millions
-
హార్డ్ డ్రైవ్లో రూ.65 వేలకోట్లు!.. పదేళ్లుగా వెతుకులాట
ఏదైనా ఒక వస్తువును పోగొట్టుకున్న తరువాత.. దాని విలువ హఠాత్తుగా పెరిగితే, దాని కోసం ఎక్కడపడితే అక్కడ వెతికేస్తాం. అంతెందుకు జేబులో ఉన్న ఓ వంద రూపాయలు ఎక్కడైనా పడిపోతేనే మనం ఎక్కడెక్కడ తిరిగామో.. అక్కడంతా వెతికేస్తాం. అయితే ఓ వ్యక్తి వేలకోట్ల విలువ గలిగిన బిట్కాయిన్లు ఉన్న హార్డ్ డ్రైవ్ పోగొట్టుకున్నాడు. దాన్ని వెదకడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేశారో.. ఈ కథనంలో చూసేద్దాం.జేమ్స్ హోవెల్స్ అనే వ్యక్తి 2013లో అనుకోకుండా.. 7500 బిట్కాయిన్లు ఉన్న ఒక హార్డ్ డ్రైవ్ పోగొట్టుకున్నాడు. అయితే దాని విలువ ఇప్పుడు 771 మిలియన్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 65 వేలకోట్ల కంటే ఎక్కువ.తన హార్డ్ డ్రైవ్ స్థానిక స్థానిక ల్యాండ్ఫిల్ (డంప్యార్డ్) ప్రాంతంలో ఉంటుందని, డ్రైవ్ కోసం త్రవ్వడానికి అనుమతించమని న్యూపోర్ట్, వేల్స్ కౌన్సిల్ని ఒప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. అనుమతిస్తే.. బిట్కాయిన్లో 10% లేదా దాదాపు 77 మిలియన్లను స్థానిక కమ్యూనిటీకి విరాళంగా ఇస్తానని పేర్కొన్నాడు.హార్డ్ డ్రైవ్ను వెదకడానికి హోవెల్స్ తన ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టాడు. మొత్తం సమయాన్ని కేవలం ఆ డ్రైవ్ను వెదకడానికే కేటాయించాడు. దీనిని వెదకడంలో అతనికి సహాయం చేయడానికి నిపుణుల బృందాన్ని కూడా నియమించుకున్నాడు. అంతటితో ఆగకుండా.. హోవెల్స్ ల్యాండ్ఫిల్ను శోధించే హక్కు కోసం నగరంపై దావా వేసి 629 మిలియన్ల నష్టపరిహారం కోరాడు.హోవెల్స్ కేసు ఇటీవల న్యాయమూర్తి ముందుకు వచ్చింది. హైకోర్టులో పూర్తిస్థాయి విచారణకు రాకముందే కేసును కొట్టివేయాలని న్యూపోర్ట్ అథారిటీ ప్రయత్నిస్తోంది. ల్యాండ్ఫిల్లోకి వెళ్ళేదంతా కౌన్సిల్ యాజమాన్యంలోకి వస్తుందని చెప్పారు. తవ్వకానికి అనుమతి ఇస్తే సంఘానికి డబ్బు అందజేస్తామని ఇచ్చిన ప్రతిపాదనను.. కౌన్సిల్కు ప్రాతినిధ్యం వహిస్తున్న జేమ్స్ గౌడ్ కేసీ.. లంచం అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వేల సంవత్సరాలు పనిచేసే డైమండ్ బ్యాటరీ ఇదే..హోవెల్స్ అభ్యర్థన మేరకు ల్యాండ్ఫిల్ తవ్వకాలు జరిపితే.. పర్యావరణానికి ప్రమాదం అని అన్నారు. అంతే కాకుండా తవ్వకాలకు అనుమతిస్తే, పది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం చెత్తలో ఉన్న హార్డ్ డ్రైవ్లో డేటా ఉంటుందా? అనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. ఎవరెన్ని చెప్పినా హోవెల్స్ మాత్రం హార్డ్ డ్రైవ్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు. -
ఒక్క ఏడాదిలో 30 లక్షల మందికి కుక్కకాటు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2023 ఒక్క ఏడాదిలోనే 286 మంది కుక్కకాటుకు బలయ్యారని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. 2023లో మొత్తంగా 30 లక్షలకుపైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ మేరకు మంగళవారం(జులై 30) కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లోక్సభకు రాతపూర్వకంగా తెలిపారు. 2023లో 46లక్షల 54వేల98మందికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రేబిస్ నియంత్రణకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ రేబీస్ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.కుక్కల నియంత్రణకు స్థానిక సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేబిస్ టీకాకు నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు. -
బొగ్గు గని తవ్వకాల్లో అద్భుత ఖజానా..
అప్పుడప్పుడు తవ్వకాల్లో లభ్యమయ్యే పురాతన వస్తువులు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అమెరికాలోని నార్త్ డకోటాలో జరిపిన తవ్వకాల్లో ఒక కార్మికుడు అత్యంత పురాతన కాలానికి చెందిన అతిపెద్ద ఏనుగు దంతాన్ని కనుగొన్నాడు. పూర్వీకులు దీనిని మముత్ అని పిలిచేవారు. ఈ దంతం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాటిదని పురావస్తు పరిశోధకులు చెబుతున్నారు. ఉత్తర డకోటా నగరంలోని ఒక గనిలో జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన ఏనుగు దంతం బయటపడింది. గనిలో జరుగుతున్న పనుల్లో పాల్గొన్న ఒక కార్మికుడు దాదాపు రెండు మీటర్ల పొడవైన తవ్వకం జరిపినప్పుడు ఈ అతిపెద్ద దంతం బయటపడింది. ఇది 10 వేల నుంచి లక్ష ఏళ్ల క్రితం నాటిదని పరిశోధకులు చెబుతున్నారు. యూఎస్లోని ఉత్తర డకోటా గనులలో కొన్ని మిలియన్ టన్నుల లిగ్నైట్ బొగ్గును వెలికితీస్తారు. ఈ బొగ్గు గనిలోనే ఈ అమూల్యమైన నిధి దొరికింది. ఈ బొగ్గు గనుల్లో ఇంతకాలం భారీ యంత్రాలు ఉపయోగిస్తున్నప్పటికీ ఇప్పుడు ఇంత విలువైన ఏనుగు దంతం దొరకడంపై నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం అంటే డైనోసార్లు మనుగడ సాగించిన కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగులు భూమిపై ఉండేవని పరిశోధకులు కనుగొన్నారు. ఆ ఏనుగులను మముత్లు అని పిలిచేవారు. ఇప్పుడు నాటికాలపు ఏనుగు దంతం బయల్పడటం విశేషం. దీనిని అద్భుతమైన ఆవిష్కరణగా నిపుణులు పరిగణిస్తున్నారు. అమెరికాలోని ఉత్తర డకోటాలోని బొగ్గు గనిలో దొరికిన మముత్ ఏనుగు దంతం బరువు 22 కిలోలకు మించి ఉంది. శాస్త్రవేత్తలు మముత్ ఏనుగు దంతాన్ని తదుపరి పరిశోధన కోసం సురక్షితంగా భద్రపరిచారు. కాగా ఈ ఏనుగుదంతాన్ని వెలికితీసిన బొగ్గు గని కార్మికుడు భారీ మొత్తంలో సొమ్ము అందుకోనున్నాడనే ప్రచారం జరుగుతోంది. -
కలిసొచ్చిన పండుగ సీజన్.. అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న ఫ్లిప్కార్ట్
Flipkart The Big Billion Days: భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటివి వినియోగదారుల కోసం గొప్ప ఆఫర్స్ ప్రకటించాయి. అయితే ఈ పండుగ సీజన్ ఫ్లిప్కార్ట్కు (Flipkart) ఎలా కలిసొచ్చింది, ఎలాంటి లాభాలు వచ్చాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఫ్లిప్కార్ట్ యాన్యువల్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ 'ది బిగ్ బిలియన్ డేస్' (TBBD) అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే మిలియన్ల మంది కస్టమర్ల నుంచి గొప్ప రెస్పాన్స్ పొందింది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 10వ ఎడిషన్ కేవలం 7 రోజుల్లో 1.4 బిలియన్ కస్టమర్ సందర్శనలను సాధించింది. ఈ ఏడాది ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు & గృహోపకరణాల (Home Appliances) వంటి వాటిని కొనుగోలు చేసుకోవడానికి వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపినట్లు సమాచారం. థర్డ్ పార్టీ పార్టనర్లు, బ్యాంకుల సహకారంతో కొనుగోలుదారులందరికీ సంస్థ మంచి సువర్ణావకాశం అందించింది. మునుపటి కంటే ఎక్కువ అండమాన్, హయులియాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), చోగ్లాంసర్ (లడఖ్), కచ్ (గుజరాత్) & లోంగేవాలా (రాజస్థాన్) ప్రాంతాలకు కూడా ఫ్లిప్కార్ట్ తన సేవలను విజయవంతంగా అందించింది. మునుపటి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కంటే కూడా ఈ ఏడాది కనీవినీ ఎరుగని రెస్పాన్స్ పొందినట్లు తెలుస్తోంది. కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే 4 మిలియన్లకు పైగా ప్యాకేజీలను డెలివరీ చేయడం గమనార్హం. అమ్మకాల పరంగా గొప్ప వృద్ధిని సాధించిన ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మార్కెట్లో కొత్త శిఖరాలను అధిరోహించింది. హోమ్, ఫర్నిషింగ్ అండ్ లైఫ్స్టైల్ విభాగాల్లో ఏకంగా 3.5 లక్షల ఉత్పత్తులను అందిస్తోంది. పండుగకు ముందు కాలంతో పోలిస్తే ప్రస్తుతం అమ్మకాలు ఆరు రెట్లు ఎక్కువయ్యాయిన కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను.. బిగ్ బిలియన్ డేస్ 2023 సమయంలో సంస్థ అనేక రకాల ఉత్పత్తులను సరసమైన ధరలతో అందుబాటులోకి తెచ్చింది. ఇన్స్టంట్ సేవింగ్స్, అన్లిమిటెడ్ క్యాష్బ్యాక్ ఆఫర్ల ద్వారా కూడా అమ్మకాలు పరిగాయి. అంతే కాకుండా ఫ్లిప్కార్ట్ పే లేటర్ ద్వారా 4 రెట్లు, ప్రీ-ఫెస్టివ్ పీరియడ్తో పోలిస్తే ఈఎమ్ఐ ద్వారా 7 రెట్లు కొనుగోళ్లు పెరిగాయి. 60 శాతం మెంబర్షిప్ ఫ్లిప్కార్ట్ వీడియో కామర్స్ ఆఫర్ ఇప్పటి వరకు ఏకంగా 8 లక్షల గంటల వీక్షణను పొందినట్లు సమాచారం. ఇది గత TBBDతో పోల్చితే 16 రెట్లు ఎక్కువ. మెంబర్షిప్లలో కూడా 60 శాతం పెరుగుల రావడం గమనార్హం. అంతే కాకుండా ఈ పండుగ సీజన్లో భారతీయులు అంతర్జాతీయంగా దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్, కొలంబో, ఫుకెట్లకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నట్లు తెలిసింది. భారతదేశంలో అయితే గోవా, కొచ్చి, జైపూర్ వంటివి ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఇదీ చదవండి: 16 ఏళ్ల అమ్మాయి.. చదువుకునే వయసులో బిజినెస్.. రూ.100 కోట్ల సామ్రాజ్యం! ది బిగ్ బిలియన్ డేస్ 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భమగా ఫ్లిప్కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'కళ్యాణ్ కృష్ణమూర్తి' (Kalyan Krishnamurthy) మాట్లాడుతూ.. ఈ ఏడాది TBBD ఊహకందని ఆదరణ పొంది, అమ్మకాల్లో ఓ కొత్త మైలురాయిని చేరుకున్నట్లు తెలిపాడు. వినియోగదారులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఆన్ టైమ్ డెలివరీ చేయడానికి ఏకంగా ఒక లక్ష ఉద్యోగులను నియమించుకున్నట్లు వెల్లడించాడు. రానున్న రోజుల్లో సంస్థ మరిన్ని విజయాలు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కత్రినా క్రేజే వేరు.. ఏకంగా ఫేస్ బుక్ సీఈవోను వెనక్కి నెట్టి!!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో విక్కీ కౌశల్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ఉన్న సినీ తారల్లో కత్రినా ఎప్పుడు ముందు వరసలోనే ఉంటారు. ఇన్స్టాలో ఆమెకు 76.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా వాట్సాప్ సైతం ఛానెల్స్ సదుపాయం ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ కూడా కత్రినా కైఫ్ 14 ఫాలోవర్స్లో ముందు వరుసలో నిలిచింది. ఈ విషయంలో ఏకంగా ఫేస్బుక్ దిగ్గజం మార్క్ జుకర్ బర్గ్, ప్రముఖ రాపర్ బ్యాడ్ బన్నీ కంటే ఎక్కువ ఫాలోవర్స్ను కలిగి ఉంది. (ఇది చదవండి: కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ను నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్) ఇప్పటివరకు వాట్సాప్ ఛానెల్కు అత్యధికంగా 23 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రముఖ ఓటీటీ యాప్ నెట్ఫ్లిక్స్ 16.8 మిలియన్లతో రెండోస్థానంలో ఉంది. రియల్ మాడ్రిడ్ అధికారిక ఛానెల్ 14.4 మిలియన్లతో మూడోస్థానంలో నిలవగా.. కత్రినా తన 14.2 మిలియన్ ఫాలోవర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. రాపర్ బ్యాడ్ బన్నీ 12.6 మిలియన్ల ఫాలోవర్లతో 5వ స్థానం, మార్క్ జుకర్బర్గ్ను 9.2 మిలియన్లతో కొనసాగుతున్నారు. కత్రినా కైఫ్ సెప్టెంబర్ 13న వాట్సాప్ ఛానెల్ను ప్రారంభించింది. కొత్త ఛానెల్కు స్వాగతం చెబుతూ తన ఫోటోలు కూడా పంచుకుంది. సెలబ్రీటీల పరంగా చూస్తే కత్రినా కైఫ్ టాప్లో ఉంది. (ఇది చదవండి: సల్మాన్ ఖాన్ టైగర్ సందేశం వచ్చేసింది) కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్తో కలిసి టైగర్-3 చిత్రంలో నటిస్తోంది. యష్ రాజ్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. గతంలో సల్మాన్ఖాన్, కత్రినా కైఫ్ జంటగా ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాల్లో నటించారు. ఈ ప్రాంఛైజీలో భాగంగా వస్తున్న చిత్రమే టైగర్-3. నవంబరు 10న దిపావళికి ఈ చిత్రం విడుదల అవుతుందని టైగర్ మేకర్స్ ప్రకటించారు. -
సైక్లింగ్తో స్ఫూర్తి నింపుతూ...
సాక్షి, వరంగల్: ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదని అందరూ అంటారు. కానీ కొందరు మాత్రమే ఆరోగ్యంకోసం తపిస్తారు. ఆదాయం వేటలోపడి ఆరోగ్యాన్ని మరచిపోతారు. అయితే యుక్త వయసులోనే రంజిత్ కుమార్ దవేరాకు ఆరోగ్యం ఎంత విలువైనదో తెలియజెప్పింది కరోనా... మార్చిన మహమ్మారి... కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఆ మహమ్మారి బారిన పడిన నాన్న రాములే కాదు...కళ్లెదుటే ఎంతో మంది చనిపోవడం వరంగల్ గిర్మాజీపేటకు చెందిన ఈ డీఫార్మసీ గ్రాడ్యుయేట్ను కదిలించింది. సరైన శారీరక శ్రమ లేక వ్యాధినిరోధకత కోల్పోయి ఈ మహమ్మారికి బలయ్యారని ఆయనకు అవగతమైంది. దీంతో ప్రతిఒక్కరిలో ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలన్న ఆలోచన కలిగించడమే లక్ష్యంగా సైక్లింగ్ వైపు రంజిత్ అడుగులు పడ్డాయి. అలా 2021 ఏప్రిల్ 5న మొదలైన ‘రంజిత్ ఆన్ వీల్స్’సైక్లింగ్....దశలవారీగా రాష్ట్రాలు దాటింది. ఇప్పుడు ఏకంగా ఖండాంతరాలు దాటింది. ఏ ఉద్దేశంతో ఈ సైక్లింగ్ మొదలెట్టాడో... ఇప్పుడు అదీ కార్యాచరణ రూపంలో కనిపించడం ఎంతో సంతృప్తిగా ఉందని అంటున్నాడు రంజిత్. దాదాపు 500 మంది వరకు తనను చూసి స్ఫూర్తి పొందారని మలేసియాలో సైక్లింగ్ కొనసాగిస్తున్న రంజిత్ ‘సాక్షి’కి తెలిపారు. తనను ఆగస్టు 15న మలేసియా ఇండియన్ హైకమిషన్ సత్కరించడం సంతోషం కలిగించిందన్నాడు. అలా మొదలైంది... 2021 ఏప్రిల్ ఐదున హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మొదలైన సైక్లింగ్...దాదాపు 3,000 కిలోమీటర్లు తిరిగి హైదరాబాద్లోనే జూన్ 14న ముగిసింది. మళ్లీ జూలై 17న ప్రారంభించి హైదరాబాద్ నుంచి లడఖ్ వరకు సైక్లింగ్ చేశాడు. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్, లదాఖ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తిరిగి అక్టోబర్ 22న హైదరాబాద్లో ముగిసింది. ఈ సమయంలోనే రంజిత్ సినీ హీరో సోనూసూద్ను కలిశాడు. ఆ తరువాత హైదరాబాద్ నుంచి చైనా సరిహద్దు వరకు పెంపుడు శునకం భగీరతో కలిసి రంజిత్ సైక్లింగ్ చేశాడు. విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ప్రదేశ్,అస్సాం, వెస్ట్బెంగాల్, సిక్కింల నుంచి నథులాపాస్లో చైనా బార్డర్ వరకు వెళ్లాడు. గత 2022 ఫిబ్రవరి 8న మొదలైన ఈ ఆరువేల కిలోమీటర్ల యాత్ర జూలై 25న ముగిసింది. ఆ్రస్టేలియా వైపుగా... హైదరాబాద్ నుంచి వియత్నాంకు రోడ్డు మార్గాన వెళ్లే అవకాశం లేకపోవడంతో 2023 మే ఐదున శంషాబాద్ విమానాశ్రయంలో సైకిల్ ప్యాక్ చేసుకొని వియత్నాం వెళ్లాడు. అక్కడ హానోయ్ సిటీ నుంచి హోచి మిన్హ్ వరకు దాదాపు మూడు వేల కిలోమీటర్లు సైక్లింగ్ చేసి, ఆ తర్వాత కాంబోడియాలోకి ప్రవేశించి 900 కిలోమీటర్లు, థాయ్లాండ్లో 2,200 కిలోమీటర్లు, మలేసియాలో 400 కిలోమీటర్లు దాటి ప్రస్తుతం కౌలంలంపూర్కు చేరుకున్నాడు. ఆ తర్వాత సింగపూర్, ఇండోనేసియా, జకార్తాకు, అక్కడి నుంచి ఆ్రస్టేలియాకు విమానం ద్వారా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేస్తాడు రంజిత్. 2021 ఏప్రిల్ ఐదు నుంచి ఇప్పటివరకు 22 వేల కిలోమీటర్ల మార్క్ చేరుకున్నాడు. ఆసియా, ఆ్రస్టేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని వెల్లడించాడు. సోషల్ మీడియాతో మరింత క్రేజ్ సైక్లింగ్ చేస్తున్న సమయంలో రంజిత్ తీస్తున్న వీడియోలు, ఫొటోలు తనకు సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఫాలోవర్స్ను తెస్తున్నాయి. ‘రంజిత్ ఆన్ వీల్స్’ఫేస్బుక్ పేజీలో 40,000 మంది, ఇన్స్టాగ్రామ్లో 3,15,000 మంది, యూట్యూబ్లో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా సైక్లింగ్ చేస్తూనే...ఇంకోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా రంజిత్ ఎంతో మందిని చైతన్యవంతం చేస్తున్నారు. -
ట్విటర్ను షేక్ చేస్తున్న మెటా కొత్త యాప్! గంటల వ్యవధిలో..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్'కి పోటీగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' ఓ కొత్త యాప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. 'థ్రెడ్స్' (Threads) పేరుతో విడుదలైన ఈ యాప్ ఇటీవలే అందుబాటులో వచ్చింది. దీనిని ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఉపయోగించవచ్చు. ఈ లేటెస్ట్ యాప్కు అతి తక్కువ సమయంలో కనీవినీ ఎరుగని రీతితో స్పందన లభిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లక్షలు దాటుతున్న యూజర్లు.. నివేదికల ప్రకారం.. థ్రెడ్స్ యాప్ విడుదలైన కేవలం 2 గంటల్లో 20 లక్షల మంది, 4 గంటల్లో 50 లక్షల మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఈ విషయాన్నీ మెటా సీఈఓ 'మార్క్ జుకర్బర్గ్' స్వయంగా వెల్లడించారు. ట్విటర్ మాదిరిగా ఉండే ఫీచర్స్ కలిగిన ఈ మెటా కొత్త యాప్ ఇన్స్టాగ్రామ్కు అనుసంధానంగా ఉంటుంది. కావున ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్ కొనసాగించొచ్చు. పరిస్థితులను చూస్తుంటే థ్రెడ్స్ యాప్ ఖాతాదారుల సంఖ్య త్వరలోనే ట్విటర్ను అధిగమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇన్స్టాలో ఫాలో అవుతున్న అకౌంట్స్ కొత్త యాప్లోనూ అనుసరించే అవకాశం ఉంది. కావున తప్పకుండా ఎక్కువమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ఫోటో లైక్, షేర్ వంటి సౌలబ్యాన్ని కూడా అందిస్తుంది. టెక్స్ట్ మెసేజ్లు చేసుకోవాలనుకునే వారికి ఇది తప్పకుండా కొత్త అనుభవాన్ని అందిస్తుందని, ఆధునిక ప్రపంచంలో ఇలాంటి ఇలాంటి యాప్ అవసరం చాలా ఉందని మెటా చీప్ వెల్లడించారు. (ఇదీ చదవండి: రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..) pic.twitter.com/MbMxUWiQgp — Mark Zuckerberg (@finkd) July 6, 2023 ఎలాన్ మస్క్ స్పందన.. మెటా థ్రెడ్స్ యాప్ మీద ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఇది పూర్తిగా Ctrl + C + V ట్విటర్ కాపీ పేస్ట్ అని వ్యంగ్యంగా అన్నాడు. దీనికి స్పందిస్తూ ఒక నవ్వుతున్న ఎమోజీని ఎలాన్ మస్క్ పోస్ట్ చేసాడు. అయితే జుకర్బర్గ్ కొత్త యాప్ ప్రారంభించిన సందర్భంగా 11 సంవత్సరాల తరువాత తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇందులో ఇద్దరు స్పైడర్ మ్యాన్ ఫోటోలు ఉండటం చూడవచ్చు. ఎలాన్ మస్క్ను ఉద్దేశించి జుకర్బర్గ్ చేసిన పోస్ట్ ఇది చాలామంది భావిస్తున్నారు. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) 😂 — Elon Musk (@elonmusk) July 6, 2023 -
యూట్యూబర్ అదితి అగర్వాల్ సక్సెస్ జర్నీ..మీరు ఫిదా!
సాక్షి, ముంబై: ఇటీవలి కాలంలో దాదాపు ప్రతీ ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందిఅనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఔత్సాహిక టీనేజర్లు,యువభారతం తమ టాలెంట్ను నిరూపించుకునేందుకు యూట్యూబ్ను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు వంటలు, చిట్కాలు, యోగాలు, కిచెన్ గార్డెనింగ్ దగ్గర్నించి, బిజినెస్, రాజకీయాలు ఇలా పలు కేటగిరీల్లో సక్సెస్ఫుల్ యూటూబర్లుగా లక్షలు, కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఢిల్లీకి చెందిన భువన్ బామ్ నుండి ముంబైకి చెందిన ప్రజక్తా కోలి వరకు అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. అలాంటి వారిలో ఒకరు యూట్యూబర్ అదితి అగర్వాల్. అద్దె ఇంట్లో మొదలు పెట్టిన ప్రయాణంలో ఇపుడు సొంత ఫ్లాట్తో పాటు దాదాపు 70 లక్షల మంది మద్దతుతో ఈ స్థాయికి చేరడం వెనుక ఏళ్ల కష్టం ఉంది. యూట్యూబ్లో క్రాఫ్టర్ అదితిగా దూసుకుపోతోందిఅదితి అగర్వాల్. ప్రయాగ్రాజ్కు చెందిన అదితి ప్రయాగ్రాజ్లోని బాలికల ఉన్నత పాఠశాలలో తన విద్యను పూర్తి చేశాక అలహాబాద్ యూనివర్శిటీ నుండి డిగ్రీని చేసింది. (చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!) అదితి ప్రయాణం ఎలా మొదలైంది? ఒక విధంగా చెప్పాలంటే అదితి ప్రయాణం ఎనిమిదో తరగతిలో మొదలైంది. ఊహాత్మకంగా, ఆకర్షణీయంగా కార్డులు తయారు చేయడం అదితికి చాలా ఇష్టం. అలా ఎనిమిదో తరగతిలో ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఆమె ఓ కార్డును రూపొందించింది. అది చూసిన టీచర్లంతా ఫిదా అయిపోయారు. అక్కడనుంచి ప్రేరణకు తోడు 11వ తరగతిలో, అదితికి కార్డ్ ఆర్డర్ వచ్చింది. దానికి ప్రతిఫలంగా తొలి సంపాదనగా 300 రూపా యలుఆర్జించింది. ఇది ఇలా ఉండగా, అదితి తన 12వ తరగతిలో NIFT పరీక్షకు హాజరై 205 మార్కులు సాధించింది, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కళాశాలలో చేరలేదు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) దీంతో తన స్పెషల్ ఇంట్రస్ట్ గిప్ట్స్, కార్డుల మేకింగ్లో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో సోషల్ మీడియాను ఉపయోగించుకుంది. 2015లో ఫేస్బుక్లో అదితి కార్డ్ జోన్ పేజీని ప్రారంభించింది. ఆ మరుసటి రోజే ఆమెకు 800 రూపాయల ఆర్డర్ వచ్చింది. తానే స్వయంగా కార్డులను డెలివరీ చేసింది. ఈ ప్రయాణం అంతఈజీగా ఏమీ సాగలేదు. కానీ పట్టువదలకుండా తన వంతు ప్రయత్నం చేస్తూ పోయింది అదితి. 2017లో తన యూట్యూబ్ ఛానెల్ని ప్రారంభించింది. గ్రాడ్యుయేషన్ చేస్తూనే ప్రతిరోజూ ఆమె ఒక వీడియోను అప్లోడ్ చేసేది. సోదరి సాయంతో వీడియోలను రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. మదర్స్ డే , ఫాదర్స్ డే ఇలా ఏ అకేషన్ను వదులుకోలేదు. రకారకాల గిఫ్ట్స్, కార్డ్లను ఆన్లైన్లో విక్రయించడంతో అదితి వీడియోలను అప్లోడ్ చేసేది. అలా కార్డ్ మేకింగ్ వీడియోను వైరల్ అయింది. దాదాపు 2 లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. దీంతో మరింత పాపులారీటి పెరిగింది. ఫలితంగా 2018లో లక్షమార్క్ను దాటిన అదితి ఛానెల్ సబ్స్క్రైబర్లు 2020 నాటికి 2.60 లక్షలకు చేరుకుంది. ఈ సక్సెస్తో 30 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉన్న తన ఫ్యామిలీకి అదితి 2020లో లక్నోలో రెండు పడకగదుల ఫ్లాట్ని కొనుగోలు చేసింది. ఆమె తండ్రి ఒక ప్రైవేట్ ఉద్యోగి. ఈలోపు కరోనా రావడంతో 2021లో లక్నోకి మకాం మార్చింది. అదితి ఛానెల్పై కోవిడ్-19 ప్రభావం కరోనా సమయంలో, అదితి ఛానెల్ కంటెంట్కు ఆదరణ కాస్త తగ్గింది. దీంతో 2.60 లక్షల మంది సభ్యులు 2.54 లక్షలకు పడిపోయారు. ఈ సమయంలో కాస్త నిరాశ పడినా, ఆ తర్వాత అదితి తన తల్లి సపోర్ట్తో ప్రతిరోజూ వీడియోలు అప్లోడ్ చేయాలని నిర్ణయించుకుంది. చివరికి వీడియో ఒకటి వైరల్ కావడంతో కేవలం 15 రోజుల్లో సబ్స్క్రైబర్లు 10 లక్షల మంది చేరారు. ప్రస్తుతం అదితి యూట్యూబ్ ఛానెల్లో దాదాపు 7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లుండటం విశేషం. ఈ రోజు సంపాదన 6 అంకెలలో. అదితికి ఇన్స్టాగ్రామ్లో 5.9 లక్షల మంది, ఫేస్బుక్లో 2.90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రేసు గుర్రంలా పరిగెట్టాల్సిందే యూట్యూబర్ కావాలనుకునే వారికి టిప్స్ ఇస్తూ..సక్సెస్ రావాలంటే లాంగ్ రేసు తప్పదని, చాలామందికి సడెన్గా సక్సెస్ వచ్చినా మాయమైపోతుందని, దాన్ని నిలుపు కోవడం ముఖ్యమని సూచిస్తుంది. అందుకే రేసు గుర్రంలా మారితే గొప్ప విజయాన్ని అందుకోలేమని చెబుతుంది అదితి. తనకు కూడా సక్సెస్ రావడానికి ఆరేళ్లు పట్టిందంటూ తన జర్నీని గుర్తు చేసుకుంది. (సర్కార్ కొలువుకు గుడ్బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) YouTube ప్రశంసలు అనేక ఈవెంట్లకు ఆహ్వానం అదితి విజయాన్ని యూట్యూబ్ కూడా ప్రశంసించింది. DIY ఈవెంట్కి ఆహ్వానాన్ని అందుకుంది. ఇంకా మెటా అనేక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం వచ్చింది. -
దళపతి విజయ్.. థియేటర్లే కాదు.. సోషల్ మీడియా కూడా షేక్!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ ఆయనకు భారీసంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా క్రేజ్ సంపాదించుకున్న హీరో దళపతి విజయ్. ఇటీవలే వారసుడు(వారీసు) మూవీతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ప్రస్తుతం సెలబ్రిటీలు సోషల్ మీడియాను విరివిగా వాడేస్తున్నారు. తమ అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాతో టచ్లో ఉంటున్నారు. అయితే ప్రస్తుతం సినీతారలు ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటివరకు ఆయనకు ఇన్స్టాలో ఖాతా లేదంటే విచిత్రంగా ఉంది కదూ. అవునండీ తాజాగా దళపతి విజయ్ తన ఇన్స్టా ఖాతాను తెరిచారు. ఇంకేముంది ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. విజయ్ ఖాతా తెరిచిన 24 గంటల్లోనే ఏకంగా 4.6 మిలియన్ల ఫాలోవర్లు వచ్చేశారు. ఖాతా ప్రారంభించిన 99 నిమిషాల్లో 1 మిలియన్ల ఫాలోవర్స్ చేరిన తొలి ఇండియన్గా విజయ్ నిలిచారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ విషయంలో విజయ్ మూడోస్థానం దక్కించుకున్నారు. తొలి రెండు స్థానాల్లో బీటీఎస్ వీ(43 నిమిషాలు), ఎంజెలీనా జోలీ(59 నిమిషాలు) ఉన్నారు. దీంతో నెటిజన్స్ దళపతి విజయ్ అంటూ ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తున్నారు. అంతకుముందు కేవలం 15 గంటల్లో 3.9 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. విజయ్ ఇన్స్టాలో ఎంట్రీ ఇస్తూ ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఇన్స్టాలో రాస్తూ.. 'హలో నంబా అండ్ నంబిస్' వెల్కమ్ సందేశం ఇచ్చారు. కాగా.. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘లియో’ షూటింగ్లో ఉన్నారు. గతంలో ట్విటర్ ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్న విజయ్, కొంతకాలం విరామం తీసుకున్నాడు. దళపతికి ఇప్పటికే ఫేస్బుక్లో 7.8 మిలియన్లు, ట్విట్టర్లో 4.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Vijay (@actorvijay) -
వామ్మో.. లియోనల్ మెస్సీ ఆస్తుల చిట్టా వింటే ఆశ్చర్యపోవాల్సిందే!
మూడున్నర దశాబ్ధాల అర్జెంటీనా నిరీక్షణ ఫలించింది. ఆదివారం అంత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 4-2 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ను గెలుచుకుంది. జగజ్జేతగా మెస్సీ బృందం నిలిచింది. అలాంటి ఫుట్బాల్ మైదానంలో మెస్సీ కొదమ సింహంలా పోటీ పడుతుంటే స్టేడియంలో ప్రేక్షకులే కాదు, ప్రపంచం మొత్తాన్ని ఉగిపోయేలా చేసింది. అలాంటి ఫుట్బాల్ లెజెండ్లో వే(ఆ)టగాడే కాదు ఓ మంచి బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నాడు. ఫోర్బ్స్ కథనం ప్రకారం.. ►మెస్సీ గతేడాది ఆశ్చర్యంగా 75 మిలియన్లు సంపాదించాడు. ఈ సంపాదన భూమ్మిద ఉన్న ఇతర ఆటగాళ్ల కంటే ఎక్కువ ►ఫుట్ బాల్ టీమ్ పారిస్ సెయింట్-జర్మైన్ ఎఫ్సీ ఇచ్చే జీతం మాత్రమే సంవత్సరానికి 35 మిలియన్లు. అంటే మెస్సీ వారానికి 738,000 డాలర్లు , రోజుకు 105,000 , గంటకు 8,790 సంపాదిస్తారు. ►గత వేసవిలో అర్జెంటీనా ఫ్రెంచ్ జట్టు కోసం సైన్ చేసిన మెస్సీ ఏకంగా 25 మిలియన్లు సంపాదించారు. రోజర్ ఫెదర్తో సమానంగా ►గతేడాది మెస్సీ ఆఫ్ ఫీల్డ్ సంపాదన 55 మిలియన్లు ఉండగా..టెన్నిస్ ఐకాన్ రోజర్ ఫెదరర్, ఎన్బీఏ సూపర్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ మాత్రమే ఎక్కువ సంపాదించిన వారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ►క్రిప్టోకరెన్సీ ఫ్యాన్ టోకెన్ ప్లాట్ఫారమ్ సోషియోస్తో సంవత్సరానికి 20 మిలియన్ల భాగస్వామ్యంతో పాటు, 35 ఏళ్ల ఎండార్స్మెంట్ పోర్ట్ఫోలియోలో అడిడాస్, బడ్వైజర్,పెప్సికోతో ఒప్పందాలు ఉన్నాయి. ►గత జూన్లో, హార్డ్ రాక్ ఇంటర్నేషనల్ మొట్టమొదటి అథ్లెట్ బ్రాండ్ అంబాసిడర్గా అవతరించాడు. 1 బిలియన్ కంటే ఎక్కువే ఫోర్బ్స్ ప్రకారం, మెస్సీ ఆటగాడిగా, ఇతర బిజినెస్లలో రాణిస్తూ 1.15 బిలియన్ల కంటే ఎక్కువ సంపాదించారు. ప్రస్తుతం లెబ్రాన్ జేమ్స్, క్రిస్టియానో రొనాల్డో, టైగర్ వుడ్స్ మాత్రమే సంపాదనలో ముందంజలో ఉన్నారు. పైన పేర్కొన్న వారి కంటే రోజర్ ఫెదరర్, ఫ్లాయిడ్ మేవెదర్ మాత్రమే కెరీర్ సంపాదనలో 1 బిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ సంపాదించారు. కార్లంటే మహా ఇష్టం మెస్సీ సంపాదనలో సగ భాగం కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు మెస్సీ వద్ద 2 మిలియన్ల ధర పలికే పగని జోండా ట్రైకలర్, ఫెరారీ ఎఫ్4 30 స్పైడర్, డాడ్జ్ ఛార్జర్ ఎస్ఆర్టీ8, మసెరటి గ్రాన్ టురిస్మో వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. 2016 అర్జెంటీనాలో 37 మిలియన్లకు 1957 ఫెరారీ 335 స్పోర్ట్ స్పైడర్ స్కాగ్లియెట్టి అనే ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు పుకారు వచ్చింది. అయితే, ఇదే నా కొత్త కారు అంటూ బొమ్మ కారును పట్టుకొని ఆ పుకార్లకు చెక్ పెట్టారు. విలాసవంత మైన భవనాలు మెస్సీ ఆస్తులలో అత్యంత విలాసవంతమైనది బార్సిలోనా శివార్లలో 7 మిలియన్ల భవనం. నో-ఫ్లై జోన్ సబర్బ్లో ఉన్న భవనంలో స్విమ్మింగ్ పూల్, ఇండోర్ జిమ్, థియేటర్, స్పా ఉన్నాయి. ఫుట్బాల్ పిచ్ కూడా మెస్సీకి ఇంద్ర భవనాన్ని తలపించాలే ఎకో-హౌస్ ఉంది. అర్జెంటీనాలోని తన సొంత పట్టణం రోసారియోలో ఒక భవనం, ఫ్లోరిడాలోని సెయింట్ ఐల్స్ బీచ్లోని ఒక విలాసవంతమైన కండోమినియంలు ఉన్నాయి. ఇందుకోసం గతేడాది 7.3 మిలియన్లు చెల్లించాడు. 2017 నుండి మెజెస్టిక్ హోటల్ గ్రూప్ నిర్వహించే ఇబిజా, మజోర్కా, బార్సిలోనాలో రిసార్ట్లతో పాటు , ఎంఐఎం పేరుతో ఉన్న హోటల్ చైన్లు సైతం మెస్సీకి చెందినవే. 2021లో మెస్సీ వింటర్ సీజన్లో విడిది కోసం అరన్ వ్యాలీలో పైరినీస్ నడిబొడ్డున రిసార్ట్ను ప్రారంభించారు. ఫోర్బ్స్ ప్రకారం..ఫోర్ స్టార్ హోటల్లో 141 గదులు ఉన్నాయి. స్పా, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ సెంటర్, మౌంటెన్ గైడ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. బాల్కనీ పెద్దగా ఉందని మెస్సీ 2017లో 35 మిలియన్లు పెట్టి ఓ భవనాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆ భవనంలో బాల్కనీ పెద్దగా ఉందని.. మొత్తాన్ని కూల్చేయించారు. కారణంగా బాల్కనీలను తీసివేయడానికి, తగ్గించడానికి ఏదైనా ప్రయత్నం చేసినా హోటల్ కూలిపోయే అవకాశం ఉంది. అందుకే ఆ సమస్యకు పరిష్కారం చూపించలేక మొత్తం పడగొట్టాల్సి వచ్చింది 15 మిలియన్ల ప్రైవేట్ జెట్ మెస్సీకి గల్ఫ్స్ట్రీమ్ వీ అనే ప్రైవేట్ ఉంది. అందులో రెండు కిచెన్లు, బాత్రూమ్లు ఉన్నాయి. గరిష్టంగా పదహారు మంది ప్రయాణికులు సేద తీరే సౌకర్యాలు ఉన్నాయి. దానంలో కలియుగ కర్ణుడు 2007లో యునిసెఫ్ భాగస్వామ్యంతో లియోనెల్ మెస్సీ ఫౌండేషన్ ప్రారంభమైంది.ఆ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో బలహీనంగా ఉన్న పిల్లలకు సహాయం చేస్తుంది. యునిసెఫ్ ప్రకారం..2017లో మెస్సీ సిరియాలో 1,600 మంది అనాథ పిల్లలకు తరగతి గదులను నిర్మించడంలో ఫౌండేషన్కు సహాయం చేయడానికి తన సొంత డబ్బును విరాళంగా ఇచ్చారు. 2019లో కెన్యా పౌరులకు ఆహారం, నీటిని అందించడానికి ఫౌండేషన్ $218,000 విరాళంగా అందించింది. చివరిగా కండోమినియం అంటే? అమ్మకం కోసం ఒక పెద్ద ఆస్తిని ఒకే యూనిట్లుగా విభజించినప్పుడు దానిని కండోమినియం కాంప్లెక్స్గా సూచిస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పోలీసుల అకౌంట్లోకి వచ్చిపడుతున్న కోట్ల డబ్బు...టెన్షన్లో అధికారులు
ఒక పోలీస్ అకౌంట్లో 10 కోట్లు క్రెడిట్ అయ్యాయి. దీంతో అతను ఒక్కసారిగా రాత్రికి రాత్రే కోటిశ్వరుడిగా మారిపోయాడు. ఈ ఘటన పాకిస్తాన్లోని కరాచీలో చోటు చేసుకుంది. ఒక పోలీస్ అధికారికి తన జీతంతో పాటుగా సుమారు రూ. 10 కోట్లు అకౌంట్లో జమ అయ్యాయి. అయితే బ్యాంకు వాళ్లు ఫోన్ చేసి చెప్పేంత వరకు తనకు ఈ విషయం తెలియలేదని సదరు పోలీసు అధికారి చెబుతున్నాడు. దీంతో అతని అకౌంట్ని బ్లాక్ చేసి ఈ డబ్బు ఎలా క్రెడిట్ అయ్యిందని దానిపై దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. అచ్చం సదరు పోలీస్లానే పాక్లోని లర్కానా ప్రాంతంలోనిమరో ముగ్గురు పోలీస్ అధికారుల అకౌంట్లోకి కూడా రూ. 5 కోట్లు చొప్పున క్రెడిట్ అయినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇంత మొతంలో డబ్బు ఎలా ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. (చదవండి: బ్రేక్ ఇవ్వండి..ఎవరు ఇడియట్స్ అనేది తేలుద్దాం: బైడెన్ ఫైర్) -
ముప్పును తగ్గించే కొత్త ఉప్పు.. లక్షల ప్రాణాలకు రక్ష!
తినే ఉప్పు.. శాస్త్రీయ నామం సోడియం క్లోరైడ్ ఎక్కువైతే ముందు రక్తపోటు.. జాగ్రత్తలేవీ తీసుకోకపోతే.. కొంత కాలం తరువాత గుండెజబ్బులు, గుండెపోటు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. అనేక శాస్త్ర పరిశోధనలు ఇప్పటికే తేల్చి చెప్పాయి ఈ విషయాన్ని. కానీ మనకే కాదు.. ప్రపంచం మొత్తమ్మీద ఉప్పులేని వంటకం తినడం దాదాపు ఎవరికీ ఇష్టం లేదు. మరి ఏం చేయాలి? ఉప్పులో సోడియం క్లోరైడ్ తగ్గించి.. పొటాషియం క్లోరైడ్ పెంచితే సరి అంటున్నారు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియా, చైనాలతోపాటు భారత్లోనూ కేంద్రాలున్న ఈ స్వతంత్ర వైద్య పరిశోధన సంస్థ ఇటీవలే ఒక భారీస్థాయి అధ్యయనం ఒకదాన్ని నిర్వహించింది. ఉప్పులో సాపేక్షంగా పొటాషియం క్లోరైడ్ను ఎక్కువ చేసి ఇవ్వడం వల్ల దుష్ప్రభావాలేవీ ఉండవని నిర్ధారించింది. అంతేకాదు.. ఈ కొత్త రకం ఉప్పును తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు, అకాల మరణం వంటివి కొంతమేరకు తగ్గుతాయని కూడా ఈ పరిశోధన చెబుతోంది. -సాక్షి, హైదరాబాద్ ప్రాణాలకు రక్ష! కొత్త రకం ఉప్పును అందరూ వాడటం మొదలుపెడితే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చునని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త బ్రూస్ నీల్ చెబుతున్నారు. అవసరానికి మించి ఉప్పు తినడం ఇప్పుడు అన్నిచోట్ల ఎక్కువ అవుతోందని, ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రత్యామ్నాయాల (సైంధవ లవణం వంటివి)ను ఉపయోగించడం ఖరీదైన వ్యవహారం అవుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సోడియం క్లోరైడ్ తక్కువగా, పొటాషియం క్లోరైడ్ ఎక్కువగా ఉన్న ఉప్పును తయారు చేసి, పంపిణీ చేయడంతోపాటు, వాడకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందించడం ఎంతైనా అవసరమని, పైగా ఈ కొత్త రకం ఉప్పు ఖరీదు తక్కువేనని వివరించారు. తీవ్రమైన మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిని మినహాయించి మిగిలిన వాళ్లు ఎవరైనా ఈ కొత్తరకం ఉప్పును వాడవచ్చునని చెప్పారు. ఇదీ పరిశోధన... ప్రత్యామ్నాయ ఉప్పు ప్రభావాన్ని, సమర్థతను అంచనా వేసేందుకు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ చైనాలో దాదాపు 21 వేల మందిపై పరిశోధన నిర్వహించింది, గుండెపోటు లేదా అదుపులో లేనంత ఎక్కువ రక్తపోటు ఉన్న వారిని దాదాపు 600 గ్రామాల నుంచి ఎంపిక చేసింది. 2014 ఏప్రిల్లో మొదలుపెట్టి 2015 జనవరి వరకూ అంటే దాదాపు తొమ్మిది నెలలపాటు వీరిలో కొందరికి ప్రత్యామ్నాయ ఉప్పు మరికొందరికి సాధారణ ఉప్పు అందించింది. ఒక్కో వ్యక్తికి రోజుకు 20 గ్రాముల చొప్పున ఈ ప్రత్యామ్నాయ ఉప్పును అందించి వంట, నిల్వ (ఊరగాయ లాంటివి)లకు వాడేలా జాగ్రత్తలు తీసుకుంది. ఆ తరువాత అంటే 2015 నుంచి ఐదేళ్లపాటు ఈ గ్రామాల ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ వచ్చింది. ఐదేళ్ల కాలంలో మూడు వేల మంది గుండెపోటుకు గురయ్యారు. అయితే ప్రత్యామ్నాయ ఉప్పును తీసుకున్న వారిలో ఈ ప్రమాదం 14 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు తేలింది. గుండెకు సంబంధించిన సమస్యల విషయానికి వస్తే 13 శాతం తగ్గుదల నమోదు కాగా... అకాల మృత్యువు బారిన పడే అవకాశం 12 శాతం వరకూ తగ్గింది. చదవండి: హర్ష్ గోయెంకా ఫన్నీ వీడియో, లక్కీ ఫెలో అంటున్న నెటిజన్లు సిద్దిపేటలోనూ పరిశోధన ప్రత్యామ్నాయ ఉప్పును వాడటం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుందనేందుకు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ భారత్లో జరిపిన ఒక పరిశోధన తార్కాణంగా నిలుస్తోంది. సుమారు ఆరు నెలల క్రితం వెలువడ్డ ఈ పరిశోధన ఫలితాల ప్రకారం.. ప్రత్యామ్నాయ ఉప్పు వాడిన వారిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గింది. తెలంగాణలోని సిద్దిపేట ప్రాంతంలో తాము 502 మందిపై ఈ పరిశోధన నిర్వహించామని వీరిలో కొంతమందికి 70 శాతం సోడియం క్లోరైడ్, 30 శాతం పొటాషియం క్లోరైడ్ల మిశ్రమమైన ప్రత్యామ్నాయ ఉప్పును, మరికొందరికి వంద శాతం సోడియం క్లోరైడ్ ఇచ్చామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త సుధీర్ రాజ్ థౌట్ తెలిపారు. చదవండి : మనీషాయే దిక్కు.. ‘తమిళనాడు థెరిస్సా’ మూడు నెలల తరువాత పరిశీలించినప్పుడు ప్రత్యామ్నాయ ఉప్పును వాడిన వారిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 4.6 యూనిట్లు తగ్గిపోగా, డయాస్టోలిక్ బ్లడ్ప్రెషర్లో, మూత్రంలో ఉప్పు అవశేషాల విషయంలోనూ సానుకూల మార్పులు కనిపించాయని వివరించారు. ఈ ఫలితాలు రక్తపోటు నివారణకు ఉపయోగించే మాత్రల ప్రభావంతో పోల్చదగ్గదిగా ఉందన్నారు. చదవండి : జొమాటోకు మరో ఎదురుదెబ్బ, నెటిజనుల మండిపాటు -
క్రిప్టో కరెన్సీలో దిట్ట.. 13 ఏళ్ల మన భారతీయ బిడ్డ!
వర్చువల్ కరెన్సీ వ్యాపారంలో ఇండియాకు చెందిన గజేశ్నాయక్ సంచలనం సృష్టిస్తున్నాడు. ఇంకా పదో తరగతి పూర్తి చేయకముందే కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతని పనితీరు మెచ్చి ప్రపంచ కుబేరులు అతని సంస్థలో పెట్టుబడులు పెడుతున్నారు. సాక్షి, వెబ్డెస్క్: గజేశ్ నాయక్, వయస్సు 13 ఏళ్లు, చదివేది 9వ తరగతి, నివసించేది గోవా. ఇవేమీ అతని ప్రత్యేకతలు కావు. కానీ అతను నెలకొల్పిన బిజినెస్ యాప్ ఆర్థిక కార్యకలాపాల విలువ అక్షరాల యాభై కోట్ల రూపాయలకు పైమాటే. పదో తరగతి కూడా పాస్ కాకుండానే గజేశ్ ఈ ఘనత సాధించాడు. ఇండియాలో మొగ్గదశలోనే ఉన్న క్రిప్టో కరెన్సీ కార్యకలాపాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాడు. కరోనా సంక్షోభంలో స్టార్టప్లు ఇబ్బందులు పడుతుంటే అందుకు భిన్నంగా ముందుకెళ్తున్నాడు గజేశ్. చదువులో దిట్ట గోవా రాజధాని పనాజీలోని పీపుల్స్ హై స్కూల్ చెందిన గజేశ్ నాయక్ చిన్నప్పటి నుంచే చదువులో దిట్ట, గణితంలో మేటి. చిన్నప్పటి నుంచే టెక్నాలజీపై ఆసక్తి ఎక్కువ. అందువల్లే కరోనా కారణంగా పాఠశాలు మూత పడినప్పుడు, తన కంటే కింది తరగతి విద్యార్థుల కోసం స్టడీ కంటెంట్ రెడీ చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచాడు. పాఠశాలలు తెరుచుకోపోవడంతో న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేశాడు. సీ, సీ ప్లస్, జావా స్క్రిప్ట్, సోలిడిటీలలో ఆరితేరాడు. క్రిఫ్టోకరెన్సీపై ఫోకస్ గోవాలో 2018లో జరిగిన ఇంటర్నేషనల్ బ్లాక్ చెయిన్ సమావేశాల్లో గజేశ్ పాల్గొన్నాడు. అప్పటి నుంచే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, ఆర్టిపీషియల్ ఇంటిలిజెన్స్పై ఆసక్తి పెరిగింది. లాక్డౌన్ టైంలో నేర్చుకున్న కొత్త కోర్సులను తన ఆసక్తికి జత చేశాడు. కోడింగ్ రాయడం సుళువైంది. ఆ తర్వాత వర్చువల్ కరెన్సీ మార్కెటైన క్రిప్టో కరెన్సీపై ఫోకస్ చేశాడు. క్రిప్టో కరెన్సీపై అనుభవం ఉన్న నిపుణులతో చర్చలు జరిపాడు. అనంతరం తనే స్వంతంగా పాలీగజ్ పేరుతో కొత్త డీయాప్ను రూపొందించాడు. డీ సెంట్రలైజ్డ్ పాలిగాన్ బ్లాక్చైయిన్ టెక్నాలజీపై డీఫై ప్రోటోకాల్ ఆధారంగా గజేశ్ రూపొందించిన పాలిగజ్ డీయాప్ క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వ్యవహరాలను నిర్వహిస్తుంది. ఇందులో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిజినెస్ని ఎటువంటి చట్టపరమైన అనుమతులు, మధ్యవర్తులు, దళారులు లేకుండానే నిర్వహించవచ్చు. ఈ పద్దతిలో వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలపై ఏ ఒక్కరి పెత్తనం ఉండదు, బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రోటోకాల్లోనే అన్ని వ్యవహరాలు ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. 7 మిలియన్ డాలర్లు పాలిగజ్లో డీయాప్పై ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే దీని నిర్వాహాణ సామర్థ్యం వన్ మిలియన్ డాలర్లకి చేరుకుంది. పాలిగజ్ యాప్ పనితీరు నచ్చడంతో ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ మార్క్ క్యూబన్ ఆసక్తి చూపించారు. తాను పెట్టుబడులు పెట్టారు. దీంతో ఇప్పుడు పాలిగజ్ నిర్వాహణ సామర్థ్యం 7 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఒక 13 ఏళ్ల భారతీయ బాలుడు స్థాపించిన పాలిగజ్ యాప్ అమెరికన్లు సైతం ఆశ్చర్యపరిచే రీతిలో పెర్ఫ్మామ్ చేస్తోంది. డీఫై ప్రోటోకాల్ సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలను బ్యాంకులు నిర్వహిస్తాయి, వాటి పైన సెంట్రల్ బ్యాంకులు అజమాయిషీ ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, స్థానిక చట్టాలు, రాజ్యంగానికి లోబడి విధులు నిర్వర్తిస్తాయి, ఇక డీఫై అంటే డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అని అర్థం. అంటే చట్టాలు, ప్రభుత్వ నిబంధనలు, మధ్యవర్తులు లేకుండా జరిగే ఆర్థిక వ్యవహరాలు. ఇందులో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర అని పనులు నిర్వహిస్తారు. అయితే ఇందులో మారకంగా క్రిప్టోకరెన్నీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే ఆర్టిఫీయల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్లను డీయాప్ అంటే డీ సెంట్రలైజ్డ్ యాప్ అని అంటారు. -
కడుపుబ్బ నవ్విస్తున్న బైక్ దొంగతనం
-
రూ.2 వేల నోటు టెస్టింగ్ వీడియో సంచలనం
న్యూఢిల్లీ: నాన్ బ్రేకబుల్ వస్తువులను ఎత్తయిన ప్రదేశాలనుంచి కిందపడేసి టెస్ట్ చేయడం చూశాం....వాటర్ ప్రూఫ్ స్మార్ట్ఫోన్లు పరీక్షించడం చూశాం.. ఇపుడు రెండు వేల రూపాయల నోటు వంతు వచ్చింది. అవును.. కొత్తగా ప్రజల చేతుల్లో కళకళలాడుతున్న రెండువేల నోటును కడుగుతున్న వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతుంది. ట్యాప్ లోంచి ధారాళంగా పడుతున్న నీటి కింద రూ.2000 నోటును ఒక వ్యక్తి కడుగుతున్న వీడియో ఒకటి సంచలనం రేపుతోంది. ఎవరు..ఎక్కడ చేశారు అనేవివరాలు తెలియనప్పటికీ.. ఆదివారం సోషల్ మీడియా షేర్ అయిన క్షణాల్లో వైరల్ అయిది. లక్షల కొద్దీని వ్యూస్ ను సొంతం చేసుకుంటూ యూ ట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది. ఫేస్బుక్ లాంటి ఇతర సోషల్ మీడియాలలో ట్రెండింగ్ టాపిక్గా మారింది. కాగా కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టేందుకు దేశంలో 500, 1000 రూపాయల నోట్ల చలామణిని రద్దుచేసింది. ఈ క్రమంలో కొత్తగా రెండువేల రూపాయల నోట్లు చలామణిలోకి వచ్చాయి. అయితే ఈ కొత్త నెట్ సెక్యూరిటీ ఫీచర్స్ పై అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అపుడే నకిలీ నోట్లు చలామణిలోకి వచ్చాయనే వార్తలు ప్రజల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
రూ.2 వేల టెస్టింగ్ వీడియో సంచలనం
-
బక్కెట్లకొద్దీ డబ్బు దొరికింది!
ఫ్లోరిడాలో పోలీసులకు దిమ్మతిరిగే దృశ్యం కనిపించింది. ఓ ఇంట్లో భద్రంగా దాచిన 24 బక్కెట్లలో కోట్ల కొద్దీ డబ్బు కనిపించడంతో షాక్ అయ్యారు. అక్రమ వ్యాపారం నిర్వహించగా వచ్చిన డబ్బును మియామీ ప్రాంతంలోని ఓ వ్యాపారి ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టిన వార్త.. ఇప్పుడక్కడ పెద్ద సంచలనంగా మారింది. అటకమీద ఎవ్వరికీ కనిపించకుండా దాచిన బక్కెట్లనిండా డబ్బుతోపాటు, కొన్ని డ్రగ్స్, ఓ గన్ కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. అమెరికా ఫ్లోరిడాలోని మియామీలోని ఓ ఇంట్లో తన అక్రమ వ్యాపారంతో సంపాదించిన డబ్బును సదరు వ్యాపారి బక్కెట్లలో భద్రంగా దాచుకున్నాడు. ఇంటి అటకమీద 24 బక్కెట్లలో దాచిపెట్టిన 163 కోట్ల రూపాయలను (సుమారు 20 మిలియన్ డాలర్లు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సొమ్ముతోపాటు, అత్యంత ఖరీదైన తుపాకీ, కొన్ని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకొన్న మియామీ పోలీసులు.. వ్యాపారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. 44 ఏళ్ళ లూయిస్ హెర్నాండెజ్ గాంజలెజ్, ఆయన సోదరి 32 ఏళ్ళ సల్మా గాంజలెజ్ లను అక్రమ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న కేసులో అరెస్టు చేశారు. గార్డెన్ సామాన్లు అమ్మే బిజినెస్ నిర్వహిస్తున్న నిందితులు, అక్రమంగా మాదక ద్రవ్యాల వ్యాపారం కూడ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు.. వారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లోని అటకపై భద్రంగా దాచిపెట్టిన బక్కెట్ల కొద్దీ డబ్బును, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిద్దరిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెర్చ్ వారెంట్ తో నిందితుల ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు అటకపై ఉన్న బక్కెట్లు చూసి షాకయ్యారు. వాటితోపాటు ఎనబాలిక్ స్టెరాయిడ్లు, టీఈసీ-9 పిస్టల్ కనిపించడంతో వారి అనుమానాలు నిజమయ్యాయి. వెంటనే అలర్టయిన పోలీసులు... నిందితులను అదుపులోకి తీసుకొని అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇంత భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. -
ఫేస్ బుక్ లో ఆకట్టుకుంటున్న శునకం
యజమానిపై అమితమైన ప్రేమను చూపించే పెంపుడు జంతువుల్లో శునకాలదే మొదటిస్థానం అని చెప్పొచ్చు. విశ్వాసానికి మారుపేరుగా కూడ కుక్కలనే చెప్తారు. అంటువంటి ఓ పెంపుడు శునకం తన యజమానిపై అభిమానాన్ని చాటుకుంటోంది. తన యజమాని కుటుంబ సభ్యులపై ఈగవాలనివ్వకుండా చేస్తోంది. కుటుంబంలో చిన్నకొడుకుపై ప్రత్యేక ప్రేమను చూపిస్తూ.. ఇప్పుడు.. మిలియన్లకొద్దీ ఫేస్ బుక్ వ్యూయర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. విశ్వాసానికి నిదర్శనంగా చెప్పే శునకాలు యజమానిపై ఉండే ప్రేమను ఎన్నోసార్లు నిరూపించుకుంటుంటాయి. ఒక్క చిన్న బిస్కెట్ ముక్క పెడితే చాలు కనీసం వీధికుక్కలు కూడ వారిని మరచిపోకుండా గుర్తుపెట్టుకొని, కనిపించినప్పుడల్లా అభిమానాన్ని అనేక విధాలుగా వ్యక్తపరుస్తుంటాయి. అటుంటి ప్రేమకు మారుపేరైన ఓ శునకం.. తన యజమానిపై చూపిస్తున్న అభిమానం ఇప్పుడు ఫేస్ బుక్ లో ప్రత్యేకాకర్షణగా నిలిచింది. మంచంపై పడుకున్న యజమాని చిన్నకొడుకును ఎవరు ముట్టుకున్నా తన ప్రతాపం చూపిస్తూ..మిలియన్లకొద్దీ వినియోగదారులను ఆకర్షిస్తోంది. శుక్రవారం పోస్టు చేసిన వీడియో ఒక్క రోజులోనే సుమారు రెండున్నర కోట్ల వ్యూ లతో ప్రత్యేకతను సంతరించుకుంది. -
ఫేస్ బుక్ లో కాక పుట్టిస్తున్న'హాకా'!
ప్రపంచ దేశాల్లో పెళ్ళిళ్ళ సందర్భంలో అనేక సాంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయి. సుమారుగా ప్రతి సంప్రదాయ పద్ధతిలోనూ అక్కడి వేడుకలో ఉత్సాహాన్ని నింపడం కనిపిస్తుంటుంది. ఒక్కోసారి అక్కడి సన్నివేశాలు ఉద్వేగాన్ని కూడ నింపుతుంటాయి. అటువంటి వివాహ సందర్భంలో తీసిన వీడియో ఇప్పుడు ఫేజ్ బుక్ లో హల్ చల్ చేస్తోంది. రెండు రోజుల క్రితం పోస్టు చేసిన ఆ వీడియో ఇప్పటివరకూ సుమారు కోటీ అరవై లక్షలమందిని ఆకట్టుకుంది. న్యూజిల్యాండ్ లో వివాహ వేడుక సమయంలో ఉత్సాహంగా నిర్వహించే సంబరాల్లో సంప్రదాయ నృత్యం 'హాకా' ఒకటి. బంధు మిత్రులంతా కలసిన వేళ.. నిర్వహించిన ఆ వార్ డ్యాన్స్ సన్నివేశం ఇప్పుడు ఫేస్ బుక్ వినియోగదారులను లక్షలమందిని అమితంగా ఆకట్టుకుంది. ఎందరో హృదయాలను దోచిన ఆ హాకా డ్యాన్స్ వీడియో... బెన్, అలియా ఆమ్ స్ట్రాంగ్ ల పెళ్ళి సందర్భంలోనిది. వధూవరులు.. దంపతులైన వేళ న్యూజిల్యాండ్ సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులంతా కలసి ఉత్సాహంగా హాకా డ్యాన్స్ చేస్తారు. ఇలా నిర్వహించే సంప్రదాయ నృత్యాన్ని ఆ కుటుంబ గౌరవానికి చిహ్నంగా చెప్తారు. ఈ వేడుకలో పెళ్ళి కొడుకుతోపాటు అతని పెద్దన్న కార్యక్రమానికి నాయకత్వం వహించారు. పాటలకు లయబద్ధంగా అడుగులు కలుపుతూ సంప్రదాయ పద్ధతిలో చేసే ఆ నృత్యం.. అక్కడి వారిని భావోద్వేగానికి లోను చేసింది. హాకా డ్యాన్స్ సమయంలో సందర్భానుసారంగా పాడే పాటలు... విన్నవారు సైతం కన్నీరు పెట్టకున్నారు. ఉత్సాహంగా అంతా కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఉద్వేగభరిత సన్నివేశం లక్షలమంది మనసులను దోచింది. వధూవరులిద్దరూ కూడ కన్నీటిని తుడుచుకొని ఆ వేడుకలో భాగం పంచుకోవడం అందరికీ ఆనందాన్ని నింపింది. ఇప్పుడు ఫేస్ బుక్ లో వీడియోను చూసిన వారంతా వధూవరులు సైతం డ్యాన్స్ చేసిన తీరును పొగడ్తలతో ముంచెత్తారు. అయితే తెలుగువారి వివాహ సంప్రదాయంలోని అప్పగింతల పాటలు కూడ ఇటువంటి సందర్భాన్ని స్ఫురింపజేస్తాయి. పెళ్ళి కుమార్తెను భర్తకు, వారి కుటుంబ సభ్యులకు అప్పగించే సమయంలో పాడే పాటలు, వాయించే మ్యూజిక్ అక్కడున్నవారిని కన్నీరు పెట్టించడం కనిపిస్తుంది. న్యూజిల్యాండ్ హాకా డ్యాన్స్ లో కూడ అటువంటి సందర్భమే మనకు కళ్ళకు కడుతుంది. -
ఐఎస్ ఐఎస్ డబ్బును ధ్వంసం చేసిన అమెరికా దళాలు
ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు ఆమెరికా నిర్విరామంగా కృషి చేస్తోంది. ఐఎస్ ఐఎస్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా ఇరాక్ సెంట్రల్ మోసుల్ లోని ఓ భవనంపై రక్షణ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. ఐఎస్ ఐఎస్ భవిష్యత్ కార్యాచరణకోసం డబ్బు దాచిపెట్టిన భవనాన్ని యూఎస్ దళాలు ధ్వంసం చేశాయి. అయితే భవనంలో ఎంత మొత్తం డబ్బు, ఏ దేశానికి చెందిన కరెన్సీ ఉంది అన్న విషయాలను మాత్రం రక్షణ అధికారులు వెల్లడించలేదు. కాగా ఆ డబ్బు మిలియన్లలోనే ఉందని వివరాలను బట్టి తెలుస్తోంది. రెండువేల పౌండ్ల బరువున్న రెండు బాంబులు... డబ్బు దాచిపెట్టిన భవనాన్నిక్షణాల్లో ధ్వంసం చేశాయి. ఐఎస్ ఐఎస్ సామర్థ్యాన్ని తగ్గించేందుకు వారి ఆర్థిక స్థావరాలను నాశనం చేయడమే అమెరికా అక్ష్యంగా చేసుకుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్లక్రితం యూఎస్ యుద్ధ విమానాలు ఐఎస్ ఐఎస్ చమురు ట్రక్కులను కూడ టార్గెట్ చేశాయని అంటున్నారు. అయితే ప్రస్తుత మోసుల్ దాడుల్లో సాధారణ ప్రజలు కూడా మరణించే ప్రమాదం ఉండటంతో ఈ విధ్వంసాన్ని అమెరికా సున్నితంగా భావించింది. అందుకే చాలాకాలంపాటు డబ్బు సేకరణ, పంపిణీ స్థావరంపై డ్రోన్లు, విమానాలతో నిఘా పెట్టింది. చివరికి అక్కడ జన సంచారం లేని సమయాన్ని కనిపెట్టి దాడులు నిర్వహించింది. అయితే ఆ స్థావరాన్ని అమెరికా ఎలా కనిపెట్టింది అన్న విషయం బహిర్గతం కాలేదు. బాంబు దాడుల ప్రాంతానికి సమీపంలో సాధారణ పౌరులు పగటి సమయంలో మాత్రమే ఉండటం, రాత్రిళ్ళు ఐఎస్ ఐఎస్ సిబ్బంది పనిచేస్తుండటం గమనించిన నిఘా అధికారులు ఆదివారం తెల్లవారుజామున దాడులు జరిపేందుకు నిర్ణయించారు. అయితే తమ లక్ష్యాన్ని సాధించేందుకు సుమారు 50మంది వరకు సాధారణ పౌరులు బలికాక తప్పదని తాము యోచించినట్లు కమాండర్లు ఒప్పుకుంటున్నారు. కాగా దాడిలో ఐదు నుంచి ఏడుగురు మాత్రమే మరణించినట్లు చెప్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికా తన లక్ష్యాలను అమలుపరిచే నేపథ్యంలో మరింత మంది సాధారణ ప్రజలు బలయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. -
'ఆ రహస్యాన్ని దాచడానికి రూ. 66 కోట్లు'
హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ తనకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందన్న విషయాన్ని దాచడానికి చాలానే డబ్బును వదిలించుకున్నాడు. 'ఓ హాలీవుడ్ స్టార్కు హెచ్ఐవీ సోకింది' అని ఇటీవల ఓ పోర్న్ స్టార్ చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో అది తానేనంటూ చార్లీ షీన్ బహిరంగంగా అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ రహస్యాన్ని దాచేందుకు బ్లాక్ మెయిల్ చేసినవారికి సుమారు రూ. 66 కోట్లను ఇచ్చినట్లు చార్లీ బుధవారం వెల్లడించాడు. 'టూ అండ్ ఎ ఆఫ్ మెన్ షో' తో ఫేమస్ అయిన ఈ నటుడు తనపై వస్తున్న ఆరోపణలపై ఓ టీవీ షోలో వివరణ ఇచ్చాడు. ఉద్దేశపూర్వకంగానే ఇతరులకు హెచ్ఐవీని అంటించాడని, తనకు గల వ్యాధి వివరాలను దాచి లైంగిక సంబంధాలను కొనసాగించాడని తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించాడు. తనకు నాలుగేళ్ల క్రితం ఎయిడ్స్ ఉన్నట్లు నిర్థారణ అయిందని ఆ తరువాత తగిన జాగ్రత్తలు తీసుకొని నిజాయితీగా లైగిక సంబంధాలు జరిపినట్లు తెలిపాడు. అయితే చార్లీతో నాలుగేళ్ల క్రితం ఏడాది పాటు గడిపిన మాజీ పోర్న్ స్టార్ బ్రీ ఓల్సన్ మాత్రం అతని వ్యాఖ్యలను ఖండించింది. చార్లీ తనతో గడిపిన ఏడాదిలో మాట మాత్రమైనా తనకు ఈ విషయం గురించి చెప్పలేదని ఆమె వెల్లడించింది. ఎప్పుడూ 'ఐయామ్ క్లీన్' అని చెప్పేవాడని తెలిపింది. అయితే తనకు హెచ్ఐవీ ఫలితాలు నెగటీవ్ అని తేలాయని చెప్పిన ఓల్సన్ ఉద్దేశపూర్వకంగానే చార్లీ రహస్యాన్ని దాచాడని ఆరోపించింది. ఒకప్పుడు అమెరికాలోనే టీవీ షో కార్యక్రమాలలో అత్యంత రెమ్యునరేషన్ అందుకున్న నటుడుగా పేరున్న చార్లీ షీన్ పలువురు సెలబ్రిటీలతో పాటు పోర్న్స్టార్లతో విచ్చలవిడిగా లైంగిక సంబంధాలు కొనసాగించి ఉద్దేశపూర్వకంగానే హెచ్ఐవీని అంటించాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రయాణికులు మెచ్చే విమానాశ్రయాలు
1. సేవలలో ఫస్ట్.. షాంఘై ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా ఇప్పటికే నాలుగుసార్లు బహుమతులను కైవసం చేసుకున్న షాంఘై ఎయిర్పోర్ట్ ఈ ఏడాదీ మొదటి స్థానంలో నిలిచింది. సింగపూర్లో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ కిందటేడాది 50 మిలియన్ల మంది ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ప్రయాణికులు ఈ ఏడాది కూడా ఈ విమానాశ్రయానికి అగ్రతాంబూలం ఇచ్చారు. ఆసియా ఖండం నుంచి ఎంపికైన ఈ ఎయిర్పోర్ట్ 3,200 ఎకరాల స్థలంలో, ఏడాదికి 66 మిలియన్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలిగే సామర్థ్యం కలిగి ఉంది. 2. అత్యంత వేగం... ఇంచియాన్ ఆసియా ఖండంలో రెండవ అత్యుత్తమ ఎయిర్పోర్ట్ అవార్డును ఇంచియాన్ విమానాశ్రయం సొంతం చేసుకుంది. సౌత్ కొరియాలోని సియోల్లో ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. కొన్నేళ్లుగా బెస్ట్ ఎయిర్పోర్ట్లలో రెండవస్థానాన్ని కొట్టేస్తూ వచ్చిన ఇంచియాన్ ఈ యేడాది కూడా తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఇక్కడి సిబ్బంది సేవలు అత్యుత్తమంగా ఉంటాయని ప్రజలు కొనియాడారు. 2005 సంవత్సరంలో ప్రారంభించిన ఈ విమానాశ్రయంలో ఇతర సేవలతో పాటు గోల్ఫ్ కోర్స్, స్పా, వ్యక్తిగత గదులు, ఐస్ స్కేటింగ్ రింక్, క్యాసినో, ఇండోర్ గార్డెన్స్, కొరియా సంస్కృతికి సంబంధించిన మ్యూజియమ్.. మొదలైనవన్నీ ఉన్నాయి. ప్రయాణికులను అత్యంత వేగంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చగలదనే ప్రపంచవ్యాప్తంగా పేరుంది. దీంతో వ్యాపారవేత్తలు ఈ విమానాశ్రయం నుండి అత్యధికంగా ప్రయాణిస్తుంటారు. 3. సెల్ఫ్ సర్వీస్... ఆమ్స్టర్ డ్యామ్ చిపోల్ మొదటిసారి స్కైట్రాక్స్ అవార్డును సొంతం చేసుకున్న ఈ విమానాశ్రయం నెదర్ల్యాండ్స్, అమ్స్టర్ డ్యామ్ ప్రాంతంలో ఉంది. అతి పెద్దదైన ఈ విమానాశ్రయంలో స్వీయ సేవా బదిలీ ప్రక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. యూరప్ దేశాలలో రద్దీ గల విమానాశ్రయంగా దీనికి పేరుం ది. 1916లో ప్రారంభించిన ఈ విమానాశ్రయం కిందటేడాది 52 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించింది. 4. వాణిజ్య సేవలలో మేటి.. హాంగ్ కాంగ్ 2012లో మూడవస్థానంలో ఉన్న హాంగ్కాంగ్ విమానాశ్రయం ఈ ఏడాది నాలుగో స్థానంలో నిలిచింది. 1988 నుంచి ఈ విమానాశ్రయం వాణిజ్యపరమైన సేవలు అందిస్తోంది. 65,000 మంది సిబ్బంది పనిచేస్తున్న ఈ విమానాశ్రయంలో నుంచి ప్రపంచంలోని 180 ముఖ్య పట్టణాలకు వాయుమార్గం ఉంది. 5. అధునాతనం.. బీజింగ్ క్యాపిటల్ ఉత్తర బీజింగ్లో గల బీజింగ్ క్యాపిటల్ విమానాశ్రయం’ 1958లో చిన్న భవనంలో మొదలైంది. 1980లో ఒకేసారి 12 విమానాలు ల్యాండ్ అయ్యే సామర్థ్యంతో 3,700 ఎకరాలలో అధునాతనంగా నిర్మించారు. 1999లో 50వ వార్షికోత్సవం జరుపుకున్న ఈ ఎయిర్పోర్ట్ ప్రతియేటా 83 కోట్లకు పైగా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చుతూ 5వ స్థానంలో నిలిచింది. 6. అన్నపూర్ణ... మ్యూనిచ్ విమానాశ్రయాలలో ఆహారపదార్థాలకు అత్యధిక డబ్బు ఖర్చు చేస్తూ విసిగిపోయే ప్రయాణికులు మ్యూనిచ్ ఎయిర్పోర్ట్ కు నీరాజనాలు పలికారు. జర్మనీలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ అందించే స్థానిక సదుపాయాలు ప్రయాణికులకు అమితంగా నచ్చుతున్నాయి. మధ్య యూరప్లో అత్యుత్తమ భోజన సదుపాయాలు గల ఎయిర్పోర్ట్ జాబితాలో బెస్ట్ డైనింగ్ ప్లేస్ అవార్డును కొట్టేసింది. 7. లగేజీ సురక్షితం... జోరిచ్ విమానాశ్రయాలలో లగేజీలు పోగొట్టుకునే అనుభవం చాలా మంది ప్రయాణికులకు ఉంటుంది. కానీ, స్విట్జల్యాండ్లోని జోరిచ్ ఎయిర్పోర్ట్’లో లగేజీ మిస్ అయ్యే అవకాశమే లేదు. అన్ని భద్రతా చర్యలు తీసుకుంటారు ఇక్కడ. ప్రపంచంలోని అన్ని ఎయిర్పోర్ట్ల కన్నా లగేజీ సురక్షితంగా చేర్చడంలో ముందు వరసలో ఉన్నది జ్యూరిచ్ ఒక్కటే. అందుకే ఈ ఏడాది బెస్ట్ బ్యాగేజీ డెలివరీ అవార్డును, అలాగే అత్యుత్తమ సిబ్బంది సేవల అవార్డును ఈ ఎయిర్పోర్ట్ సొంతం చేసుకుంది. 8. ప్రతినిధుల ప్రశంసలు... వ్యాన్కూవర్ బ్రిటిష్ కొలింబియాలో గల వ్యాన్కూవర్ ఈ ఏడాది బెస్ట్ ఎయిర్పోర్ట్ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది. ఉత్తర అమెరికా ప్రతినిధుల చేత ప్రశంసలు పొందిన ఈ ఎయిర్పోర్ట్ 2012లో తొమ్మిదవస్థానంలో ఉండగా ఈ ఏడాది మరో మెట్టు అధిగమించింది. 9. పరిశుభ్రతకు మారు పేరు... టొక్యో పది అంతర్జాతీయ విమానాశ్రయాల జాబితాలో కొత్తగా చేరింది జపాన్లోని ‘టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం. బెస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ల జాబితాలో 2012లో మొదటి స్థానంలో ఉన్న ఈ విమానాశ్రయంలోని పరిశుభ్రత సూపర్బ్గా ఉంటుందని ప్రయాణికులు కొనియాడారు. 10. అత్యుత్తమ టెర్మినల్స్... లండన్ హీత్రో లండన్లో 5 అతి పెద్ద టెర్మినల్స్తో 2008లో ప్రారంభించిన హీత్రో ఎయిర్పోర్ట్ 2012 వరకు వరుసగా బెస్ట్ టెర్మినల్స్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది ప్రయాణికులు ఈ ఎయిర్పోర్ట్ను పదవ స్థానానికి పరిమితం చేశారు. -
అర్హులని తేలినా..పింఛన్ల మంజూరుకు నో