-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు
-
ఓటర్లపై కూటమి ప్రలోభాల వల
సాక్షి, అమరావతి: ఎన్నికల నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈ మేరకు ఆదివారం వెలగపూడి సచివాలయంలో ఈసీని కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాకు వెల్లడించిన వివరాలు.. ► రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ నేతలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ఘటనలను ఎప్పటికప్పుడు ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నాం. కడప బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకుని, ఓట్లు మాత్రం కాంగ్రెస్కు వేయమని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడారు. దీనిపై ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశాం. ► విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ నేత కేశినేని చిన్ని, ఓటర్లను ప్రలోభ పరుస్తూ డబ్బులు పంచడాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. ఆనాడు కేంద్ర కేబినెట్లో ఉండి కూడా, రాష్ట్ర ప్రయోజనాలను సుజనా పూర్తిగా పక్కన పెట్టారు. ప్రత్యేక హోదాను సమాధి చేసి ప్యాకేజీగా మార్చడంలో సుజనా చౌదరి, సీఎం రమేష్ల పాత్రే కీలకం. ► సీఎస్, డీజీపీలపై నర్సీపట్నం సభలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వాడిన భాష సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. అధికారులను తూలనాడటం, వ్యవస్థలను తేలిక చేసి మాట్లాడటం, చంద్రబాబు నుంచి అభ్యర్థుల వరకు షరా మామూలైపోయింది. – పింఛన్ దారుల విషయంలోనూ ఏవిధంగా కూటమి నేతలు చులకన చేసి మాట్లాడారో ఈసీ దృష్టికి తీసుకువెళ్లాం. మైనార్టీలపై బాబు కపట ప్రేమ ‘‘మైనార్టీల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు, టీడీపీకి ఏమాత్రం లేదు. ఆనాడు దివంగత మహానేత మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ తీసుకువస్తుంటే, కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకుంది టీడీపీ కాదా? అధికారంలో ఉండి కూడా ఎన్నికలకు ముందు 4 నెలల వరకు మైనార్టీలకు కేబినెట్లో స్థానం కల్పించని వ్యక్తి చంద్రబాబు. కానీ సీఎం వైఎస్ జగన్ తన తొలి కేబినెట్లోనే మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించి, మైనార్టీల పక్షపాతిగా నిలిచారు’’ అని విష్ణు పేర్కొన్నారు. అమరావతి పేరుతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆడిన డ్రామాలను ప్రజలు గ్రహించినందునే స్థానిక ఎన్నికల్లో అక్కడి ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించారని గుర్తుచేశారు. రైతు రుణమాఫీని ఎగ్గొట్టి అన్నదాతలకు ద్రోహం చేసిన చంద్రబాబు రైతు సంక్షేమంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎవరెన్ని విమర్శలు గుప్పించినా ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయమని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే వెంట నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఎ. నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సుజనా చౌదరి, కేశినేని చిన్నిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు గాం«దీనగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్నికల ప్రచారంలో భాగంగా హారతి పళ్లెంలో డబ్బులు వేసిన ఘటనపై ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని)పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసులో ఆయన ఫిర్యాదు చేశారు. డబ్బుల పంపిణీపై వార్తా చానల్స్, వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్స్, హారతి పళ్లంలో డబ్బులు వేస్తున్న వీడియోలు ఎన్నికల అధికారులకు అందజేశారు. పూర్తి ఆధారాలు ఉన్నందున ఎన్నికల నియమావళిలో సూచించిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుజనా చౌదరి డబ్బుల సంచులతో పశ్చిమ నియోజకవర్గానికి వచ్చారన్నారు. తొలిరోజే ఆయన కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు. -
వాలంటీర్లపై ‘పచ్చ’ కుట్ర.. చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేతల ఫైర్
సాక్షి, విజయవాడ: పెన్షన్ పంపిణీపై నిమ్మగడ్డ అండ్ కో ఫిర్యాదుపై ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మండిపడ్డారు. సీఎం జగన్ చెప్పినట్లు పేదలకు, పెత్తందార్లుకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. పేదలకు అందించే పెన్షన్లు నిలుపుదల చేయించడం దురదృష్టకరమన్నారు. పెన్షన్ల పంపిణీ అంశంపై ఈసీ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారులు ఇబ్బందులు పడతారు: ఎంపీ కేశినేని పెన్షన్లు ఆపేస్తే లబ్ధిదారులు ఇబ్బంది పడతారన్నారని ఎంపీ కేశినేని నాని అన్నారు. మొన్నటి వరకూ ఒకటవ తేదీనే పెన్షన్ ఇచ్చేవాళ్లం. ఆ విధానాన్ని కొనసాగించేలా ఈసీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, 64 లక్షల మంది పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారన్నారు. నిమ్మగడ్డ రమేష్తో పాటు మరికొందరు చంద్రబాబు ఏజెంట్లుగా.. తొత్తులుగా మారారని దుయ్యబట్టారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పెన్షన్లను అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. దీనికి టీడీపీ కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందేనన్నారు. వృద్ధుల ఉసురు పోసుకున్న చంద్రబాబు: వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిమ్మగడ్డ రమేష్ అండ్ బ్యాచ్ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో మూడు రోజులు క్యూలో నిలబడితేనే కానీ పెన్షన్లు వచ్చేవి కాదు. ఈ కుట్రకు కారణం చంద్రబాబే. వృద్ధుల ఉసురు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుంది. సీఎం జగన్ ఇంటికే పెన్షన్లు అందిస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్ల ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
చంద్రబాబుకు మల్లాది విష్ణు స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, విజయవాడ: టీడీపీ తీరు ఆత్మస్తుతి పరనిందలాగా మారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వంపై పనిగట్టుకుని బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. ‘విధ్యంసం’ పుస్తకం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు,పవన్ దిగజారిపోయి వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు తన గురించి తాను రాసుకున్న ‘మనసులో మాట’ పుస్తకాన్ని బయటపెట్టాలి. చంద్రబాబు ఐదేళ్ల పాలనకు.. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనకు బహిరంగ చర్చకు మేం సిద్ధం. ఎక్కడ చర్చకు రమ్మన్నా వచ్చేందుకు రెడీ. చంద్రబాబుకు ఇదే నా సవాల్. పథకాలిస్తుంటే ఏపీ శ్రీలంక అయిపోతుందన్నావ్. ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఆరు గ్యారంటీలిస్తానంటున్నావ్. ప్రజలు నిన్ను నమ్మం బాబు అంటున్నారు’’ మల్లాది విష్ణు పేర్కొన్నారు. నీ గురించి గొప్పగా.. సీఎం జగన్పై తప్పుగా ప్రచారం చేయిస్తున్నావ్. బాబు జమానా అవినీతి ఖజానా అని పుస్తకం వేసింది సీపీఐ కాదా?. సీఎం జగన్పై బురద చల్లడానికే ‘విధ్వంసం’ పుస్తకాన్ని తెచ్చారు. సీఎం జగన్ని ఢీకొట్టే సత్తాలేక బాబు ఇతర పార్టీలను కలుపుకుంటున్నాడు. కుర్చీ కోసం పాకులాడటం తప్ప.. ప్రజలకు మేలు జరగాలనే ఆలోచన మీకులేదు. ఐదేళ్లలో విజయవాడ నగరానికి ఒక్క మంచి పనైనా చేశావా?. విజయవాడ అభివృద్ధి పై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి’’ అంటూ మల్లాది విష్ణు హితవు పలికారు. ‘‘పరిపాలనకు మీరు పనికిరారని, ప్రజలు 2019లో మిమ్మల్ని విధ్వంసం చేశారు. తప్పుడు సంకేతాలివ్వాలనే టీడీపీ నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. విధ్వంసం పుస్తకం వెనుక చంద్రబాబు, పవన్, సీపీఐ రామకృష్ణ ఉన్నారు. మూడు రాజధానులే మా పార్టీ విధానం. ఏపీలో పొత్తులు తేలాక ఎవరి పై ఎవరు రాళ్లు విసురుతారో.. ఎవరి కుర్చీ ఎవరు మడతపెడతారో తేలిపోతుంది. పొత్తులు ప్రకటించాక మంచి వినోదం మొదలవుతుంది. ఏపీని మోసం చేసిన పార్టీలే మళ్లీ కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయి. చంద్రబాబు,పవన్ ది రెండు నాల్కల ధోరణి. వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ ఏం మాట్లాడారో.. ఇప్పుడేం మాట్లాడుతున్నారో అంతా గమనిస్తున్నారు’’ అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. -
175 స్థానాలలో పోటీ చేసే దమ్ము లేక..టీడీపీ పై మల్లాది విష్ణు ఫైర్
-
అసెంబ్లీలో టీడీపీ తీరు అత్యంతహేయంగా ఉంది: మల్లాది
-
మల్లాది విష్ణుకి టికెట్ ?..సజ్జల కీలక కామెంట్స్
-
ఒక్క హగ్తో యెల్లో బ్యాచ్కి చెక్
ఎన్టీఆర్, సాక్షి: పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు తప్పవని.. అలాంటప్పుడు అలకలు సహజమని.. పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ముందు నుంచే చెబుతున్నాయి. అయితే యెల్లో మీడియా మాత్రం ఈ అలకల్ని భూతద్ధంలో పెట్టి చూపించే యత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ్టి విజయవాడ సెంట్రల్ పరిణామాలు.. ఆ బ్యాచ్ నోళ్లు మూయించాయి. వైఎస్సార్సీపీ నుంచి తొలి గెలుపు విజయవాడ సెంట్రల్దే కావాలని.. వెల్లంపల్లి శ్రీనివాస్ను గెలిపించాలంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం పిలుపు ఇచ్చారు. అంతేకాదు విజయవాడలో పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అయితే టీడీపీ అనుకూల మీడియా చానెల్స్, పత్రికలు చాలారోజుల నుంచి వీళ్ల మధ్య ఏదో వైరం నడుస్తున్నట్లు చూపించే యత్నం చేసింది. ఒక అడుగు ముందుకేసి ఆయన పార్టీని కూడా వీడుతారంటూ ఊహాజనిత కథనాలు రాశాయి. అయితే ఆ రోతరాతలకు ఒక్క హగ్తో చెక్ పెట్టారు ఈ ఇద్దరూ. విజయవాడ సెంట్రల్ సింగ్ నగర్ లో వైఎస్సార్సీపీ ఇంఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి ఆఫీస్కు ర్యాలీ తన ఆఫీస్ నుంచి మల్లాది వచ్చారు. ఈ సందర్భంగా మల్లాదికి వెల్లంపల్లి ఆత్మీయ స్వాగతం పలికారు. అంతేకాదు.. ఈ ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని.. పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. సమిష్టిగా పని చేయడం ద్వారా ఈ ఎన్నికల్లో విజయం సాధించి తీరాతామని ఈ సందర్భంగా ఈ ఇద్దరు ప్రకటించారు. -
'మందలో ఒకరిగా కాదు.. వందలో ఒకరిగా..' : ఆర్.కే. రోజా
నేటి యువత దేశానికే ఆదర్శంగా నిలవాలని, యూత్ ఐకాన్ లుగా తయారవ్వాలని, స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పిలుపునిచ్చారు. జాతీయ యువజన దినోత్సవంను పురష్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి జాతీయ యువజన దినోత్సవ వేడుకలను శుక్రవారం అత్యంత వేడుకగా నిర్వహించారు. యువజన వేడుకలకు ముఖ్య అతిధిగా హజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక అని నేటి యువత అన్ని రంగాల్లో తమ ప్రాముఖ్యతను చాటుకోవాలని ఆకాంక్షించారు. స్వామి వివేకానంద ప్రసంగాలను ఆదర్శంగా తీసుకుని యువత ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కడివెడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు అని అన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు యువత శక్తిపై అపార నమ్మకాన్ని ఉంచి వారి అభ్యున్నతి కోసం మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి ఆర్.కె. రోజా తెలిపారు. స్వామి వివేకానంద యువతకు మార్గనిర్ధేశం చేశారని, ఆయన ఆశయాలకు, ఆకాంక్షలకు, స్ఫూర్తికి అనుగుణంగా యువత నడిస్తే వారికి తిరుగుండదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖామాత్యులు ఆర్.కే. రోజా పేర్కొన్నారు. హిందూ యోగిగా స్వామి వివేకానంద మన దేశ సంస్కృతి, సాంప్రదాయాల ఔన్నత్యాన్ని విదేశాల్లో చాటి చెప్పిన తొలి వ్యక్తి అని కొనియాడారు. స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ లు నేడు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాయని వివరించారు. అందుకనే 120 సంవత్సరాల తరువాత కూడా స్వామి వివేకానంద గొప్పతనాన్ని ఇప్పటికీ చెప్పుకుంటున్నామన్నారు. స్వామి వివేకానంద మన దేశంలో జన్మించటం మనం చేసుకున్న అదృష్టమని మంత్రి ఆర్. కె. రోజా పేర్కొన్నారు. నేటి యువత మందలో ఒకరిగా కాదు వందలో ఒకరిగా నిలవటానికి వారి వారి రంగాల్లో విశేష కృషి చేయాలని కోరారు. స్వామి వివేకానంద సముద్ర కెరటం నాకు ఆదర్శమన్నారని, అంటే ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు కాని ప్రయత్నం చేయటంలోనే ఓడిపోకూడదని, యువత తమ జీవితంలో ఒక గోల్ నిర్ణయించుకుని నిరంతరం శ్రమిస్తే విజయం తథ్యమని మంత్రి ఆర్. కె. రోజా అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురష్కరించుకుని ప్రతి ఏడాది యువజనోత్సవాలు నిర్వహిస్తున్నామని, అలాగే ఈ ఏడాది థీమ్ యూత్ ఫర్ డిజిటల్ ఇండియా గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిదన్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యువజనోత్సవ పోటీల్లో ప్రధమంగా నిలిచిన విజేలందరినీ, ఈ ఏడాది నాసిక్ లో నిర్వహించే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనటానికి పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12 నుంచి 16 వరకు మహారాష్ట్రలోని నాసిక్ లో నిర్వహిస్తున్న జాతీయ యువజనోత్సవాల్లో ప్రతిభ చూపి మన రాష్ట్రానికి మరిన్నీ బహుమతులు తీసుకురావాలని మంత్రి ఆర్.కె. రోజా కోరారు. రండి-మెల్కోండి-లక్ష్యాన్ని చేరుకోండి అన్న స్వామి వివేకానంద స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. యువతకు మార్గనిర్ధేశకులు స్వామి వివేకానంద అని అన్నారు. యువత అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వం దేశంలోనే మన ముందు వరుసలో ఉండటం గర్వకారణమని, అందుకు మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కు ధన్యవాదాలు తెలిపారు. ఆడుదాం ఆంధ్రాకు స్ఫూర్తి స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యువత మానసిక వికాసం, శారీరక ధారుడ్యం పెంచుకోవాలని ఎమ్మెల్యే విష్ణు కోరారు. యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న స్వామి వివేకానంద జీవితానికి సంబంధించిన నాలుగు చిన్న కథలను విద్యార్థులకు వివరించి అందులోనుంచి సమయస్ఫూర్తి, శారీరక బలం, మానసిక బలం, ధైర్యం ప్రాముఖ్యతను యువతకు వివరించారు. ఈ నాలుగు జీవితంలో భాగం చేసుకోవాలని అప్పుడే యువత తమ లక్ష్యాన్ని మరింత త్వరగా చేరుకుంటారన్నారు. స్వామి వివేకానంద దేశ భవిష్యత్ గురించి కూడా చెప్పారని రాబోయే తరాలు మన సంస్కృతికి, సాంప్రదాయలకు పెద్దపీట వేస్తారని అన్నారని గుర్తుచేశారు. రామకృష్ణ మిషన్ స్వామిజీ తాతా మహారాజ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, ఆయన రచనలు యువతకు ఆదర్శమని అన్నారు. స్వామి వివేకానంద యువతకు దిక్సూచి అని కొనియాడారు. భారతదేశం గొప్పతనాన్ని తెలుచుకోవాలంటే వివేకానందుడి జీవితాన్ని చదివితే తెలుస్తుందన్నారు. సనాతన ధర్మం గొప్ప తనాన్ని నేటి యువత గుర్తించాలన్నారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి అతిధులు ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన యువజనోత్సవాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందచేశారు. అలాగే యువజన శాఖ ఆధ్వర్యంలో అధికారులు మంత్రి రోజాను ఘనంగా సత్కరించారు. ఈ ఏడాది మన రాష్ట్రం సాధించిన లార్జెస్ట్ యూత్ ఐకాన్ ఫెస్టివల్ అవార్డును మంత్రి రోజా యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్నకు అందచేశారు. వేదికపై చెస్ మాస్టర్ ఎం. లలిత్ బాబును మంత్రి రోజా శాలువా, పూలామాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కె. శారదాదేవి, డిప్యూటీ మేయర్ ఎ. శైలజారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ షేక్. ఆసీఫ్, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పి. మహేష్ తదితరులు పాల్గొన్నారు. - కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. -
మల్లాది విష్ణు, నేను వేరు కాదు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లాది విష్ణు, తాను వేరు కాదు.. ఇద్దరూ ఒక్కటేనని వెల్లంపల్లి స్పష్టం చేశారు. అలాగే, బోండా ఉమా హద్దు మీరి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వెల్లంపల్లి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం. మల్లాది విష్ణు, నేను వేరు కాదు.. ఇద్దరం ఒక్కటే. సామాజిక సమీకరణాల్లో భాగంగానే మార్పులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండగా పాటిస్తాం. సీఎం వైఎస్ జగన్ పథకాలు, సంక్షేమ పాలనే వైఎస్సార్సీపీని, మమ్మల్నిని గెలిపిస్తాయి. టీడీపీ నేత బోండా ఉమ హద్దు మీరి మాట్లాడుతున్నాడు. బోండా ఉమ హద్దు మీరితే సహించేది లేదు. ముందు వాళ్ల సీట్లు కన్ఫర్మ్ చేసుకోవాలి అని హితవు పలికారు. -
పేదల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి సీఎం జగన్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-
మాజీ సిఎం చంద్రబాబు రాష్ట్రానికి పనికొచ్చే పని ఏం చేశారు?- వైసీపీ ఎమ్మెల్యే మల్లాదివిష్ణు
-
నారా లోకేష్ పై మల్లాది విష్ణు సెటైర్లు
-
నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి .. మల్లాది విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్
-
మైనారిటీలపై చంద్రబాబు కక్ష సాధింపు..మల్లాది విష్ణు ఫైర్..
-
పురంధేశ్వరిపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్
-
శ్రీవారి పాదాల సాక్షిగా నారా భువనేశ్వరిని ఒక్కటే అడుగుతున్నా
-
జైల్లో చంద్రబాబు కేజీ బరువు పెరగడంపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు సెటైర్లు..
-
డబ్బులిస్తే అతను ఏ పనైనా చేస్తాడు
-
అవినీతి అనకొండ చంద్రబాబు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-
రాజరాజేశ్వరిపేటలో గడపగడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం
-
బాలకృష్ణ, టీడీపీ నేతలపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు
-
సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత టీడీపీ, జనసేనకు లేదు: మల్లాది విష్ణు
-
ఈ స్కిల్ స్కామ్ లో పవన్ కళ్యాణ్ వాటా ఎంతో నిన్నే అర్ధమయింది
-
సీపీఐ, జనసేనపై మల్లాది విష్ణు సీరియస్ కామెంట్స్
సాక్షి, విజయవాడ: సీపీఐ రామకృష్ణ, చంద్రబాబు, పవన్పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తొత్తులా సీపీఐ రామకృష్ణ వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. జనసేన సిద్ధాంతం లేని పార్టీ అని ఎద్దేవా చేశారు. అలాగే, బాలకృష్ణ, పవన్ నోరు అదుపులో పెట్టకుని మాట్లాడాలని హెచ్చరించారు. కాగా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి చేసిన చంద్రబాబును సీపీఐ సమర్థిస్తోంది. చంద్రబాబుకు తొత్తులా రామకృష్ణ వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చేసిన స్కాంలు పవన్కు కనబడట్లేదా?. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం 12 నుంచి 6 శాతానికి తగ్గింది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. జనసేన సిద్ధాంతం లేని పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్కు అత్యుత్సహం ఎక్కువైంది. దత్త తండ్రి అరెస్ట్ను పవన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అవినీతి చేసిన వ్యక్తిని సపోర్టు చేయడం సిగ్గుచేటు. చంద్రబాబు చేసిన అవినీతిలో పవన్, బాలకృష్ణకు కూడా వాటా ఉందా?. చంద్రబాబు ఒక ఆర్థిక నేరస్థుడు. పవన్కు భయం పట్టుకుంది. అందుకే ఈరోజు జైలుకి వెళ్లాడు. పవన్ బీజేపీతో వివాహం.. టీడీపీతో కాపురం చేస్తున్నాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: మాకొద్దు ‘బాబు’ వర్రీ.. మాకెందుకు ఈ కొరివి!
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
పిల్లలపై ఓ కన్నేయండి..
స్టాక్ బయటకొచ్చింది
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement