Manmadhudu
-
తలకు గాయం.. అయినా ఫోటోషూట్ వదలని అన్షు
-
ఫ్యామిలీతో కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో మన్మధుడు హీరోయిన్ అన్షు (ఫోటోలు)
-
అలా మజాకాకి చాన్స్ వచ్చింది: నటి అన్షు
‘నాకు పదిహేనేళ్ల వయసు ఉన్నప్పుడే నటిగా కెరీర్ స్టార్ట్ చేశాను. నాగార్జునగారి ‘మన్మథుడు’ సినిమా చేశాను. మరోవైపు చదువుకోవాల్సి వచ్చింది. దీంతో లండన్ వెళ్లిపోయాను. అక్కడ కాలేజ్ స్టడీస్ పూర్తి చేసి, మాస్టర్స్ చేశాను. సైకాలజిస్ట్ అయ్యాను. సొంతంగా ఓ క్లినిక్ కూడా రన్ చేస్తున్నాను. నా 24 ఏళ్ల వయసులో నేను సచిన్ సాగర్ను పెళ్లి చేసుకున్నాను.మాకు ఇద్దరు సంతానం. ఒకవేళ ‘మన్మథుడు’ సమయానికి నా వయసు 25 ఏళ్లు ఉండి ఉంటే నేను సినిమాల్లోనే కొనసాగేదాన్నేమో!’’ అని నటి అన్షు అన్నారు. సందీప్ కిషన్ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మించిన చిత్రం ‘మజాకా’(Majaka). రీతూ వర్మ హీరోయిన్గా, మరో లీడ్ రోల్లో అన్షు(Anshu) నటించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో అన్షు చెప్పిన సంగతులు...⇒ ‘మజాకా’లో నేను యశోద అనే క్యారెక్టర్ చేశాను. యశోద స్ట్రాంగ్ విమెన్. కానీ తనలో మంచి ఎమోషనల్ పెయిన్ ఉంది. సినిమాలో నా రోల్కి మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఇక ‘మన్మథుడు’ సినిమా రీ–రిలీజ్ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నా వీడియో బైట్ కోసం నన్ను కాంటాక్ట్ చేశారు. అలా సోషల్ మీడియాలో కనిపించాను. ఆ తర్వాత రచయిత ప్రసన్నకుమార్గారు మా మేనేజర్ ద్వారా నన్ను కలిసి, ఈ సినిమా కథ చెప్పారు. అలా ‘మజాకా’కి చాన్స్ వచ్చింది. ఈ కథ వింటున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ⇒ నేను తిరిగి సినిమాలు చేస్తానన్నప్పుడు నా భర్త నన్ను ఎంకరేజ్ చేశారు. హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు... ఇలా ఏ తరహా పాత్రలు అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ∙నేను లండన్లో ఉన్నప్పుడు ఓ క్యాస్టింగ్ ఏజెన్సీకి నా వివరాలు ఇచ్చి, యాక్ట్ చేస్తానని చెప్పాను. నేను చేసిన సినిమాల గురించి చెప్పాను. వాళ్లు నన్ను రిజెక్ట్ చేశారు. అయితే నేనొక సైకాలజిస్ట్ని. సక్సెస్తో కన్నా ఫెయిల్యూర్స్తోనే ఎక్కువగా నేర్చుకోగలమని నమ్ముతాను. -
ఫ్యామిలీతో 40వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న 'మన్మధుడు' హీరోయిన్ అన్షు (ఫోటోలు)
-
సంబరాల సంక్రాంతి అంటూ అందంగా ముస్తాబైన అన్షు అమ్మడు
-
పెళ్లయి 14 ఏళ్లు.. 'మన్మథుడు' హీరోయిన్ మధుర జ్ఞాపకాలు (ఫొటోలు)
-
సాగర తీరాన మన్మధుడు హీరోయిన్.. రీ ఎంట్రీ ఇవ్వనుందా?
-
మన్మధుడు హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
'మన్మథుడు' సినిమా పేరు చెప్పగానే కామెడీ డైలాగ్స్ గుర్తొస్తాయి. అలానే హీరోయిన్ అన్షు కూడా జ్ఞాపకమొస్తుంది. ఎందుకంటే మూవీలో ఉన్నది కాసేపే అయినా తన అందంతో మెస్మరైజ్ చేసింది. అయితే మరిన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తుందని అనుకుంటే.. సడన్గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. దేశమే వదిలేసి వెళ్లిపోయింది. అలాంటిది ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందట.(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)లండన్లో పుట్టి పెరిగిన అన్షు.. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంది. ఆ తర్వాత మోడలింగ్ చేసి, హీరోయిన్ అయిపోయింది. మన్మథుడు, రాఘవేంద్ర, మిస్సమ్మ సినిమాలు చేసింది. తమిళంలో మరో మూవీ చేసింది. హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే.. 2003లో సచిన్ నిగ్గర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తిరిగి లండన్ వెళ్లిపోయింది. యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది.ఇక కొడుకు, కూతురు పుట్టారు. కొన్నాళ్ల పాటు గార్మెంట్ బిజినెస్ కూడా చేసింది. గత కొన్నేళ్ల నుంచి మళ్లీ గ్లామర్ చూపిస్తూ వచ్చింది. అలా గత కొన్నాళ్ల నుంచి హైదరాబాద్లోనే ఉంటూ తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. అలా ఇప్పుడు సందీప్ కిషన్ కొత్త మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో రావు రమేశ్కి జోడీగా ఈమె కనిపించనుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) -
20 ఏళ్ల తర్వాత కలిసిన 'మన్మథుడు' జోడీ.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్!
తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో 'మన్మథుడు' ఒకటి. నాగార్జున, సోనాలి బింద్రే, బ్రహ్మానందం, త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్.. ఇలా ఒకరిని మించి మరొకరు ఈ మూవీకి బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. కల్ట్ క్లాసిక్ మూవీగా నిలబెట్టారు. ఇప్పుడు ఈ మూవీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. 'మన్మథుడు'లో ఓ హీరోయిన్గా చేసిన అన్షు.. ఇప్పుడు నాగార్జునని కలిసింది. ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా పెట్టింది. (ఇదీ చదవండి: డైరెక్ట్గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) 2002లో వచ్చిన 'మన్మథుడు' సినిమాలో హీరోగా నాగార్జున ఎంత అందంగా కనిపిస్తారో.. హీరోయిన్లుగా చేసిన సోనాలి బింద్రే, అన్షు కూడా అంతే అందంగా కనిపిస్తారు. అయితే ఈ మూవీ చేసిన తర్వాత అన్షు.. మరో రెండు తెలుగు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పూర్తిగా నటనకు దూరమైపోయింది. పెళ్లి చేసుకుని ఇంగ్లాండ్లో సెటిలైపోయింది. దాదాపు 20-21 ఏళ్ల తర్వాత భారత్ తిరిగొచ్చిన అన్షు.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. నాగార్జునతో కలిసి పార్టీ కూడా చేసుకుంది. రీసెంట్గా 'మన్మథుడు' జోడీ నాగార్జున-అన్షు కలిసి పార్టీ చేసుకున్నారు. పలు ఫొటోలు బయకొచ్చాయి. తాజాగా ఇప్పుడు నాగార్జునని కలవడం గురించి స్వయంగా హీరోయిన్ అన్షునే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. 'ఔదర్యం, మంచిగా ఉండటం అనేవి నాగ్ సర్లో మరింతగా పెరిగాయి. ఈ జ్ఞాపకాలు మరింత పదిలంగా ఉంటాయి' అని అన్షు రాసుకొచ్చింది. ఇప్పుడు ఫొటోలు అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) -
Manmadhudu: 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన మన్మథుడు జంట ఫోటోలు వైరల్
-
ఆ ఒక్క కారణం వల్లే సినిమాలు మానేశా: మన్మథుడు హీరోయిన్
అన్షు అంబానీ.. చేసింది నాలుగే నాలుగు సినిమాలు.. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్లో గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికీ ఆమెను తెలుగు ఆడియన్స్ ఇట్టే గుర్తుపడతారు. తను నటించిన తొలి చిత్రం మన్మథుడు. ఈ మూవీ అటు నాగార్జునకు, ఇటు అన్షుకు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ మరుసటి ఏడాదే రాఘవేంద్ర సినిమా చేసిందీ బ్యూటీ. మిస్సమ్మలో అతిథి పాత్రలో మెరిసింది. 2004లో జై అనే తమిళ చిత్రంలో చివరిసారిగా నటించింది. తర్వాత మరే సినిమా ఒప్పుకోలేదు. 2003లో సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లాడి లండన్లో సెటిలైంది. తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఇరవై ఏండ్ల తర్వాత ఈమె మీడియా ముందుకు వచ్చింది. 16 ఏళ్ల వయసులోనే.. తాజాగా ఏదో పని మీద భారత్కు వచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో తను సినిమాలు మానేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది. అన్షు మాట్లాడుతూ.. నేను ఇంగ్లాండ్లో పుట్టి పెరిగాను, కానీ నా పూర్వీకులు భారతీయులే. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు ఇండియాకు వచ్చాను. అప్పుడే మన్మథుడు సినిమాలో ఆఫర్ వచ్చింది. ఓపక్క సినిమాల్లో యాక్టివ్ అవ్వాలనుకున్నా.. మరోవైపు చదువుపైనా దృష్టి పెట్టాలనుకున్నాను. పదేపదే అలాంటి క్యారెక్టర్.. తెలుగులో చేసిన రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్గానే ఛాన్స్ వచ్చింది. ఆ రెండింటిలోనూ నా పాత్ర చనిపోతుంది. ఆ తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాల్లో కూడా ఇలా చనిపోయే రోల్సే ఆఫర్ చేశారు. పదేపదే అలాంటి క్యారెక్టర్సే వస్తుండటంతో విసుగెత్తిపోయాను. ఇవి చేసే బదులు ఖాళీగా ఉండటం నయమనుకున్నాను. అందుకే సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోయాను. ఒక క్యారెక్టర్ బాగా చేశారని పదేపదే ఆ నటులను అదే పాత్రకు పరిమితం చేయడం కరెక్ట్ కాదు' అని చెప్పుకొచ్చింది అన్షు అంబానీ. చదవండి: సహజీవనం వేస్ట్.. ఇద్దరు తప్పు చేసినా ఒక్కరికే శిక్ష!: పక్కింటి కుర్రాడు -
ఈ హీరోయిన్ గుర్తుందా? ప్రభాస్, నాగార్జునతో మాత్రమే!
ఈ హీరోయిన్ పుట్టింది లండన్లో.. కానీ హీరోయిన్ కావాలనుకుంది. అలా ప్రయత్నం చేసి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్, నాగార్జున లాంటి హీరోలతో నటించింది. వీటిలో ఒకటి ఇండస్ట్రీలో బెస్ట్ ఫిల్మ్ కాగా, మరొకటి యావరేజ్గా నిలిచింది. వీటి తర్వాత ఈమెకు ఛాన్సులు వచ్చాయి గానీ ఒకే ఒక్క కారణంతో యాక్టింగ్కి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ ఎవరీ బ్యూటీ? ఈమె స్టోరీ ఏంటి? (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) సాధారణంగా హీరోయిన్లకు వయసు పెరిగేకొద్ది గ్లామర్ తగ్గుతుంది. అదేంటో ఈమెకు మాత్రం అది రివర్స్లో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. లేకపోతే 40 ఏళ్లు వయసు, ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ యంగ్ హీరోయిన్లు పోటీ ఇచ్చేలా తయారైంది. ఇంతకీ ఈమె పేరు చెప్పలేదు కదు. అన్షు అంబానీ. ఇప్పటికీ గుర్తురాలేదా? 'మన్మథుడు' ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో కనిపించే హీరోయిన్ ఈమెనే. ఇక ఈమె పేరు అన్షు అంబానీ. భారతీయ మూలాలున్న ఈ బ్యూటీ లండన్లో పుట్టి పెరిగింది. చదువుతున్నప్పుడే మోడలింగ్లోకి అడుగుపెట్టింది. సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో హీరోయిన్ అవుదామనుకుంది. దీంతో ప్రయత్నాలు చేసింది. అలా ప్రభాస్ కెరీర్ మొదట్లో చేసిన 'రాఘవేంద్ర' సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇది షూటింగ్ పూర్తి చేసుకునేలోపు, నాగార్జున 'మన్మథుడు'లో ఈమె ఓ హీరోయిన్గా చేసింది. (ఇదీ చదవండి: ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!) ఇలా తెలుగులో కేవలం రెండంటే రెండు సినిమాలు చేసింది. 'మిస్సమ్మ' చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. తమిళంలో 'జై' అనే మూవీ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు పలు చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. కానీ ఈమె వాటిని అంగీకరించలేదు. తిరిగి లండన్ ఫ్లైట్ ఎక్కేసింది. దీనికి కారణం ఏంటా అని చూస్తే.. సినిమాలు చేద్దామనే ఇంట్రెస్ట్ ఉంది గానీ కేవలం ఒకటి రెండు అని ముందే ఫిక్స్ అయిందట. అలా తన డ్రీమ్ నెరవేరగానే ఇంటికెళ్లిపోయింది. ఇక లండన్కి వెళ్లిపోయిన అన్షు.. సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండియన్ డిజైనర్ వేర్ బిజినెస్ చేస్తూ బిజీగా ఉంది. ఫ్రీ టైంలో జిమ్ వర్కౌట్ వీడియోలు, గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఒకప్పటి క్యూట్గా ఉండే ఈమె ఇప్పుడు 40ల్లోనూ హాట్గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈమెని చూడగానే మీలో ఎవరైనా గుర్తుపట్టారా? లేదా ఇదంతా చదివిన తర్వాత గుర్తుపట్టారా? View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) (ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్) -
'మన్మథుడు' హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
అన్షు అంబానీ.. ఈ పేరు పెద్దగా విని ఉండకపోవచ్చు కానీ మన్మథుడు హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. ఈ సినిమాలో బేల చూపులతో అమాయకంగా మాట్లాడే ఆమె పాత్ర ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. కెమెరా మ్యాన్ కబీర్ లాల్.. అన్షును దర్శకుడు విజయ్ భాస్కర్కు పరిచయం చేశాడు. అలా ఆమె కింగ్ నాగార్జునతో 'మన్మథుడు'లో నటించే ఛాన్స్ కొట్టేసింది. 2002లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ కొట్టి అన్షుకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ మరుసటి ఏడాది ఆమె ప్రభాస్తో 'రాఘవేంద్ర' సినిమాలో నటించింది. అయితే ఈ రెండు సినిమాల్లోనూ చనిపోయే పాత్రలే చేసిందీ భామ. తర్వాత 'జై' అనే తమిళ చిత్రంలో నటించిన ఈ హీరోయిన్ ఆ తర్వాత చిత్రపరిశ్రమలో కనిపించకుండా పోయింది. లండన్లో పుట్టి పెరిగిన అన్షు రెండు సినిమాలతోనే సునామీ సృష్టించింది. కానీ ఇండస్ట్రీకి ఓ అతిథిలా వచ్చి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న వ్యాపారవేత్త సచిన్ సగ్గార్ను పెళ్లాడి లండన్లోనే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం అన్షు అక్కడ ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఇన్స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ కూడా ఉంది. అక్కడ టాలీవుడ్తో పాటు బాలీవుడ్ హీరోయిన్లు వేసుకునే దుస్తులనే తిరిగి రెడీ చేయించి అమ్మకాలు చేస్తోందట. ఇదిలా వుంటే గతంలో ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో మన్మథుడు సుందరి ఆ రూమర్లను కొట్టిపారేస్తూ తను లండన్లో సంతోషంగా జీవిస్తున్నానని క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అన్షు ఇండస్ట్రీని వదిలేసి సుమారు 18 ఏళ్లవుతోంది. ఈ మధ్యే ఆమె తిరిగి సినిమాల్లోకి రానుందంటూ కథనాలు వచ్చాయి. కానీ ఇంతరవకు వాటిపై స్పష్టత రాలేదు. ఆమె తిరిగి వచ్చే అవకాశాలూ కనిపించడం లేదు. అయినప్పటికీ ఏదో అద్భుతం జరిగి ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తే బాగుండు అంటున్నారు అభిమానులు. చదవండి: నటి టాప్లెస్ ఫొటో, నెటిజన్పై సెటైర్ ‘ప్రేమ దేశం’ హీరో వినీత్ టాలీవుడ్కి ఎందుకు దూరమయ్యాడంటే.. -
17 ఏళ్ల తర్వాత ఆ నటి రీ ఎంట్రీ ఇవ్వనుందా?
అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి అన్షు అంబాని అందరికి గుర్తుండే ఉంటుంది. అదేనండి ‘గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తుంది.. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది’.. అంటూ కింగ్తో కలిసి ఆడిపాడారు అన్షు. విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి సినిమాతో ఎందరో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ప్రభాస్కు జంటగా ‘రాఘవేంద్ర’లో నటించారు. అనంతరం 2004లో వచ్చిన మిస్సమ్మలో గెస్ట్ రోల్ పోషించిన అన్షు తరువాత మరే ఇతర చిత్రంలోనూ కనిపించలేదు. 2003లో లండన్కు చెందిన సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరికి ఓ పాప ఉన్నారు. తాజాగా అన్షు మళ్లీ సినిమాల్లోకి రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత అన్షు అంబానీ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అన్షు కీలక పాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్షును చిత్ర యూనిట్ సంప్రదించగా ఇందుకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే అలనాటి ముద్దుగుమ్మను మళ్లీ వెండితెరపైకి చూసుకోవచ్చు. #NTR30గా రూపొందనున్నఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కాగా ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నాడు. చదవండి: సుస్మితతో పెళ్లి.. ప్రియుడి కామెంట్ చదవండి: ‘చావుకబురు చల్లగా’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది -
శరీరం లేకపోతేనేం...
మన్మథుడు మనుషుల మనసులో మోహాన్ని రేకెత్తించగల వరాన్ని జన్మతః కలిగినవాడు. తనకు కలిగిన వరం ఎంతమేరకు ఫలిస్తుందో పరీక్షించేందుకు ఆ మన్మథుడు స్వయంగా తన తండ్రి మీదే బాణాలను సంధించాడట. దాంతో కోపగించుకున్న తండ్రి మున్ముందు శివుని మూడోకంటికి భస్మం అయిపోతావంటూ శపించాడు. అయితే ఆ శాపం లోక కళ్యాణానికే ఉపయోగపడింది. దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి భస్మం అయిపోయిన తరువాత శివుడు విరాగిగా మారిపోయాడు. సుదీర్ఘమైన ధ్యానంలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తారకాసురుడు అనే రాక్షసుడు, ఆ శివునికి కలిగే సంతానం వల్లే తనకు మృత్యువు ఉండాలన్న వరాన్ని కోరుకున్నాడు. వైరాగ్యంలో కూరుకుపోయిన శివునికి సంతానం కలుగదన్నది అతని ధీమా! శివుని మనసుని ఎలాగైనా మరలుగొల్పి, పార్వతీదేవిగా అవతరించిన సతీదేవి మీద అతని మనసుని లగ్నం చేయాలని భావించారు దేవతలు. ఆ కార్యాన్ని సాధించేందుకు వారికి మన్మథుడే కీలకంగా తోచాడు. పార్వతీదేవి, శివుడు ధ్యానం చేసుకునే వనంలోకి ప్రవేశించే సమయంలో అతని మీదకు తన పూలబాణాలను సంధించాడు. దాంతో ధ్యానం చెదిరిన శివుడు కోపంతో తన మూడో కంటిని తెరిచి ఆ మన్మథుని భస్మం చేశాడు. అయితేనేం! అప్పటికే ఆయన హృదయానికి మన్మథ శరాలు గుచ్చుకునిపోయాయి. తన కంటి ఎదురుగా ఉన్న పార్వతి మీదకి దృష్టి మరలింది. మన్మథుని భార్య రతీదేవి వేడుకోళ్లతో ఆయన మనసు కరిగింది. మన్మథుని మళ్లీ జీవింపచేశాడు. కానీ చేసిన తప్పుకి శిక్షగా ఇక మీదట మన్మథుడు ఎలాంటి శరీరమూ లేకుండా ఉండిపోతాడని శపించాడు. అప్పటి నుంచీ మన్మథునికి ‘అనంగుడు’ అన్న పేరు స్థిరపడిపోయింది. మన్మథుడు అనంగుడే కావచ్చు. కానీ అవసరం అయినప్పుడు ప్రేమికులను కలిపేందుకు సర్వసన్నద్ధంగా బయల్దేరతాడు. ప్రేమ రాయబారాలు నడిపే చిలుకే అతని వాహనం, తియ్యటి చెరుకుగడే అతని విల్లంబు, మల్లె వంటి అయిదు రకాల పుష్పాలే అతని బాణాలు... వాటితో అతను మనసులను మధించి వేయగలడు. అలా మనసుని మథించేవాడు కాబట్టి మన్మథుడు అని అంటారట.– డి.వి.ఆర్. -
‘పాకెట్ మనీ కోసమే సినిమాలు చేశా’
తాను నటినెందుకయ్యానో తెలుసా? అని అంటున్నారు నటి రకుల్ప్రీత్సింగ్. కథానాయకిగా రాణిస్తున్న ప్రతి నటి తానెందుకు నటినయ్యాను? ఎలా అయ్యాను? వంటి విషయాల గురించి ఏదో కారణం ఉందని చెబుతుంటారు. మనం వింటుంటాం. మరి రకుల్ప్రీత్సింగ్ ఏం చెబుతున్నారో చూసేస్తే పోలా. ఈ అమ్మడికి కోలీవుడ్లో ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం అనే ఒక్క విజయం మినహా సరైన మరో సక్సెస్ లేదన్నది నిజం. అయితే టాలీవుడ్లో రెండు మూడు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారీ బ్యూటీ. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒక్కో చిత్రమే రకుల్ప్రీత్సింగ్ చేతిలో ఉన్నాయి. ఇకపోతే కోలీవుడ్లో సూర్యతో నటించిన ఎన్జీకే చిత్రంపై ఈ భామ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం కూడా నిరాశపరిచింది. దీని గురించి రకుల్ప్రీత్సింగ్ తాను ఎన్జీకే చిత్రంలో నటించడానికి ప్రధాన కారణాలు రెండు అని చెప్పుకొచ్చారు. దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తే నటనను మరింత మెరుగుపరుచుకోవచ్చునని, ఇక రెండో విషయం హీరో సూర్య కావడం అన్నారు. దర్శకుడు సెల్వరాఘవన్ ఇంతకు ముందు తెరకెక్కించిన 7జీ.రెయిన్బో కాలనీ, కార్తీ హీరోగా నటించిన ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రాలు తనను బాగా ఆకట్టుకున్నాయన్నారు. నిజంగానే సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడం వినూత్న అనుభంగా పేర్కొన్నారు. తాను కార్తీ, సూర్య ఇద్దరితోనూ నటించానని, ఇద్దరూ చాలా భిన్నమైన వ్యక్తులని తెలిపారు. సూర్య, కార్తీ ఇద్దరూ కఠిన శ్రమజీవులు అన్నారు. ఎలాంటి గర్వం లేకుండా చేసేపనిని ఇష్టపడి చేస్తారని అంది. తనకు తమిళం కంటే తెలుగు భాష బాగా తెలుసని, తెలుగులో సరళంగా మాట్లాడగలనన్నారు. తమిళ చిత్రాలకు అయితే సంభాషణలను హిందీలో రాసుకుని చెబుతానని, అది కాస్త కష్టతరం అయినా సవాల్గా తీసుకుని నటిస్తానని చెప్పారు. ఇంకో విషయం ఏమిటంటే తాను మొదట పాకెట్ మనీ కోసమే సినిమాల్లో నటించానని తెలిపారు. ఆ తరువాత కెమెరా ముందు నిలబడి నటించడం చాలా నచ్చడంతో పూర్తిగా నటిగా మారిపోయానని రకుల్ప్రీత్సింగ్ చెప్పుకొచ్చారు. కోలీవుడ్లో ఈ అమ్మడికి రవికుమార్ దర్శకత్వంలో శివకార్తికేయన్తో రొమాన్స్ చేస్తున్న చిత్రం ఒక్కటే ఉంది. అదేవిధంగా తెలుగులో నాగార్జునతో మన్మథుడు 2, హిందీలో మర్జావాన్ అనే ఒక చిత్రంలో నటిస్తున్నారు. -
మన్మథుడితో ‘మహానటి’
కింగ్ నాగార్జున ‘మన్మథుడు’ చిత్రంలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. మళ్లీ అదే స్టైల్లో ఎంటర్టైన్మెంట్ అందించడానికి యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ‘మన్మథుడు-2’ చిత్రాన్ని నాగార్జునతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోర్చుగల్ షెడ్యూల్లో కీలక సన్నివేశాల్ని షూట్ చేసింది చిత్రయూనిట్. పోర్చుగల్ షెడ్యూల్లో రకుల్ప్రీత్-నాగార్జునపై సీన్స్ను తెరకెక్కించగా.. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో కీర్తి సురేష్ జాయిన్ అయింది. తాజాగా వీరిద్దరిపై రొమాంటిక్ సీన్స్ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ లోకేషన్లోని ఓ పిక్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సమంత కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. Look who joined our set today! The adorable @KeerthyOfficial 😊#Manmadhudu2Diaries @iamnagarjuna @Rakulpreet @vennelakishore @AnnapurnaStdios @AnandiArtsOffl @Viacom18Studios @mynnasukumar @chaitanmusic pic.twitter.com/RfW9B6kGUt — Rahul Ravindran (@23_rahulr) 4 June 2019 -
పోర్చుగల్కి బై
కొన్ని రోజులుగా పోర్చుగల్లో మన్మథుడు హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఫారిన్లో కెమెరా ముందు మన్మథుడి అల్లరికి ఫుల్స్టాప్ పడింది. పోర్చుగల్కి బై బై చెప్పనున్నారు ‘మన్మథుడు 2’ టీమ్. నాగార్జున హీరోగా ‘చిలసౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మన్మథుడు 2’. ఇందులో రకుల్ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. సమంత, కీర్తీ సురేశ్ కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలిసింది. తొలుత స్మాల్ షెడ్యూల్ను హైదరాబాద్లో కంప్లీట్ చేసిన చిత్రబృందం ప్రస్తుతం పోర్చుగల్ షెడ్యూల్ని కూడా పూర్తి చేసింది. ‘‘పోర్చుగల్ షెడ్యూల్ పూర్తిచేశాం. కొంచెం కష్టంగా అనిపించినా సెట్లో ఫన్ ఉండటంతో ఈ 32రోజుల షెడ్యూల్ను హ్యాపీగా కంప్లీట్ చేశాం’’ అని రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నారు. అక్కడ కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలతోపాటుగా ఓ పాటను చిత్రీకరించినట్లు తెలిసింది. అంటే మన్మథుడు అండ్ టీమ్ బ్యాక్ టు హోమ్ అన్నమాట. ఈ షెడ్యూల్లోనే సమంత కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రావు రమేష్, నాజర్, ఝాన్సీ, ‘వెన్నెల’ కిశోర్, దేవ దర్శిని కీలక పాత్రలు చేస్తున్నారు. నాగార్జున, పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. 2002లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి ఇది సీక్వెల్ అని తెలిసిందే. -
మన్మథుడు–2లో మహానటి
‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు కీర్తీ సురేష్. ఆ సినిమాలో ఆమె నటన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆ చిత్రం తర్వాత నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రం చేస్తున్నారు. ఇటీవలే నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా సైన్ చేశారు. తాజాగా ‘మన్మథుడు 2’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించేందుకు అంగీకరించారు. ఇప్పటికే ఈ చిత్రంలో ఓ కీలకపాత్రకు సమంత ఎంపికైన విషయం తెలిసిందే. నాగార్జున, రకుల్ ప్రీత్సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మన్మథుడు 2’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పోర్చుగల్లో జరుగుతోంది. మనం ఎంటర్ప్రైజెస్, ఆనందీ ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ నిర్మిస్తున్నారు. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
వర్కింగ్ హాలిడే
‘సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయోచ్’ అంటున్నారు సమంత. అంటే.. షూటింగ్స్కు బ్రేక్ ఇచ్చి ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నారా? కాదు, కాదు. ఇది వర్కింగ్ హాలిడే. నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. నాగార్జున, పి. కిరణ్ నిర్మాతలు. ఇందులో సమంత ఓ స్పెషల్ రోల్లో కనిపించనున్నారు. తన పార్ట్ షూటింగ్ కోసం పోర్చుగల్లో ఉన్నారు సమంత. ‘‘ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ (రాహుల్ రవీంద్రన్, ‘వెన్నెల’ కిశోర్, సమంత) కలసి షూటింగ్ చేస్తే చాలా ఫన్గా ఉంటుంది’’ అని ఈ ఫొటోను షేర్ చేశారు సమంత. ‘మనం, రాజుగారి గది 2’ తర్వాత సమంత, నాగార్జున కలసి యాక్ట్ చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రంలో తన పాత్ర చిత్రీకరణ పూర్తయ్యాక ‘96’ రీమేక్ షూట్లో జాయిన్ అవుతారామె. స్యామ్ నటించిన ‘ఓ బేబి’ సినిమా రిలీజ్కు రెడీగా ఉంది. -
పోర్చుగల్లో మన్మథుడు
పోర్చుగల్లో ‘మన్మథుడు–2’ టీమ్ చాలా హుషారుగా షూటింగ్ చేస్తున్నారు. ఆ షూటింగ్కి సంబంధించి చాలా ఫొటోలను విడుదల చేశారు. నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. నాగార్జున, పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం పోర్చుగల్లో జరుగుతోంది. -
రకూల్
పోర్చుగల్లో షూటింగ్కు అంతా అనువుగా ఉన్నప్పటికీ ‘మన్మథుడు 2’ టీమ్లో మాత్రం హాట్ హాట్ వాతావరణం ఉందని, అందుకు కథానాయిక రకుల్ప్రీత్సింగే కారణమనే వార్తలు రెండు రోజులుగా నెట్టింట్లో షికార్లు చేస్తున్నాయి. అయితే అలాంటిది ఏమీ లేదని తెలిసింది. అంత కూల్గానే సాగుతోందట. నాగార్జున హీరోగా ‘చి..ల..సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నాగ్ సరసన రకుల్ర్ పీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. అయితే రకుల్ నటన పట్ల టీమ్ సంతృప్తిగా లేదనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై రాహుల్ రవీంద్రన్ కూడా స్పందించారు. ‘‘ప్రచారంలో ఉన్న వార్తలు నిజం కాదు. అవి కేవలం పుకార్లు మాత్రమే. పోర్చుగల్ షెడ్యూల్ స్టార్ట్ అయిన తొలి రోజు నుంచే రకుల్ మా టీమ్తో ఉన్నారు. ఆమె మంచి ప్రతిభాశాలి. అద్భుతంగా నటిస్తోంది. టీమ్ అందరం హ్యాపీగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు. సో.. ర‘కూల్’ అన్నమాట. ఇక్కడ ఇన్సెట్లో ఉన్న నాగార్జున ఫొటోను రాహుల్ రవీంద్రన్ షేర్ చేసి, ‘ఈ ఒక్క సీన్ మీ కోసమే’ అని ట్వీట్ చేశారు. 2002లో వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి ‘మన్మథుడు 2’ సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని నాగార్జున, పి. కిరణ్ నిర్మిస్తున్నారు. -
ఈ ఒక్క సీన్ మాత్రం మీకోసమే!
బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటూ.. ఇక్కడ మల్టీస్టారర్లకు ఓకే చెప్తూ.. సోలోగానూ సినిమాలు ఫుల్ ఫామ్లో ఉన్నారు కింగ్ నాగార్జున. ఇటీవలె దేవదాస్తో పలకరించిన నాగ్.. అటు బాలీవుడ్లో ‘బ్రహ్మాస్త్ర’లో ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు. నాగ్ ప్రస్తుతం ‘మన్మథుడు2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ‘చి.ల.సౌ’తో డైరెక్టర్గా మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ రవీంద్రన్.. మన్మథుడు2ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోర్చుగల్లో షూటింగ్ జరుపుకుంటొంది చిత్ర యూనిట్. నాగ్కు సంబంధించిన ఓ షాట్ను రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన ట్విటర్లో నాగ్ ఫోటోను షేర్ చేస్తూ.. ఫిట్నెస్లో ఈ మనిషి.. అంటూ దండం పెడుతూ.. కింగ్ ఫ్యాన్స్.. ఈ ఒక్క సీన్ మాత్రం మీకోసమే అని ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో సమంత ఓ ముఖ్యపాత్రను పోషిస్తుండగా.. వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. This man.... pah! Fitness goals! 🙏🏽🙏🏽🙏🏽 King fans... ee okka scene maatram mee kosame💛 pic.twitter.com/6Gg3Rfo9G3 — Rahul Ravindran (@23_rahulr) April 18, 2019 -
నాగ్ అరుదైన రికార్డ్
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. తన జనరేషన్ హీరోలందరూ రొమాంటిక్ సినిమాలకు గుడ్బై చెప్పేసినా నాగ్ మాత్రం ఇప్పటికీ మన్మథుడు ఇమేజ్తో దూసుకుపోతున్నాడు. అదే బాటలో ఓ అరుదైన ఘనత సాధించాడు. తమ ఫ్యామిలీలో మరో జనరేషన్ హీరోలతో నటించిన హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ నాగ్ మాత్రం తకన్న ముందు జనరేషన్తో నటించిన హీరోయిన్లతో పాటు తన తరువాతి జనరేషన్తో నటించిన హీరోయిన్లతోనూ కలిసి నటిస్తున్నాడు. అక్కినేని నాగేశ్వరరావుతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవితో నాగార్జున పలు సూపర్ హిట్ సినిమాలు చేశాడు. తాజాగా తన తనయుడు నాగచైతన్య సరసన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్తో కలిసి నటిస్తున్నాడు నాగ్. అంటే తండ్రి సరసన హీరోయిన్గా చేసిన భామతో, కొడుకు సరసన హీరోయిన్గా చేసిన భామతోనూ కలిసి నటించిన అరుదైన రికార్డ్ను సాధించాడు కింగ్. ప్రస్తుతం చిత్రకరణ జరుపుకుంటున్న మన్మథుడు 2లో నాగ్, రకుల్ జంటగా నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. -
‘మన్మథుడు 2’ ఫ్యామిలీతో కింగ్
కింగ్ నాగార్జున టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మన్మథుడు 2’. ఈ సినిమా షూటింగ్ గత వారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ తో కలిసి నాగార్జున అక్కినేని, పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించి ఓ ఇంట్రస్టింట్ అప్డేట్ ఇచ్చారు నాగార్జున. చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి సెల్ఫీ దిగిన నాగ్ ఆసెల్పీని తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేశారు. ‘నేను నా మన్మథుడు 2 ఫ్యామిలీ!!! లవింగ్ ఇట్’ అని కామెంట్ చేశారు. ఈ సెల్ఫీలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, రాహుల్ రవీంద్రన్, సీనియర్ నటి లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ తదితరులున్నారు. ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
రెండో మన్మథుడు షురూ
నాగార్జున హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మన్మథుడు’. కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పదహారేళ్ల తర్వాత నాగ్ ‘మన్మథుడు 2’ చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్కి జోడీగా రకుల్ప్రీ™Œ సింగ్ నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాగచైతన్య కెమెరా స్విచ్చాన్ చేయగా, అమల అక్కినేని క్లాప్ ఇచ్చారు. ‘‘మన్మథుడు’ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని నాగార్జున ఈ సినిమా చేస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యూరప్లో ప్రారంభం కానుంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. నాగార్జున సోదరి నాగసుశీల, మేనల్లుడు, హీరో సుశాంత్ పాల్గొన్నారు. లక్ష్మి, ‘వెన్నెల’ కిషోర్, రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు ఈ చిత్రంలో నటించనున్నారు. -
వరుస సీక్వెల్స్కు కింగ్ రెడీ
టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం హిందీలో భారీ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్రలో నటిస్తున్నా నాగ్, త్వరలో మన్మథుడు 2లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు చిలసౌ ఫేం రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఈ సినిమా తరువాత సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వల్గా తెరకెక్కనున్న బంగార్రాజు సినిమాను పట్టాలెక్కించేందుకు ఓకె చెప్పాడట. ఈ సినిమాలో బంగార్రాజు పాత్రలో నాగ్ నటించనుండగా ఆయన మనవడిగా నాగచైతన్య కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా రాజుగాది గది సీక్వెల్ కూడా తెర మీదకు వచ్చింది. రాజు గారి గది 2లో ఇంట్రస్టింగ్ రోల్లో కనిపించిన నాగ్, ఆ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న రాజుగారి గది 3లో నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇలా వరుసగా సీక్వెల్ సినిమాలతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు కింగ్ నాగార్జున. -
మన్మథుడు మొదలు
సుమారు 17 ఏళ్ల తర్వాత మళ్లీ మన్మథుడి పాత్రలోకి ఎంట్రీ ఇవ్వడానికి నాగార్జున రెడీ అయ్యారు. 2002లో వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్గా ‘మన్మథుడు 2’లో నటించనున్నారాయన. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25న హైదరాబాద్లో ప్రారంభం కానుందని టాక్. ‘చి.ల.సౌ’ చిత్రంతో దర్శకుడిగా మారిన హీరో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రకుల్ప్రీత్ సింగ్, పాయల్రాజ్పుత్ కథానాయికలు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 4 వరకూ సాగనుందట. ఆ తర్వాత ఏప్రిల్ 12కి చిత్రబృందం పోర్చుగల్ ప్రయాణం కానున్నారు. ఇందులో నాగార్జున భార్యగా రకుల్ ప్రీత్ కనిపించనున్నారని టాక్. సీక్వెల్ కాబట్టి మొదటి పార్ట్ కథకు కొనసాగింపుగా ఉంటుందా? లేక అందులోని పాత్రలు మాత్రమే తీసుకుంటారా? వేచి చూడాలి. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం రిలీజ్ కావచ్చు. -
స్పెషల్ గెస్ట్!
స్క్రీన్ మీద సందడి చేయడానికి మామా, కోడలు నాగార్జున, సమంత మరోసారి రెడీ అవుతున్నారట. ‘రాజుగారి గది 2’లో నాగార్జున, సమంత నటించిన విషయం తెలిసిందే. నాగార్జున లేటెస్ట్ చిత్రం ‘మన్మథుడు 2’. ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్ ఇది. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజ్పుత్ కథానాయికలు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జునే నిర్మించనున్నారు. ఈ సినిమాలో కీలక సన్నివేశాల్లో వచ్చే పాత్రలో సమంత కనిపించనున్నారని టాక్. సుమారు 5–10 నిమిషాలు ఆమె కనిపిస్తారట. ఈ పాత్రకు సమంత అయితే బావుంటుందని, కోడలిని మామ అడగటం, స్యామ్ వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయాయని ఇండస్ట్రీ టాక్. అలాగే చిత్రదర్శకుడు రాహుల్, సమంత మంచి స్నేహితులు. కెరీర్ స్టార్టింగ్లో సమంత చేసిన తమిళ చిత్రం ‘మాస్కోవిన్ కావిరి’లో రాహుల్, సమంత జంటగా నటించారు. సో.. రాహుల్ గెస్ట్గా చేయమంటే సమంత కాదంటారా? ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ శాతం షూటింగ్ పోర్చుగల్లో జరగనుంది. ఇందులో నాగార్జున భార్యగా రకుల్ నటించనున్నారని సమాచారం. -
మన్మథుడి భామ
మొదటి భాగంలో ఇద్దరి హీరోయిన్లతో సందడి చేసిన నాగార్జున సెకండ్ పార్ట్లోనూ ఇద్దరు హీరోయిన్ల్లతో రొమాన్స్ చేయనున్నారట. నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్గా ‘మన్మథుడు 2’ చిత్రం తెరకెక్కనుంది. దర్శకుడిగా మారిన హీరో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఫస్ట్ పార్ట్లో సోనాలీ బింద్రే, అన్షు నాయికలుగా నటించారు. సీక్వెల్లో రకుల్ ప్రీత్, పాయల్ రాజ్పుత్ నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెల రెండో వారంలో స్టార్ట్ కానుంది. ఎక్కువ శాతం పోర్చుగల్లో షూటింగ్ జరుపుకోనుంది. -
సీనియర్ హీరోకు జోడిగా రకుల్
చిన్న సినిమాలతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఎంత వేగంగా స్టార్ ఇమేజ్ సాధించిందో అదే వేగంగా తన ఫాం కోల్పోయింది ఈ భామ. 2016లో ధృవ సినిమాతో చివరగా బిగ్ హిట్ అందుకున్న రకుల్ తరువాత టాలీవుడ్ లో ఒక్క ఘనవిజయం కూడా సాధించలేకపోయింది. దీంతో ఈ అమ్మడి కెరీర్ కష్టాల్లో పడింది. అదే సమయంలో తమిళ, హిందీ ఇండస్ట్రీల మీద దృష్టి పెట్టడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఇతర ఇండస్ట్రీలలో కూడా ఆశించిన స్థాయి సక్సెస్లు దక్కకపోవటంతో రకుల్ తిరిగి టాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. కొంతకాలంగా టాలీవుడ్కు దూరంగా ఉండటంతో రకుల్ ఇక్కడ ఆఫర్లు తగ్గాయి. దీంతో టాలీవుడ్లో తిరిగి ప్రూవ్ చేసుకునేందుకు సీనియర్ల సరసన నటించేందుకు కూడా ఓకె అంటుందట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న మన్మథుడు 2లో నాగార్జున సరసన నటించేందుకు రకుల్ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అయినా రకుల్ తిరిగి ఫాంలోకి వస్తుందేమో చూడాలి. -
పాయల్ ఎక్స్ప్రెస్
‘‘ఆర్ఎక్స్ 100’ సూపర్ సక్సెస్తో టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారిపోయారు పాయల్ రాజ్పుత్. మొదటి సినిమాలోనే బోల్డ్గా నటించి ఇండస్ట్రీ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారామె. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు సైన్ చేస్తారనుకుంటే కొంచెం సమయం తీసుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలకు సంతకాలు చేస్తున్నారు. మొదట రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒక హీరోయిన్గా ఎంపికయ్యారు. లేటెస్ట్గా నాగార్జున ‘మన్మథుడు 2’ , వెంకటేశ్ ‘వెంకీ మామ’లో హీరోయిన్గా కమిట్ అయ్యారీ బోల్డ్ బ్యూటీ. ఇలా టాప్ హీరోలు ముగ్గురితో సినిమాలు సంతకం చేసి బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు సక్సెస్ అయితే పాయల్ టాప్ లీగ్లోకి ఎంట్రీ ఇవ్వడం ఈజీ అనుకోవచ్చు. ప్రస్తుతం తమిళంలో ఉదయ్ నిధి స్టాలిన్తో ‘ఏంజిల్’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. -
మన్మథుడి ముహూర్తం కుదిరే
స్త్రీలను అసహ్యించుకునే స్ట్రిక్ట్ బాస్లా ‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున పంచిన కామెడీ ఎవర్ గ్రీన్. ఇప్పటికీ అందులోని పంచ్ డైలాగ్స్ ఫ్రెష్గానే పేలుతుంటాయి. లేటెస్ట్గా మన్మథుడు మళ్లీ రావడానికి ముహూర్తం కుదిరింది. 2002లో నాగార్జున హీరోగా విజయ భాస్కర్ రూపొందించిన చిత్రం ‘మన్మథుడు’. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రూపొందనుంది. దర్శకుడిగా మారిన హీరో రాహుల్ రవీంద్రన్ ఈ సీక్వెల్ను తెరకెక్కించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున నిర్మించనున్నారు. ఈ సినిమాకు ‘మన్మథుడు 2’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా ముహూర్తం మార్చి మొదటి వారంలో జరగనుందని టాక్. ఎక్కువ శాతం షూటింగ్ పోర్చుగల్లో జరుపుకోనున్న ఈ చిత్రంలో హీరోయిన్గా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్పుత్ను ఎంపిక చేశారట. ఈ సీక్వెల్లో ‘మన్మథుడు’ క్యారెక్టరైజేషన్ను మాత్రమే తీసుకుంటారా? లేక వేరే కథను ప్లాన్ చేశారా? వేచి చూడాలి. -
‘మన్మథుడు’కి జోడిగా..!
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన బ్యూటీ పాయల్ రాజ్పుత్. ప్రస్తుతం ఈ భామ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. తొలి సినిమాతో గ్లామర్ షోతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం పాత్ర ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క సినిమా మాత్రమే చేస్తున్న ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్ట్లో కనిపించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన్మథుడు సీక్వల్లో పాయల్ రాజ్పుత్ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. మార్చి లేదా ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభ కానుంది. -
తాతామనవడు
నాగార్జున, నాగచైతన్య నిజజీవితంలో తండ్రీ కొడుకులు. కానీ చూడ్డానికి మాత్రం అన్నదమ్ముల్లా ఉంటారని అక్కినేని అభిమానులు సరదాగా చెప్పుకుంటుంటారు. ఇప్పుడు నాగార్జున, నాగచైతన్య తాతామనవళ్లుగా నటించబోతున్నారు. రెండేళ్ల క్రితం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున చేసిన బంగార్రాజు క్యారెక్టర్ ఆడియన్స్ను బాగా మెప్పించింది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్లోనే ‘సోగ్గాడే చిన్ని నాయానా’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. అయితే ఇందులో నాగచైతన్య కూడా నటిస్తారు. బంగార్రాజు మనవడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ వేసవిలో ఆరంభం కానుందని సమాచారం. ఇంతకుముందు ‘మనం’ సినిమాలో నాగార్జునకు నాన్న పాత్రలో నాగచైతన్య కనిపించారు. ఇప్పుడు ఈ చిత్రం కోసం మనవడిగా మారారు. ఈ సంగతి ఇలా ఉంచితే... 2002లో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి కూడా స్వీకెల్ చేస్తున్నారట నాగార్జున. ఈ సినిమాకు నటుడు, ‘చిలసౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తారు. మార్చిలో ఈ సినిమా షూటింగ్ పోర్చ్గల్లో స్టార్ట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. -
మన్మథుడు ఈజ్ బ్యాక్!
దర్శకునిగా తొలి సినిమా ‘చి.ల.సౌ’ రిలీజ్ కాకముందే అన్నపూర్ణలాంటి బిగ్ బ్యానర్లో సినిమా చేసే ఛాన్స్ను దక్కించుకున్నారు రాహుల్ రవీంద్రన్. అటు నటుడిగానూ సక్సెస్ఫుల్ కెరీర్ను లీడ్ చేస్తున్నారు. రాహుల్ దర్శకత్వం వహించిన ‘చిలసౌ’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కింగ్ నాగార్జునను డైరెక్ట్ చేయబోతున్నారు రాహుల్. ఇందుకోసం ఆయన ఓ రొమాంటిక్ కథను కూడా రెడీ చేశారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 2002లో నాగ్ నటించిన ‘మన్మథుడు’ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ‘మన్మథుడు 2’ అనే టైటిల్ని అక్కినేని కాంపౌండ్ రిజిస్టర్ చేయించిందనే వార్త వినిపిస్తోంది. ఈ టైటిల్ నాగార్జున– రాహుల్ రవీంద్రన్ సినిమాకేనా? అంటే వెయింట్ అండ్ సీ అంటున్నారట టీమ్. మరోవైపు రెండేళ్ల క్రితం నాగార్జున హీరోగా కల్యాణ్కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జోరందుకుందట. -
‘మన్మథుడు 2’ ఎవరి కోసం..!
నాగార్జున కెరీర్లో బిగెస్ట్ హిట్స్లో మన్మథుడు సినిమా ఒకటి. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ్ నిజంగా మన్మథుడు లాగే ఆకట్టుకున్నాడు. అమ్మాయిలను ద్వేషించే పాత్రలో కూడా అమ్మాయిల కలల రాకుమారుడిగా కనిపించాడు కింగ్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం మన్మథుడు సినిమాలో మరింత పదునుగా పంచ్లు విసిరింది. ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకుంటే తాజాగా కింగ్ నాగార్జున ‘మన్మథుడు 2’ అనే టైటిల్ను ఫిలిం చాంబర్లో రిజిస్టర్ చేయించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మన్మథుడు సినిమాకు నాగ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ సీక్వెల్లో మరోసారి నాగే మన్మథుడిగా అలరిస్తాడా..? నాగచైతన్య, అఖిల్లలో ఒకరు మన్మథుడి పాత్రలో కనిపించనున్నారా..? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. -
నాలుగో సింహం
సమ్సారం సంసారంలో సినిమా ‘‘సంసారం అంటే ఏమనుకుంటున్నావ్? ససారామ్లో జగ్జీవన్రామ్ గెలిచినంత ఈజీ కాదు. సారనాథ్లో బౌద్ధ స్థూపం చెక్కినంత కష్టం. కనిపించే మూడు సింహాలతోపాటు కనిపించని నాలుగో సింహం ఉంటుంది. అది ఎప్పుడు ఎలా గర్జిస్తుందో ఊహకు కూడా అందదు. కనిపించే మూడు సింహాల కదలికల మీద ట్వంటీఫోర్బై సెవెన్ ఓ కన్నేసి ఉంచవచ్చు. కనిపించని ఆ సింహం మాత్రం ఎప్పుడూ మనం నిద్రలో ఉన్నప్పుడే జూలు విదుల్చుతుంది’’. ‘‘నీ తార్కికత, తాత్వికత వినడానికి బాగానే ఉన్నాయి. పెళ్లంటే అంత భయమేంట్రా చైతూ, మేమంతా చేసుకోలేదా’’ అంటూ కొడుకును సముదాయించబోయాడు శ్రీనివాస్. ‘‘అమ్మో! మీరెన్నయినా చెప్పండి నాన్నా. నో డౌట్. భార్యంటే కనిపించని నాలుగో సింహమే. ఆ సింహానికి ఎప్పుడు కోపం వస్తుందోననే భయంతోనే నిద్రలేవాలి, ఆ భయంతోనే అన్నం తినాలి, ఆ భయంతోనే నిద్రపోవాలి. ఇంతగా భయపడానికి పెళ్లిచేసుకోవాలా? పెళ్లి చేసుకుని ఇంతలా భయపడాలా. నాకు వద్దనే వద్దు’’ తండ్రీకొడుకుల వాదనను మొదట్లో ఎంజాయ్ చేసింది. రాను రానూ కోపం వచ్చేసింది ప్రవీణకు. ‘‘రేయ్! ఆడవాళ్ల మీద చాలా తప్పు అభిప్రాయంలో ఉన్నావ్. నన్ను చేసుకుని మీ నాన్న కోల్పోయిందేమిటో చెప్పు’’ నిలదీసింది.‘‘అదిగో మా పెళ్లి ఫొటో చూడరా! ఎన్ని కష్టాలొచ్చినా సరే... ఇలా సోఫాలో కూర్చుని ఆ ఫొటోని చూస్తే అన్నీ మర్చిపోతుంటాను’’ కొడుకుని పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీనివాస్. ‘‘పాయింట్కొచ్చేశావ్ నాన్నా! అసలు నీకు కష్టాలు ఎందుకొస్తున్నాయంటావూ... పెళ్లి చేసుకున్నందుకే. పెళ్లే చేసుకోకపోతే నీకేం కష్టాలుంటాయి చెప్పు. నీకొచ్చే జీతంతో ఇంకా పెద్ద ఫ్లాట్ కొనేవాడివి. ఎస్యువి కారులో తిరిగే వాడివి... ఇంకా...’’ అంటూండగానే... ‘‘మీ నాన్న పెద్ద ఫ్లాట్ కొనకపోవడానికి, ఎస్యువి కారు కొనలేకపోవడానికి కారణం నన్ను పెళ్లి చేసుకోవడం కాదురా వెధవా, నిన్ను కనడమే. స్కూలు ఫీజులు, కాలేజీ ఖర్చులు, బ్రాండెడ్ దుస్తులు’’ లిస్ట్ చదివింది ప్రవీణ. ‘‘అమ్మా! నువ్వు కూడా దగ్గరదగ్గరగా పాయింట్కొచ్చేశావ్. పెళ్లి చేసుకోకపోతే పిల్లల్ని కనే బాధ కూడా ఉండదుగా’’ చూశావా టిట్ ఫర్ టాట్ ఎలా ఇచ్చానో అన్నట్లు తల్లి వైపు చిలిపిగా చూశాడు చైతన్య. ‘‘ఆఖరుకి నీలాగే వితండ వాదం చేసినోళ్లే పెళ్లి లేకుండా ఉండి పోయి, నలభై ఏళ్లు దాటాక తెల్ల మొహం వేస్తారు. ఆలోచనలు నేలమీదకొచ్చి పెళ్లి చేసుకుందామంటే ఏ అమ్మాయీ మీ ముఖం కూడా చూడదు’’ ప్రవీణలో కోపం పొంగుకొస్తోంది. మూడవ ప్రపంచ యుద్ధానికి తొలి అడుగు తన ఇంటి నుంచే పడవచ్చని భయమేసింది శ్రీనివాస్కి. ‘‘పది దాటింది నిద్రపోరా! ఉదయం ఆఫీస్ టైమయ్యే వరకు పక్క మీద నుంచి లేవవు’’ అంటూ టీవీ ఆఫ్ చేసి తన గదిలోకి వెళ్లిపోయాడు. ‘‘వీడిలా ఎందుకయ్యాడండీ! మనిళ్లలో అందరూ చక్కగా పెళ్లి చేసుకుని చల్లగా సంసారాలు చేసుకుంటున్నారు. పిల్లలతో ఆ ఇళ్లన్నీ కళకళలాడుతున్నాయి’’ ప్రవీణ బెడ్రూమ్లో ట్యూబ్లైట్ ఆపి బెడ్ ల్యాంప్ వేస్తూ అన్నది. శ్రీనివాస్ ఏమీ మాట్లాడలేదు. ‘‘నా వయసు వాళ్లు మనుమలు, మనుమరాళ్ల కబుర్లు చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. మాటల్లో మాటగా మన వాడి పెళ్లి టాపిక్ తెస్తారేమోనని నా గుండె గుబగుబమంటూ ఉంటుంది’’ అన్నది బ్లాంకెట్ మడత విప్పుతూ ప్రవీణ ఆవేదనగా. ఈసారీ మౌనమే సమాధానం. ‘‘మీ ఉద్యోగంతో మనం ఊరూరు తిరుగుతూ వాణ్ని చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెంచడంతోనేమో, వాడికి కుటుంబం అర్థం కావడం లేదు’’ అంటూ కళ్లు మూసుకుంది ప్రవీణ. పంజగుట్ట, చట్నీస్ రెస్టారెంట్. చైతన్య, శ్రీనివాస్ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. వెయిటర్ వినయంగా వంగి గ్లాసులో నీళ్లు పోశాడు. వినమ్రంగా వంగి వంగి సర్వ్ చేస్తున్నాడు.‘‘చూశావా నాన్నా! ఇంట్లో ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటి సర్వీస్ అందుతుందా?’’ అన్నాడు. ‘‘నీ ధోరణి మారాలి చైతూ. నీ ఫ్రెండ్స్ లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నారో గమనించావా ఎప్పుడైనా’’ అన్నాడు శ్రీనివాస్ అనునయంగా . ‘‘ఎందుకు లేదు నాన్నా! అంతా బ్యాచిలర్ లైఫ్ని తలుచుకుంటూ పెళ్లి చేసుకున్నందుకు బాధపడేవాళ్లే. ఒక్కరూ మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉందనే వాళ్లు లేరు’’ పెళ్లి విషయంలో తన అభిప్రాయం తప్పుకాదన్న ఆత్మవిశ్వాసం అతడి మాటల్లో. ‘‘భార్యంటే నాలుగో సింహం కాదు చైతూ! జీవితంలో సగం’’. ‘‘జీవితంలో కాదు నాన్నా! జీతంలో సగం అను ఒప్పుకుంటాను’’ పెడవాదాన్ని బలంగా వినిపిస్తున్నాడు చైతన్య. ‘‘రాత్రి ఎనిమిదికి రామకృష్ణ కొడుకు పెళ్లి! నువ్వు ఆఫీస్ నుంచి నేరుగా పెళ్లికి వచ్చెయ్యి, నేనూ అమ్మా ఇంటి నుంచి వస్తాం’’‘‘యా! వినీల్ పెళ్లి కదా! నాకు కష్టమే నాన్నా! ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది. మీరిద్దరూ వెళ్లండి’’ అనేసి సర్వర్కి ఫింగర్ బౌల్ చెప్పాడు. ‘‘ఏవండీ! భోజనానికి వస్తున్నారా’’ కిచెన్లో నుంచి పిలిచింది ప్రవీణ, ‘‘చైతూ, వస్తున్నావా’’ అంటూ చైతన్య గదిలోకి చూశాడు శ్రీనివాస్.‘‘ఆకలి లేదు, తర్వాత తింటా’’ ల్యాప్టాప్లో నుంచి ముఖం తిప్పకుండానే చెప్పాడు. ‘‘ముగ్గురి భోజనంలో ఒక్కొక్కరు ఒక్కోసారి భోజనం చేయడమేంట్రా, చల్లారిపోకముందే రా త్వరగా’’ అరిచినట్లే అన్నది ప్రవీణ. చైతన్య ముఖం చిట్లించుకుంటూ ‘‘అమ్మా! తినడానికి ఆకలి ఉండాలి కదా!’’ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చాడు, చైతన్య శిలాప్రతిమ అయ్యాడు కొద్దిసేపు. శ్రీనివాస్ ప్లేట్లో అన్నం పొగలు కక్కుతోంది. ప్రవీణ అన్నంలో ఆవు నెయ్యి, కరివేపాకు పొడి వేసింది. అన్నాన్ని కొద్దికొద్దిగా పక్కకు జరుపుతూ కాలుతున్న చేతిని ఊదుకుంటూ కలిపి ముద్దలు చేస్తోంది. ‘‘వేడిగా కరివేపాకు పొడితో రెండు ముద్దలు పట్టండి. రెండ్రోజులుగా బయటి భోజనాలాయె. పొట్ట పాడైందని తినకుండా ఊరుకుంటూ పొట్టలో గ్యాస్ ఫార్మ్ అవదూ’’ అంటూ శ్రీనివాస్కి గోరు ముద్దలు తినిపిస్తోంది. ‘‘నేను తింటాలే ప్రవీణా’’ అంటూ శ్రీనివాస్ అన్నంలో చెయ్యి పెట్టాడు. ‘‘ఆగండి, ఇంత వేడి అన్నం కలపడం మీ వల్లనవుతుందా’’ అంటూ శ్రీనివాస్ చేతిని పక్కకు తోసేసి అన్నం కలుపుతూ శ్రీనివాస్ నోట్లో పెడుతోంది. చైతన్య వచ్చి శ్రీనివాస్ పక్క కుర్చీలో కూర్చుని బోర్లించిన ప్లేట్ని వెల్లకిలా తిప్పుకుని, బాటిల్లో నుంచి నీటిని గ్లాసులో పోసుకున్నాడు. చైతన్య ప్లేట్లో భోజనం వడ్డించి, ‘‘మీరు లేవకండి, అజీర్తి వదలడానికి మిరియాల చారు పెట్టాను’’ ఆర్డరేసినట్లే అంటూ కిచెన్లోకి వెళ్లింది. తండ్రి రియాక్షన్ కోసం ముఖంలోకి చూస్తూన్నాడు చైతన్య. శ్రీనివాస్ కొడుకు వైపు చూసి ‘‘నువ్వు చెప్పింది నిజమే చైతూ. కనిపించని నాలుగో సింహమే భార్య. మనకు ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని జూలు విదిలించి రంగంలో దిగడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’’ అన్నాడు. చైతన్య మనోనేత్రం ముందు ఓ సంఘటన. ‘‘చైతూ! నువ్వు ఆఫీస్కెళ్లే దారిలో నన్ను ఏదో ఓ షాపింగ్మాల్లో దించు. రేపు మీ నాన్న బర్త్డే. ఏం మనిషో ఏంటో! ఇప్పటి వరకు కొత్త డ్రెస్ తెచ్చుకోలేదు’’ అంటూ హడావిడిగా ఎలా ఉన్న మనిషి అలాగే బయలుదేరింది ప్రవీణ. కారులో వెళ్తుండగా ‘‘చైతూ నీకు ఖాళీ ఉన్న రోజు చెప్పు కన్నా! మీ నాన్నకు ఓ సారి మాస్టర్ చెకప్ చేయించాలి. ఈ మధ్య మనిషి ఏంటో లాగేసినట్లయిపోతున్నాడు. మన కోసం ఆరాటపడడమే తప్ప, తన గురించి పట్టించుకోడు’’ అన్నది ప్రవీణ. చారు కోసం అన్నాన్ని కలుపుతున్న తండ్రి చేతి మీద చేయి వేస్తూ ‘‘అగ్రీ విత్ యూ నాన్నా!’’ అని షో కేస్లో ఉన్న అమ్మానాన్నల పెళ్లి ఫొటో వైపు చూశాడు చైతన్య. – మంజీర సుబ్బారావు పెళ్లి... అభిరామ్ లొల్లి..! సినిమాలో సంసారం అభిరామ్ (నాగార్జున) యాడ్ ఏజెన్సీలో మేనేజర్. ఆ కంపెనీ వాళ్లదే. అభిరామ్కు అమ్మాయిలన్నా, పెళ్లి అన్నా పడదు. ఆ కంపెనీలో ఓ ఉద్యోగి సుబ్బారావు. పెళ్లి కార్డుతో బాస్ ఇంటికి వెళ్లి... ‘మీ ఆశీర్వాదం కావాలి సార్’ అంటాడు. ‘ఏంటి పుట్టినరోజా?’ అని సింపుల్గా అడుగుతాడు అభిరామ్.‘పెళ్లి సార్’ మోహంలో సిగ్గు కనిపించాలనే ప్రయత్నంతో సమాధానం చెబుతాడు సుబ్బారావు. సుబ్బారావు ఏదో ఘోరమైన తప్పు చేయబోతున్నట్లు ఆశ్చర్యంగా ‘పెళ్లా...!’ అని అడుగుతాడు అభిరామ్. సుబ్బరావు మాత్రం మెల్లిగా ‘పెళ్లి సార్’ అంటాడు. ‘పెళ్లెందుకు అంటాడు’ అభిరామ్. ‘అందరూ పెళ్లి ఎప్పుడు అని అడుగుతారు, మీరేంటి సార్ ఎందుకు అని అడుతున్నారు’ అని ఆశ్యర్యంగా ముఖం పెడతాడు సుబ్బారావు. ‘అందుకే అడుగుతున్నాను ఎందుకు’? అని కాస్త అసహసంతో అంటాడు అభిరామ్. ‘భోజనానికి కష్టమైపోతోంది సార్’ అని ఏదో నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు సుబ్బారావు. ‘కుక్కును పెట్టుకో’ అని సింపుల్ చెప్తాడు అభిరామ్. ‘ఇల్లు చూసుకోవడానికి కూడా ఎవరు లేరు’ ఇంకో కన్విన్సింగ్ రీజనిస్తాడు సుబ్బారావు. ‘కుక్కను పెంచుకో’ అని కూల్ రిఫ్లై ఇస్తాడు అభిరామ్. అయినా పెళ్లంటే ఇష్టం పెళ్లి చేసుకునేవాళ్ళకు ఉండాలి కానీ, వచ్చి చూసిపోయేవాళ్ళ ఇష్టం ఎవరికి కావాలి చెప్పండీ. అలా అభిరామ్కు ఇష్టం లేకపోయినా సుబ్బారావుకి పెళ్లయిపోతుంది. మోహమాటంగా పిలిచిన పెళ్ళికి కూడా అభిరామ్ నిర్మొహమాటంగా వెళ్తాడు. విశేషం ఏంటంటే అప్పుడు కూడా సుబ్బారావుకు ఏవేవో మాటలు చెప్పి జరిగిపోయిన పెళ్లిని పెటాకులు చేయాలనే విఫలప్రయత్నం చేసి తాను సఫలం కాలేకపోతాడు. ఇక ఎంతకూ వర్కౌట్ కాక ఓ పెగ్గేసి ‘అరే.. వద్దురా... సోదరా... అరే.. పెళ్లంటే నూరేళ్ళ మంటరా... గోతిలో పడద్దురా’ అంటూ ఓ వైరాగ్య సందేశం ఇస్తాడు అభిరామ్ ‘మన్మథుడు’ సినిమాలో. పెళ్లంటే ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఉన్న అభిరామ్ చివరికి రియలైజ్ అయి ప్రేమవివాహం చేసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి.samsaaram2017@gmail.com -
రావోయి మన్మథా..
మన్మథుడు వలపుల రేడు. ఆయన బాణం తగిలితే ప్రవరాఖ్యుడు కూడా ప్రేమలో పడాల్సిందే. పొద్దస్తమానం పరుగులతోనే గడిపేసే సిటీజనుల దగ్గర మన్మథుని పప్పులు ఉడకడం లేదు. విఫలమవుతున్న వివాహబంధాలు, విడిపోతున్న జంటలే దీనికి నిదర్శనం. ఈ మన్మథనామ సంవత్సరం నుంచైనా ప్రేమానుబంధాలు వర్ధిల్లాలని కోరుకుంటూ... మన్మథుడికి వెల్కమ్ చెబుతూ... ..:: ఎస్.సత్యబాబు ‘నీకో జీతం.. నాకో జీతం.. నీదో ఉద్యోగం.. నాదో ఉద్యోగం..’ ఇలాంటి ఒప్పందాల మధ్య అనుబంధాల్లోకి యాంత్రికత అనివార్యంగా చొచ్చుకొచ్చేస్తోంది. ఉరుకుల పరుగుల నగర జీవనం ‘దగ్గరితనాన్ని’ దూరం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో మన్మథ నామ సంవత్సరం వచ్చేసింది. ఇప్పటికైనా వలపు బాణాలు విసిరే మన్మథుడికి తలొగ్గితే జంటలకు లభించేది అనురాగపూర్వక విజయాలే. దీన్నే కోరుకుంటూ నూరేళ్ల పంట మూణ్నాళ్ల ముచ్చటగా మారకూడదనుకుంటున్న వారి కోసం.. మానసిక వైద్యులు చేస్తున్న సూచనల్లో కొన్ని.. జోరుగా హుషారుగా.. దాంపత్యజీవనాన్ని రసహీనంగా మార్చే కారణాల్లో మూసధోరణి ఒకటి. పొద్దున్న లేస్తే పడుతూ లేస్తూ పరుగులు తీస్తూ సాగే జీవనం.. జీవిత భాగస్వామితో సరసాలకు, ముచ్చట్లకు అవకాశం ఇవ్వడం లేదు. ఆధునిక యుగంలో తీరిక లేని జీవనం ఎలాగూ తప్పేది కాదు. అయితే ఈ తీరిక లేనితనంలోకి జీవిత భాగస్వామితో అనుబంధాన్ని కూడా జొప్పించకుండా వీలైనంత వరకూ తప్పించాలి. దీని కోసం ప్రత్యేక సందర్భాలను, సమయాలను సృష్టించుకోవాలి. ఆయా సమయాల్లో ఇచ్చి పుచ్చుకునే అబ్బురపరిచే కానుకలు మాత్రమే కాదు.. వారాంతపు షికార్లు కూడా ఉపకరిస్తాయి. విహారయాత్రలంటే ఊటీలు, సిమ్లాలు మాత్రమే కాదండోయ్.. శివార్లలోని రిసార్ట్స్ నుంచి సిటీ చుట్టుపక్కలే ఉన్న బోలెడన్ని విహారస్థలాలు కూడా. కలిసి నడిస్తే కలదు సుఖం.. ‘ఎక్కడికి వెళ్లినా కలిసే వెళతాం. అసలు తను పక్కన లేకుంటే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది’ అని కళాకృతి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు ప్రశాంత్, రేఖలు ఒకరి గురించి ఒకరు అంటారు. ఇది అన్ని జంటలకూ అనుసరణీయం. సిటీలో విందులు, వినోదాలకు కొదవలేదు. ఎవరి స్థాయిలో వారికి ఆహ్వానాలూ అందుతుంటాయి. వీలైనంత వరకూ ఆయా పార్టీలకు జంటగా వెళ్లడం సిటీలో జరిగే మార థాన్లు, ఫన్ ఈవెంట్లలో కలిసి పాల్గొనడం దాకా దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచి పోషిస్తాయి. ఇప్పటికే ఇలా చేస్తున్న సక్సెస్ఫుల్ జంటలు ఎన్నో ఉన్నాయి సిటీలో. ఆరోగ్యం.. ఆకర్షణ.. ‘ఇంటా బయటా జంట కవులవలె అంటుకు తిరగాలోయ్..’ అన్న పాటను గుర్తు చేస్తూ జంటగా మారిన కొత్తలో ఒకరికొకరే ప్రపంచం అన్నట్టు తిరిగే యువతీయువకులు స్వల్పకాలంలోనే ఒకరంటే ఒకరు నిరాసక్తంగా మారిపోవడం.. లోపిస్తున్న ఆకర్షణ ఒక కారణం. ఆరోగ్యాన్ని దూరం చేసే అలవాట్లు, అందాన్ని మాయం చేసే వ్యసనాలు వదులుకోవడం లేదా బాగా తగ్గించాలి. ఒకరి ఆరోగ్యం పట్ల మరొకరు శ్రద్ధ చూపిస్తే అది పరస్పరం ఆకర్షణను మాత్రమే కాదు ఆప్యాయతను కూడా రెండింతలు చేస్తుంది. కలిసి రెగ్యులర్గా వ్యాయామానికి వెళ్లడం అన్యోన్యతను పెంచుతుంది. ముఖాముఖి ముచ్చట్లే.. వ్యాపారరీత్యానో, మరో లావాదేవీల కోసమో చేసే మొబైల్ చాట్లు లైఫ్పార్ట్నర్కి కూడా వర్తింపజేసేయడం యాంత్రికత పెరగడానికి మరో కారణం. అవసరాల రీత్యా చేసే సంభాషణకి, అనురాగంతో చేసే ముచ్చట్లకి మధ్య వ్యత్యాసం ఉండేలా చూసుకోవాలి. రిలేషన్ పెంచుకోవడానికి కేవలం కమ్యూనికేషన్ మీద ఆధారపడడం సరైంది కాదు. చాట్లు, మెసేజ్లు ఉన్నాయి కదాని ముఖాముఖి మాట్లాడుకోవడం తక్కువయితే అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలే ఎక్కువ. ఇటీవలి కాలంలో బంధాలు ముక్కలవ్వడానికి మొబైల్ ఫోన్లే కారణంగా పలు సర్వేలు వెల్లడిస్తున్న విషయం తెల్సిందే. ఏ మనిషికైనా అసలు సిసలు ఆనందం లభించేది మరో మనిషి సమక్షంలోనే తప్ప యంత్రాలతో కాదు. మానవ సంబంధాలు సజావుగా ఉన్నంతకాలమే సమాజం సంతోషంగా ఉంటుంది. మన్మథుడు తరహా పురాణ పాత్రల సృష్టి వెనుక మన పూర్వీకుల ఆంతర్యం అదే. పెద్దల ఆంతర్యాన్ని గౌరవిద్దాం. మనసారా మన్మథుడిని స్వాగతిద్దాం. ‘పండుగ రోజుల్లో కుటుంబీకులతో కలిసి పంచుకునే ఆనందకర క్షణాలు రొటీన్ ఫీలింగ్ని దూరం చేస్తాయి. మన రెగ్యులర్ ప్రొఫెషనల్ వర్క్ మరింత బాగా చేసేందుకు హెల్ప్ అవుతాయి’ - మోహన్, శైలజ -
గీత స్మరణం
పల్లవి : Ooh baby just give me love Ooh baby I want it now ‘‘Ooh baby‘‘ అందమైన భామలు లేత మెరుపు తీగలు (2) ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు అరె సిల్కు చుడీదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యోరామ ఈ భామ భలె ముద్దొస్తున్నాదే అయ్యోరామ అందంతో నను చంపేస్తున్నాదే ॥ ॥‘‘Ooh baby‘‘ చరణం : 1 నువ్వేనా నా కల్లోకొచ్చింది నా మనసంతా తెగ అల్లరి చేసింది ఊహల పల్లకిలో నిను ఊరేగించెయ్నా నా కమ్మని కౌగిట్లో నిను బంధించేసేయ్నా అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేయ్నా హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా ॥‘‘Ooh baby‘‘ చరణం : 2 కళ్యాణీ నచ్చిందే నీ ఓణీ నీ తోడే కోరిందే జవానీ ఎర్రని బుగ్గలకి వేసెయ్నా గాలాన్ని నీ ఒంపుల సొంపులకీ ఒక మన్మధ బాణాన్ని అరె ఎన్నో ఎన్నో అందాలున్నా ఈ లోకంలో చిన్నారీ అన్నిట్లోకి నువ్వేమిన్న కద సుకుమారీ ॥॥ చిత్రం : మన్మథుడు (2002) రచన : భువనచంద్ర సంగీతం, గానం : దేవిశ్రీ ప్రసాద్ నిర్వహణ: నాగేశ్ -
జయాపజయాలను అంచనా వేయడం మరో వంద సినిమాలు చేసినా నా వల్ల కాదు
మన్మథుడు, కింగ్, గ్రీకువీరుడు... ఇలాంటి టైటిల్స్కి అక్షరాలా సరిపోతారు అక్కినేని నాగార్జున. ఫిఫ్టీ ప్లస్లోనూ యంగ్గా కనిపిస్తున్న ఈ హ్యాండ్సమ్ హీరో ఈసారి ‘భాయ్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన చిత్రం ఇది. వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగార్జునతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ... *** ‘పగలు భాయ్.. చీకటి పడితే ప్లేబోయ్’ అని డైలాగ్ చెప్పారు.. ఇంతకీ ఆరు తర్వాత ఈ ప్లేబోయ్ ఏం చేస్తాడేంటి? (నవ్వుతూ) ఈ మధ్య ఓ ఆస్పత్రిలో షూటింగ్ చేశాం. సాయంత్రం ఆరు ఆవ్వగానే షూటింగ్కి పేకప్ చెప్పేసి, అందరం ఇంటికెళ్లే హడావిడిలో ఉన్నాం. అప్పుడు అక్కడున్న నర్సులు ‘ఏంటి సార్. ఆరయ్యింది కదా. ప్లేబోయా? అన్నారు సరదాగా. ఈ డైలాగ్ అంతలా అందరికీ రీచ్ అయ్యింది. ఇంకా ‘భాయ్’ సినిమాలో ఉన్న ఇతర పంచ్ డైలాగ్క్కూడా మంచి స్పందన లభిస్తోంది. ఇక, ఈ ప్లేబోయ్ ఏం చేస్తాడో సినిమాలో చూస్తేనే ఆసక్తికరంగా ఉంటుంది. *** ఇంతకూ ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? ఫస్టాఫ్ అంతా ప్లేబోయ్లానే కనిపిస్తాను. చాలా సరదా సరదాగా ఉంటుంది. ముఖ్యంగా ఓపెనింగ్ సీన్స్ చాలా ఇంట్రస్టింగ్గా ఉంటాయి. మాఫియా డాన్లా, హాంగ్కాంగ్లో ఓ భాయ్కి రైట్ హ్యాండ్లా, ఓ సాదా సీదా వ్యక్తిలా... మూడు రకాల గెటప్స్లో కనిపిస్తాను. *** భాయ్ అంటే డాన్ అని, అన్నయ్యా అనీ అర్థం. మరి... ఆడవాళ్లు మిమ్మల్ని అన్నయ్యా అని పిలుస్తూ రాఖీతో రెడీ అయిపోతే ఏమనిపిస్తుంది? అన్నయ్యా అని పిలిస్తే ఆనందంగానే ఉంటుంది. కానీ, ఒక్క విషయం. నేను చెల్లెలు అనుకున్నవాళ్లందరూ నన్ను అన్నయ్యా అని పిలిచి, రాఖీ కడితే చాలా చాలా ఆనందపడతా. *** ఇంతకూ ‘భాయ్’ ఏ కేటగిరీ సినిమా? మంచి కమర్షియల్ సినిమా. ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ సెంటిమెంట్సూ ఉంటాయి. యాక్షన్ వయొలెంట్గా ఉండదు. చాలా స్టయిలిష్గా ఉంటుంది. ఇది ఫలానా కేటగిరీ మూవీ అని చెప్పలేం. అన్ని వర్గాలవారు చూసి ఆనందించే విధంగా ఉంటుంది. *** ఈ 25నే విడుదల చేయాలని వెంటనే ఎందుకు నిర్ణయం తీసుకున్నట్లు? ఈ మధ్యకాలంలో మూడు, నాలుగు సినిమాలు వాయిదాలు పడటంవల్ల రిలీజ్ డేట్ విషయంలో కొంచెం సందిగ్ధం నెలకొంది. ఏ సినిమాకైనా సోలో డేట్ చాలా అవసరం. ఈ నెలాఖరున ‘క్రిష్ 3’ వస్తోంది. అది మాత్రమే కాకుండా నవంబర్ 1 నుంచి 14 వరకు బెంగళూరులో దక్షిణాది భాషా చిత్రాలను విడుదల చేయకూడదు. ప్రతి సంవత్సరం ఈ తేదీల్లో కన్నడ, హిందీ, ఇంగ్లిష్ సినిమాలు తప్ప వేరేవి విడుదల చేయకూడదనే నిబంధన పెట్టారు. ఈ కారణాల వల్ల 25 బెస్ట్ డేట్ అనుకుని, రిలీజ్ ఫిక్స్ చేశాం. *** వీరభద్రమ్ టేకింగ్ గురించి? బాగా తీశాడు. మంచి మ్యూజిక్ డెరైక్టర్, సినిమాటోగ్రాఫర్... ఇలా అందరూ మంచి టెక్నీషియన్స్ కుదిరారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అన్నిటినీ వీరభద్రమ్ సరిగ్గా వినియోగించుకున్నాడు. హిట్ సినిమా చేయాలనే తాపత్రయంతో అందరం కష్టపడి చేశాం. *** ఈ చిత్రం పాటల్లో మీకు బాగా నచ్చినవి? అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మమతా మోహన్దాస్ పాడింది. ‘రయ్య రయ్య...’ పాటను మమతాతో పాడించారు. చాలా బాగా పాడింది. ఫోన్ చేసి, అభినందించాలనుకుంటున్నా. *** ఈ మధ్య ప్రతి సినిమా పైరసీకి గురవుతోంది. ఒకవేళ డీటీహెచ్ (డెరైక్ట్ టు హోమ్) విధానం ద్వారా థియేటర్లో విడుదల చేస్తే పైరసీ తగ్గుతుం దంటారా? ఆ అవకాశం ఉంది. కానీ, ఇలా విడుదల చేయడంవల్ల థియేటర్స్లో వసూళ్లు తగ్గే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి, థియేటర్లో విడుదల చేసిన రోజునే స్మాల్ స్క్రీన్స్కి విడుదలైన సినిమాలు లేవు. హాలీవుడ్లో కూడా ‘ఐరన్మేన్’లాంటి పెద్ద సినిమాలను థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తారు. తక్కువ ఓపెనింగ్స్ వస్తాయనిపించే చిన్న సినిమాలను మాత్రమే డీటీహెచ్లో కూడా విడుదల చేస్తుంటారు. *** భవిష్యత్తులో మీరు ఈ విధానాన్ని అనుసరిస్తారా? విడుదలైన రోజునే కాదు.. మొదటి, రెండో వారం తర్వాత అయితే ఆలోచిస్తా. *** మీరు దాదాపు 80 సినిమాలకు పైగా చేశారు కాబట్టి, ఓ సినిమా జయాపజయాలను కరెక్ట్గానే అంచనా వేయగలుగుతారా? 80 కాదు.. మరో 100 సినిమాలు చేసినా సినిమా జయాపజయాలు అంచనా వేయడం నా వల్ల కాదు. జయాపజయాలను ఊహించగలిగితే అన్నీ హిట్ సినిమాలే చేసేస్తాం. నాకు తెలిసి ఇప్పటివరకు ఓ సినిమాని వంద శాతం అంచనా వేసినవాళ్లు ఎవరూ లేరు. *** ఓకే... ‘మనం’ సినిమా విషయానికొద్దాం. ఫస్ట్ లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఆ లుక్నే విడుదల చేయాలన్నది ఎవరి ఆలోచన? డెరైక్టర్ విక్రమ్కుమార్దే. సినిమా కథ చెప్పినప్పుడే ఈ ఫొటోగ్రాఫ్ గురించి చెప్పాడు. నాక్కూడా బాగా నచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తయ్యింది. డిసెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నాం. *** ఈ సినిమా మొత్తం మీరిలా కళ్లద్దాలతోనే కనిపిస్తారా? మొత్తం కాదు.. కొన్ని సన్నివేశాల్లో అలా కనిపిస్తా. *** ‘మనం’ తర్వాత చేయబోయే సినిమా? ఏమీ అనుకోలేదు. ఎందుకంటే, గత రెండేళ్లుగా విశ్రాంతి లేకుండా సినిమాలు చేస్తున్నా. అందుకని, కొంచెం కూల్గా తర్వాత సినిమాని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నా. సో.. ప్రస్తుతానికి ‘భాయ్’ ప్రమోషనల్ కార్యక్రమాలు, ‘మనం’ షూటింగ్తో బిజీగా ఉన్నాను. ఫిఫ్టీ ప్లస్లోనూ యంగ్గా కనిపిస్తున్నారు. ముడతలు మాయమవ్వడం కోసం బొటాక్స్ ఇంజక్షన్స్ ఏమైనా చేయించుకున్నారా? బొటాక్స్ ఇంజక్షన్ చేయించుకుంటే ముడతలు మాయమవ్వడం సంగతి అటుంచితే, మొహంలో ఎక్స్ప్రెషన్స్ కూడా మాయమవుతాయని నా ఫీలింగ్. ఫ్రీజ్ అయినట్లుగా కనిపిస్తాం. ఆ ఇంజక్షన్ చేయించుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. మరో పది, పదిహేనేళ్ల తర్వాత కూడా బొటాక్స్ జోలికి వెళ్లను. నాన్నగారికి ఇప్పటికీ ముడతలు ఉండవు. పళ్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో... నాన్నగారి జీన్స్ వల్ల మేం కూడా ముడతల బారిన పడమనుకుంటున్నా (నవ్వుతూ).