Munugode By Election Results 2022
-
Munugode Bypoll Result 2022: అధికార దుర్వినియోగంతో దక్కిన విజయం
తెలంగాణ చరిత్రలోనే మునుగోడులో జరిగిన ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా మిగిలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంలోని 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 12 మంది ఎంపీలు, మునుగోడులో తిష్ఠ వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. ప్రతి రెండు గ్రామాలకూ ఒక ఎమ్మెల్యేని మోహరించారు. మండలానికి ముగ్గురు మంత్రులను నియమించి భారతీయ జనతా పార్టీ నాయకులను, గ్రామస్థాయిలో ఉండే యువతను టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగి పోతాయనీ, పింఛన్ దారులకు పింఛను రాదనీ, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇన్ని కుయుక్తులతో సాధించినది విజయమేనా? ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 97,006 ఓట్లు తెచ్చుకొని 10,309 ఓట్ల మెజారిటీ విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 86,693 ఓట్లు పొంది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వణికించారు. కాంగ్రెస్ 23,906 ఓట్లు పొంది డిపాజిట్ కోల్పోయింది. భారతీయ జనతా పార్టీ తమకు పోటీనే కాదనీ, కాంగ్రెస్సే ప్రత్యర్థి అని ఎన్నోసార్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు; ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నో ప్రగల్భాలు పలికినప్పటికీ మును గోడులో భారతీయ జనతా పార్టీకి మంచి ప్రజాదరణ కనిపించింది. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ తమ పార్టీ సాధించిన విజయాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకోలేక ‘చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు’ భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ సాంప్రదాయి కంగా బలంగా ఉన్న కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని సాధించిన విజయమే తప్ప కేసీఆర్ ప్రభుత్వ పథకాలను చూసి కానీ, ఆయన పరిపాలనా విధానం చూసి గానీ వచ్చింది కాదు. కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవకపోతే ప్రభుత్వ మనుగడకు ప్రమాదమని భావించి... విజయం కోసం తన అంగ బలాన్నీ, అధికార బలాన్నీ ఉపయోగించారు. తాను చీదరించి మనుగడ లేకుండా చేసిన కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టు కున్నారు. అందుకే కనీస మెజారిటీ అన్నా టీఆర్ఎస్కు దక్కింది. ఈ ఉప ఎన్నిక... భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకు లకు రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి రాబోతోందనే సంకేతాన్ని ఇస్తోంది. ఓటమి భయంతో కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికీ రెండు గ్రామాలను అప్పగించి ఆయా గ్రామాలలో మెజార్టీ చూపిం చకపోతే వచ్చే ఎలక్షన్లలో వారికి సీటు ఇచ్చేది లేదని చెప్పినట్టు తెలిసింది. దీన్నిబట్టి కేసీఆర్ బీజేపీని చూసి ఎంతగా భయపడ్డారో తెలుస్తోంది. ఇంతజేస్తే... మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న గ్రామాలలో బీజేపీకి టీఆర్ఎస్ కన్నా ఎక్కువ మెజారిటీని కట్టబెట్టారు ప్రజలు. ఆ విధంగా మంత్రులకు... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు వచ్చే అవకాశం లేదన్నమాట. కాబోయే సీఎం అని చెప్పుకునే కేటీఆర్ ఇన్ఛార్జిగా ఉన్న గట్టుప్పల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు ఉండి... ప్రతి ఒక్క ఓటరుకూ రూ. 4,000 ఇచ్చినా టీఆర్ఎస్కు బీజేపీ కన్నా 65 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి వరుసగా ఇన్ఛార్జ్లుగా ఉన్న ఆరెగూడెం, లింగోజిగూడెం గ్రామాలలో టీఆర్ఎస్ కంటే బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ నిజంగా మునుగోడు నియోజక వర్గంలో చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీలలో; చౌటుప్పల్ గ్రామీణ ప్రాంతాలలో టీఆర్ఎస్ కంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తుందని అనుకున్నప్పటికీ, అనుకున్నంత మెజారిటీ సాధించలేక పోయింది. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు మునుగోడు ఉప ఎన్నిక వస్తుందని ముందుగానే భావించిన టీఆర్ఎస్ చౌటుప్పల్, చండూర్ మున్సిపాలిటీలలో 30 వేల పైన ఓట్లు కొత్తగా నమోదు చేయించడం జరిగింది. ఇలా హడావిడిగా ఇన్ని కొత్త ఓట్లు నమోదు చేయడం అధికార దుర్వినియోగం అవుతుంది అని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో రెండు మూడు వేల ఓట్లు మునుగోడు నియోజకవర్గంలోని నివాసితులవి కాగా, మిగతా ఓట్లన్నీ టీఆర్ఎస్ నాయకులు... మునుగోడు పక్క నియోజకవర్గాల నుంచి తమ కార్యకర్తల చేత ఓటు కోసం అప్లై చేయించినవే అని చెప్పవచ్చు. ఇదే రకమైన విధానాన్ని కేసీఆర్ పట్టభద్రులకు జరిగిన రెండు శాసనమండలి ఎలక్షన్లలో కూడా ఉపయోగించారు. అలాగే ఒకటవ తారీఖు సాయంత్రం ఎన్నికల నిబంధన ప్రకారం బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గం విడిచి వెళ్లకుండా, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి పక్షపాతం చూపించారు. మూడో తారీఖు సాయంత్రం వరకూ డబ్బులు పంచుకుంటూ ప్రలోభాలకు గురిచేసి, బెదిరించి, మద్యాన్ని ఏరులై పారించి అడ్డదారుల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఓటర్లను ప్రభావితం చేయడం జరిగింది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న ప్రభుత్వానికి ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. తనకు తాను జాతీయ నేతగా ప్రకటించుకొని బీఆర్ఎస్గా మారిన తర్వాత జరుగుతున్న ఎన్నిక కాబట్టి ఎలాగైనా గెలవాలన్న తపనతో ఏకంగా ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట ఫామ్హౌస్ డ్రామాకు ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు టీఆర్ఎస్ తెరలేపడం జరిగింది. అయినప్పటికీ మునుగోడులోని ఓటర్లు కానీ, తెలంగాణ ప్రజలు కానీ కేసీఆర్ నాటకాన్ని నమ్మలేదు. ఎన్నో ఆశలతో రూపొందించిన ఫామ్ హౌస్ డ్రామా రక్తి కట్టలేదు. ఈ మొత్తం ఎన్నికల్లో టీఆర్ఎస్కు సంబంధించిన ఒక రూపాయి కూడా పట్టుబడకపోవడం ప్రభుత్వ వ్యవస్థల దుర్వి నియోగానికీ, అధికార యంత్రాంగం టీఆర్ఎస్ గెలుపు కోసం చిత్తశుద్ధితో పనిచేసింది అనడానికీ నిదర్శనం. (క్లిక్ చేయండి: బీఆర్ఎస్కు పచ్చాజెండా ఊపిన మునుగోడు ఓటర్లు) రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని తేల్చిన అనేక సర్వేలు చూసిన తర్వాత అయోమయానికి గురవు తున్న టీఆర్ఎస్ నేతలకు... ఏమి చేయాలో పాలుపోక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానమంత్రిని కూడా అడ్డుకోవాలని నిరసన కార్యక్రమాలు చేపట్టడం దేనికి అద్దం పడుతుంది? ఈ పనులేవీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అడ్డు కోలేవు. ఇటీవలి కాలంలో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. అధికారం దిశగా అడుగులు వేస్తోంది. - ఎన్. రామచందర్ రావు మాజీ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ -
మునుగోడు ఫలితంపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
బీఆర్ఎస్కు పచ్చాజెండా ఊపిన మునుగోడు ఓటర్లు
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నారు పెద్దలు. ఆ దిశగానే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారిన తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ ప్రజలు పచ్చ జెండా ఊపేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో అభ్యర్థిని గెలిపించి ‘తెలంగాణ మోడల్’ను భారత దేశమంతా అమలు చేయమని ఆశీర్వదించారు. మేమంతా ఇప్పుడు ‘భారత్ రాష్ట్ర సమితి’ వెంటేనని తెలంగాణ మెజారిటీ ప్రజలు నిర్ణయించారు. ఇప్పుడు ఉప ఎన్నికలో వచ్చిన ఫలితమే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉంటుందని చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ రెట్టించిన ఉత్సాహంతో దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ను ప్రజల్లోకి తీసుకువెళ్లి అభివృద్ధి, సంక్షేమాలను వివరించాల్సిన అవశ్యకత ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని 64 ప్రత్యేక పథకాలు ఇక్కడే అమలవుతున్నాయి. ముఖ్యంగా సామాజిక పింఛన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, చేనేత బీమాలు తెలంగాణ సమాజంలో కేసీఆర్ మార్కును చూపిస్తున్నాయి. ఒక వైపు కాళే శ్వరం లాంటి భారీ ప్రాజెక్ట్లతో రాష్ట్రంలో సాగు లోకి వచ్చిన భూ విస్తీర్ణం అమాంతం పెరిగిపోయి గ్రామీణ ముఖ చిత్రమే మారిపోయింది. 24 గంటల విద్యుత్, ఉచిత విద్యుత్, సర్కారే ధాన్యం కొనుగోలు చేయడం, గొర్రె పిల్లలు పంపిణీ, చేప పిల్లల పంపిణీ వంటివి కూడా గ్రామీణఆర్థిక వ్యవస్థను రోజురోజుకూ పటిష్టం చేస్తున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో 2018 ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్న హామీల్లో మెజారిటీ నెరవేర్చటం, మిగిలినవి ప్రగతిలో ఉండటం విశేషం. అన్నింటి కంటే ముఖ్యంగా విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించే పని ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో విజయవంతమై రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రాబోతుండటం శుభ పరిణామం. ఇవి కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డయాలసిస్, కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తుండటంతో నిరు పేదలు కార్పోరేట్ ఆస్పత్రుల దోపిడి నుంచి పూర్తిగా తప్పించుకున్నారు. గడిచిన ఐదేళ్లలో తెలంగాణ నుండి కేంద్రానికి వివిధ రూపాల్లో రూ. 2.15 లక్షల కోట్ల రూపాయలను చెల్లిస్తే... కేంద్రం నుండి తెలంగాణ కు లక్ష కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి. ఎక్కువ ఆదాయం పంపే రాష్ట్రాల్లో ఎక్కువ అభివృద్ధికి అవకాశం ఇవ్వాల్సిన అసవరం ఉంది. ఇక దేశంలో సామాజిక పింఛన్లు, రైతు సంక్షేమం, విద్య, వైద్య రంగాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ ఎంతో ముందున్నది. (క్లిక్: నిజాన్కి నేనే గెల్సిన.. రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే..) కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలో వెనకబడిన, అణచివేతకు గురవుతున్న ప్రాంతాలు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవశ్యకత నేడు ఎంతో ఉంది. సహజ సంపదలు ఎన్ని ఉన్నా... వాటిని వినియోగించు కోలేని స్థితి పలు రాష్ట్రాల్లో పక్కాగా కనిపిస్తున్నది. స్వాతంత్రం వచ్చాక 75 ఏళ్లకు సాకారమైన కాళేశ్వరం... నేడు తెలంగాణ ప్రగతిలో మేలి మలుపు అయింది. వివిధ నదుల కింద ప్రాజెక్ట్ల నిర్మాణం ద్వారా, అనేక పరిశ్రమల స్థాపనకు ద్వారాలు తెరిచి సంపద సృష్టించి, ఆ సంపదను మళ్లీ ప్రజలకే పంచడం కేసీఆర్ ప్రత్యేకత. అందుకే మునుగోడు ఓటరు కేసీఆర్ని దీవించి భారత్ రాష్ట్ర సమితికి పచ్చాజెండా ఊపారు. - డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు ఉభయ రాష్ట్రాల మాజీ ప్రధాన సమాచార కమిషనర్ -
నిజాన్కి నేనే గెల్సిన.. రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే..
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ దిక్కు బోయిండు. గాడ రొండం త్రాల బంగ్లల బేతాలుడుంటున్నడు. గా బంగ్ల ముంగట విక్రమార్కుడు మోటరాపిండు. ఆపి హారన్ గొట్టిండు. హారన్ సప్పుడినంగనే బేతా లుడు బంగ్లకెల్లి ఇవుతల కొచ్చిండు. మోట రెక్కి ఎన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. గూసోంగనే విక్రమార్కుడు మోటర్ నడ్ప బట్టిండు. గప్పుడు ఎన్క సీట్ల గూసున్న బేతాలుడు – ‘‘నన్ను గూసుండ బెట్టుకోని గుంతలు, ఎత్తు గడ్డలు, కంకర తేలిన తొవ్వలని సూడకుంట మోటర్ నడ్పుతవు. ఒక్కోపారి ట్రాఫిక్ల ఇర్కపోతవు. కోపం గినొస్తె నువ్వు గాన్ని గీన్ని తిట్టొచ్చు. నీకు ఎటూ సుద్రాయించక పోవచ్చు. నీకు యాస్ట రాకుంట ఉండెతంద్కు గిప్పుడు నడుస్తున్న ఒక కత జెప్త ఇను. ‘‘నెల దినాల సంది మునుగోడుల నడ్సిన బైఎలచ్చన్ల బాగో తంకు పర్ద బడ్డది. పది మంత్రులు, తొంబైమంది ఎమ్మెల్యేలే గాకుంట ముక్యమంత్రి గుడ్క బాగోతమాడితె పదివేల చిల్లర ఓట్లతోని టీఆర్ఎస్ దిక్కుకెల్లి పోటి జేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెల్సిండు. అన్నా! నువ్వు గెల్సినందుకు పటాకులు గాలుస్తం. లడ్లు, కోవపేడలు పంచిపెడ్తం. మందు గొడ్తం. కోల్లు, మేకలు గోసి దావత్ జేసుకుంటం. పది లచ్చల రూపాయలు ఇయ్యే అని గాయిన దిక్కుకెల్లి పని జేసిన టీఆర్ఎసోల్లు అడిగిండ్ర’’ ని బేతాలుడు అన్నడు. ‘‘గాల్లు అడిగితె కూసుకుంట్ల రూపాయ లిచ్చిండా?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘వందల కోట్ల రూపాయలు కర్సు జేస్తె కింద మీద బడి బై ఎలచ్చన్ల గెల్సిన. ఇంతకుముందు మీరు అడి గట్లిస్తె కడిగి నట్లయింది. ఇంక పైసలు యాడికెల్లి దేవాలె. ఎంత గనం తన్లాడినా కమస్కం నల్ఫై వేల ఓట్ల మెజార్టి రానందుకు కేసీఆర్ నారాజైండు అన్కుంట గాయిన మొత్తుకుండు.’’ ‘‘బీజేపీ దిక్కు కెల్లి నిలబడ్డ రాజగోపాల్ రెడ్డి ఏమన్నడు?’’ ‘‘కింద బడ్డా మీది కాలు నాదే. న్యాయం నా దిక్కే ఉన్నది. టీఆర్ఎస్కు ఓటు ఎయ్యకుంటె పింఛన్లు ఇయ్యమని బెదిరిచ్చిండ్రు. తొండి జేసి గెల్సిండ్రు. నిజం జెప్పాలంటె నేనే గెల్సిన అన్నడు.’’ ‘‘గీ ఎలచ్చన్ల బాగోతంల బుడ్డర్ ఖాన సుంటి కె.ఎ. పాల్ ఏమన్న అన్నడా?’’ ‘‘నూరుకు అర్వై ఓట్ల లెక్కన నాకు ఓట్లు వొస్తయి. గని టీఆర్ఎస్, బీజేపీలు ఈవీఎంల తోని తోతిరి జేసినయి. ఈవీఎంలు వొద్దంటె గా రొండు పార్టిలు అడ్డంబడి నన్ను గెల్వకుంట జేసినయి. నిజాన్కి నేనే గెల్సిన. ఇయ్యాల గాకున్నా రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే అని కె.ఎ. పాల్ అన్నడు. ఎలచ్చన్లు గిప్పటి తీర్గ గాకుంట హర్రాజ్ తోని బెట్టాలె. ఎవ్వలు అందరికన్న ఎక్వ కోట్లు పంచి పెట్టుడే గాకుంట కోట్ల రూపాయల మందు బోపిచ్చెతందుకు ముంగట్కి వొస్తరో గాల్లే గెల్సినట్లు సాటి య్యాలని సర్కార్ అనుకుంటున్నది. కోట్ల రూపాయలు కర్సు బెట్ట కుండుడే గాకుంట మందు బోపియ్యనోల్లకు ఎలచ్చన్ల పోటి జేసే హక్కు ఉండదని జెబ్దామనుకుంటున్నరు. ఓటుకు నాల్గు వేలు ఇస్త మని మూడు వేలే ఇచ్చిండ్రు. కడ్మ వెయ్యి ఎప్పుడిస్తరని కొందరు లొల్లి బెట్ట బట్టిండ్రు’’ ‘‘గింతేనా ఇంకేమన్న ఉన్నదా?’’ ‘‘సార్ మీరు రాజినామ జెయ్యుండ్రి. రాజినామ జేస్తె మును గోడు లెక్క బై ఎలచ్చన్లొస్తయి. సర్కార్ పైసలు మంజూరు జేస్తది. దాంతోని మా పరిగి మంచిగైతది అన్కుంట పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డికి ఒకడు ఫోన్ గొట్టిండు. అన్నా! పౌరన్ నువ్వు మంత్రి కుర్సికే గాకుంట ఎమ్మెల్యేకు నువ్వు రాజినామ జేసి బై ఎలచ్చన్లు తేయే. నువ్వు రాజినామ జేస్తె ధర్మపురి నియోజక వర్గమే గాకుంట మా బత్కులు బాగై తయే అన్కుంట బతికెపల్లి కెల్లి రమేశ్ అనెటోడు మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఫోన్ గొట్టిండు. అచ్చెమ్మ పెండ్లి బుచ్చెమ్మ సావు కొచ్చిన తీర్గ మునుగోడు బై ఎలచ్చన్లు మా పానం మీదికొ చ్చిందే అన్కుంట మంత్రి మొత్తుకుండు. మునుగోడు ఎలచ్చన్ల నేనే గెల్సిన అని కూసుకుంట్ల అన్నడు. న్యాయంగ జూస్తె నేనే గెల్సిన అని రాజ గోపాల్ రెడ్డి అంటె గీల్లిద్దరు గాదు నేనే గెల్సిన అని కె.ఎ. పాల్ అంటున్నడు. ఇంతకు ఎవ్వలు గెల్సిండ్రు. ఎవ్వలు ఓడిపోయిండ్రు . గీ సవాల్కు జవాబ్ జెప్పకుంటివా అంటె నీ మోటర్ గుంతల బడ్తది’’ అని బేతాలుడన్నాడు. ‘‘మునుగోడుల మందు, మనీ గెల్సింది. జెనం ఓడి పోయిండ్రు’’ అని విక్రమార్కుడు జెప్పిండ్రు. బొందల గడ్డ రాంగనే బేతాలుడు మోటర్ దిగి ఇంటికి బోయిండు. (క్లిక్: ఓట్ల పండ్గ ఎట్లైంది.. మునుగోడుల ధూమ్దామ్గ జేస్కుండ్రు) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
మునుగోడు ఉప ఎన్నికను రద్దుచేయాలి: కేఏ పాల్
నల్గొండ (చండూరు): మునుగోడు ఉప ఎన్నికను రద్దుచేసి బ్యాలెట్ పేపర్తో తిరిగి ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేస్తామని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ అన్నారు. ఆయన మంగళవారం చండూరులో విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పేపర్ పెట్టమని చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. అవి నీతి, అక్రమాలు జరగనప్పుడు.. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఎందుకు కౌంటింగ్ చేయలేదన్నారు. ఉప ఎన్నికలో ఎన్నికల అధికారులు మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్కి తొత్తులుగా పనిచేశారని ఆయన ఆరోపించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలలో బిగించిన సీసీ కెమెరాలకు సంబంధించిన లింక్ తమకు ఎందుకు ఇవ్వలేదన్నారు. స్ట్రాంగ్ రూమ్కు వేసిన సీల్ మారిందని చెప్పారు. టీఆర్ఎస్ ఏజెంట్లు కండువాలు కప్పుకుని కౌంటింగ్ హాల్లో తిరుగుతున్నా ఎందుకు బయటకు పంపించలేదని ఆయన ప్రశ్నించారు. పోలింగ్ స్టేషన్లలో అధికారులు వృద్ధులతో రెండో నంబర్కు ఓటు వేయించారని ఆయన ఆరోపించారు. ఓటుకు డబ్బులు పంచడం అనేది ఎన్నికల అధికారులతో పాటు అందరికి తెలిసినా కూడా ఈ ఎన్నికను ఎందుకు రద్దుచేయలేదో చెప్పాలన్నారు. మునుగోడు ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ను చీకొడుతున్నారని, తనను అభిమానిస్తున్నారని పాల్ చెప్పారు. -
మునుగోడు ఫలితాలు.. లెక్క తప్పిందెక్కడ?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డాయి. ఎన్నికల్లో మెజారిటీ తగ్గిందని, రావాల్సిన ఓట్లు రాలేదంటూ విజయం సాధించిన పార్టీతోపాటు అపజయం పాలైన పార్టీలు భావిస్తున్నాయి. ఈ ప్రక్రియలో లెక్క ఎక్కడ తప్పింది? ఓట్లు ఎందుకు తారుమారయ్యాయి..? అన్న దానిపై అన్ని ప్రధాన పార్టీలు పోస్టుమార్టం చేస్తున్నాయి. భారీ మెజారిటీ వస్తుందని టీఆర్ఎస్, తప్పకుండా గెలుస్తామన్న ధీమాలో బీజేపీ, మహిళా సెంటిమెంట్ పని చేస్తుందని, ఎక్కువ ఓట్లు వస్తాయని కాంగ్రెస్ భావించినా వారి అంచనాలను మునుగోడు ప్రజలు తారుమారు చేశారు. భారీ మెజారిటీ అంచనా వేసుకున్న టీఆర్ఎస్ ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ 30 వేల నుంచి 40 వేల మెజారిటీ వస్తుందని అంచనా వేసుకుంది. అన్ని మండలాల్లోనూ ఆధిక్యంలోనే ఉన్నా తక్కువ మెజారిటీ రావడానికి గల కారణాలపై ఆరా తీస్తోంది. ముఖ్యమంత్రి రెండుసార్లు బహిరంగ సభలకు రావడంతోపాటు 12 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే తిష్టవేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. నామినేషన్ మొదలుకొని పోలింగ్ చివరి వరకు నియోజకవర్గంలో ఉండి. ఆ తర్వాత నియోజకవర్గ పొలిమేరల్లో ఉండి మరీ పర్యవేక్షించారు. బీజేపీకి 86 వేలకు పైగా ఓట్లు వస్తాయని ఊహించలేదు. 2018 ఎన్నికల్లో కేవలం 12వేలకు పైగా ఓట్లతో సరిపెట్టుకున్న బీజేపీ ఒకేసారి 86 వేలకు పైగా రావడంతో టీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ పెద్ద ఎత్తున తగ్గింది. దీనిపై పార్టీ నేతలు పోస్టుమార్టం చేస్తున్నాయి. ఏ మండలంలో ఎందుకు మెజారిటీ తగ్గిందన్న అంశంపై దృష్టి సారిస్తున్నారు. గెలుస్తామనుకున్న బీజేపీ బీజేపీ ఈ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్లతేడాతోనైనా గెలుస్తామని భావించింది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ధర్మయుద్ధం పేరుతో టీఆర్ఎస్ను, ముఖ్యమంత్రి కేసీఆర్ను టార్గెట్ చేసి మరీ ప్రచారం చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులంతా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం మెడలు వంచాలంటే బీజేపీనే ప్రత్యామ్నాయమని చెబుతూ ఆ పార్టీ జాతీయ నాయకత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదు. అయినా 10 వేలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఎక్కడ పొరపాటు జరిగిందన్న విశ్లేషణల్లో పడింది. 15 రౌండ్ల ఓట్ల లెక్కింపులో 3 రౌండ్లలోనే బీజేపీకి ఆధిక్యం వచ్చిందని, మిగతా రౌండ్లలోని పోలింగ్ బూత్ల పరిధిలో పార్టీ ప్రచారం, ఓటర్లను ప్రభావితం చేయడంలో వైఫల్యాలను అంచనా వేసుకునే పనిలో పడింది. వైఫల్యాలే కారణమా.. కాంగ్రెస్ పార్టీ ప్రచార వైఫల్యం వల్లే ఓట్లు తగ్గాయన్న భావనలో ఉంది. టీఆర్ఎస్, బీజేపీలు ప్రచారంలోనూ ఇతర ఓటర్లను ప్రభావితం చేయడంలోనూ పోటీ పడ్డాయి. కాంగ్రెస్ మాత్రం వాటితో పోటీ పడలేని పరిస్థితి. ఇదే సందర్భంలో రాహుల్గాంధీ జోడో యాత్ర తెలంగాణకు రావడంతో రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్, భట్టి విక్రమార్క, ఇతర రాష్ట్ర నేతలంతా జోడో యాత్రలోనే ఉన్నారు. దీంతో చివరి దశలో ప్రచారం పెద్దగా చేయని పరిస్థితి నెలకొంది. చివరికి పోలింగ్ రోజున ఓటర్లను డబ్బు పంపిణీ విషయంలోనూ వెనుకబడింది. అయినా మహిళా సెంటిమెంట్, మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్రెడ్డి కూతురు అన్న భావనతో ఓట్లు భారీ ఎత్తున వస్తాయన్న అంచనాలు వేసుకుంది. అయినా వెనుకబడిపోయింది. ఈ విషయంలో పార్టీలో అంతర్గత సమస్యలు కారణమన్న అంచనాకు వచ్చింది. అయినప్పటికీ స్రవంతికి 23 వేలకు పైగా ఓట్లు వచ్చాయంటే మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ బాగానే ఉందన్నది నిరూపితమైంది. -
సాక్షి కార్టూన్ 08-11-2022
సాక్షి కార్టూన్ 08-11-2022 -
‘బిడ్డా మీ ఆటలు సాగవింక.. ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే ఉర్కించి కొడతాం’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడటంతో నాయకుల పరస్పర విమర్శలు రాజకీయ వేడిని తగ్గనీయడం లేదు. తాజాగా టీఆర్ఎస్ గెలుపును తక్కువ చేసి మాట్లాడతున్న నాయకులపై ఆ పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మందికి నీతులు వల్లించే ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజురాబాద్లో ఏం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది అవుతున్న సొంత నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్చేశారు. ఆయన హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి అని కౌశిక్రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మీడియాతో సోమవారం మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ఈ వందల కోట్లు ఎక్కడి నుండి తెచ్చారో చెప్పాలి. చొప్పరి వేణు నీతో ఉంటాడా లేదా? ఈటల హత్య రాజకీయాలు చేసే వ్యక్తి. ప్రవీణ్ యాదవ్ను పోలీసుల టార్చర్ తో చంపింది నిజం కాదా? నన్ను కూడా చంపే ప్రయత్నం చేయలేదా? ఇన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తే కానీ గొడవలు.. మీ భార్య సొంత ఊరిలో ఎలా గొడవలు చేశారు. పలివెల గ్రామంలో పల్లా రాజేశ్వర్ రెడ్డినీ చంపే కుట్ర చేశారు’ అని విమర్శలు చేశారు. (చదవండి: తెలంగాణ సర్కార్కి గవర్నర్ లేఖ.. అందులో ఏముంది?) ఇష్టానుసారంగా మాట్లాడితే కబర్ధార్! ‘వివేక్ నీ మొహానికి మళ్ళీ ఎంపీ గా గెలవగలవా? నువ్వు కనీసం వార్డ్ మెంబర్ గా గెలిచే స్థితి లేదు. కేటీఆర్ పైన ఇష్టానుసారంగా మాట్లాడితే బిడ్డ కబర్దార్. కేసిఆర్, కేటీఆర్ పైన ఇక నుండి ఏం మాట్లాడిన ఉర్కించి కొడతాం. బిడ్డ బీజేపీ నాయకుల్లారా ఇక నుండి మీ ఆటలు సాగవు. ఈటల రాజేందర్ నువ్వు గెలిచి ఏడాది దాటింది. హుజూరాబాద్ లో చేసిందేమిటి. రూ. 3000 పెన్షన్ అన్నవ్ ఇప్పటి వరకు ఇచ్చావా? రోడ్లు, డ్రైనేజ్ లైన అభివృద్ధి చేసినవా?’అని కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. కాగా, వామపక్షాల భిక్షతో టీఆర్ఎస్ గెలిచిందని ఈటల రాజేందర్ విమర్శించిన సంగతి తెలిసిందే. విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేసి టీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టారని, అధికార పార్టీకి పోలీసులు కూడా సహాకరించారని ఆరోపించారు. (చదవండి: బీజేపీ ఓటమిపై ఈటల హాట్ కామెంట్స్.. వారి భిక్షతోనే టీఆర్ఎస్ గెలిచింది!) -
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటున్న టీఆర్ఎస్.. ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాల విస్తరణకు వీలుగా భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందే ప్రయత్నాల్లో ఉన్న టీఆర్ఎస్, మునుగోడు ఉప ఎన్నిక గెలుపును కీలక మలుపుగా భావిస్తోంది. 2001లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలుపు ద్వారా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పినట్లుగానే మునుగోడు విజయం కూడా బీఆర్ఎస్కు కొత్త మలుపును ఇస్తుందని అంచనా వేస్తున్నారు. చదవండి: బీఆర్ఎస్గా టీఆర్ఎస్.. అభ్యంతరాలపై పత్రికా ప్రకటన రిలీజ్ కాంగ్రెస్కు గట్టి పట్టున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మునుగోడుకు పరిమితం చేయకుండా.. ఉపఎన్నికలో గెలుపును కేవలం మునుగోడుకే పరిమితం చేయకుండా రాష్ట్ర, జాతీయ రాజకీయాల కోణంలో ప్రొజెక్ట్ చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ప్రస్తుత ఉపఎన్నిక ఫలితంతో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ మరింత దూకుడును పెంచడమో లేదా వేగాన్ని తగ్గించడమో చేస్తుందని ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ అనుసరించే వ్యూహం ఎలా ఉంటుందనే కోణంపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. ప్రస్తుత ఫలితం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే అంశంపైనా టీఆర్ఎస్లో ఆసక్తి నెలకొంది. కేసీఆర్ నాయకత్వంలోని ఓ బృందం జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ వేయాల్సిన అడుగులపై కసరత్తు కొనసాగిస్తుందని, అదే సమయంలో 2023 ఎన్నికలపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించేలా తమ కార్యాచరణ ఉంటుందని టీఆర్ఎస్ కీలక నేత ఒకరు వెల్లడించారు. రాష్ట్రంలో వరుసగా మూడో పర్యాయం అధికారంలోకి రావడమే తమకు అత్యంత ప్రధానమని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ ఎన్నికల రాజకీయాలను ఎండగట్టడం ద్వారా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించేందుకు మునుగోడు గెలుపును వ్యూహంగా మలుచుకోవడంపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ఎన్నిక సరే.. మునుగోడుతో ఎన్నో మలుపులు
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ ,బీజేపీల మద్య హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో ఎన్నెన్నో ట్విస్టులు, జిమ్మిక్కులు జరిగిన తీరు రాజకీయాలకు అంత వన్నె తెచ్చేవి కావు. కాని గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఈ రోజులలో ఈ ప్రమాణాల గురించి పెద్దగా ఆలోచించడం అనవసరమనిపిస్తుంది. రాజకీయంగా చూస్తే టీఆర్ఎస్ గెలిచిన మాట నిజమేకాని, ఆశించినంత మెజార్టీ రాకపోవడం ఆ పార్టీకి కొంత నిరాశేనని చెప్పకతప్పదు. టీఆర్ఎస్ అభ్యర్ధి కె.ప్రభాకరరెడ్డి అంత బలమైన అభ్యర్ధి కాదని ప్రచారం జరిగిన నేపధ్యంలో ఈ మాత్రం మెజార్టీ అయినా రావడం ఆ పార్టీకి ఊరట అని భావించాలి. భవిష్యత్తుకు సంకేతం.! ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని తద్వారా తెలంగాణలో గట్టి పునాది వేసుకోవాలని విశ్వయత్నం చేసిన బీజేపీకి తీవ్ర ఆశాభంగమే ఎదురైందని చెప్పాలి. కాని రెండో స్థానంలోకి రావడం ద్వారా కాంగ్రెస్ను బాగా దెబ్బతీసినట్లయింది. భవిష్యత్తులో తామే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడానికి అవకాశం వచ్చినందుకు బీజేపీ సంతోషపడుతోంది. అందువల్లే ఓడిపోతే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఖాతాలోకి, గెలిస్తే బీజేపీ ఖాతాలోకి వస్తుందన్న విశ్లేషణలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మునుగోడులో తన పట్టు పూర్తిగా కోల్పోకపోయినా, డిపాజిట్ పోవడం , మూడో స్థానానికే పరిమితం కావడం పెద్ద దెబ్బ అని చెప్పాలి. అయినా టీఆర్ఎస్, బీజేపీల మధ్య సాగిన రాజకీయ యుద్దంలో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి 23వేల ఓట్లు తెచ్చుకోవడం విశేషమే . ఎందుకంటే ఇంతకు ముందు జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మరీ దారుణంగా మూడువేల లోపు ఓట్లకే పరిమితం అయింది. ఇక్కడ ఆ పరిస్థితి రాలేదు. ఎన్నికలో ఎవరిది పైచేయి.? స్థూలంగా చూస్తే తెలంగాణలో బీజేపీ దూకుడుకు టీఆర్ఎస్ కళ్లెం వేస్తే, ఇంతకాలం తనకు ఎదురులేదనుకున్న టీఆర్ఎస్ మెజార్టీని తగ్గించడం ద్వారా, రెండో స్థానాన్ని సాధించడం ద్వారా ఆ పార్టీని బీజేపీ కొంత ఆత్మరక్షణలో పడేసిందని చెప్పాలి. గత సాదారణ ఎన్నికలలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పక్షాన 22వేలకుపైగా మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో కోమటిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తు పై ఆలోచన చేసి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్లాలని ఆలోచించారు. ఆ క్రమంలో ఆయన కొన్నిసార్లు బీజేపీని ప్రశంసించడం, ఆ పార్టీలోకి వెళ్లనున్నట్లు సంకేతాలు ఇవ్వడం, మరికొన్నిసార్లు కాంగ్రెస్లోనే కొనసాగుతున్నట్లు చెప్పడం వంటి రాజకీయం నడిపారు. కేంద్రంలోకాని, తెలంగాణలో కాని కాంగ్రెస్ అధికారం రావడం సాద్యం కాదని ఆయన భావించడమే ఇందుకు కారణం. అదే సమయంలో తన నియోజకవర్గంలోని కాంగ్రెస్ క్యాడర్ తొలుత ఆయన పార్టీ మారడాన్ని అంగీకరించలేదు. అందుకే ఆయన చాలా సమయం తీసుకున్నారు. అంతేకాదు. ఒక దశలో తన సోదరుడు, ఎంపి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశించారు. తమకు ఆ బాద్యతలు అప్పగిస్తే పార్టీని తెలంగాణలో అదికారంలోకి తెస్తామని వారు అదిష్టానానికి చెప్పారు. కాని కాంగ్రెస్ అధినాయకత్వం టీడీపీ నుంచి వచ్చిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ బాధ్యత అప్పగించింది. కోమటిరెడ్డి కొత్త దారి రేవంత్ ఎంపిక తర్వాత కోమటిరెడ్డి సోదరులు బాగా హర్ట్ అయ్యారు. అప్పటి నుంచి రాజగోపాలరెడ్డి బీజేపీలోకి వెళ్లాలన్న గట్టి ఆలోచనకు వచ్చారు. ఇందుకోసం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కూడా కలిశారు. బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ నుంచి ఒక గట్టి నేత తమ పార్టీలోకి వస్తే బీజేపీకి మరింత ఊపు వస్తుందని భావించారు. రాజగోపాలరెడ్డి బీజేపీలోకి చేరడానికి ముందుగా నియోజకవర్గం అంతటా పర్యటించి తన మద్దతుదారులను మానసికంగా సిద్దం చేశారు. మెజార్టీ మద్దతుదారులను తనవైపు తిప్పుకున్నా, కాంగ్రెస్ నుంచి బయటకు రావడానికి ఇష్టపడని క్యాడర్ కూడా గణనీయంగానే ఉందని చెప్పాలి. అదే ఇప్పుడు కోమటిరెడ్డిని దెబ్బతీసింది.కాంగ్రెస్ పార్టీకి పది వేల నుంచి పదిహేనువేల ఓట్లు లోపే వస్తాయని వారు అనుకున్నారు. కోమటిరెడ్డి బీజేపీకి పరోక్షంగా మద్దతు ప్రకటించి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఉంటే ఈ ఉప ఎన్నిక వచ్చేదికాదు. వ్యూహాలు - ప్రతి వ్యూహాలు బీజేపీ తన బలాన్ని పెంచుకోవడానికి , తన పట్టును పరీక్షించుకోవడానికి ఉప ఎన్నిక తీసుకు వచ్చింది. మరో ఏడాదిలో జరగనున్న సాధారణ ఎన్నికలకు ఇది రిహార్సల్ అని, సెమీ ఫైనల్స్ అని ప్రచారం జరిగింది. మునుగోడులో గెలిస్తే ఒక ఊపు వచ్చి తెలంగాణ అంతటా బీజేపీకి బలమైన అభ్యర్ధులు దొరికి అధికారం వైపు వెళ్లవచ్చని ఆ పార్టీ నేతలు అనుకున్నారు. కాని వారి లక్ష్యం కొంతమేరే నెరవేరింది. వచ్చే సాధారణ ఎన్నికలలో గెలవాలంటే బీజేపీ ఇంకా చాలా కష్టపడవలసి ఉంటుంది. టీఆర్ఎస్ వ్యూహాలను పరిశీలిస్తే బీజేపీ ఎత్తుగడలను ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ పసిగట్టారు. అందులోను హుజూరాబాద్ లో బీజేపీ పక్షాన ఈటెల రాజేందర్ గెలవడంతో టీఆర్ఎస్ పై ప్రజలలో వచ్చిన అనుమానాలను పోగొట్టాలంటే మునుగోడు ఎట్టి పరిస్థితిలోను గెలిచి తీరాలని ఆయన అనుకున్నారు. మిషన్ మునుగోడు ఎన్నికల రాజకీయాలలో తలపండిన కేసీఆర్ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడానికి ముందే ప్రచారం ఆరంభించారు. మంత్రి జగదీష్ రెడ్డికి పూర్తి బాద్యతలు అప్పగించారు. ఆ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. తన రాజీనామా వల్లే టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలు చేపడుతోందని కోమటిరెడ్డి ప్రచారం చేసినా, దానిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుని వెళ్లారు. మొత్తం మంత్రులు,టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరిని మునుగోడులో ప్రచారానికి పంపించారు. తానుకూడా ఒక గ్రామానికి ఇన్ చార్జీగా ఉంటానని చెప్పడం ద్వారా నేతలకు ఈ ఎన్నిక ఎంత ముఖ్యమైనదో ఆయన తెలియచేశారు. బీఆర్ఎస్కు ఇదే నాంది జాతీయ పార్టీ బిఆర్ఎస్ కు మునుగోడు గెలుపు ఒక మలుపు అవుతుందని ప్రచారం చేశారు. ఇదే సమయంలో బీజేపీ విధానాలను తప్పుపడుతూ విమర్శలు కురిపించేవారు. ప్రభుత్వాలను కూలగొడుతూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హరిస్తోందని చెప్పడానికి నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని విజయవంతంగా తెరపైకి తెచ్చారు. దీనిని ఎదుర్కోవడానికి బీజేపీ చాలా కష్టపడవలసి వచ్చింది. వారు ఇదంతా డ్రామా అని ప్రచారం చేసినా, బీజేపీకి కొంత డామేజీ జరిగిందని చెప్పాలి.కోమటిరెడ్డికి కేంద్రం 18వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిందని, అంత మొత్తానికి ఆయన అమ్ముడుపోయారంటూ తీవ్ర ఆరోపణ చేసింది. మొత్తం 18వేల కోట్లు రాజగోపాలరెడ్డి జేబులోకి వచ్చాయేమోనని ప్రజలు అనుమానించే తీరులో ఈ ప్రచారం జరిగింది. దీనిపై బీజేపీ ఎంత వివరణ ఇచ్చినా పెద్దగా ఉపయోగం జరగలేదు. ఇంత చేసినా పది వేలే.! మామూలుగా ఎన్నికల్లో పది వేల మెజార్టీ మంచి మెజార్టీనే అవుతుంది. కాని టీఆర్ఎస్ గతంలో సాధించిన విజయాలు,మునుగోడులో కేంద్రీకరించిన తీరు, సర్వేలలో పదినుంచి పదిహేను శాతం ఆదిక్యతతో గెలుస్తుందని వచ్చిన అంచనాలు ..వీటన్నిటిని గమనంలోకి తీసుకుంటే ఇది గొప్ప మెజార్టీ కాదన్న అభిప్రాయం ఏర్పడింది. టీఆర్ఎస్ కు, బీజేపీకి మద్య నాలుగుశాతం ఓట్ల తేడానే ఉంది. ఈ రెండు పార్టీలు కూడా పోటాపోటీగా వ్యయం చేశాయన్నది వాస్తవం. టీఆర్ఎస్ నాలుగువేల చొప్పున, బీజేపీ మూడువేల చొప్పున, కాంగ్రెస్ వెయ్యి రూపాయల చొప్పున డబ్బు పంపిణీ చేశాయని చెబుతున్నారు.ఇవి కాకుండా స్థానిక నేతలను లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. స్టేట్ పోలీస్ x సెంట్రల్ ఫోర్సెస్ రోజూ ఓటర్లకు మద్యం , చికెన్ వంటివి సరఫరా చేశారు.కాగా బీజేపీ డబ్బును పట్టుకోవడానికి రాష్ట్ర పోలీసులను టీఆర్ఎస్ వాడుకుంటే, ఆదాయపన్ను శాఖ అదికారులను బీజేపీ వాడుకుంది. ఈ విషయంలో టీఆర్ఎస్ బాగా సఫలం అయిందని చెప్పాలి. పట్టుబడిన డబ్బులో అత్యధికం బీజేపీకి చెందినవారిదే కావడమే ఇందుకు ఉదాహరణ. ఆదాయపన్ను అదికారులు మంత్రి జగదీష్ రెడ్డి పిఎ ఇంటిలోకాని, మరికొన్ని చోట్ల కాని దాడులు చేసినా, అంతంతమాత్రంగానే డబ్బు పట్టుబడిందని చెబుతున్నారు.సిబిఐ, ఈడి వంటి సంస్థలను వాడుకుని ప్రత్యర్ధి పార్టీలను బీజేపీ ఇబ్బంది పెడుతోందన్న ప్రచారాన్ని కూడా టీఆర్ఎస్ విజయవంతంగా తీసుకు వెళ్లింది. డిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని బీజేపీ ప్రచారం చేసినా, టీఆర్ఎస్ ఆరోపణల ముందు ఇది ఆగలేదనిపిస్తుంది. ఏతావాతా చెప్పాలంటే టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలో గెలిచినప్పటికీ, వచ్చే సాధారణ ఎన్నికలలో పరిస్థితి అంత తేలికగా ఉండదన్న సంకేతం వచ్చింది. కారు కళ్లు తెరుస్తుందా? ఈ ఎన్నిక ద్వారా ఒక విషయం అర్థమయింది. టీఆర్ఎస్ పూర్తి అప్రమత్తం కావాల్సిన తరుణం అని చెప్పాలి. అలాగే బీజేపీకి తెలంగాణలో అదికారం వచ్చేంత సీన్ ఇప్పటికైతే రాలేదన్న సంగతి కూడా అర్ధం అవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఈ రెండు పార్టీల మధ్య బకరా అయిపోయింది. అక్కడికి సీనియర్ నేత, దివంగత పాల్వాయి గోవర్ధనరెడ్డి కి ఉన్న పలుకుబడి ఆయన కుమార్తెగా కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతికి కొంత ప్రయోజనం కలిగించింది. అయినా అది సరిపోలేదు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఉప ఎన్నిక సమయంలోనే తెలంగాణ లో పాదయాత్ర చేసినా, దాని ప్రభావం పడకపోవడం పార్టీకి కొంత నష్టమే అని చెప్పాలి. దీని ప్రభావం పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డిపై పడుతుంది. ఆయనకు వ్యతిరేకంగా పార్టీలోని కొన్ని గ్రూపులు పనిచేస్తున్నాయి. వారు మరింత క్రియాశీలకం అయి అదిష్టానానికి పిర్యాదులు చేయవచ్చు. ఈయన పీసీసీ అద్యక్షుడు అయ్యాక జరిగిన రెండు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ కు డిపాజిట్ పోవడం రేవంత్ కు అప్రతిష్ట తెచ్చే అంశమే అవుతుంది.బీజేపీ అభ్యర్ది సోదరుడు, భువనగిరి కాంగ్రెస్ ఎమ్.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు కూడా చర్చనీయాంశం అయింది. ఆయన తన సోదరుడికి అనుకూలంగా పరోక్షంగా ప్రచారం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆయనకు క్రమశిక్షణ సంఘం నోటీసు కూడా ఇచ్చింది.ఈ పరిణామం కూడా కాంగ్రెస్కు నష్టం చేసింది. వెంకటరెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారా?లేక బీజేపీలోకి వెళతారా అన్నది తేలవలసి ఉంది. ఎన్నో గుణపాఠాలు కాంగ్రెస్ అభ్యర్ధికి ఆర్దిక బలం అంతంత మాత్రమే ఉంది. కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు చీల్చకపోతే తమకు నష్టం వాటిల్లుతుందని టీఆర్ఎస్ ఈమెకు ఆర్దిక సాయం చేశారన్న ఆరోపణలను బీజేపీ గుప్పిస్తోంది. అందులో కొంత వాస్తవం ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది. ఒకప్పుడు అత్యంత బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ , తెలంగాణ ఆవిర్భావం తర్వాత కోలుకోలేని విధంగా మారింది.ల పెద్దగా ఉనికి లేని బీజేపీ రెండో స్థానంలోకి వచ్చి టీఆర్ఎస్ కు సవాలు విసురుతూ కాంగ్రెస్ ను వెనక్కి నెడుతోంది. తెలంగాణలో ఇప్పటికీ కాంగ్రెస్ కే క్యాడర్ అదికంగా ఉంది. అది బీజేపీ వైపు వెళ్లకుండా చూసుకోవడం కూడా కాంగ్రెస్కు సవాలే. మొత్తం మీద మూడు పార్టీలకు మునుగోడు ఉప ఎన్నిక కొత్త గుణపాఠాలను నేర్పిందని అనుకోవచ్చు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
అసలు ఆట ఇప్పుడే మొదలైంది.. కిషన్రెడ్డి కౌంటర్ ఎటాక్!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి చెందిన విషయం తెలిసిందే. బీజేపీ ఓటమిపై ఇప్పటికే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, తాజాగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘మునుగోడులో నైతిక విజయం బీజేపీదే. మేము గెలిచి ఓటమి చెందాము. ఓటర్లకు ప్రలోభాలు, బెదిరింపులతో టీఆర్ఎస్ గెలిచింది. ఓట్లు వేయకపోతే సంక్షేమ పథకాలు ఇవ్వబోమని బెదిరించారు. విచ్చలవిడిగా ప్రలోభాలకు గురిచేశారు. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందిస్తాము. గతంలో మునుగోడులో డిపాజిట్ రాని పరిస్థితి నుంచి రెండోస్థానంలోకి వచ్చాము. మునుగోడులో ప్రచారానికి బీజేపీ నుంచి బయట నాయకులు ఎవరూ రాలేదు. ఎవరిది సంసారమో, ఎవరిది వ్యభిచారమో ప్రజలకు తెలుసు. ఇక నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత కసిగా పనిచేస్తాము. వచ్చే ఎన్నికల్లో విజయం మాదే’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ‘ధనబలంతో బీజేపీ.. ప్రజల గొంతు నొక్కాలని చూసింది’ -
Cartoon: డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్
డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ -
సీరియస్ ఎన్నికలో నవ్వుల ‘పాల్’
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఆనంద్ కిలారి పాల్ (కేఏ పాల్) ప్రచారంలో ఓటర్లను భలే అలరించారు. రోజుకో రీతిలో తనదైన శైలిలో ప్రచారం చేశారు. పాల్ ప్రచారానికి ఓటర్లు మునుగోడు ఓటర్లు సైతం బాగా ఆకర్షితులయ్యారు. ఆయన కనిపిస్తే చాలు జనంలో జోష్ వచ్చింది. కానీ, ఓట్లలో మాత్రం పాల్ను ఆదరించలేదు. ఆయనకు కేవలం 805 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏ రౌండ్లోనూ కనీసం రెండంకెలు కూడా దాటలేదు. కౌంటింగ్ సెంటర్ వద్ద సైతం పాల్ సందడి చేశారు. (క్లిక్ చేయండి: మునుగోడు బరిలో కేఏ పాల్.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే..) ప్రజాస్వామ్యం ఖూనీ అయింది: కేఏ పాల్ నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన మాట్లాడుతూ... ఈవీఎంల పనితీరుపై నమ్మకం లేదన్నారు. ఉప ఎన్నికలో తన ఉంగరం గుర్తుకు 1.10లక్షల ఓట్లు పడినట్లు ప్రజలు చెప్పారని, సగం కౌంటింగ్ పూర్తయ్యాక తనకు 600 ఓట్లు కూడా రాలేదని వాపోయారు. ఇదంతా టీఆర్ఎస్, బీజేపీల కుట్ర అని ఆరోపించారు. ఫలితాలు చూస్తుంటే టీఆర్ఎస్ కుట్ర ఎంటో అర్థమవుతోందని, అధికారులంతా టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పాల్ ఆరోపించారు. -
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన
-
మునుగోడులో బెడిసికోట్టిన బీజేపీ స్కెచ్
-
కేసీఆర్ చాణుక్యమే గెలిపించింది
-
ఉత్కంఠ భరిత ఉపపోరులో టీఆర్ఎస్ ఘనవిజయం
-
'కారు' మెజారిటీకి గండి పెట్టిన రోడ్డు రోలర్, రోటీ మేకర్
నల్లగొండ: టీఆర్ఎస్ పార్టీ మెజారిటీకి కారును పోలిన గుర్తులతో గండి పడింది. ఉప ఎన్నికలో ఇండిపెండెంట్లకు కారును పోలి ఉన్న రోడ్డు రోలర్, చపాతి మేకర్ గుర్తులు వచ్చాయి. దీంతో కొందరు ఓటర్లు వాటిని చూసి కారు గుర్తే అనుకుని ఓటేసినట్లు తెలుస్తోంది. కారును పోలిన గుర్తులను మిగతావారికి ఇవ్వొద్దని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేసింది. అయినా దాన్ని తొలగించలేదు. మొత్తం ఉప ఎన్నికలో 47 మంది పోటీలో ఉండగా 12వ నెంబర్లో ఉన్న అభ్యర్థికి చపాతి మేకర్ గుర్తు వచ్చింది. ఆ గుర్తుకు 2,407 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా 14వ నెంబర్లో ఉన్న అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించారు. ఆ గుర్తుకు 1,874 ఓట్లు వచ్చాయి. ఈ రెండు గుర్తులకు వచ్చిన ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి పడితే మెజారిటీ మరింత పెరిగేదని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. కాగా, రెండో బ్యాలెట్లో 18వ నంబర్ అభ్యర్థి చెప్పుల గుర్తుకు 2,270 ఓట్లు వచ్చాయి. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
టీఆర్ఎస్కు కలిసొచ్చిన కమ్యూనిస్టుల మద్దతు.. కమలం ఆశలకు గండి..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అధికార టీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టుల పొత్తు కలిసొచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేందుకు ఈ పొత్తు దోహదపడింది. నియోజవర్గంలో సీపీఐ, సీపీఎంలకు ఉన్న బలం టీఆర్ఎస్కు తోడవడంతో ఆ పార్టీకి గెలుపు దక్కింది. కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరడంతో వారి ద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొంత మేర టీఆర్ఎస్ వైపు మళ్లడం కూడా టీఆర్ఎస్కు లాభం చేసింది. ఈ ఎన్నికల్లో రాజగోపాల్రెడ్డి గెలుపొందడం ద్వారా దక్షిణ తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ భావించింది. అయితే, బీజేపీని అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ పకడ్బందీ వ్యూహం అమలు చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడి ఆ రెండు పార్టీల మద్దతు పొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున సీపీఎం, సీపీఐ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో 15 వేల వరకు ఉన్న తమ ఓటు బ్యాంకును టీఆర్ఎస్కు మరల్చడంలో సక్సెస్ అయ్యారు. కమ్యూనిస్టులు కలిసి రావడంతో టీఆర్ఎస్కు మేలు చేకూరింది. తద్వారా టీఆర్ఎస్ అభ్యర్థి 10,309 ఓట్ల మెజారిటీతో గెలుపాందారు. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
సాక్షి కార్టూన్ 07-11-2022
-
Munugode Bypoll Results: సీఎం కేసీఆర్ సారు గ్రామంలో కారు జోరు
మర్రిగూడ/చండూరు: మునుగోడు ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ ఇన్చార్జిగా వ్యవహరించిన మర్రిగూడ మండలం లెంకలపల్లి ఎంపీటీసీ పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థికి 711 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక్కడ సహ ఇన్చార్జిగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి వ్యవహరించారు. ఈ ఎంపీటీసీ పరిధిలో లెంకలపల్లి, సరంపేట గ్రామాల్లోని మూడు బూత్లలో 4,009 మంది ఓటర్లు ఉండగా 2,793 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్కు 1,610, బీజేపీకీ 899, కాంగ్రెస్కు 95, బీఎస్పీకి 34, మిగతావి ఇతరులకు పోలయ్యాయి. కేటీఆర్ ఇన్చార్జిగా ఉన్న గట్టుప్పల్లో 47 ఓట్ల ఆధిక్యం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గట్టుప్పల్ ఎంపీటీసీ–1కు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆయన పరిధిలో 3,360 మంది ఓటర్లు ఉండగా 3097 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్కు 1359 ఓట్లు, బీజేపీకి 1312 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్కు 47 ఓట్ల ఆధిక్యం లభించింది. మంత్రి కేటీఆర్ తరపున పూర్తిగా సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆగయ్య ప్రచార బాధ్యతలు నిర్వహించారు. మర్రిగూడ మండల కేంద్రానికి మంత్రి హరీశ్రావు ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఇక్కడ మూడు బూత్లలో 2,785 మంది ఓటర్లు ఉండగా 2,522 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్కు 1,389, బీజేపీకి 792, కాంగ్రెస్కు 174, బీఎస్పీకి 37 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ బీజేపీపై టీఆర్ఎస్కు 597 ఓట్ల ఆధిక్యం లభించింది. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
నిబంధనల ప్రకారమే మునుగోడు ఉపఎన్నిక
సాక్షి, హైదరాబాద్: దేశం దృష్టిని ఆకర్షించిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ ప్రకటించారు. నిబంధనల ప్రకారమే ఎన్నిక నిర్వహించామని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ రిటర్నింగ్ అధికారి సస్పెండ్ కావడం దేశ చరిత్రలో తొలిసారిగా మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జరిగిందన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. వ్యక్తిగత స్థాయిలో కొందరు పొరపాట్లు చేసి దాని పర్యవసాలను అనుభవిస్తారన్నారు. 8న మునుగోడు ఉప ఎన్నిక కోడ్ ముగుస్తుందన్నారు. బీజేపీ ఆరోపణలు.. సీఈఓ వివరణ.. ఉప ఎన్నిక ఓట్లను 15 రౌండ్లలో లెక్కించగా, రౌండ్లవారీగా ఫలితాల ప్రకటనను కావాలనే జాప్యం చేస్తున్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ విషయమై సీఈఓ వికాస్రాజ్కు ఫోన్ చేసి రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో ఆలస్యంపై ప్రశ్నించారు. దీనిపై సీఈఓ వికాస్రాజ్ స్పందించారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడం వల్లే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అధిక సమయం పట్టిందన్నారు. ఒక్కో రౌండ్లో ఓట్లను లెక్కించిన తర్వాత వాటిని చెక్చేయాల్సి ఉంటుందని, అభ్యర్థుల ఏజెంట్ల నుంచి అంగీకారం తర్వాత కౌంటింగ్ అబ్జర్వర్ నుంచి ఆమోదంతో రిటర్నింగ్ అధికారి ఫలితాలను ప్రకటిస్తారని తెలిపారు. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
మునుగోడు ఉపఎన్నిక ఫలితం బీజేపీకి చెంపపెట్టు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘డబ్బు, మద్యం, అధికార మదంతో జనం గొంతు నొక్కి, ఓటర్లను కొనాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు మునుగోడు ప్రజల చైతన్యం ముందు విఫలమయ్యాయి. మునుగోడు ప్రజలు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటిచెప్తూ బీజేపీకి చెంపదెబ్బ రుచి చూపించారు..’’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయం అనంతరం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొమ్మిది ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ పెద్దలకు మునుగోడు ఉప ఎన్నిక గట్టి ఎదురుదెబ్బఅని పేర్కొన్నారు. వారు ఇంతా చేసి టీఆర్ఎస్ మెజారిటీని తగ్గించగలిగారే తప్ప మునుగోడు విజయాన్ని ఆపలేకపోయారని చెప్పారు. 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారని.. తొలిసారిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 స్థానాలు టీఆర్ఎస్కు కట్టబెట్టి కొత్త చరిత్ర లిఖించారని కేటీఆర్ అన్నారు. విచ్చలవిడి ధన ప్రవాహం ప్రజాస్వామ్య ప్రభుత్వాలను గౌరవించాలనే ఇంగితం లేకుండా తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ తెలంగాణలోనూ క్రూర రాజకీయ క్రీడకు తెరలేపిందని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ ఢిల్లీ, గల్లీ నాయకత్వం తొలిసారిగా ఢిల్లీ నుంచి రూ.వందల కోట్లు తరలించిందని.. డబ్బు, మద్యం, అధికార మదంతో ఓటర్లను కొనాలని అన్నిస్థాయిల్లో ప్రయత్నించిందని ఆరోపించారు. ‘‘ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అనుచరుడు, కరీంనగర్ కార్పొరేటర్ భర్త వేణు కోటి రూపాయలతో దొరికాడు. ఈటల రాజేందర్ పీఏ కడారి శ్రీనివాస్ రూ.90లక్షలతో పట్టుబడ్డాడు. మాజీ ఎంపీ వివేక్ గుజరాత్ నుంచి హవాలా ద్వారా రూ.2 కోట్లు తెప్పించి దొరికింది నిజం కాదా? డాక్యుమెంట్ ఎవిడెన్స్తో, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగానే దొరికిపోయిన దొంగల గురించి మాట్లాడుతున్నాను తప్ప ఆషామాషీగా ఆరోపణలు చేయడం లేదు. వివేక్ గతంలో ఈటల రాజేందర్కు, ఇప్పుడు రాజగోపాల్రెడ్డికి రూ.75 కోట్లను తన కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? రూ.75కోట్లు అభ్యర్థి పార్టీ మారగానే ఖాతాల్లోకి ప్రవహించింది నిజం కాదా? రాజగోపాల్రెడ్డికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా.. ఆయన అనుచరుడు రూ.కోటితో మణికొండలో పట్టుబడింది నిజం కాదా? జమున హ్యాచరీస్కు రూ.25 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది నిజం కాదా? ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా.. ఒక హవాలా ఆపరేటర్ మాదిరిగా వివేక్ను అడ్డం పెట్టుకున్నారు. ఎందుకోసం ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రా సంస్థ నుంచి రూ.5.25 కోట్లను మునుగోడులోని ఓటర్లు, బీజేపీ నేతల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని తాము ఫిర్యాదు చేస్తే.. బీజేపీ పెద్దలు ఎలక్షన్ కమిషన్పై ఒత్తిడి తెచ్చి ప్రేక్షపాత్ర వహించేలా చేశారని ఆరోపించారు. వామపక్షాల నేతలకు కృతజ్ఞతలు మునుగోడులో టీఆర్ఎస్ గెలుపునకు తోడ్పడిన సీపీఐ, సీపీఎం నాయకులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, పల్లా వెంకట్రెడ్డి, జాలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, యాదగిరిరావులకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయానికి దోహదపడిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లకు ధన్యవాదాలు చెప్పారు. నాటకాన్ని నడిపింది మోదీ, అమిత్షా ప్రధాని మోదీ, అమిత్ షాలు అహంకారం, డబ్బుతో కళ్లునెత్తికెక్కి రాజగోపాల్రెడ్డితో రాజీనామా చేయించి బలవంతపు ఉప ఎన్నికను ప్రజలపై రుద్దారని కేటీఆర్ విమర్శించారు. ‘ఉప ఎన్నికను రుద్దిన వారిపై మునుగోడు ప్రజలు గుద్దిన గుద్దుడుకు చెక్కరొచ్చింది. ఎన్నికల్లో ఇక్కడ కనిపించిన ముఖం రాజగోపాల్రెడ్డిదే కావొచ్చు. వెనకుండి నాటకం నడిపింది అమిత్ షా, మోదీ అనే విషయం ప్రజలకు తెలుసు. ఇంతకుముందు ఉపఎన్నికలు జరిగిన నారాయణ్ఖేడ్, హుజూర్నగర్, నాగార్జునసాగర్, దుబ్బాకలలో కనిపించని.. ధన ప్రవాహం హుజూరాబాద్, మునుగోడులలో ఎందుకు వచ్చిందో ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. డబ్బున్న ఈటల, రాజగోపాల్రెడ్డి ఉప ఎన్నికల్లోకి వచ్చాకే కలుషితం అయ్యాయి’ అని పేర్కొన్నారు. బీజేపీ అధికార దుర్వినియోగం, విచ్చలవిడితనానికి ఈ ఎన్నికలు పరాకాష్ట అని.. 15 కంపెనీల సీఆర్పీఎఫ్, 40 ఐటీ టీమ్లను దించి నియోజకవర్గం మీదికి దండయాత్రకు వచ్చారని విమర్శించారు. అయినా గతంకంటే టీఆర్ఎస్కు ఓటింగ్ శాతం 34.2 శాతం నుంచి 43 శాతానికి పెరిగిందని కేటీఆర్ చెప్పారు. బీజేపీ వాళ్లు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధానిని ప్రచారానికి తీసుకొచ్చారని.. తమ ఎమ్మెల్యేలు మునుగోడు ప్రచారానికి వెళితే తప్పేమిటని ప్రశ్నించారు. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: యావత్ తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరభవం చవిచూసింది. డిపాజిట్ కూడా దక్కించుకోలేేక మూడో స్థానానికి పరిమితమైంది. ఈ పరాజయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని రేవంత్ పేర్కొన్నారు. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పనిచేశామన్నది ముఖ్యమన్నారు. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా, నికార్సుగా, నిబద్ధతగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పని చేశామన్నది ముఖ్యం. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా నికార్సుగా, నిబద్ధతగా పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. — Revanth Reddy (@revanth_anumula) November 6, 2022 ఉత్కంఠగా సాగిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ 10వేలకుపైగా మెజార్టీతో ఘన విజయం సాధించింది. విజయంపై ధీమాగా ఉన్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలై రెండో స్థానంలో నిలిచారు. చదవండి: ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్ఎస్ జయకేతనం -
ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్ఎస్ జయకేతనం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ప్రజలు కారుకే జై కొట్టారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీని సాధించారు. ఈ ఎన్నికలో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. 2018 ఎన్నికల్లో కోల్పోయిన మునుగోడు స్థానాన్ని టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో తిరిగి దక్కించుకుంది. ముగ్గురి మధ్యే పోటీ..: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 3న జరగ్గా ఆదివారం నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. 686 పోస్టల్ బ్యాలెట్లు సహా 2,25,878 ఓట్లు (93.41 శాతం) పోలయ్యాయి. ఇందులో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి 97,006 ఓట్లురాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి 86,697 ఓట్లు, పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు వచ్చాయి. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్లు, 5 సర్వీసు ఓట్లలో.. టీఆర్ఎస్కు 405 పోస్టల్, 3 సర్వీసు ఓట్లు.. బీజేపీకి 211 పోస్టల్, ఒక సర్వీసు ఓటు.. కాంగ్రెస్కు 41 పోస్టల్, ఒక సర్వీసు ఓటు లభించాయి. మిగతా ఓట్లు బరిలో ఉన్న మిగతా 44 మంది అభ్యర్థులు, నోటాకు పడ్డాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే.. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలుత బీజేపీ, టీఆర్ఎస్ మ«ధ్య నువ్వానేనా అన్నట్టుగా కొనసాగింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరింది. ఇందులో 3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యం సాధించగా, మిగతా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ హవా కనిపించింది. కాంగ్రెస్ తొలి నుంచీ 3వ స్థానంలోనే ఉంది. మొదటి రౌండ్లో బీజేపీపై టీఆర్ఎస్ 1,292 ఓట్ల మెజారిటీ సాధించగా.. రెండో రౌండ్లో బీజేపీ 841 ఓట్ల మెజారిటీ సాధించింది. మూడో రౌండ్లోనూ బీజేపీకి 36 ఓట్లు ఎక్కువ వచ్చాయి. 4వ రౌండ్లో టీఆర్ఎస్కు 299 మెజారిటీ వచ్చింది. 5వ రౌండ్లో 817, 6వ రౌండ్లో 638, 7వ రౌండ్లో 399, 8వ రౌండ్లో 532, 9వ రౌండ్లో 852, 10వ రౌండ్ 488 ఓట్ల మెజారిటీని టీఆర్ఎస్ సాధించింది. అప్పటిదాకా ప్రతిరౌండ్లో వెయ్యిలోపే ఎక్కువ ఓట్లను సాధించిన టీఆర్ఎస్కు తర్వాత ఓట్లు పెరిగాయి. ఆ పార్టీకి 11వ రౌండ్లో 1,361, 12 రౌండ్లో 2వేల ఓట్లు, 13వ రౌండ్లో 1,345 ఓట్లు, 14వ రౌండ్లో 1,055 ఓట్లు మెజారిటీ వచ్చింది. చివరిదైన 15వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి 88 ఓట్లు ఎక్కువ వచ్చాయి. పోస్టల్/సర్వీస్ బ్యాలెట్లలో టీఆర్ఎస్కు మరో 194 ఓట్లు ఎక్కువ వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి 10,309 ఓట్లు మెజారిటీ సాధించారు. ఆద్యంతం ఉత్కంఠగా.. ఉప ఎన్నిక పోలింగ్కు సంబంధించి అన్ని సర్వేలు టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపాయి. భారీ మెజారిటీ వస్తుందని అనుకున్నా 10,309 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయితే ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపులో కొద్దిపాటి ఆధిక్యమే కనిపించడంతో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మొదటి రౌండ్ నుంచి 10వ రౌండ్ వరకు గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. తర్వాత పరిస్థితి మెల్లగా టీఆర్ఎస్ వైపు మొగ్గింది. 12వ రౌండ్ సమయానికి టీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయిందన్న అంచనాకు వచ్చేశారు. అయితే నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు పెరిగాయి. 2018లో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్రెడ్డికి 12,725 ఓట్లు లభించాయి. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి 86,694 ఓట్లు వచ్చాయి. మొత్తంగా నియోజకవర్గంలో బీజేపీకి పట్టు పెరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. డిపాజిట్ దక్కించుకోని కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థికి డిపాజిట్ దక్కాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం.. మొత్తంగా చెల్లుబాటైన ఓట్లలో ఆరో వంతు (16.7 శాతం) కంటే ఎక్కువ ఓట్లు రావాల్సి ఉంది. అంటే మునుగోడులో మొత్తంగా పోలైన 2,25,878 ఓట్లలో ఆరో వంతు అంటే 37,646 ఓట్లు, ఆపై వస్తే డిపాజిట్ దక్కినట్టు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆమెతోపాటు పోటీలో ఉన్న 45 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆశ, నిరాశల మధ్య బీజేపీ శ్రేణులు సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పోరాడి ఓడారు. అధికార పార్టీకి ప్రతి రౌండ్లోనూ నువ్వా నేనా అన్నట్టు గట్టి పోటీ ఇస్తూ వచ్చారు. దీనితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశనిరాశల మధ్య గడిపారు. ఉప ఎన్నికల్లో గెలిస్తే పార్టీ కార్యాలయం వద్ద హంగామా చేసేందుకు సరూర్నగర్ కార్పొరేటర్ ఏర్పాట్లు చేశారు. పదో రౌండ్ దాకా బీజేపీ పుంజుకుంటుందనే ఆశలున్నా.. తర్వాత అంతా నిరుత్సాహంలోకి వెళ్లిపోయారు. సమయం గడుస్తూ, బీజేపీ విజయావకాశాలు తగ్గినకొద్దీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆఫీసు నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఉదయం నుంచీ ఓట్ల లెక్కింపు సరళిని పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర సీనియర్ నేతలు, హిమాయత్నగర్లోని ఎంపీ కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఎప్పటికప్పుడు విశ్లేషించారు. చదవండి: పక్కా వ్యూహంతో విజయం -
టీఆర్ఎస్ గెలుపు పోలీసులు, ఈసీదే..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు కొందరు పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆదివారం మునుగోడు ఫలితం వెలువడ్డాక బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ నేతలు డాక్టర్ మనోహర్రెడ్డి, ఎస్.కుమార్, టి.వీరేందర్గౌడ్, జె.సంగప్ప, వెంకటరమణలతో కలసి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘సీఎం మోచేతి నీళ్లు తాగుతున్న ఆ అధికారులు టీఆర్ఎస్ను గెలిపించేందుకు అడ్డదారులు తొక్కారు. పోలీసులే దగ్గరుండి డబ్బు పంచారు. రూ. వందల కోట్లు పంచిన టీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎందుకు పట్టుపడలేదో, ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు కాలేదో వారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్కు బీజేపీకంటే అధిక ఓట్లు రావాలని ఆ పార్టీ తరఫున సైతం టీఆర్ఎస్ నేతలు డబ్బు పంచారు. అయినా ప్రజలు టీఆర్ఎస్కు అసలు సిసలైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆశీర్వదించారు’ అని సంజయ్ పేర్కొన్నారు. అయితే ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని ప్రకటించారు. ఓడిపోయినప్పడు కుంగిపోమని, గెలిచినప్పుడు పొంగిపోమని చెప్పారు. రాజగోపాల్రెడ్డి యుద్ధంలో హీరోలా పోరాడారన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం.. ‘టీఆర్ఎస్ నేతల పిచ్చి కూతలతో బీజేపీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. మరింత ఉత్సాహంతో, కసితో ప్రజలపక్షాన పోరాడతాం. వచ్చే ఎన్నికల్లో మునుగోడులో బీజేపీ జెండా ఎగరేస్తాం. మునుగోడు ఫలితంపై విశ్లేషించుకుంటాం’ అని బండి చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఈ ఫలితం ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ ఖతమైంది. సిట్టింగ్ స్థానాన్ని ఆ పార్టీ కోల్పోయింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. సీపీఐ, సీపీఎంతో ప్రత్యక్షంగా, కాంగ్రెస్తో పరోక్షంగా పొత్తు పెట్టుకొని పోటీ చేసినా... మనీ, మద్యం, మాంసం ఏరులై పారించినా... ఎన్నికల సంఘం అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకున్నా టీఆర్ఎస్కు 10 వేలకు మించి మెజారిటీ రాలేదు. బీజేపీ సింహంలా సింగిల్గా పోటీ చేసి గతంతో పోలిస్తే 7 రెట్లు అధికంగా 86 వేలకుపైగా ఓట్లు సాధించింది’ అని బండి సంజయ్ చెప్పారు. ఆ 12 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా? సీఎం కేసీఆర్కు ధైర్యముంటే కాంగ్రెస్ నుంచి అనైతికంగా టీఆర్ఎస్లో చేర్చుకున్న 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి వెళ్లే దమ్ముందా? అని సంజయ్ సవాల్ విసిరారు. ఉపఎన్నికలో గెలిపిస్తే మునుగోడులోని సమస్యలన్నీ 15 రోజుల్లో పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారని... ఆ గడువులోగా హామీలన్నింటినీ అమలు చేయాల్సిందేనని లేనిపక్షంలో ఊరుకోబోమని హెచ్చరించారు. కాగా, మునుగోడులో నైతిక విజయం బీజేపీ, రాజగోపాల్రెడ్డిదేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె. లక్ష్మణ్ చెప్పారు. సీఎం కేసీఆర్ మనీ, మద్యాన్ని ఏరులై పారించినా, ఊరికో ఎమ్మెల్యేను, మంత్రిని నియమించినా, రెండుసార్లు సీఎం పర్యటించినా బీజేపీ ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారన్నారు. -
పక్కా వ్యూహంతో విజయం
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాల దృష్ట్యా ఈసారి అన్ని అస్త్రశస్త్రాలతో మునుగోడు బరిలోకి దిగిన గులాబీదళం.. గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పక్కా వ్యూహం రచించి అమలు చేయడంతోపాటు పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపించడంతో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని విజయం వరించింది. అయితే బీజేపీ ఆత్మస్థైర్యం దెబ్బతీయడం లక్ష్యంగా భారీ మెజారిటీ సాధనకు టీఆర్ఎస్ చెమటోడ్చినా ప్రతిపక్ష బీజేపీ గట్టి పోటీ ఇచ్చినట్లు రౌండ్లవారీ గణాంకాలు వెల్లడించాయి. రాజగోపాల్రెడ్డి రాజీనామాకు ముందే అప్రమత్తం.. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరతారని ముందే పసిగట్టిన టీఆర్ఎస్ అధినేత... ఉపఎన్నిక సన్నాహాలను ముందస్తుగా ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు తొలివారంలో రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా జూన్ చివరి వారం నుంచే కేసీఆర్ తన వ్యూహాలకు పదునుపెట్టడం ప్రారంభించారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలను ఏకతాటిపైకి తేవడంతోపాటు అసమ్మతికి చెక్ పెట్టడంపై దృష్టి సారించారు. రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరికకు ఒక రోజు ముందే ఆగస్టు 20న మునుగోడులో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా పార్టీ యంత్రాంగంలో కేసీఆర్ కదలిక తెచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ముందే ఖరారైనా కేసీఆర్ మాత్రం నామినేషన్ల సమయంలోనే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలకు మునుగోడులో మండలాలవారీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి ఆత్మీయ సమ్మేళనాల ద్వారా స్థానికంగా పార్టీలో సంస్థాగత లోపాలను సరిదిద్దారు. నిఘా వర్గాలు, సర్వేల నివేదికలను సమీక్షిస్తూ వ్యూహాన్ని స్వయంగా పర్యవేక్షించారు. ప్రచారంలో కీలక నేతల మోహరింపు.. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అనుసరించిన వ్యూహంలోని లోపాలు పునరావృతం కాకుండా మునుగోడులో కేసీఆర్ కొత్త ప్రయత్నం చేశారు. గట్టుప్పల్ను మండలంగా ప్రకటించడం, నియోజకవర్గంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వారి సాయంపై వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావులతోపాటు స్వయంగా గ్రామ స్థాయిలో బాధ్యత తీసుకున్నారు. రాష్ట్ర మంత్రులు, 70కిపైగా మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లతోపాటు సుమారు 3 వేల మంది క్రియాశీల నాయకులను గ్రామ, బూత్ స్థాయిలో మోహరించారు. ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున పార్టీ నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించడం ద్వారా సూక్ష్మస్థాయిలో ఎన్నికల వ్యూహాన్ని పక్కాగా అమలయ్యేలా చూశారు. పకడ్బందీగా చేరికలు.. రాజగోపాల్రెడ్డితోపాటు కాంగ్రెస్ యంత్రాంగం గంప గుత్తగా బీజేపీలో చేరకుండా 4 నెలలుగా చేరికల వ్యూహాన్ని టీఆర్ఎస్ నిరంతరాయంగా అమలు చేసింది. పార్టీలో అసమ్మతిని చక్కదిద్దుతూనే కాంగ్రెస్, బీజేపీల నుంచి సుమారు 35 మందికిపైగా సర్పంచ్లు, ఎంపీటీసీలను చేర్చుకుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన మర్నాడే మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పార్టీని వీడినా శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్తోపాటు మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, పల్లె రవికుమార్ తదితరులను చేర్చుకొని కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంది. దక్కని భారీ మెజారిటీ.. పోలింగ్ సరళిని బట్టి 25 వేలకుపైగా ఓట్ల మెజారిటీ సాధిస్తామని టీఆర్ఎస్ అంచనా వేసింది. అయితే ఓట్ల లెక్కింపులో 10వ రౌండ్ వరకు రాజగోపాల్రెడ్డి నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైనట్లు గణాంకాలు వెల్లడించాయి. అదే సమయంలో కారు గుర్తును పోలిన చిహ్నాలైన రోడ్డు రోలర్, రోటీ మేకర్తోపాటు చెప్పుల గుర్తుతో పోటీ చేసిన మరో అభ్యర్థికి గణనీయమైన ఓట్లు రావడం కూడా మెజారిటీపై ప్రభావం చూపినట్లు టీఆర్ఎస్ భావిస్తోంది. -
డిపాజిట్ పోయినా.. కేడర్ నిలబెట్టింది!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ప్రభావంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, నల్లగొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గంలో ఆ పార్టీకి ఉన్న పట్టు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెస్కు ఇది మిశ్రమ ఫలితమేననే అభి ప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ఎమ్మె ల్యే రాజీనామా చేసి వేరే పార్టీ నుంచి పోటీ చేసినందునే దెబ్బతిన్నామని కాంగ్రెస్ నేతలు చెపుతున్నా..డిపాజిట్ కోల్పోవడం చిన్న విషయమేమీ కాదని, ఇది కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. అయితే, ఆ మాత్రం ఓట్లు వచ్చాయంటే కాంగ్రెస్ పార్టీని కేడర్ నిలబెట్టిన ట్టేనని, టీఆర్ఎస్– బీజేపీల మధ్య హోరాహోరీగా పోరు సాగినప్పటికీ కాంగ్రెస్ కేడర్ స్థైర్యాన్ని కోల్పోకుండా పనిచేయడం వల్లనే 24 వేల వరకు ఓట్లు వచ్చాయనే చర్చ జరుగుతోంది. అప్పటికి మెరుగుపడతాం.. రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్కు చెందిన మెజారిటీ కేడర్ను తన వెంట తీసుకుపోవడంతో పార్టీకి దెబ్బ తగిలిందని, నువ్వా.. నేనా.. అనే స్థాయిలో టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడటం, అదీ ఉప ఎన్నిక కావడంతో సంప్రదాయ ఓటర్లు బీజేపీ (రాజగోపాల్రెడ్డి) వైపు మొగ్గుచూపారే తప్ప సాధారణ ఎన్నికలు జరిగిన ప్పుడు ఈ పరిస్థితి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమ వుతోంది. హుజూరా బాద్లో జరిగిన ఎన్నికలో 3 వేల ఓట్లు మాత్రమే సాధించిన పరిస్థితి నుంచి, హోరాహోరీ పోరాటంలో 24 వేల వరకు ఓట్లు సాధించడం చెప్పుకోద గినదేనని, సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఇంత ఫోకస్ చేయలేదు కనుక తమ పరిస్థితి మరింత మెరుగవు తుందనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. మెజార్టీ నియోజకవర్గాల్లో తమ పార్టీ బలం పదిలంగానే ఉందని ధీమాను కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అప్పటి ఓట్లు కూడా రాలేదు 2014లో పాల్వాయి స్రవంతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు 27 వేల ఓట్లు పోలవగా, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా 24 వేల లోపు ఓట్లు మాత్రమే రావడం కూడా చర్చనీయాంశమవుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నప్పుడు వచ్చిన ఓట్లు కూడా పార్టీ పక్షాన నిలిచినప్పుడు రాకపోవడంపై కాంగ్రెస్లో అంతర్గతంగా గుబులు మొదలైంది. డిపాజిట్ కోల్పోవడం, మూడోస్థానానికి దిగజారడంతో రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమన్న నినాదానికి గండి పడిందా అనే చర్చ కూడా జరుగుతోంది. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓటమి చవిచూడడంతో పాటు డిపాజిట్లు కోల్పోవడంపై కూడా నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ పక్షాన వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కనుగోలు వ్యూహాలు కూడా పనిచేయడం లేదని ఈ ఫలితంతో అర్థమవుతోందని, చివరి క్షణంలో మహిళా గర్జన పెట్టకపోతే ఈ మాత్రం ఓట్లు కూడా వచ్చేవి కావని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఉప ఎన్నిక ఫలితంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు మాట్లాడుతూ ‘ఈ ఫలితం మాకు ధైర్యాన్ని ఇచ్చింది. కానీ ఆందోళన కూడా కలిగిస్తోంది. మా పార్టీ ఐసీయూలో చేరిందా? అనే అనుమానం వస్తోంది. పార్టీకి పట్టున్న నల్లగొండ జిల్లాలో మూడో స్థానానికి దిగజారడం, డిపాజిట్ కోల్పోవడం కచ్చితంగా ఆందోళన కలిగించే అంశమే. అయితే, పార్టీ కేడర్ స్థైర్యాన్ని మాత్రం అభినందించాల్సిందే. పార్టీని వీడి వెళ్లిపోయిన రాజగోపాల్రెడ్డి గెలవకుండా నిలువరించడం కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా మంచి పరిణామమే.’అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
టీఆర్ఎస్ వ్యూహాలను తక్కువగా అంచనా వేశాం!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడాన్ని ఆ పార్టీ నేతలు లోతుగా విశ్లేషించుకుంటున్నారు. ఆదివారం ఓట్ల లెక్కింపు ఆద్యంతం (2, 3 రౌండ్లలో మినహా) టీఆర్ఎస్ మెజారిటీ కొనసాగడం బీజేపీ నేతలను నిరాశకు గురిచేసింది. గట్టిగా ప్రయత్నించినా తమ అభ్యర్ధి విజయం సాధించకపోవడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయనివారు చెప్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సాధించిన విజయంతో మునుగోడులో కొంత అతి విశ్వాసంతో వ్యవహరించడం.. అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ల వ్యూహాలు, ప్రయత్నాలను తక్కువగా అంచనా వేయడం.. పార్టీ అవకాశాలను దెబ్బతీశాయని అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ సర్కార్పై, అభ్యర్థిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో బీజేపీ సులువుగా గెలుస్తుందన్న అంచనాలు తలకిందులు అయ్యాయని అంటున్నారు. టీఆర్ఎస్ ముందస్తుగా సిద్ధమవడంతో.. మునుగోడుకు సంబంధించి రాజగోపాల్రెడ్డి రాజీనామా నాటికే టీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాలు చేపట్టిందని, దీన్ని బీజేపీ పసిగట్టలేకపోయిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నియోజకవర్గ స్థాయిలో చేస్తున్న కసరత్తు, సంసిద్ధతకు ప్రచారం కల్పించకుండా.. టీఆర్ఎస్ నిర్వహించిన అండర్ గ్రౌండ్ ఆపరేషన్ను గ్రహించలేకపోయామని.. దీనితో తగినట్టుగా ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకోలేకపోవడం తమ అవకాశాలను దెబ్బతీసిందని అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ మునుగోడులో పక్కా ప్లానింగ్తో వ్యవహరించిందని.. మండలాలు, మున్సిపాలిటీల వారీగా కిందిస్థాయిలో ప్రతి వంద మంది ఓటర్ల వరకు పర్యవేక్షణ బృందాలను నియమించుకుని పట్టుసాధించిందని భావిస్తున్నారు. రాజగోపాల్రెడ్డి రాజీనామా నాటి నుంచి పోలింగ్ ముగిసేదాకా టీఆర్ఎస్ నేతలు చాపకింద నీరులా పనిచేయడంతో పరిస్థితి అధికార పార్టీకి అనుకూలంగా మారిందని పేర్కొంటున్నారు. రాజగోపాల్రెడ్డి వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా బీజేపీలోకి రాకపోవడం కూడా దెబ్బతినడానికి కారణమైందని.. అలాంటి కాంగ్రెస్ కేడర్ను టీఆర్ఎస్ పకడ్బందీగా తమవైపు తిప్పుకొందని స్పష్టం చేస్తున్నారు. అధికార యంత్రాంగం అండదండలతో..! రాష్ట్రంలో అధికారంలో ఉన్న కారణంగా అధికార, పోలీసు యంత్రాంగం అనుకూలంగా పనిచేయడం టీఆర్ఎస్కు కలిసి వచ్చిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ బీజేపీకి, కేంద్రమంత్రి, ఇతర ముఖ్యనేతల ప్రకటనలకు ప్రభుత్వ యంత్రాంగం ఆటంకాలు సృష్టించిందని.. చివరికి రాళ్లదాడులు, అడ్డుకోవడాలు వంటి చర్యల్లోనూ బీజేపీకి ప్రతికూలంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నారు. బీజేపీకి సంబంధమున్న వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకోవడం, దాన్ని మీడియాకు లీకులివ్వడం ద్వారా.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ప్రచారాన్ని టీఆర్ఎస్ బలంగా జనంలోకి తీసుకెళ్లగలిగిందని అంటున్నారు. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నించిందనే ఆరోపణలు కూడా కొంతమేర ప్రతికూల ప్రభావం చూపినట్టు అంచనా వేస్తున్నారు. -
మునుగోడు బరిలో కేఏ పాల్.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సూపర్ విక్టరీని అందుకుంది. దాదాపు 10వేల ఓట్లకుపైగా ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. ఘన విజయం సాధించారు. బీజేపీ రెండో స్థానంలో, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి మూడో స్థానంలో నిలిచాయి. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు సత్తా చాటారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసిన పాల్కు 805 ఓట్లు వచ్చాయి. అయితే, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి రెండు డిజిట్ల సంఖ్యకే పరిమితమైన పాల్.. పదమూడో రౌండ్లో అత్యధికంగా 86 ఓట్లు సాధించారు. ఇక, అత్యల్పంగా 15వ రౌండ్(ఆఖరి రౌండ్)లో 11 ఓట్లు సాధించడం విశేషం. మరోవైపు.. ఎన్నికల ఫలితాల వెలువడిన అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు. అంతా ఫ్రాడ్ అంటూ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు సీబీఐ విచారణ జరిపించడంలేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తును పోలిన సింబల్స్ అభ్యర్థులకు దాదాపు 6వేలకు పైగా ఓట్లు పడ్డాయి. ఇక, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చని పక్షంలో ఓటర్లు నోటాకు ఓటు వేసే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో నోటాకు 482 మంది ఓటు వేశారు. ఇది కూడా చదవండి: ‘కోమటిరెడ్డి బ్రదర్స్కు అంత సీన్ లేదు’ -
మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ రావు విశ్లేషణ ...
-
మునుగోడును దత్తత తీసుకుంటా: కేటీఆర్
హైదరాబాద్: మునుగోడులో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలో భాగంగా తాను ఇచ్చిన మాట ప్రకారం మునుగోడు అభివృద్ధికి కృషి చేస్తానని ట్వీటర్ ద్వారా కేటీఆర్ వెల్లడించారు. ముందుగా తమ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. టీఆర్ఎస్పై, కేసీఆర్పై నమ్మకం ఉంచి గెలిపించినందుకు ఆ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, తాను చెప్పిన హామీ ప్రకారం మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని అన్నారు. Many congratulations to @Koosukuntla_TRS Garu on being elected as the MLA of Munugodu Thanks to the people of Munugodu for reposing faith in TRS party & Hon’ble CM KCR’s leadership 🙏 As promised, will adopt the constituency & work towards expeditious progress of pending works pic.twitter.com/mAmtddXaf4 — KTR (@KTRTRS) November 6, 2022 ఇక్కడ చదవండి: మునుగోడులో టీఆర్ఎస్ భారీ విజయం.. టీఆర్ఎస్కు ఆయనో గోల్డెన్లెగ్.. ఉప ఎన్నికల్లో రికార్డులు బ్రేక్ -
అంత అహంకారమెందుకు.. టీఆర్ఎస్ గెలుపుపై బండి సంజయ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో ఊహించని రీతిలో బీజేపీ పార్టీ ఓటమిని చవిచూసింది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రచారంలో జోరు పెంచిన బీజేపీ.. గెలుపుపై ధీమా వ్యక్తం చేసినప్పటికీ మునుగోడు ప్రజలు మాత్రం టీఆర్ఎస్కు పట్టం కట్టారు. ఇక, బీజేపీ ఓటమి నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఓడిపోతే కుంగిపోమని స్పష్టం చేశారు. కాగా, బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజా తీర్పును గౌరవిస్తాము. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో యుద్ధం చేశారు. అధికార పార్టీ ఎన్ని బెదిరింపులకు పాల్పడినా బీజేపీ కార్యకర్తలు తలొగ్గకుండా పనిచేశారు. గెలిచిన ఆనందంలో టీఆర్ఎస్ నేతలు హామీలు నెరవేర్చుతామని చెప్పకుండా అహంకారంగా మాట్లాడుతున్నారు. మునుగోడు గెలుపు.. తండ్రి గెలుపా? కొడుకు గెలుపా?. అల్లుడి గెలుపా?. బీజేపీకి భయపడి.. మా పార్టీని ఎదుర్కొనేందుకు అన్ని శక్తులు (టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, పరోక్షంగా కాంగ్రెస్) కలిసి పనిచేశాయి. దమ్ముంటే టీఆర్ఎస్లో చేరిన 12 మందితో రాజీనామా చేయించండి. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రచారం చేస్తే 10వేల మెజార్టీ వచ్చింది. ఈ గెలుపు.. గెలుపే కాదు. మునుగోడు గెలుపు ఎన్నికల కమిషనర్ గెలుపు. టీఆర్ఎస్ వాళ్లు డబ్బులు పంచారు.. కానీ ఎక్కడా దొరకలేదు. టీఆర్ఎస్ను అడ్డుకునే దమ్మున్న పార్టీ బీజేపీనే. తెలంగాణ అంతటా బీజేపీ ఉంది. ముందు ముందు మరింత కమిట్మెంట్తో పనిచేస్తాము. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాము’ అని వెల్లడించారు. -
బిగ్ క్వశ్చన్ : మునుగోడు ఓటమి బీజేపీకి నేర్పిన పాఠం ఏంటి ..?
-
టీఆర్ఎస్ కు ఇంకా భారీ మెజారిటీ రావాల్సింది : కేటీఆర్
-
శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. విజయంపై కేటీఆర్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు సంబురాలు జరుపుకుంటున్నారు. గులాబీ పార్టీ విజయం సందర్భంగా కేటీఆర్.. మునుగోడు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘మునుగోడు ప్రజలు కేసీఆర్ పాలనకు పట్టం కట్టారు. అభివృద్ధికి, ఆత్మగౌరవానికి ప్రజలు పట్టం కట్టారు. నల్లగొండ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన సీపీఐ, సీపీఎం నేతలకు ధన్యవాదాలు. నల్లగొండ జిల్లాలో 12కు 12 సీట్లు గెలిపించి కొత్త చరిత్ర లిఖించిన ప్రజలకు ధన్యవాదాలు. అహంకారం, డబ్బు మదంలో తెలంగాణ ప్రజలపై ఢిల్లీబాసులు ఉప ఎన్నిక రుద్దారు. ఉప ఎన్నిక రుద్దినవారికి గట్టిగా బుద్ధిచెప్పారు. ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్షాకు చెంప పెట్టులాంటి తీర్పునిచ్చారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పారు. డబ్బుతో జనం గొంతు నొక్కాలని బీజేపీ భావించింది. సంజయ్ అనుచరుడు, ఈటల రాజేందర్ పీఏ డబ్బులతో దొరికిపోయారు. తెలంగాణలో క్రూరమైన క్రీడకు బీజేపీ తెరలేపింది. వివేక్ రూ. 75కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా?. ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. బీజేపీ అక్రమాలపై మేం ఆధారాలిచ్చినా ఈసీ పట్టించుకోలేదు. ప్రలోభాలతో మెజార్టీ తగ్గించారు కానీ గెలుపును ఆపలేకపోయారు. గతంలో కంటే మునుగోడులో మాకు 23వేల ఓట్లు అధికంగా వచ్చాయి. గతంతో పోలిస్తే టీఆర్ఎస్కు 9 శాతం ఓట్లు పెరిగాయి. ఈటల, రాజగోపాల్రెడ్డి వల్లే ఎన్నికలు డబ్బుమయమయ్యాయి. వాళ్లకు వందల కోట్లు ఎక్కడినుంచి వచ్చాయో ఆత్మవిమర్శ చేసుకోవాలి. కారును పోలిన గుర్తుకు 6 వేల ఓట్లు వచ్చాయి. కావాలనే రోడ్డు రోలర్ గుర్తును బలవంతంగా తెచ్చారు. బీజేపీ డ్రామాలను ప్రజలు నమ్మలేదు’ అని వ్యాఖ్యలు చేశారు. -
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం
-
మునుగోడులో టీఆర్ఎస్ భారీ విజయం..
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపు 10వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో వికర్టీని సాధించారు. ఇక, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండో స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మూడో స్థానంలో నిలిచారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ డిపాజిల్ కోల్పోవడం గమనార్హం. కాగా, మునుగోడు ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి తమ మార్క్ చూపించారు. ముఖ్యంగా కారు గుర్తును పోలి ఉన్న చపాతీ రోలర్, రోడ్డు రోలర్ గుర్తులకు భారీగా ఓట్లు పడ్డాయి. ఇక, అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపుతో గులాబీ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. -
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందడంతో మంత్రి మల్లారెడ్డి మాస్ స్టెప్పులు
-
మునుగోడులో టీఆర్ఎస్ అధర్మంగా గెలిచింది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
-
ప్రజలు కేసీఆర్తోనే ఉన్నారని మరోసారి రుజువైంది : మంత్రి జగదీష్ రెడ్డి
-
కోమటిరెడ్డి బ్రదర్స్పై మంత్రి జగదీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తపరుస్తున్నాయి. ఇక, ఉప ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కేసీఆర్తోనే ఉన్నారని మరోసారి రుజువైంది. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఛాలెంజ్పై మీడియా ప్రశ్నించగా.. మంత్రి జగదీష్ రెడ్డి..ఈ జిల్లాలో వాళ్ల అన్నదమ్ముల మాటలను ప్రజలు ఎవ్వరూ నమ్మరు. అలాంటి ఛాలెంజ్లు చాలా చేసే ఉంటారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ మాటను వారు అమలు చేయలేదు. వాళ్లు గురించి నేను పెద్దగా పట్టించుకోను. టీఆర్ఎస్ను ఓడించడానికి స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్షా, కేంద్రమంత్రులు, కీలక నేతలు వచ్చారు. కానీ, వారు కేసీఆర్ను ఓడించలేకపోయారు. బీజేపీ నేతలు ఎన్ని అక్రమాలు చేసినా.. అవినీతి చేసినా.. ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారు. కేసీఆర్గారు మీరు ఢిల్లీ వెళ్లండి.. దేశరాజకీయాల్లోకి వెళ్లండి అని ప్రజలు చెప్పకనే చెప్పారు. ఇక, ఇక్కడి నుంచే కేసీఆర్గారు ఢిల్లీపైన ధర్మయుద్ధం ప్రారంభిస్తారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. మరోవైపు.. కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న మునుగోడులో ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ డిపాజిట్ కోల్పోవడంపై కూడా మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. అది కాంగ్రెస్ పార్టీ స్వయంకృతపారాధం. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం లేదు అనడానికి ఇదే నిదర్శనం. నల్లగొండలో కాంగ్రెస్కు ఇక గత చర్రితే అని అన్నారు. -
మద్యం, డబ్బు పంచి టీఆర్ఎస్ గెలిచింది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
-
ఓటమిని అంగీకరించిన కోమటిరెడ్డి.. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మునుగోడులో, తెలంగాణ భవన్లో సంబురాలు జరుపుకుంటున్నాయి. ఇక, మునుగోడులో బీజేపీకి ఊహించని ఓటమి ఎదురైంది. మరోవైపు, ఎన్నికల ఫలితాల సందర్భంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాతీర్పును గౌరవిస్తున్నాను. ఈ ఎన్నికల్లో నైతిక విజయం నాదే. మునుగోడులో టీఆర్ఎస్ అధర్మంగా గెలిచింది. మద్యం, డబ్బు పంచి టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. డబ్బులు పంచేందుకు పోలీసులే సహకరించారు. పోలీసు వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరించింది. మమ్మల్ని కనీసం ప్రచారం కూడా చేసుకోనివ్వలేదు. దేశ చరిత్రలో తొలిసారి రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రలోభాలకు గురిచేశారు. అవినీతి సొమ్ముతో అడ్డదారులు తొక్కారు. అధికార యంత్రాంగం మొత్తం మునుగోడులోనే ఉంది. ప్రజల పక్షాన నా పోరాటం కొనసాగుతుంది. ఓవైపు ప్రలోభాలు.. మరోవైపు బెదిరింపులకు గురిచేసింది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మరోవైపు.. మునుగోడు ఉన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతు అయ్యింది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. ఎన్నికల ఫలితాల్లో మూడో స్థానంలో నిలిచారు. ఇది కూడా చదవండి: ఈటల అత్తగారి గ్రామంలో బీజేపీకి బూస్ట్.. దెబ్బకొట్టిన ఆ రెండు గుర్తులు! -
మునుగోడు: ఈటల అత్తగారి గ్రామంలో బీజేపీకి బూస్ట్.. దెబ్బకొట్టిన ఆ రెండు గుర్తులు!
సాక్షి, మునుగోడు: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల పూర్తి స్థాయి ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. ఇప్పటి వరకు 11వ రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. 11వ రౌండ్ వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక, మునుగోడు నియోజకవర్గంలోని ఈటల రాజేందర్ అత్తగారి గ్రామమైన పలివేల గ్రామంలో బీజీపీ.. టీఆర్ఎస్ పార్టీపై 207 ఓట్ల లీడ్ సాధించింది. ఇక, ఈ గ్రామానికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంఛార్జ్గా వ్యవహరించారు. ఇదిలా ఉండగా.. మునుగోడు ఓట్ల లెక్కింపులో ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ సత్తా చాటారు. ముఖ్యమైన పార్టీలకు భారీ షాకిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో ఈవీఎంలలో కారు మాదిరిగా ఉన్న చపాతీ రోలర్, రోడ్డు రోలర్ గుర్తులకు భారీగా ఓట్లు పడ్డాయి. ఏడో రౌండ్ ముగిసే వరకు చపాతీ రోలర్కు 994, రోడ్డు రోలర్ గుర్తుకు 746 ఓట్లు పోలయ్యాయి. కాగా, ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తుల కారణంగా పార్టీలకు కొంత ఎదురుదెబ్బ తగిలింది. -
11వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు
-
10వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
9వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
8వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
ఏడో రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
అధికారులను భయపెట్టడం సరికాదన్న మంత్రి జగదీష్ రెడ్డి
-
ఎన్నయినా చెప్పు! గెలవలేదని ఇచ్చిన డబ్బులు తిరిగివ్వడం కుదర్దు!
ఎన్నయినా చెప్పు! గెలవలేదని ఇచ్చిన డబ్బులు తిరిగివ్వడం కుదర్దు! -
ఈసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి?: రంజిత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే బీజేపీ నాయకులు ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడుతుండటాన్ని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి తప్పుపట్టారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగానే జరుగుతోందని తెలిపారు. బీజేపీకి తొందరపాటు ఎందుకు?. ఈసీ ఎవరి చేతిలో ఉంటుంది?. ఈసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. 'కౌంటింగ్కు కేంద్రం నుంచి అబ్జర్వర్ వస్తారు. వాళ్ల ఆధీనంలోనే కౌంటింగ్ జరుగుతుంది. బీజేపీ ఎన్ని డబ్బులు పంచినా, ఎంత మందు పోసినా ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఇప్పుడు వస్తున్న ఫలితాలే అందుకు నిదర్శనం. బీజేపీ నాయకులు అనవసరంగా మాట్లాడుతున్నారు. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు బీజేపీ నేతలు ఆగలేరా?. ఖర్చు పెట్టి ఓడిపోతున్నామనే భయంలో ఏదేదో మాట్లాడుతున్నారని' టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి మండిపడ్డారు. చదవండి: (Munugode Results: అందుకే ఫలితాలు ఆలస్యమవుతున్నాయి: వికాస్రాజ్) -
కౌంటింగ్ లో ఎలాంటి అవకతవకలు లేవు : ఈసీ
-
పరేషాన్లో టీఆర్ఎస్, బీజేపీ? వారికి భారీగా ఓట్లు.. ఎవరిది విజయం?
సాక్షి, నల్గొండ: హోరాహోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి సొంత మండలం చౌటుప్పల్లో చేదు ఫలితాలు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు సొంతూర్లోనే షాక్ తగిలింది. ఆయన సొంత గ్రామం లింగవారి గూడెం లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం.. తొలి రౌండ్లో స్వతంత్ర అభ్యర్థులు అనూహ్యంగా ఓట్లు సాధించడం విశేషం. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ తొలి రౌండ్లో.. చపాతి మేకర్ గుర్తు శ్రీశైలం యాదవ్ 104 ఓట్లు, చెప్పుల గుర్తు గాలయ్య 157 ఓట్లు, ఉంగరం గుర్తు కేఏ పాల్ 34 ఓట్లు, రోడ్డు రోలర్ గుర్తు శివకుమార్ 84 ఓట్లు సాధించారు. (చదవండి: ఎన్నికల ప్రధానాధికారి తీరుపై బీజేపీ సీరియస్) అయితే, నిముషనిముషానికి మారుతున్న ఆధిక్యం ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీకి కలవరం పుట్టిస్తుండగా.. ఇతర అభ్యర్థులు భారీగా ఓట్లకు గండిపెట్టడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ సహా 47 మంది అభ్యర్థులు మునుగోడు బరిలో నిలిచారు. ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం.. నాలుగు రౌండ్లు ముగిసేసరికి 63351ఓట్లను లెక్కించగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి 26443 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి 25729, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 7380 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి 714 స్వల్ప ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక అనూహ్యంగా బీఎస్పీ అభ్యర్థి అందోజు శంకరాచారి నాలుగు రౌండ్లలో కలిపి 907 ఓట్లు ఖాతాలో వేసుకోవడం గమనార్హం. ఇక మిగతా స్వతంత్రులు, నోటాకు పోలైన ఓట్లు 2892. ఈ ఓట్లు అభ్యర్థుల గెలుపోటలను తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించినా ఆశ్చర్యపోనవసరం లేదు! ఎవరి ఓట్లు చీలిపోయి ఓటమిపాలవుతారో? ఎవరికి మేలు జరిగి విజయబావుటా ఎగరేస్తారో చూడాలి. (చదవండి: ఓటమి తట్టుకోలేక కౌంటింగ్పై బీజేపీ ఆరోపణలు.. మంత్రి జగదీష్ రెడ్డి) -
మునుగోడు కౌంటింగ్ పై బీజేపీ సీరియస్
-
Munugode Results: అందుకే ఫలితాలు ఆలస్యమవుతున్నాయి: వికాస్రాజ్
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఆలస్యంపై సీఈఓ వికాస్రాజ్ స్పందించారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందునే కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. 'ప్రతి టేబుల్ దగ్గర అభ్యర్థుల ఏజెంట్లు ఉన్నారు. ఆర్వో సంతకం చేసిన తర్వాతే ఫలితాలను విడుదల చేస్తున్నాం. అయితే మిగత రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువమంది పోటీలో ఉండటంతోనే ఫలితాలు ఆలస్యమవుతున్నాయి. అందుకే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్డేట్ చేయడానికి ఆలస్యమవుతోందని' సీఈఓ వికాస్రాజ్ చెప్పారు. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు ఐదురౌండ్ల కౌంటింగ్ ముగిసింది. దాదాపు 75వేల ఓట్లు లెక్కింపు పూర్తి కాగా, ఇంకా లక్షన్నర ఓట్లు లెక్కించాల్సి ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి 5 రౌండ్లు ముగిసే సమయానికి 1430 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చదవండి: (Munugode Round Wise Results Live: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు) -
ఓటమి తట్టుకోలేక కౌంటింగ్పై బీజేపీ ఆరోపణలు.. మంత్రి జగదీష్ రెడ్డి
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్పై పొలిటికల్ వార్ నడుస్తోంది. ఈసీ తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కౌంటింగ్ మందకొడిగా సాగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై సీరియస్ అయ్యింది. ఫలితాల వెల్లడిలో ఏ పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చిరించింది. అయితే బీజేపీ ఆరోపణలను టీఆర్ఎస్ ఖండించింది. ఓటమి తట్టుకోలేకే కాషాయ పార్టీ ఆరోపణలు చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అధికారులను భయపెట్టడం సరికాదని విమర్శించారు. కాగా మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 5వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 1,631 ఓట్లతో ముందంజలో ఉంది. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం లింగంవారిగుడెంలో టీఆర్ఎస్ 340 ఓట్లు లీడ్ సాధించింది. మీడియా ఆందోళన మునుగోడు కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. తమకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. చదవండి: Munugode Bypoll 2022 Result: ఆధిక్యంలో టీఆర్ఎస్ -
ప్రజలు మాతోనే ఉన్నారు : రాజగోపాల్ రెడ్డి
-
Munugode Results: ఎన్నికల ప్రధానాధికారి తీరుపై బీజేపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్/నల్గొండ: మునుగోడు వార్ కొనసాగుతోంది. కౌంటింగ్ మందకొడిగా సాగడంలో బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రౌండ్ల వారీగా మునుగోడు ఉపఎన్నిక ఫలితాల వెల్లడిలో జాప్యంపై బీజేపీ సీరియస్ అయ్యింది. ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎప్పటికప్పుడు ఎందుకు వెల్లడించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈసీ తీరు అనుమానాస్పదం.. ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఆధిక్యాన్ని వెల్లడించడం లేదంటూ ఆరోపించారు. ఫలితాల్లో ఆలస్యం జరుగుతోంది. జాప్యానికి కారణలేంటో ఈసీ చెప్పాలని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్కు లీడ్ వస్తే తప్ప ఫలితాలు చెప్పరా? అంటూ మండిపడ్డారు. ఫలితాల వెల్లడిలో ఏ పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. సీఈవో విఫలం రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో సీఈవో విఫలం అయ్యిందని డీకే అరుణ అన్నారు. సీఈవో తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రచార సమయంలో చూపిన పక్షపాతమే ఫలితాల్లో చూపిస్తున్నారన్నారు. మీడియా ప్రతినిధులు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. -
నాలుగో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం
-
చౌటుప్పల్లో అనుకున్న మెజార్జీ రాలేదు
-
Munugode Bypoll: చౌటుప్పల్లో తక్కువ ఓట్లు.. నిరాశలో రాజగోపాల్ రెడ్డి
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. రౌండ్ రౌండ్ ముగిసే సమయానికి పార్టీల మధ్య ఆధిక్యం తారుమారవుతోంది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య టగ్ అఫ్ వార్ నడుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం వద్ద రాజగోపాల్రెడ్డి నిరాశ వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన బయటకు వచ్చేశారు. సొంత మండలం చౌటుప్పల్లో తాను అనుకున్న మెజార్టీ రాలేదని ఆవేదన చెందారు. ఫలితం ఎలాగైనా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. చివరి వరకు హోరాహోరి తప్పకపోవచ్చని, బాజేపీ గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు. కాగా చౌటుప్పల్ మండలంలో 55,678 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్కు 21,209...బీజేపీకి 21,174...కాంగ్రెస్కు 5,164 ఓట్లు పడ్డాయి. ఇక మునుగోడు కౌంటింగ్లో ఇప్పటి వరకు నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యింది. 4 రౌండ్లు ముగిసే సరికి 714 స్వల్ప ఓట్లతో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 4వ రౌండ్లో టీఆర్ఎస్కు 4,854 ఓట్లు రాగా, బీజేపీకి 4,555 ఓట్లు పోలయ్యాయి. చదవండి: ఆరు రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు -
మూడో రౌండ్ లో బీజేపీ ఆధిక్యం
-
రెండో రౌండ్ లో 1200 ఓట్లకు పైగా ఆధిక్యంలో బీజేపీ
-
మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ కు 1192 ఓట్ల ఆధిక్యం
-
7 అసెంబ్లీ స్థానాల ఫలితాలు.. నాలుగు సీట్లలో బీజేపీ విజయం
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన వాటిల్లో మహారాష్ట్రలో శివసేన, తెలంగాణలో టీఆర్ఎస్, బిహార్లో రెండింటిలో ఒక స్థానాన్ని ఆర్జేడీ దక్కించుకున్నాయి. ► మునుగోడు(తెలంగాణ).. టీఆర్ఎస్ ► అంధేరీ(మహారాష్ట్ర)... శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) ► మొకామా(బిహార్).. ఆర్జేడీ ► ధామ్నగర్(ఒరిశా).. బీజేపీ ► గోపాల్గంజ్(బిహార్)... బీజేపీ ► అదమ్పుర్(హరియాణా).. బీజేపీ ► గోలా గోక్రానాథ్(ఉత్తర్ప్రదేశ్).. బిజేపీ TIME: 3:45PM ► ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఫలితాలు తెలిపోయాయి. ఇప్పటి వరకు బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందింది. ఆర్జేడీ, శివసేన ఒక్కోస్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఒక స్థానంలో బీజేపీ ముందంజలో ఉండగా.. ఒక స్థానంలో టీఆర్ఎస్ లీడ్లో కొనసాగుతున్నాయి. బిహార్లోని గోపాల్గంజ్, హరియాణాలోని అదమ్పుర్, గోలా గోక్రానాథ్లో బీజేపీ విజయం సాధించింది. అంధేరీలో శివసేన అభ్యర్థి రుతుజా లాట్కే విజయం సాధించారు. TIME: 1:00PM ► అంధేరి తూర్పులో శివసేనకు చెందిన రుతుజా లట్కే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. పది రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత 37,469 ఓట్లతో లీడ్లో ఉన్నారు. రుతుజా లట్కే విజయం దాదాపు ఖరారు కావడంతో శివసేన కార్యకర్తలు సంబరాలు మొదలెట్టారు. ►బిహార్లోని గోపాల్గంజ్లో కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. 22వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి 607 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►యూపీలోని గోల గోకరనాథ్ ఉప ఎన్నిక కౌంటింగ్లో 29 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ దాదాపు 33,000 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ► మునుగోడు కౌంటింగ్ ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆరో రౌండ్ ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. చౌటుప్పల్, సంస్థాన్ నారాయపురం ఓట్లు లెక్కింపు ముగిసింది. ►ఒడిశాలోని ధామ్నగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,392 ఓట్లతో ముందంజలో ఉన్నారు. 6వ రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 22,495 ఓట్లు పోలయ్యాయి. Odisha | Counting underway for Dhamnagar by-elections. BJP candidate Suryabanshi Suraj continues his lead on the assembly seat after five rounds of counting, with a total of 22,495 votes so far. pic.twitter.com/TNe4j2UtLC — ANI (@ANI) November 6, 2022 ► హర్యానాలోని ఆదంపూర్ అసెంబ్లీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. 6 రౌండ్లు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్ 13,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►మొకమలో 20 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి ఆర్జేడీ 16,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తుంది. TIME: 12:00PM ► అంధేరి తూర్పులో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ అభ్యర్థి రుతుజా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయే సరికి 4,078 ఓట్లతో మెజార్టీ సాధించారు. ఇప్పటివరకు మొత్తం 29,033 ఓట్లు పోలయ్యాయి. ► ఒడిశాలోని ధమ్నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ 18,181 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేడీ అభ్యర్థి అబంతి దాస్ 14,920 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ► మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 5వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 1,631 ఓట్లతో ముందంజలో ఉంది. In Pics | Counting of votes in Andheri East bypoll elections underway Follow for live updates:https://t.co/069cEQIUP9 pic.twitter.com/XMyjNa7fu1 — Express Mumbai (@ie_mumbai) November 6, 2022 TIME: 11:00AM అంధేరి తూర్పులో ఐదో రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి రుతుజా లత్కే 2,630 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు ఆమెకు 17,278 ఓట్లు పోలయ్యాయి. ► బిహార్ మోకమలో తొమ్మిదో రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఆర్జేడీకి చెందిన నీలమ్ దేవి 35,036 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవి 24,299 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. TIME: 10:00AM బిహార్లోని రెండు( మోకమ, గోపాల్గంజ్) స్థానాల్లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి ఆర్జేడీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►అంధేరి (తూర్పు)లో రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన రుతుజా లట్కే 7,817 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. Patna, Bihar | Counting underway for Mokama By-poll, visuals from counting center Counting started at 8 am & is happening peacefully. 3-tier security deployed. No complaint so far, patrolling is being done in nearby areas: Manavjeet Singh Dhillon, SSP pic.twitter.com/9WtVmW3qfh — ANI (@ANI) November 6, 2022 ► ఒడిశాలోని ధామ్నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన సూర్యవంశీ సూరజ్ 4,749 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన అభ్యర్థి అబంతి దాస్కు 3,980 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. Haryana | Counting of #AdampurByElection underway. Outside visuals from counting center 3-layer security provided as EVMs have reached. CAPF & district police deployed. Law & order company with anti-riot equipment present in case of any eventuality. Checking is being done: SSP pic.twitter.com/KeJJYj7TNI — ANI (@ANI) November 6, 2022 ► యూపీలోని గోల గోకరానాథ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అమన్ గిరి నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి 15,866 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన వినయ్ తివారీ 10,853 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ►మునుగోడులో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 1,100 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుంది. సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగుతోంది. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు), బిహార్లోని మొకామా, గోపాల్గంజ్, హరియాణాలోని ఆదంపూర్, యూపీలోని గోలా గోరఖ్నాథ్లో, ఒడిశాలోని ధామ్నగర్తోపాటు తెలంగాణలోని మునుగోడు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ పోరులో ప్రధానంగా బీజేపీకి, ప్రాంతీయ పార్టీలకు మధ్యే పోటీ నడుస్తోంది. మధ్యాహ్నం వరకు ఫలితాలు తేలనున్నాయి. కాగా ఈ ఏడు నియోజవర్గాలకు ఈ నెల 3న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు (7) ►మహారాష్ట్ర-తూర్పు అంధేరి ►బిహార్-మోకమ ►బిహార్- గోపాల్గంజ్ ►హరియాణ-అదంపూర్ ►తెలంగాణ-మునుగోడు ►ఉత్తర్ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ►ఒడిశా- ధామ్నగర్ హరియాణలో మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఆదంపూర్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. శివసేన ఎమ్మెల్యే రమేష్ లత్కే అకాల మరణంతో అంధేరీ ఈస్ట్లో ఎన్నికలు వచ్చాయి. బిహార్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో మొకమ స్థానం ఖాళీ అయింది. బిహార్లోని గోపాల్గంజ్లో కూడా సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణం కారణంగా పోటీ అనివార్యమైంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆగస్టు 2న రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక జరిగింది. యూపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్ గిరి మృతి చెందడంతో లఖింపూర్ ఖేరీ జిల్లా గోల గోకరనాథ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మ్మెల్యే బిష్ణు చరణ్ దాస్ అకాల మరణంతో ధామ్నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. చదవండి: Munugode Bypoll 2022: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ముందంజ
-
భారీ మెజారిటీతో టీఆర్ఎస్ గెలుస్తుంది : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
-
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ప్రారంభం
-
మునుగోడు విజయంపై బీజేపీ ధీమా
-
Munugode By Election Results: టెన్షన్.. టెన్షన్
సాక్షి, నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఉప ఎన్నికల ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారోనన్న ఉత్కంఠ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఎవరికి అనుకూలంగా, మరెవరికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందోనన్న టెన్షన్ ప్రధాన పార్టీలకు తప్పడం లేదు. బరిలో ఉన్న 47 మంది అభ్యర్థులు, ఆయా పార్టీలు తీర్పు కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నాయి. ఆదివారం మధ్యాçహ్నం వరకు ఈ టెన్షన్ తప్పదు. ఏ పార్టీకి పట్టం కడతారో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో ఏ పార్టీ మునుగుతుందో, ఏ పార్టీ తేలుతుందో ఆదివా రం వెల్లడికానుంది. మూడు ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు ప్రధానం కావడంతో జోరుగా ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే హోరాహోరీ ప్రచారం కొనసాగింది. మొదట్లో జోరుగా ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కొంత నెమ్మదించింది. పోలింగ్ తేదీ దగ్గర పడిన సమయంలో మాత్రం మళ్లీ ప్రచార జోరును పెంచింది. అయితే టీఆర్ఎస్, బీజేపీ చేసినంత భారీ ఎత్తున ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్.. టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా(బీఆర్ఎస్) మార్పు చేయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోనే టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో దిగింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే టీఆర్ఎస్ పేరుతో ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి. ఈ స్థానం నుంచి 2014 ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ 2018 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పుడు తమ పాత స్థానాన్ని కచ్చితంగా దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఉప ఎన్నికల్లో ఇన్చార్జులుగా నియమించింది. వారు తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కూడా నియోజకవర్గంలో జరిగిన రెండు సభల్లో పాల్గొన్నారు. కేటీఆర్, హరీష్రావులు పెద్ద ఎత్తున రోడ్షోలు నిర్వహించారు. మంత్రులు ఆయా మండలాల్లో సభలు సమావేశాలు నిర్వహించారు. పక్కా వ్యూహంతో ఎన్నికల ప్రచారం పని చేసింది. దక్షిణ తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ దక్షిణ తెలంగాణలో పాగా వేసే లక్ష్యంతో బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిన రాజగోపాల్రెడ్డినే బీజేపీ నుంచి అభ్యర్థిగా పోటీలో నిలిపింది. ఆయన గెలుపు ద్వారా దక్షిణ తెలంగాణలో పాగా వేయాలని ఎన్నికల ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డింది. ఈ రెండు పార్టీల మధ్యే హోరా హోరీగా పోరు జరిగింది. సిట్టింగ్ స్థానం కోసం కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేసింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన రాజగోపాల్రెడ్డి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ మొదట్లో సీరియస్గా తీసుకుంది. మొదట దశలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. తర్వాత మధ్యలో నెమ్మదించింది. భారత్ జోడో యాత్రకు రాష్ట్ర నాయకత్వం అంతా వెళ్లడంతో కొంత వెనుకబడింది. చివరలో మళ్లీ ప్రచార జోరును పెంచింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. కౌటింగ్ ఇలా ► ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రాంరంభం ► 298 పోలింగ్ స్టేషన్లు ► 21 టేబుళ్లు, 15 రౌండ్లలో లెక్కింపు ► 294 పోలింగ్ స్టేషన్ల ఓట్లు 14 రౌండ్లలో లెక్కింపు ► 15వ రౌండ్లో 4 టేబుళ్లపై మిగిలిన ► 4 పోలింగ్ స్టేషన్ల ఓట్ల లెక్కింపు ► 9 గంటలకు మొదటి రౌండ్ ఫలితం ► చివరి ఫలితం ఒంటిగంట వరకు వచ్చే అవకాశం ► విధుల్లో పాల్గొనే మొత్తం సిబ్బంది 250 మంది ► అందులో కౌంటింగ్ కోసం 100 మంది, ఇతర కార్యకలాపాలకు 150 మంది ► ఒక్కో టేబుల్కు ఒక మైక్రో అబ్జర్వర్, ఒక పోలింగ్ సూపర్వైజర్, ఒక పోలింగ్ అసిస్టెంట్ ఉంటారు. ► అభ్యర్థుల ఏజెంట్లు ఉండేలా ఏర్పాట్లు పోలైన ఓట్లు ఇలా.. ► నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,855. ఇందులో 50 సర్వీసు ఓటర్లు. ► ఈవీఎంలలో పోలైనవి 225192 ఓట్లు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులు 739 మంది పోస్టల్ బ్యాలెట్కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 686 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలలో మొత్తంగా 2,25,878 ఓట్లు పోలయ్యాయి. 93.41 శాతం పోలింగ్ నమోదైంది. ► నవంబరు 4వ తేదీ నాటికి నాటికి సాయుధ బలగాలకు (సర్వీస్ ఓటర్స్) సంబంధించిన ఓట్లు 50 అందాయి. 4 గంటల వరకు కౌంటింగ్ పూర్తి కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అవసరమైన సిబ్బందిని నియమించాం. మొదటి రౌండ్లో చౌటుప్పల్, చివరి రౌండ్లో నాంపల్లి మండలాల కౌంటింగ్ ఉంటుంది. సాయంత్రం 4 గంటల వరకు కౌంటింగ్ పూర్తి కావచ్చు. ఈవీఎంల లెక్కింపు తరువాత డ్రా పద్ధతిన 5 పోలింగ్ స్టేషన్ల వీవీ ప్యాట్లను లెక్కిస్తాం. – జిల్లా ఎన్నికల అధికారి వినయ్కృష్ణారెడ్డి పటిష్ట భద్రత ఏర్పాటు చేశాం ఆర్జాలబావిలోని గోదాముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశాం. 470 మంది పోలీసులు, 3 కంపెనీల కేంద్ర బలగాలతో కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రతా చర్యలు చేపట్టాం. – ఎస్పీ రెమా రాజేశ్వరి -
మునుగోడు ఫలితాలు: కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న పాల్వాయి స్రవంతి
-
కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న రాజగోపాల్ రెడ్డి
-
నేడే మునుగోడు బైపోల్ తీర్పు
-
Munugode Result: మునుగోడులో టీఆర్ఎస్ విజయం
Time: 5:10PM ►మునుగోడులో టీఆర్ఎస్ విజయం ►ఏడు మండలాల్లో టీఆర్ఎస్కు ఆధిక్యం ►14 రౌండ్లు ముగిసేసరికి సుమారు 10వేల ఓట్ల ఆధిక్యంలో నిలిచిన టీఆర్ఎస్ ► 14వ రౌండ్లోనూ టీఆర్ఎస్దే ఆధిక్యం Time: 04:35PM ► విజయం దిశగా టీఆర్ఎస్ ► 13 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్9,039 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. ► 13వ రౌండ్లో టీఆర్ఎస్ 1,002 ఓట్ల ఆధిక్యం ► కాంగ్రెస్కు డిపాజిట్ గల్లంతు. Time: 03:53 PM 7,836 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ 12వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ పార్టీ 7,836 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 12వ రౌండ్లో టీఆర్ఎస్కు 2,042 ఓట్ల ఆధిక్యం దక్కింది. Time: 03:45 PM కేటీఆర్ మీడియా సమావేశం సాయంత్రం 5 గంటలకు కేటీఆర్ మీడియా సమావేశం. Time: 03:14 PM తెలంగాణ భవన్లో సంబురాలు షురూ.. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. రౌండ్లు ముగిసే కొద్ది భారీ ఆధిక్యం సాధిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణభవన్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. బాణసంచా కాల్చి, స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Time: 03:09 PM 11వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం 11వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 11వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీ 5,794 ఓట్ల ఆధిక్యంలో ఉంది. Time: 02:44 PM 10వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం 10వ రౌండ్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనబరిచింది. 10వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీ 4,436 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 10వ రౌండ్లో టీఆర్ఎస్ 484 ఓట్ల ఆధిక్యం సంపాదించింది. Time: 02:16 PM 9వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం 9వ రౌండ్లోనూ టీఆర్ఎస్ పార్టీనే ఆధిక్యం సాధించింది. 9 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 3,952 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 9వ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 7,515 ఓట్లు రాగా.. బీజేపీకి 6,665 ఓట్లు, కాంగ్రెస్కు 1,300 ఓట్లు, ఇతరులకు 1,100 ఓట్లు వచ్చాయి. Time: 01:58 PM చండూరుపైనే బీజేపీ ఆశలు 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చండూరు మున్సిపాలిటీ లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. చండూరుపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. 9,10 రౌండ్లలో చండూరు ఓట్ల లెక్కింపు జరుగనుంది. Time: 01:54 PM 8వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం 8వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 8 రౌండ్లు ముగిసేసరికి 3,104 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతోంది. 8 రౌండ్లో టీఆర్ఎస్ 536 ఓట్లు ఆధిక్యం కనబర్చింది. Time: 01:45 PM చండూరు మున్సిపాలిటీ లెక్కింపుపై ఉత్కంఠ 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.ఇప్పటివరకు టీఆర్ఎస్కు 45,710, బీజేపీకి 43,155 ఓట్లు పోల్ అయ్యాయి. ఇప్పటివరకు 1,10,000 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. చండూరు మున్సిపాలిటీ లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. చండూరుపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. 9,10 రౌండ్లలో చండూరు ఓట్ల లెక్కింపు జరగనుంది. Time: 01:27 PM ఏడో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం ఏడో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఏడు రౌండ్లు ముగిసేసరికి 2,555 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ 386 ఓట్లు ఆధిక్యం కనబర్చింది. ఏడో రౌండ్ టీఆర్ఎస్- 7,189 బీజేపీ-6,803 Time: 12:59 PM ఏడో రౌండ్ ఓట్లు లెక్కింపు మునుగోడులో హైవోల్టేజ్ హీట్ కొనసాగుతోంది. ఏడో రౌండ్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. ఏడో రౌండ్లో మునుగోడు మండలం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. Time: 12:34 PM ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆరో రౌండ్ ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. చౌటుప్పల్, సంస్థాన్ నారాయపురం ఓట్లు లెక్కింపు ముగిసింది. ఆరో రౌండ్ టీఆర్ఎస్-6,016 బీజేపీ- 5,378 Time: 12:05 PM పారదర్శకంగా కౌంటింగ్: సీఈవో ఆరో రౌండ్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. కౌంటింగ్ పారదర్శకంగా జరుగుతోందని సీఈవో వికాస్రాజ్ అన్నారు. ఆలస్యానికి కారణాలు కూడా వివరించాలని చెప్పానన్నారు. కౌంటింగ్లో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. ఎన్నికల పరిశీలకులు కూడా అక్కడ ఉన్నారన్నారు. ఎక్కువ మంది పోటీలో ఉండటం వల్లే కౌంటింగ్ ఆలస్యం అవుతుందని సీఈవో తెలిపారు. Time: 11:47 AM ఐదో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 1430 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతోంది. ఐదో రౌండ్ టీఆర్ఎస్- 5,961 బీజేపీ-5,245 Time: 11:18 AM ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఆధిక్యాన్ని వెల్లడించడం లేదంటూ ఆరోపించారు. ఫలితాల్లో ఆలస్యం జరుగుతోంది. జాప్యానికి కారణలేంటో ఈసీ చెప్పాలని బండి సంజయ్ అన్నారు. Time: 11:13 AM కాసేపట్లో ఐదో రౌండ్ ఫలితం ప్రతి రౌండ్కు ఉత్కంఠ కొనసాగుతుంది. రౌండ్ రౌండ్కు ఆధిక్యం మారుతుంది. ఐదో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. Time: 10:39 AM చౌటుప్పల్ మండలంలో పోలైన ఓట్లు-55,678 టీఆర్ఎస్- 21,209 బీజేపీ-21,174 కాంగ్రెస్-5,169 Time: 10:34 AM ఫలితం ఎలానైనా ఉండొచ్చు: రాజగోపాల్రెడ్డి చౌటుప్పల్లో తాను అనుకున్న మెజార్టీ రాలేదని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఫలితం ఎలానైనా ఉండొచ్చన్నారు. చివరి వరకు హోరాహోరీ తప్పకపోవచ్చని ఆయన అన్నారు. Time: 10:31 AM మునుగోడులో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి 714 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. నాలుగో రౌండ్ టీఆర్ఎస్-4,854 బీజేపీ-4,555 కాంగ్రెస్-1817 Time: 10:19 AM టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల సొంత గ్రామం లింగవారి గూడెం లో బీజేపీ ఆధిక్యం Time: 10:09 AM మునుగోడులో బీజేపీ ఆధిక్యం మునుగోడులో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. Time: 10:05 AM ఐదో రౌండ్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు.ఐదో రౌండ్లో నారాయణపురం ఓట్లు లెక్కిస్తున్నారు. నాలుగో రౌండ్లో 1100 ఓట్లకు పైగా బీజేపీ ఆధిక్యంలో ఉంది. Time: 09:57 AM మూడు రౌండ్లు ముగిసే సరికి 35 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతుంది. మూడో రౌండ్ టీఆర్ఎస్-7,010 బీజేపీ-7,426 కాంగ్రెస్-1,532 Time: 09:54 AM మొదటి రౌండ్లో కేఏ పాల్కు 34 ఓట్లు కేఏ పాల్కు తొలిరౌండ్లో 34 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. Time: 09:39 AM నాలుగో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. రౌండ్ రౌండ్కు ఆధిక్యం మారుతుంది. Time: 09:39 AM మూడు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో ఉంది. 1000 ఓట్లు పైగా ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. Time: 09:33 AM మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రెండు రౌండు ముగిసే సరికి 563 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. మూడో రౌండ్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్- 14,211 బీజేపీ-13,648 కాంగ్రెస్-2,100 Time: 09:25 AM ఆధిక్యంలో టీఆర్ఎస్ రెండు రౌండు ముగిసే సరికి 515 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతుంది. Time: 09:19 AM చౌటుప్పల్లో బీజేపీ ఆధిక్యం.. తొలిరౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా, రెండో రౌండ్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. చౌటుప్పల్ అర్బన్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. Time: 09:12 AM రెండో రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ ముందంజలో ఉంది. 789 ఓట్లకుపైగా బీజేపీ ఆధిక్యంలో ఉంది. Time: 09:01 AM చౌటుప్పల్ మండలం జైకేసారంలో టీఆర్ఎస్ లీడ్లో ఉంది. తొలిరౌండ్(14,553) టీఆర్ఎస్- 6,478 బీజేపీ- 5,126 కాంగ్రెస్- 2,100 Time: 08:55 AM 1352 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఈవీఎం తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 1352 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. Time: 08:45 AM పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్ఎస్కు నాలుగు ఓట్ల ఆధిక్యం, టీఆర్ఎస్కు 228, బీజేపీ 224, బీఎస్పీ -10, ఇతరులకు 88 ఓట్లు పోల్ అయ్యాయి. మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. Time: 08:30 AM టీఆర్ఎస్ ముందంజ.. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. 2 టేబుళ్లపై 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు Time: 08:15 AM పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. 2 టేబుళ్లపై 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. Time: 08:07 AM కౌంటింగ్ కోసం 23 టేబుళ్లు.. మునుగోడు కౌంటింగ్ కోసం 23 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 2 టేబుళ్లు కేటాయించారు. మిగిలిన 21 టేబుళ్లలపై ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. Time: 08:01 AM కౌంటింగ్ ప్రారంభం మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. 15 రౌండ్లలో కౌంటింగ్ ముగియనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కించనున్నారు. ముందుగా జైకేసారం, చివరగామహ్మదాపురం ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నానికల్లా విజేతపై స్పష్టత రానుంది. Time: 7:15 AM కాసేపట్లో కౌంటింగ్.. కాసేపట్లో మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కానుంది. 15 రౌండ్లలో కౌంటింగ్ ముగియనుంది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం వరకు పూర్తి కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం తేలిపోనుంది. అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ♦1,2,3 రౌండ్లలో చౌటుప్పల్ మండలం ఓట్లు లెక్కింపు ♦4,5,6 రౌండల్లో నారాయణపురం మండలం ఓట్ల లెక్కింపు ♦7,8 రౌండ్లలో మునుగోడు మండలం ఓట్ల లెక్కింపు ♦9,10 రౌండ్లలో చండూరు మండలం ఓట్ల లెక్కింపు ♦11,12,13,14,15 రౌండ్లలో మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లు లెక్కింపు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెలువడనుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు బహిర్గతం కానుంది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం వరకు పూర్తి కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం తేలిపోనుంది. అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ జరిగే విధానంపై సిబ్బందికి సాధారణ ఎన్నికల పరిశీలకులు పంకజ్ కుమార్ పలు సూచనలు చేశారు. నల్లగొండ ఆర్జాలబావిలోని గోదాముల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం రెండు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలోని ఓట్ల›లెక్కింపు కోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదటగా చౌటుప్పల్ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. అందులో మొదటి పోలింగ్ బూత్ అయిన జైకేసారం ఓట్లతో పాటు ఆ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. చివరగా నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామం ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ట్రెండ్ తెలిసిపోనుంది. 2 –3 గంటల కల్లా ఎవరి భవితవ్యం ఏంటనేది తేలనుంది. మునుగోడు ప్రజల తీర్పు వెల్లడికానుంది. నియోజకవర్గంలో 2,41,855 ఓటర్లు ఉన్నారు. అందులో సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని ఈ ఉప ఎన్నికల్లో 2,25,878 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 93.41 శాతం పోలింగ్ నమోదైంది. భారీ స్థాయిలో ఓట్లు పోలైన నేపథ్యంలో కౌంటింగ్కు సంబంధించి ఎంత ఆలస్యం జరిగినా సాయంత్రం 4 గంటల వరకు ఫలితం వెల్లడి కానుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ! కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా నాటి నుంచే అనధికారికంగా ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న ఎన్నికల షెడ్యూల్ జారీ అయినప్పటి నుంచి అధికారికంగా ప్రచారం కొనసాగింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి తమ పార్టీకి పట్టం కడతాయని టీఆర్ఎస్ విశ్వసిస్తుండగా ప్రజలకు తాను సేవ చేశానని, అలాగే యువతలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తనను గెలిపిస్తుందని రాజగోపాల్రెడ్డి భావిస్తున్నారు.