నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ను ప్రజలు రక్షించుకోవాలి. - ఈదుపల్లి వెంకటేశ్వరరావు, ఏలూరు -
12న సూర్యోదయం నుంచి కృష్ణా పుష్కరాలు
- ముహూర్తం నిర్ణయించిన దేవాదాయ శాఖ - అన్ని ప్రభుత్వ విభాగాలకు సర్క్యులర్ జారీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 12వ తేదీ సూర్యోదయం నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఎక్కువ మంది పండితులు వెలిబుచ్చిన అభిప్రాయం మేరకు ఈ ముహూర్తాన్ని నిశ్చయించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్ అన్ని విభాగాలకు సర్క్యులర్ జారీ చేశారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లలో నిమగ్నమైన అన్ని విభాగాలను అప్రమత్తం చేశారు. ఇటీవల కృష్ణా పుష్కరాలకు ఆర్థిక శాఖ విడుదల చేసిన రూ.3 కోట్ల బడ్జెట్ను నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు కేటాయిస్తూ దేవాదాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండకు రూ.1.50 కోట్లు, మహబూబ్నగర్ రూ.1.50 కోట్లు కేటాయించింది. ట్రెజరీ ఆంక్షలను సడలిస్తూ.. ఈ నిధులను ఖర్చు చేసే బాధ్యతలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. -
పుష్కర ఘాట్లే టూరిజం పాయింట్లు
విజయవాడ (భవానీపురం) : పుష్కర ఘాట్లను భవిష్యత్లో టూరిజం పాయింట్లుగా తీర్చిదిద్దుతామని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)తో కలిసి ఆయన భవానీపురంలోని పున్నమీ ఘాట్ను శనివారం సందర్శించారు. ఘాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నగరాన్ని ప్రజలు ఊహించని రీతిలో సుందరీకరణ చేస్తున్నారన్నారు. రూ.850 కోట్ల ఖర్చుతో రివర్ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పుష్కరఘాట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇంద్రకీలాద్రి, అర్జున వీధిని కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తయారవుతుందన్నారు. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బోడె ప్రసాద్, టీడీపీ అర్బన్ ప్రధాన కార్యదర్శి గన్నె నారాయణ ప్రసాద్, కార్పొరేటర్లు జి.హరిబాబు, షేక్ హబిబుల్లా, ఉమ్మడి వెంకటేశ్వరరావు, సీహెచ్ గాంధీ ఉన్నారు. పుష్కర యాత్రికులకు ప్రత్యేక బస్సులు కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు తెలిపారు. శనివారం ఆయన పున్నమి ఘాట్ను సందర్శం చారు. ఏయే ఘాట్లకు ఎంతమంది యాత్రికులు వస్తారో పోలీస్ అధికారులతో మాట్లాడి దాని ప్రకారం బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆరు శాటిలైట్ బస్స్టేషన్లు ఉన్నాయని, తద్వారా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. గత ఏడాది గోదావరి పుష్కరాల్లో చోటుచేసుకున్న ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికతో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పర్యటనలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్ఎం రామారావు, డెప్యూటీ సీటీఎం శ్రీరామ్ పాల్గొన్నారు. -
పుష్కరాలకు 15 వేల మంది పోలీసులు
నాగార్జునసాగర్: కృష్ణా పుష్కరాలకు 15 వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీఐజీ నాగిరెడ్డి వెల్లడించారు. నల్లగొండ జిల్లాలోని సాగర్జలాశయం, కృష్ణానది తీరాల వెంట చేపట్టిన పుష్కరఘాట్ల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం నాగార్జునసాగర్లో డీఐజీ విలేకరులతో మాట్లాడారు. ఘాట్ల వద్ద 24గంటలపాటు పోలీస్ యంత్రాంగం ఉంటుందన్నారు. రాష్ట్రంలో మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలోని ఘాట్ల నిర్మాణ పనులు గడువులోగా పూర్తయ్యేలా వేగవంతంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. -
ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు
హైదరాబాద్: గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాలను కూడా విజయవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 12 నుంచి 23 వరకు కృష్ణా పుష్కరాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా పుష్కరాలకు 825 కోట్లు రూపాయల ఖర్చు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అయితే కృష్ణా పుష్కరాల ఖర్చును తెలంగాణ బడ్జెట్లో అంతర్భాగం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. కృష్నా పుష్కరాల సందర్భంగా స్నానఘట్టాల నిర్మాణం, రహదారులు, మంచినీటి సౌకర్యాల ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.