NTR Statue
-
చంద్రబాబుకు జ్ఞానాన్ని ప్రసాదించండి
అజిత్సింగ్నగర్ (విజయవాడసెంట్రల్)/కపిలేశ్వరపురం/అయినవిల్లి : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే బుద్ధి, జ్ఞానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రసాదించాలని కోరుతూ వలంటీర్లు ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఏపీ వలంటీర్ అసోసియేషన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగ్నగర్ కృష్ణా హోటల్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద గురువారం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ.. చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు వలంటీర్లను కొనసాగిస్తామని, వారికి నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని, అన్ని విధాలా న్యాయం చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల విజయవాడలో బుడమేరు వరదల సమయంలో కూడా వలంటీర్లతో సేవలు చేయించుకొని, సచివాలయాల్లో కనీసం అటెండెన్స్ వేసుకునే అవకాశాన్ని కూడా కల్పించకుండా వివక్ష చూపుతోందన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా బకాయి పడ్డ గౌరవ వేతనం చెల్లించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు తగిన జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించి వలంటీర్లకు న్యాయం చేసేలా చూడాలని కోరుతూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మమత, దమ్ము రమేష్, నరేష్, కల్యాణ్, షేక్ సైదాబీ, భాను, తేజస్విని, స్వప్న, షైనీ, రాజ్ కుమార్, సీపీఐ నాయకుడు కె.వి.భాస్కరరావు, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.ఎన్నికల హామీని అమలు చేయాలి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి, తమను విధుల్లోకి తీసుకోవాలని వలంటీర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఏడు నెలలుగా తమకు జీత భత్యాలు ఇవ్వడం లేదని ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదారిలంక, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలోని పంచాయతీ కార్యాలయాల్లో ఈ మేరకు గురువారం వారు వినతిపత్రాలు అందజేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో వలంటీర్లు తమ సమస్యలపై సచివాలయంలో వినతిపత్రం అందజేశారు. -
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణపై హైకోర్టు స్టే
-
లకారం ట్యాంక్బండ్పై ఎన్టీఆర్ విగ్రహం.. హైకోర్టు స్టే.. కీలక మార్పులు!
సాక్షి, ఖమ్మం: లకారం ట్యాంక్బండ్పై ఏర్పాటు చేసే ఎన్టీఆర్ విగ్రహం.. శ్రీకృష్టుడి రూపాన్ని పోలి ఉండటంపై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు ఉత్వర్వులు, యాదవ సంఘాల అభ్యంతరాలు గౌరవిస్తూ ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విగ్రహం కిరీటంలోని నెమలి పింఛం, వెనుక భాగాన విష్ణుచక్రం, పిల్లనగ్రోవి తొలగించి ఈ నెల 28న ఆవిష్కరిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు శ్రీకృష్ణావతారంలో రూపొందించిన ఎన్టీఆర్ విగ్రహం ఖమ్మం చేరుకుంది. భారీ వాహనంలో 54 అడుగుల విగ్రహాన్ని గురువారం లకారం ట్యాంక్బండ్ వద్దకు తీసుకొచ్చారు. విగ్రహాన్ని స్థానికులు పెద్ద సంఖ్యలో తిలకించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో ‘తానా’, ఎన్ఆర్ఐలు, పలువురు పారిశ్రామికవేత్తల సహకారంతో భారీ విగ్రహా న్ని నిజామాబాద్కు చెందిన కళాకారుడు వర్మ రూపొందించారు. కోర్టు ఉత్తర్వులు.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మంలోని లకారం చెరువులో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూప విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకోవడంపై హైకోర్టు గురువారం స్టే విధించింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ విగ్రహ ఏర్పాటు ను సవాల్ చేస్తూ భారత యాదవ సమితి, ఆల్ ఇండియా యాదవ సమితి, ఆదిభట్ల శ్రీకళాపీఠం, శ్రీకృష్ణ జేఏసీ సహా పలువురు లంచ్మోషన్ రూపంలో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్కుమార్ షావిలి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపైనే అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ప్రతిష్టించడాన్ని నిషేధిస్తూ 2016లో జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తుది తీర్పు వెలువరించే వరకు విగ్రహ ప్రతిష్టాపన ఆపాలని ఆదేశించింది. చదవండి: రూ. 3 వేల కోట్లతో.. ‘మెడ్ట్రానిక్’ విస్తరణ -
కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు ఖమ్మంలో విగ్రహం ఏర్పాటు చేయడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విగ్రహ ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు గురువారం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయొద్దంటూ గురువారం హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ఖమ్మంలోని లకారం చెరువు మధ్యలో తీగల వంతెనకు ప్రత్యేక ఆకర్షణగా.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విగ్రహాన్ని ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్తో ప్రారంభింపజేయాలని భావించిన మంత్రి పువ్వాడ అజయ్.. ఆయనకు ఆహ్వానం సైతం అందించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలోనే అసలు వివాదం మొదలైంది. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంపైనా హిందూ సంఘాలతో పాటు పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఓవైపు.. కాదని విగ్రహాన్ని ప్రారంభిస్తే కూలుస్తామంటూ భారత యాదవ సంఘం నేతలు హెచ్చరికలు సైతం జారీ చేశారు. మరోవైపు కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై నటి కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఎన్టీఆర్పై చేసిన కామెంట్లకుగానూ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) నుంచి షోకాజ్ నోటీసులు కూడా అందుకుంది. ఇంకోవైపు.. ఈలోపు ముగ్గురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని అయినా పెట్టుకోండి లేదంటే కృష్ణుడి విగ్రహాన్ని అయినా పెట్టుకోండి. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి వీల్లేదు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయొద్దు. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలి అని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. తానా అసోసియేషన్తోపాటు పలువురు ప్రముఖులు అందించిన ఆర్థిక సహకారంతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. నిజామాబాద్కు చెందిన వర్మ అనే చిత్రకారుడు శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. మే 28.. అయన జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించాలనుకున్నారు. బేస్మెంట్తో కలిసి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహం.. తల భాగం అయిదు అడుగులు, కాళ్ల భాగం అయిదు అడుగులు, ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు 45 అడుగులు ఉంది. -
జూనియర్ ఎన్టీఆర్ను కలిసిన మంత్రి పువ్వాడ.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్పై ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ను కలిసి ప్రారంభ ఏర్పాట్లపై చర్చించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి మే 28న తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరణ చేయనున్నారు. మే 28న శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్ పర్యాటకులను ఆకర్షించనున్నారు. ఇప్పటికే విగ్రహం తయారు పూర్తయి, విగ్రహ తరలింపునకు రంగం సిద్ధమైంది. మే 28న పండుగ వాతావరణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భారీ విగ్రహ ఆవిష్కరణను చేయనున్నారు. బేస్మెంట్తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. చదవండి: యాంకర్ ఉదయభాను నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా? (ఫొటోలు) ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు. రూ.2.3 కోట్ల వ్యయం కానున్న ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవ చూపారు. అవసరమయ్యే నిధులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు. చదవండి: ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్లో ఆస్తులు -
జూ ఎన్టీఆర్ నేను 60 లక్షలు పెట్టి మా సొంత స్థలంలో విగ్రహాలు పెట్టాం..
-
టీడీపీ నేతల కక్కుర్తి.. ఎన్టీఆర్ విగ్రహం పేరుతో డబ్బులు వసూలు!
సాక్షి, కర్నూలు: కర్నూలు నడిబొడ్డున గాయత్రి ఎస్టేట్లో టీడీపీ కార్యాలయం ఉంది. ఇక్కడ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని శుక్రవారం ప్రతిష్టించనున్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. పనిలో పనిగా పార్టీ కార్యాలయాన్ని కూడా కాస్త ఆధునికీకరించారు. అయితే, విగ్రహం పేరుతో వసూలు చేసిన చందాలపై ఆపార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. విగ్రహం ప్రతిష్టాపన పేరుతో జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు రూ.50లక్షలు వసూలు చేశారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డితో పాటు ఆపార్టీలోని మాజీ ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు భారీగా చందాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, పాటు టైల్స్, కిటికీలు, తలుపులు ఇలా ఒక్కొక్కటీ ఒక్కో నేత విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. ఇది చాలదన్నట్లు మండల స్థాయి, గ్రామ స్థాయి నేతల నుంచి కూడా సోమిశెట్టి విరాళాలు సేకరించారని, ఈ మొత్తం రూ.50 లక్షలదాకా ఉందని, ఇందులో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కూడా ఖర్చు కాలేదని, మిగిలిన నిధులు సోమిశెట్టి జేబులోకి వెళ్లాయని చంద్రబాబు పర్యటనకు హాజరైన టీడీపీ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. -
సెట్టింగ్ ‘బంగార్రాజు’.. ఇదేందయ్యా ఇది..
నెల్లిమర్ల(విజయనగరం జిల్లా): బంగార్రాజా మజాకా.. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయడానికి, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దక్కించుకోవడానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు పడరాని పాట్లు పడుతున్నారు. ఈనెల 17న భోగాపురం విచ్చేసిన చంద్రబాబుతో పోలిపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణకు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. టూర్ షెడ్యూల్లో లేనప్పటికీ బాబు కాన్వాయ్ను వెనక్కి మళ్లించి మరీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చదవండి: రచ్చ రచ్చ.. మైదుకూరు టీడీపీలో డీఎల్ ‘చిచ్చు’ అయితే ఆవిష్కరణ అనంతరం బాబు వెళ్లిన వెంటనే ఎన్టీఆర్ విగ్రహం అక్కడినుంచి మాయమైంది. సదరు విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి, బంగార్రాజు తన కారు షెడ్డులో పెట్టేశారు. ఇదే విషయమై ఆ పార్టీ నియోజకవర్గ నేతలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. కేవలం చంద్రబాబును ఆకర్షించడానికే ఆవిష్కరణ చేపట్టి, అనంతరం తొలగించారని గుసగుసలాడుకుంటున్నారు. బాబు కళ్లకే గంతలు కట్టిన ఘనుడు బంగార్రాజు అని ముక్కును వేలేసుకుంటున్నారు. -
నిమ్మకూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాంస్య విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన నిమ్మకూరులో ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని మంత్రి కొడాలి నాని తెలిపారు. మంత్రి కొడాలి నాని, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్తో కలసి నిమ్మకూరులో ఉంటున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సీఎం వైఎస్ జగన్ని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలిశారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినందుకు వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని పెట్టాలని కోరగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. అనంతరం క్యాంప్ కార్యాలయం వద్ద మంత్రి కొడాలి నాని విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు శతజయంతి సందర్భంగా నిమ్మకూరులో ఆయన కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నిమ్మకూరులో తాగునీటి సమస్యను ప్రస్తావించారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి రూ.కోటి మంజూరు చేశారని చెప్పారు. నిమ్మకూరులో ఇతర సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారన్నారు. -
టీడీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
సాక్షి, అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు అంటే అందరికీ గౌరవమేనని, గుంటూరు జిల్లా దుర్గిలో ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన ఘటన చాలా దురదృష్టకరమని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై సోమవారం ఆయన స్పందిస్తూ.. జరిగిన ఘటనను వైఎస్సార్సీపీ, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనను టీడీపీ రాజకీయంగా వాడుకోవడానికి చూస్తోందని, ఆ పార్టీ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని కోరారు. దివంగత ముఖ్యమంత్రులు వైఎస్సార్, ఎన్టీఆర్ లాంటి వారు రాష్ట్రాన్ని పరిపాలించిన గొప్ప వ్యక్తులని కొనియాడారు. వారి గౌరవార్థం విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెట్టుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, ఆయన చావుకు కారణమైన చంద్రబాబు ఈ చిన్న ఘటనను రాజకీయంగా వాడుకోవాలని చూడటం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. ఈ ఘటనకు, వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. నిందితుడిని అతని తండ్రే పోలీసులకు అప్పగించారని, పోలీసులు కూడా వెంటనే కేసు నమోదు చేశారని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ విగ్రహాలను తీసి పక్కన పడేసిన సందర్భాలు ఎన్నోచూశామని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం పాటుబడ్డ నాయకుడిగా ఎన్టీఆర్ను తాము గుర్తించి, గౌరవిస్తామని.. అయితే 1995లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసిన చంద్రబాబే ఆయన నాయకత్వాన్ని గుర్తించలేదన్నారు. -
ఎమ్మెల్యే ప్రతాప్కు బాలకృష్ణ ఫోన్..
నెల్లూరు ,కావలి: పట్టణంలోని ముసునూరులో మహాలక్ష్మమ్మ ఆలయ స్థలంలో ఆలయానికి ఎదుట రెండేళ్ల క్రితం టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడి నుంచి గ్రామస్తులు తొలగించి పక్కనే ఉన్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ప్రతిష్టించేందుకు నిర్వహిస్తున్న పనులు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా టీడీపీ నాయకులు పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు ముసునూరులో హడావుడి చేసినప్పటికీ గ్రామంలో వాస్తవ పరిస్థితులను గమనించి వివాదం చేయడం సరికాదనే అభిప్రాయానికి వచ్చారు. ఇదిలా ఉండగా నెల్లూరుకు చెందిన టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అంశానికి సంబంధించి వివాదాన్ని పెంచేందుకు చేసిన ప్రయత్నాలు ఆ పార్టీలోనే అంతర్గతంగా విమర్శలకు దారితీశాయి. కాగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి వాస్తవ పరిస్థితులను సినీ హీరో బాలకృష్ణకు వాట్సాప్ ద్వారా తెలియజేయడంతో బాలకృష్ణ నేరుగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డికి గురువారం ఫోన్ చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడిన అనంతరం బాలకృష్ణ ఎమ్మెల్యే తీసుకొన్న చొరవను అభినందించినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని బాలకృష్ణ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి తెలియజేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాజమండ్రి నుంచి కొత్తగా కొనుగోలు చేసిన ఎన్టీఆర్ విగ్రహం ముసునూరుకు చేరుకోవడంతో విగ్రహాన్ని ప్రతిష్టించే పనులు జరుగుతున్నాయి. పక్కనే ఉన్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద కూడా శిథిలమైన దిమ్మెను మెరుగుపరుస్తున్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి చెప్పినట్లుగానే విగ్రహాన్ని ముసునూరు కూడలిలోని బస్షెల్టర్ వద్దనే ఏర్పాటు చేస్తున్న తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
ఎన్నికల కోడ్ అమల్లోనూ పక్షపాతం!
సాక్షి, పొన్నూరు: ఎన్నికల కోడ్ను అమలు చేయాల్సిన అధికారుల పనితీరుపై విమర్శలొస్తున్నాయి. మండల పరిధిలోని బ్రాహ్మణకోడూరు, దొప్పలపూడి, మన్నవ, ఉప్పరపాలెం తదితర గ్రామాల్లో ఎన్నికల కోడ్ను పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. రాజకీయపార్టీ నాయకులకు చెందిన విగ్రహలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉంటే తొలగించాలని నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో గ్రామాల్లో ఘర్షణలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడు వచ్చి 10 రోజులు దాటినా అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పటికై నా ఎన్నికల అధికారులు స్పందించి అన్ని గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చేబ్రోలు: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికి అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా అధికారులు స్పందించికపోవటంపై విమర్శలు వ్యక్తంమవుతున్నాయి. మండల కేంద్రమైన చేబ్రోలులో పలు ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన బోర్డులు దర్శనమిస్తూనే ఉన్నాయి. చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలోని జీబీసీ ప్రధాన రహదారి పక్కన ఉన్న తల్లీ బిడ్డ చల్లగా కార్యాలయ గోడలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, పరిటాల సునీత, ఎమ్మెల్యే నరేంద్రకుమార్ల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు, వాల్ ఫోస్టర్లు తొలగింపునకు నోచుకోలేదు. చంద్రన్న సంచార చికిత్స వాహనంపై ముఖ్యమంత్రి ఫొటోను అలాగే ఉంచారు. నారాకోడూరు, చేబ్రోలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థతి. గ్రామాల్లో అధికారుల పనితీరు టీడీపీకి ఒక న్యాయం, వైఎస్సార్ సీపీకి మరో న్యాయం అన్న చందంగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. -
అర్ధరాత్రి ఇష్టారాజ్యం
ఉలవపాడు: అధికారం మనదే.. మన పార్టీ నాయకుని విగ్రహం .. అనుమతితో మనకు పనేంటి అనుకున్నారు..అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు. శనివారం రాత్రి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించారు. అధికారులందరూ సహకరించినా పక్కన ఉన్న స్థలాలు, దుకాణాల చిరు వ్యాపారులు అడ్డుకుంటారని తెలిసి దిమ్మె గుట్టుచప్పుడు కాకుండా నిలబెట్టారు. ఉలవపాడు పాత బస్టాండ్ సెంటర్లో శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. వివరాలు.. సెంటర్లో చాలాకాలంగా ఎన్టీ రామారావు విగ్రహం పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. పదేళ్ల కాలంలో అప్పటి టీడీపీ ఇన్చార్జిలు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు వివాదాస్పదంగా ఏర్పాటు చేయాలని ప్రయత్నించలేదు. దీని వలన ఇబ్బంది లేకుండా ఉండేలా చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే పోతుల రామారావు నియమించిన మండల ఇన్చార్జి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని భావించారు. వైఎస్సార్ విగ్రహం పక్కనే ఎన్టీఆర్ విగ్రహం ఉండాలని రోడ్డు పక్కన ఆర్అండ్బీ రోడ్డులో విగ్రహ దిమ్మెను ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా రాత్రికి రాత్రి దిమ్మె నిర్మించడంతో పక్క దుకాణాల యజమానులు విస్తుపోయారు. పట్టించుకోని అధికారులు ప్రస్తుతం అనుమతి లేకుండా ఎలాంటి విగ్రహాలు నిర్మించకూడదని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఆర్అండ్బీ రోడ్డులో పంచాయతీ అనుమతి లేకుండా విగ్రహ దిమ్మె నిర్మించారు. అధికారులు షరామామూలుగా అధికార పార్టీకి లొంగిపోయారు. గతంలో జగ్జీవన్రామ్ బొమ్మ దిమ్మెను నిర్మించినప్పుడు సీఐ, ఇద్దరు ఎస్ఐలు దగ్గరుండి దిమ్మె కట్టనీయకుండా అడ్డుకున్నారు. ఇక దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహం నిర్మించేందుకు కొందరు పనులు ప్రారంభిస్తే గంటకు పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. హైస్కూల్ సంఘంలో మృతి చెందిన ఓ ఆర్మీ సైనికుడి విగ్రహం కోసం దరఖాస్తు చేసుకుంటే అనుమతి లేదని అలగాయపాలెం రోడ్డులో నిర్మించకుండా అడ్డుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క అధికారి, పోలీసులు ఆ పక్కకు రాకుండా పనులు జరిగాయంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం అవుతోంది. వ్యవహారం వివాదాస్పదం ప్రస్తుతం ఎన్టీఆర్ దిమ్మె అంశం చర్చనీయాంశంగా మారింది. దిమ్మె వెనుక ముఠా వర్కర్స్ యూనియన్ ఆఫీసు ఉంది. 20 ఏళ్ల క్రితం ఆ స్థలాన్ని కార్మికులు పోరాడి సాధించుకున్నారు. దాని ముందు ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి దిమ్మె ఏర్పాటు చేశారు. ఆ యూనియన్ అధ్యక్షుడు నోరు మెదపకుండా ఉండేందుకు ఓ లోన్ శాంక్షన్ చేయించారు. గ్రీన్ అంబాసిడర్లో ఉద్యోగం ఇప్పించారు. పార్టీకి అనుకూలంగా ఉన్న ఎస్సీ నాయకులతో వారిని మాట్లాడనీయకుండా చేశారు. ఇటీవలే ఓ ఎస్సీ అధికారిపై దాడి జరిగిన పరిస్థితుల నేపథ్యంలో బస్డాండ్లో ఎస్సీ యూనియన్కు ఉన్న స్థలాన్ని కనపడనీయకుండా ఎన్టీఆర్ విగ్రహ దిమ్మెనిర్మించడం గమనార్హం. స్థానిక ఎమ్మెల్యే వివాదాలను పెంచి పోషిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. -
ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటులో ఉద్రిక్తత
విజయవాడ : విజయవాడలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కాలేజీ మైదానంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు యత్నించారు. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ప్రభుత్వ కాలేజీలో రాజకీయ నేత విగ్రహ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో టీడీపీ కార్యకర్తలకు, విద్యార్థి సంఘాలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పలువురు విద్యార్థి సంఘం నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. -
టీ కొట్టునూ వదల్లేదు..బాబు
విశాఖపట్నం : తోపుడు బండిపై ఆధారపడి బతుకుతున్న ఓ టీకొట్టు వ్యాపారి బతుకు బండి నెట్టి, ఓ బాబుగారు డాబు వెలగ బెడుతున్నారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ ప్రాంతంలో ప్రహరీ గోడ పక్కన.. మద్దిలపాలెం నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ రోడ్డుకు వెళ్లే మార్గం మలుపులో ఉన్న టీ కొట్టును ఎట్టకేలకు తొలగించారు. బండి తీయిస్తే బతుకు పోతుందని ఆ యజమాని బతిమిలాడినా పట్టించుకోలేదు. పంతం కోసం ఓ ‘పచ్చ’నాయకుడు పట్టుబట్టి మరీ బండి తొలగించేలా చేయించారు. తొలగించిన బండి స్థానంలో స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహం పెట్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా దాని చూట్టు ఉన్న పోలీస్ క్వార్టర్స్ ప్రహరీ గోడపై బారెడు సైజులో బాబుగారి బొమ్మలు పచ్చరంగులో గీసి మారి ఆర్భాటం చేస్తున్నారు. పచ్చనాయకులు చేస్తున్న ఆగడాలను చూస్తున్న స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. బాబు గారి ‘బొమ్మ’లు కనిపించేందుకేనా ఇంత ఆర్భాటమూ అంటున్నారు. -
విగ్రహాల విషయంలో బాబుది ద్వంద వైఖరి
-
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటా?
అనుమతుల్లేకుండా సన్నద్ధం న్యాయ పోరాటం చేస్తాం.. వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి కావటి మనోహర్నాయుడు అమరావతి: మండల కేంద్రమైన అమరావతి మద్దూరుడౌన్ సెంటర్లో ఎటువంటి అనుమతులు లేకుడా ఎన్టీఅర్ విగ్రహం ఏర్పాటు చేయడంపై పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కావటి శివనాగమనోహరనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ఎస్.ఐ వెంకటప్రసాద్కు ఫిర్యాదు అందించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ నగరాల అభివృద్ది పేరుతో ఆలయాలను నేలమట్టం చేసిన ప్రభుత్వం విజయవాడలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వైఎస్సార్ విగ్రహన్ని తొలగించటం దారుణమన్నారు. ఇటీవల అమరావతిలో రోడ్డు విస్తరణ అడ్డుగా ఉన్నాయనే సాకుతో జాతీయ నాయకులైన మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను తొలగించి, పక్కనే మూడు రోడ్ల కూడలిలో ఎన్టీఅర్ విగ్రహం ఏర్పాటు చేయడం టీడీపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. -
రాజమహేంద్రవరం తరలిన ఎన్టీఆర్ కృష్ణ విగ్రహం
కొత్తపేట: రాజమహేంద్రవరం నగరంలోని పుష్కరాల రేవులో నెలకొల్పేందుకు శ్రీకృష్ణుని రూపంలో తీర్చిదిద్దిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని శనివారం రాత్రి కొత్తపేట నుంచి తరలించారు. స్థానిక శిల్పి డి.రాజ్కుమార్ వుడయార్ ఐదు టన్నుల కాంస్యంతో 15 అడుగుల ఎత్తు గల ఎన్టీఆర్ కృష్ణుని విగ్రహాన్ని తయారు చేశారు. కొత్తపేటలోని రాజకుమార్ శిల్పశాలకు శనివారం సాయంత్రం వచ్చిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితరులు ఆ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని ప్యాకింగ్ చేసి క్రేన్ ద్వారా ప్రత్యేక వాహనంపై ఎక్కించి తరలించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగులైన్ల రోడ్డు విస్తరణ ప్రారంభం
► నాలుగు లైన్ల రోడ్డుగా సిరిసిల్ల బైపాస్ ► మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ కార్పొరేషన్ : పదికాలాల పాటు మన్నే విధంగా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ రోడ్ల విస్తరణ చేపడుతున్నామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సిరిసిల్ల బైపాస్ నాలుగులైన్ల రోడ్డు పనులను ఎంపీ వినోద్కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు. కరీంనగర్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నివారించే ఉద్దేశంతోనే బైపాస్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఐదు కిలోమీటర్ల మేర రూ.13 కోట్లతో రోడ్డును అందంగా తీర్చిదిద్దుతామన్నారు. రద్దీ నివారణతో పాటు వేగంగా ప్రయాణించేందుకు అనువుగా రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, భానుప్రసాదరావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కార్పొరేటర్లు రూప్సింగ్, సునిల్రా వు, బోనాల శ్రీకాంత్, ఎ.వి. రమణ, నా యకులు ఈద శంకర్రెడ్డి, చల్ల హరిశంక ర్,జి.ఎస్ఆనంద్తదితరులు పాల్గొన్నారు. -
మంద కృష్ణమాదిగ అరెస్ట్ అన్యాయం
దుత్తలూరు: విజయవాడలో విలేకరుల సమావేశానికి వెళ్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను అరెస్ట్ చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శ్రీనివాస మాదిగ పేర్కొన్నారు. మంద కృష్ణ మాదిగ అరెస్ట్ను నిరసిస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు సోమవారం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరెస్ట్లతో ఎస్సీవర్గీకరణ ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు యద్దనపూడి రమణయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి గొల్లపల్లి మోహన్రావు, జిల్లా ప్రచార కార్యదర్శి ఇలారి దేవదాసు, మండల ఇన్చార్జి కే మనోజ్, ప్రధాన కార్యదర్శి విజయ్, బొజ్జా వెంకటసుబ్బమ్మ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరసన కావలి అర్బన్: మంద కృష్ణ మాదిగ అరెస్టుకు నిరసనగా ఎమ్మార్పీఎస్ నాయకులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెం టర్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాస్ట్ర నేత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ చేపట్టకుంటే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు అక్కిలగుంట మార్టిన్ సుధాకర్ మాదిగ, మంద వెంకటేశ్వర్లు మాదిగ, చేవూరు మాల్యాద్రి మాదిగ, ఎలికా చంద్రశేఖర్ మాదిగ, మహేంద్ర మాదిగ, చంద్రశేఖర్, మోజెస్, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని నిప్పుపెట్టారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విగ్రహానికి స్వల్పంగా నష్టం వాటిల్లింది. సోమవారం గమనించిన పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ గ్రామంలో ధర్నా చేపట్టారు. -
'తగ్గిన' ఎన్టీఆర్ విగ్రహం
రాజమహేంద్రవరం కల్చరల్: రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహాన్ని మార్పు చేశారు. 13 అడుగుల విగ్రహాన్ని తీసివేసి 6 అడుగుల ఉన్న మరో విగ్రహాన్ని గురువారం రాత్రి నెలకొల్పారు. హఠాత్తుగా విగ్రహాన్ని మార్చడం వెనక కారణాలేమిటో తెలియరాలేదు. కాగా గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ విగ్రహ ఏర్పాటుపై విమర్శలు వెల్లువెత్తాయి. -
అన్నా...పార్టీని నాశనం చేస్తున్నారు..!
కొనసాగుతున్న నైషధం నిరసన సిటీబ్యూరో: కొందరు నాయకులు పార్టీని సర్వనాశనం చేస్తున్నారని, వారిపై తగుచర్యలు తీసుకోవడంతోపాటు నిజమైన కార్యకర్తలు, నాయకులకు తగిన న్యాయం చేయాలని కోరు తూ హైదరాబాద్ జిల్లా టీడీపీ నాయకుడు నైషధం సత్యనారాయణమూర్తి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి మరో లేఖ రాశారు. బుధవారం ఆ లేఖను ఎన్టీఆర్ విగ్రహాని కి అందజేసి వినూత్నంగా నిరసన తెల పారు. కార్పొరేటర్ టిక్కెట్ దక్కకపోవడంతో మస్థాపానికి లోనైన నైషధం గత మూడు రోజులుగా వివిధ మార్గాల్లో నిరసన తెలియజేస్తున్నారు. టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ మరో ఇద్దరితో కలిసి టిక్కెట్లు అమ్ముకున్నారని, విచారణ జరిపిస్తే సాక్ష్యాధారాలను అందజేస్తానని తాజా లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు అందుబాటులో లేనందున స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి లేఖను అందజేస్తున్నానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీని కాపాడాలంటే జూని యర్ ఎన్టీఆర్కు టీ-టీడీపీ బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ అప్రదిష్టపాలవుతుందని హెచ్చరించారు. -
'ఎన్టీఆర్ విగ్రహాన్ని వెంటనే తొలగించండి'
తూర్పుగోదావరి: రాజమండ్రి పుష్కరాల రేవు నుంచి ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్ చేశారు. పుష్కరాల రేవులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలన్నా సంకుచిత స్వభావం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ..పుష్కరాల రేవు వద్ద జరిగిన దుర్ఘటన ధార్మిక సంస్థల ఉత్సవాల్లో వచ్చిన నష్టం తప్ప..రాజకీయ వైఫల్యం కాదన్నారు. అందువల్ల సీఎం చంద్రబాబు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన అవసరంలేదన్నారు. కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లే దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నానన్నారు. బతికున్నప్పుడు తల్లిదండ్రులకు అన్నంపెట్టని వాళ్లు పుష్కరాల్లో పిండ ప్రధానం చేస్తే ఏం లాభమన్నారు. ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయనేతల ఓవరాక్షన్ ఎక్కువైందని నారాయణ విమర్శించారు. -
'గోదావరి ఒడ్డున ఎన్టీఆర్ విగ్రహం'
హైదరాబాద్: గోదావరి పుష్కరాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పుష్కరాల కోసం 248 పుష్కర ఘాట్ లను సిద్ధం చేసినట్టు చెప్పారు. వసతుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. మహానాడులో మూడో రోజు గోదావరి పుష్కరాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... పవిత్ర గోదావరిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నదుల అనుసంధానంతో రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. గోదావరి జలాలు ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడేలా ప్రణాళిక రచిస్తున్నామని తెలిపారు. గోదావరి ఒడ్డున శ్రీకృష్ణుడి వేషధారణలో ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టిస్తామని చంద్రబాబు ప్రకటించారు. -
అమెరికాకు ఎన్టీఆర్ విగ్రహం
కొత్తపేట: విశ్వవిఖ్యాత నట సౌర్వభౌముడిగా కీర్తి గడించిన ఎన్టీ రామారావు కృష్ణావతార పంచలోహ విగ్రహం తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలోని డి.రాజ్కుమార్ వుడయార్ శిల్పశాలలో రూపుదిద్దుకుంది. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వెస్ట్ కొవిన్ (కాలిఫోర్నియా)లోని పార్కులో నెలకొల్పేందుకు ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు వుడయార్ తెలిపారు. విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు శరత్ బి కామినేని దీని రూపకల్పనకు ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. జూలైలో తానా సభల సందర్భంగా ఆవిష్కరించనున్న ఈ ఎనిమిదడుగుల విగ్రహాన్ని 80 కిలోల పంచలోహాలతో తయారు చేసినట్లు చెప్పారు. విగ్రహాన్ని బుధవారం విమానంలో అమెరికా పంపించనున్నారు. -
'అన్న' ను అవమానించిన తెలుగు తమ్ముళ్లు
-
'అన్న' ను అవమానించిన తెలుగు తమ్ముళ్లు
రెండుగా వర్గాలుగా చీలిపోయి ఘర్షణకు దిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. ఏకంగా తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఘోర అవమానం తలపెట్టిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో జరిగింది. ఆదివారం మండల టీడీపీ సమావేశానికి హాజరైన మంత్రి పీతల సుజాత తీరును వ్యతిరేకిస్తూ ఓ వర్గానికి చెందినవారు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం రసాభసగా మారింది. మంత్రి రాజీనామా చేయాలని, మండలంలో ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దుచేసి కొత్త కమిటీని వేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ క్రమంలోనే జంగారెడ్డి గూడెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నల్ల దుస్తులు కప్పి నిరసన తెలిపారు. విభేదాల సంగతి ఎలా ఉన్నా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి అవమానం తలపెట్టడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్టీఆర్ అంటే అంత నిర్లక్ష్యమా!
వైఎస్సార్ జిల్లా(రాజంపేట): ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కమిటి కన్వీనర్ నారా లోకేష్ వైఎస్ఆర్ జిల్లా పర్యటన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది. లోకేష్ తీరుకు వారు చాలా నిరుత్సాహపడ్డారు. బ్రహ్మంగారి మఠం మండలం కేశవపురంలో ఇటీవల మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి బుధవారం ఉదయం ఆయన తిరుపతి నుంచి బయలుదేరారు. మార్గం మధ్యలో రాజంపేటలో కాసేపు ఆగారు. బైపాస్ సర్కిల్లో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేయించడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. పూలదండను ఎన్టీఆర్ విగ్రహం భుజంపై సిద్ధంగా ఉంచారు. లోకేష్ అక్కడకు రాగానే ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేయాలని కార్యకర్తలు, నేతలు కోరారు. ఇందుకు ఆయన స్పందించ లేదు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. అయినా లోకేష్ పట్టించుకోకుండా విగ్రహాన్ని చూస్తూ ముందుకు వెళ్లిపోయారు. దాంతో కార్యకర్తలు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు, తన తాత విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించకుండా లోకేష్ నిర్లక్ష్యంగా వెళ్లిపోయినందుకు కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు
మహ్మదాపురం (తిరుమలాయపాలెం): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందకుండా సీఎం చంద్రబాబు నాయుడు మోకాలడ్డుతున్నారన్న ఆగ్రహంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు గురువారం ఇక్కడ విధ్వంసానికి దిగారు. వరంగల్ జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటనను నిరసిస్తూ మాదిరిపురం-సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టారు. విగ్రహ ఆవిష్కరణ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం... ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్బంగా సుబ్లేడు క్రాస్ రోడ్డు వద్ద 100 అడుగుల భారీ పైలాన్ను టీడీపీ నాయకులు నిర్మించారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. దీనిని చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఆనాడు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మాదిగలకు పెద్ద కొడుకుగా ఉండి, ఎస్సీ వర్గీకరణకు న్యాయం చేస్తా’ అని ప్రకటించారు. ఆయన ఆనాడు ఇచ్చిన మాట తప్పారని, ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయన (చంద్రబాబు) పర్యటనను అడ్డుకునేందుకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే, పైలాన్ వద్ద చంద్రబాబు ఆవిష్కరించిన ఎన్టీఆర్ విగ్రహంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. టీడీపీ జెండా దిమ్మెను కూల్చేందుకు ప్రయత్నించారు. చుట్టుపక్కలవారు వచ్చేసరికి వారు ఆటోలో, మోటార్ సైకిళ్లపై సుబ్లేడు వైపు పరారయ్యూరు. స్థానికులు నీళ్లు తెచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి అంటుకున్న మంటలను ఆర్పేశారు. విగ్రహం వెనుక బాగం పూర్తిగా కాలిపోరుు, ఒకవైపునకు వంగింది. ఘటన స్థలంలో ఎమ్మార్పీఎస్ జెండా ఉంది. ఈ సమాచారమందుకున్న వెంటనే ఎస్సై ఓంకార్ యాదవ్ అక్కడకు వెళ్లారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నిప్పు పెట్టిన విగ్రహాన్ని కూసుమంచి సీఐ రవీందర్రెడ్డి పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్స్టేషన్లో టీడీపీ మండల అధ్యక్షుడు జోగుపర్తి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం కూసుమంచి సీఐ రవీందర్రెడ్డి నేతృత్వంలో పోలీసులు ముమ్మరం గాలిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు జోగుపర్తి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో ఖండించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు ఉనికి కోసమే ఇలాంటి విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
చంద్రబాబుకు మతిభ్రమించింది: అంబటి రాంబాబు
* వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు ధ్వజం * ఎక్కువమంది పిల్లల్ని కనమనడం బాబు అజ్ఞానానికి అద్దం పడుతోంది * సీఎం మానసిక స్థితిపై అనుమానంగా ఉంది సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రకటనలు ఆయన అజ్ఞానానికి అద్దం పట్టేవిగా ఉన్నాయని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అసలు ఆయన మానసిక పరిస్థితిపైనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పిన విధంగా ఎక్కువ మంది పిల్లల్ని కంటే రాష్ట్రం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. ఒకరు లేదా ఇద్దరు చాలు అన్నది ప్రభుత్వ నినాదమైతే, చంద్రబాబు మాత్రం ఎక్కువ మందిని కనాలని పిలుపునివ్వడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జపాన్లో వృద్ధులు ఎక్కువగా ఉన్నారని, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎక్కువ మందిని కనాలని చెప్పడం ఆయన అజ్ఞానానికి తార్కాణమన్నారు. ఒకపక్క పౌష్టికాహారలోపం సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఇంకా పిల్లలను కనండి అని చంద్రబాబు చెప్పడం అర్థరహితమన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని, ప్రభుత్వోద్యోగులకు ఇంక్రిమెంట్లు కూడా రావని చెప్పారు. మరి అలాంటి వారు ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారికి చంద్రబాబు ఆయా సదుపాయాలు కల్పిస్తారా? అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబుది పిచ్చి, చెత్త వాగుడు అంటూ రాంబాబు ద్వజమెత్తారు. చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తూ అక్కడి మేధావులతో చర్చలు జరుపుతున్నట్లు హడావుడి చేస్తున్నారన్నారు. విదేశీయులు ఏపీ రాజధాని నిర్మాణానికి పోటీ పడుతున్నట్లు ఓ అందమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ విగ్రహానికి శక్తి ఉంటే చంద్రబాబు భస్మమే.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ముట్టుకుంటే బాధలన్నీ మర్చి పోతామని, కోరికలన్నీ తీరుతాయని చంద్రబాబు చెప్పడాన్ని అంబటి ప్రస్తావిస్తూ.. ఎన్టీఆర్ విగ్రహానికి అద్భుత శక్తి ఉంటే తొలుత భస్మం అయ్యేది చంద్రబాబేనన్నారు. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసి చిత్రహింసలు పెట్టి ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు.. ఇపుడు ఆయనను దైవాంశసంభూతుడని చెప్పడం విడ్డూరమని అన్నారు. ఎన్టీఆర్ను తక్కువ చేసి మాట్లాడ్డం లేదని, ఆయనను ఒక మంచి పాలకుడుగా భావిస్తారని అయితే వేంకటేశ్వరస్వామితో పోల్చడం ఏ మాత్రం సరికాదన్నారు. పదవీ గండం భయంతో సైన్స్ కాంగ్రెస్ వేదికను మార్చడంపై మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మూఢ నమ్మకాలను పెంచుకుంటూ పోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కేటాయించిన భూములపై శాసనసభా సంఘాన్ని వేసి విచారణ జరిపిస్తామని మంత్రులు చెప్పడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్నారు. చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో రూ. 1.60 లక్షల కోట్ల విలువ చేసే 26 వేల ఎకరాల భూములను విశాఖ ఫార్మా, విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి అనేక సంస్థలకు కే టాయించారని, ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాటిపై కూడా న్యాయవిచారణ లేదా సభాసంఘం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. -
ఏపీ భవన్లో ‘నందమూరి బొమ్మల కొలువు’
సాక్షి, న్యూఢిల్లీ: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ భవన్లో ఆదివారం టీమ్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఆధ్వర్యంలో ‘అన్నగారి బొమ్మల కొలువు’ అనే చిత్రప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఏపీభవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన కె. బాలకోటేశ్వరరావు గీసిన 70 చిత్రాలను ప్రదర్శించారు. ఎన్టీఆర్ చిత్రాలను జీవం ఉట్టిపడేలా గీసిన చిత్రకారుడిని ఆహూతులు అభినందించారు. 2013లోనూ హైదరాబాద్ ఆర్ట్ గ్యాలరీలో మొట్టమొదటిసారిగా 150 చిత్రాలతో ప్రదర్శన నిర్వహించి నట్టు చిత్రకారుడు బాలకోటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీభవన్ ప్రత్యేకాధికారి కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చేబర్తిలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు
చర్యలకు టీడీపీ నేతల డిమాండ్ జగదేవ్పూర్ : మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ సంఘటన మండల పరిధిలోని చేబర్తి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి వరకు ఎన్టీఆర్ విగ్రహం బాగానే ఉన్నా.. శుక్రవారం ఉదయం ఆయన విగ్రహానికి తల భాగంలో కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. దీంతో తల భాగం నల్లగా మారిపోయింది. విషయం తెలుసుకున్న టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎన్టీఆర్ విగ్రహనికి పాలాభిషేకం చేశారు. అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ వీరన్న గ్రామానికి విగ్రహానికి నిప్పు పెట్టిన విషయమై ఆరా తీశారు. గ్రామ సర్పంచ్ జామున బాయి అర్జున్సింగ్లు, టీడీపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి భూమయ్య యాదవ్లు విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట ్టడం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుల పనేనని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి భూమయ్య, నాయకులు శ్రీకాంత్, ఇంద్రసేనారెడ్డిలు ఆరోపించారు. -
ఇదే చివరి అవకాశం
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న నారా లోకేష్ కార్యకర్తలతో నారా లోకేష్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ‘ఎన్నికలకు మూడు వారాల సమయం ఉంది..కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలి. ఇదే తెలుగుదేశం పార్టీకి చివరి అవకాశం. ఈ ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళుతుంది. అప్పుడు పార్టీని కాపాడేవారే ఉండరు’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం పర్చూరు నియోజకవర్గం మార్టూరులో నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలకు క్లాస్ తీసుకున్నారు.పార్టీ కష్టకాలంలో ఉన్నందునే తన తండ్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు సీట్లు ఇవ్వడంలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కార్యకర్తలకు నచ్చజెప్పే ధోరణితో మాట్లాడారు. గొంతు నొప్పిగా ఉందంటూ సగం మాటలను మింగేస్తూ మాట్లాడిన ఆయన చంద్రబాబు హైదరాబాద్ను తొమ్మిదేళ్లలో అభివృద్ధి చేశాడని, కొత్త రాజధానిని అభివృద్ధి చేయాలంటే మళ్లీ ఆయన అవసరమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తరువాత ఆయన మార్టూరు, అద్దంకి, ఒంగోలులో ప్రసంగించారు. యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన నారా లోకేష్ పర్యటనలో రెండు చోట్ల ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. పర్చూరు నియోజకవర్గం మార్టూరు మండలంలోని ఇసుకదర్శి చేరుకున్న లోకేష్, అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో విగ్రహానికి ముసుగు వేయాల్సి ఉండగా దాన్ని ఉల్లంఘించారు. ఎన్టీఆర్ విగ్రహం ముందు పర్చూరు నియోజకవర్గ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుకు బీ ఫారం అందజేశారు. అక్కడ నుంచి ఏలూరి సాంబశివరావు స్వగ్రామం కోణంకి చేరుకుని, అక్కడ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేశారు. దీంతోపాటు పనిలోపనిగా పక్కనే ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి కూడా పూలమాల వేశారు. అక్కడ పోలీసులున్నా, ఎన్నికల కోడ్పై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. -
ముసుగు వేసిందెవరు ?
ధర్మవరంటౌన్, న్యూస్లైన్ : ఎన్నికల నేపథ్యంలో నేతల విగ్రహాలకు ముసుగు వేయడంలో వివక్ష కనిపిస్తోంది. ధర్మవరంలోని పాండురంగ సర్కిల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్ విగ్రహానికి ముసుగు తొడిగారు. పక్కనున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని మాత్రం అలానే ఉంచారు. ఓటర్లను ప్రభావితం చేస్తాయనుకుంటే రెండు విగ్రహాలకూ ముసుగు వేయాలి కానీ.. ఇలా ఒక దానికి వేసి.. మరొక దాన్ని అలాగే ఉంచడం ఏమిటని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. ఈ విషయంపై తహశీల్దార్, మునిసిపల్ కమిషనర్లను సంప్రదిస్తే ముసుగు వేయించింది తాము కాదంటే తాము కాదని అన్నారు. ఆదేశాలు లేకుండానే అత్యుత్సాహంతో ముసుగు వేసిన వారెవరో తెలియాల్సి ఉంది. -
ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు
ఖానాపూర్, న్యూస్లైన్ : మండల కేంద్రమైన ఖానాపూర్లోని ఐబీ చౌరస్తాలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ సంఘటనను నిరసిస్తూ టీడీపీ నాయకులు శనివారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ చౌరస్తాలోని నిర్మల్-ఖానాపూర్ రహదారిపై రాస్తారోకో చేశారు. టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల శ్రీనివాస్, రాజగంగన్న, మాజీ ఎంపీపీ రామేశ్వరరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాథోడ్ రాము, పీఏసీఎస్ చైర్మన్ ఆకుల వెంకాగౌడ్, వైస్ చైర్మన్ ముజీబ్ మాట్లాడుతూ మండలంలో విగ్రహాలకు రక్షణ కరువైందని అన్నారు. సుర్జాపూర్లో చోటు చేసుకున్న ఘటన మరువకముందే మరొకటి చోటు చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. సంఘటనలకు బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. సీఐ జీవన్రెడ్డి, ఎస్సై రాము, పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన విరమింపజేశారు. ఉద్రిక్తంగా మారిన బంద్ ఎన్టీఆర్ విగ్రహాన్ని దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాలు బంద్ చేయాలని కోరింది. దుకాణాలు బంద్ చేయించడాన్ని పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నాయకులు అక్కడే బైఠాయించారు. తాము శాంతియుతంగానే బంద్ చేయిస్తున్నామని, విగ్రహాన్ని దగ్ధం చేసిన వారిని పట్టుకోవాల్సింది పోయి తమను అడ్డుకోవడమేమిటని పోలీసులను ప్రశ్నించారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యక్రమంలో నాయకులు అంకం రాజెందర్, కొక్కుల ప్రదీప్, సాడిగె రాజు, షబ్బీర్పాషా, గోడాపురం సందీప్, బండారి రవిందర్, బానావత్ రాంచంద్, కనకయ్య, చిన్న రాజన్న, కొండ నారాయణ, కరిపె శ్రీనివాస్, నయిం, నయింఖాన్, నారపాక నర్సయ్య, గాజుల గంగన్న, జీవన్, మొగిలి, గుగ్లావత్ లక్ష్మణ్, లోకిని రాము, గౌరికార్ రాజు, నిట్ట రవి, రాంచందర్ పాల్గొన్నారు.