A raja
-
ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు ఊరట
చెన్నై: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాతోపాటు మరో డీఎంకే నేత చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. అయితే, డీఎంకే నాయకులు వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీ, మలేరియా, డెంగ్యూతో పోల్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా మాట్లాడడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ సమాజంలో విభజన తెచ్చేలా వ్యవహరించడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. -
'భారత్ ఒక దేశం కాదు'.. డీఎంకే ఎంపీ సంచలన వ్యాఖ్యలు
డీఎంకే ఎంపీ ఎ రాజా ద్వేషపూరిత ప్రసంగాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించమని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చిన తరువాత, భారతదేశాన్ని బాల్కనైజేషన్ చేయాలని పిలుపునివ్వడమే కాకుండా.. రాముణ్ణి అపహేళన చేయడం, భారతదేశం ఒక దేశం కాదని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఒక దేశం కాదు. దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఒక దేశం అంటే ఒక భాష, ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి. అప్పుడు మాత్రమే అది ఒక దేశంగా పరిగణిస్తారు. భారతదేశం ఒక ఉపఖండం. కారణం ఏమిటంటే.. ఇక్కడ తమిళం ఒక దేశం, మలయాళం ఒక భాష. ఇలా దేశాలన్నీ కలిసి భారతదేశాన్ని ఏర్పరుస్తాయి. సంస్కృతులు కూడా వేరుగా ఉన్నాయంటూ.. మణిపూర్ ప్రజలపైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. మన ఇళ్లలోనే వంటగది, టాయిలెట్లకు ఒకే ట్యాంకర్ నుంచి నీళ్లు వస్తాయని. కానీ టాయిలెట్లో వచ్చే నీళ్లను వంటగదిలో ఉపయోగించరు. నీరు ఒక్కటే, అది వచ్చే ప్రదేశాన్ని బట్టి ఉపయోగించడమా.. లేదా అనేది మనమే నిర్ణయించుకుంటామని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను బీజేపీ నేషనల్ ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో పోస్ట్ చేశారు. మేము రాముడికి శత్రువులు. నాకు రామాయణంపైనా, రాముడిపైనా విశ్వాసం లేదని ఎంపి ఎ రాజా వ్యాఖ్యానించారు. రాజా చేసిన ఈ వ్యాఖ్యలపైన అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయ ప్రధాన పూజారి మండిపడ్డారు. దీనిపైన ప్రధానికి, రాష్ట్రపతికి లేఖ రాస్తామని పేర్కొన్నారు. భారతదేశ ధర్మాన్ని అవమానించడం, హిందూ దేవుళ్లను బహిరంగంగా కించపరచడం వంటివి క్షమించరానివని, ఈ వ్యాఖ్యలను ఎవరూ అంగీకరించరని, వెంటనే ఎ రాజాను అరెస్టు చేయాలని తమిళనాడు బిజెపి అధికార ప్రతినిధులు అన్నారు. The hate speeches from DMK’s stable continue unabated. After Udhayanidhi Stalin’s call to annihilate Sanatan Dharma, it is now A Raja who calls for balkanisation of India, derides Bhagwan Ram, makes disparaging comments on Manipuris and questions the idea of India, as a nation.… pic.twitter.com/jgC1iOA5Ue — Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) March 5, 2024 -
డీఎంకే వ్యాఖ్యలను ఒప్పుకోం
న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజా చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవించబోమని కాంగ్రెస్ పేర్కొంది. అన్ని మతాలకు సమాన గౌరవం(సర్వధర్మ సమభావ) భావననే తమ పార్టీ విశ్వసిస్తుందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్ పవన్ ఖెరా స్పందిస్తూ..‘సమధర్మ సమభా వమనే దానినే కాంగ్రెస్ ఎల్లప్పుడూ విశ్వసిస్తుంది, ప్రతి మతం, ప్రతి విశ్వాసాలకు ఇందులో సమస్థానం ఉంటుంది. ఎవరూ ఎవరినీ తక్కువగా చూడరు. ఇలాంటి వ్యాఖ్య లను కాంగ్రెస్ పార్టీ కూడా సమ్మతించదని అన్నారు. విద్వేషాలు తొలిగేదాకా యాత్ర: రాహుల్ విద్వేషాలు తొలిగిపోయి భారత్ ఏకమయ్యేదాకా తన యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ప్రారంభమై గురువారం ఏడాది పూర్తయిన సందర్భంగా రాహుల్ స్పందించారు. నాలుగు వేల కిలోమీటర్ల పైచిలుకు సాగిన తన పాదయాత్ర తాలూకు వీడియో ఫుటేజిని ఎక్స్లో పంచుకుంటూ.. ‘ఈ యాత్ర కొనసాగుతుంది. ఇది నా ప్రామిస్’ అని రాహుల్ పేర్కొన్నారు. భారత్ జోడోయాత్రలో రాహుల్ 12 బహిరంగ సభల్లో, 100 పైచిలుకు రోడ్డు కార్నర్ మీటింగ్లలో, 13 విలేకరుల సమావేశాల్లో పాల్గొన్నారు. -
‘సనాతన ధర్మం అంశంపై చర్చలకు ఎవరు రమ్మన్నా వస్తా’
చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అత్యధికులు స్టాలిన్ మాటలను వ్యతిరేకిస్తుంటే కొందరు మాత్రమే సమర్థిస్తున్నారు. తాజాగా డీఎంకే మరో మంత్రి ఏ రాజా.. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను వెనకేసుకొచ్చారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఏ రాజా మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ సున్నిత మనస్కులు కాబట్టి సున్నితంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో పోల్చారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులకు సమాజంలో ఎలాంటి బెరుకు ఉండదని సనాతన ధర్మాన్ని సమాజాన్ని భయపెట్టే హెచ్ఐవి, కుష్టు వంటి వ్యాధులతో పోల్చాలని అన్నారు. సనాతన ధర్మం, విశ్వకర్మ యోజన రెండు వేర్వేరు కాదని రెండూ ఒక్కటేనని అన్నారు. ఈ అంశంపై డిబేట్ పెడితే చర్చలకు పెరియార్, అంబేద్కర్ పుస్తకాలను వెంటబెట్టుకుని ఢిల్లీ వస్తానని అన్నారు. నాపై రివార్డులు కూడా ప్రకటించనీ నేనైతే భయపడేది లేదని అన్నారు. ఒకవేళ ప్రధాన మంత్రి చర్చలకు రమ్మన్నా వెళతాను.. అనుమతిస్తే కేంద్ర కేబినెట్ మంత్రులతో కూడా దీనిపై చర్చకు సిద్ధమని సనాతన ధర్మం అంటే ఏమిటో చెబుతానని అన్నారు. ఇది కూడా చదవండి: ‘బాలకృష్ణలా చంద్రబాబు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా? -
హిందువుగా ఉన్నంత వరకూ.. రాజా వ్యాఖ్యల దుమారం
చెన్నై: ‘‘హిందువుగా ఉన్నంత వరకూ నువ్వు దళితునివే. అంటరానివాడివే. శూద్రునివే. శూద్రునిగా ఉన్నంతకాలం నువ్వు ఓ వేశ్య సంతానమే’’అంటూ డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంగళవారం చెన్నైలో పార్టీ భేటీలో ఆయన మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘మీలో ఎంతమంది వేశ్య సంతానంగా, అంటరానివారిగా మిగిలిపోవాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలపై గొంతెత్తినప్పుడు మాత్రమే సనాతన ధర్మాన్ని బద్దలుకొట్టే ఆయుధంగా మారగలం’’అంటూ పిలుపునిచ్చారు. ‘‘శూద్రులంటే హిందువులు కారా? వారిని మను స్మృతి తీవ్రంగా అవమానించింది. వారికి విద్య, ఉద్యోగ, సమానావకాశాలను, ఆలయాల్లోకి ప్రవేశాలను నిషేధించింది’ అంటూ రాజా ప్రసంగించినట్టుగా చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ద్రవిడ ఉద్యమం 90 శాతం మంది హిందువులకు బాసటగా నిలిచిందంటూ అనంతరం రాజా ఓ ట్వీట్ కూడా చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. Who are Sudras? Are they not Hindus? Why they have been insulted in Manusmrithi denied equality, education, employment and Temple entry. Dravidian Movement as saviour of 90% Hindus questioned and redressed these, cannot be anti-Hindus. — A RAJA (@dmk_raja) September 13, 2022 ఇదీ చదవండి: బీజేపీ బలవంతంగా రుద్దాలని చూస్తే ఊరుకోం -
DMK MP: రాజాకు సతీవియోగం
సాక్షి, చెన్నై: డీఎంకే ఎంపీ ఎ.రాజా సతీమణి పరమేశ్వరి (53) క్యాన్సర్తో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో శనివారం రాత్రి మృతిచెందారు. రాజా కేంద్ర టెలికాం మంత్రిగా పనిచేసిన సమయంలో 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డీఎంకే నీలగిరి ఎంపీగా, ఆ పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య పరమేశ్వరి కొన్ని నెలలుగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. క్రోంపేటలోని రేల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళకరంగా ఉండడంతో సీఎం స్టాలిన్ ఆస్పత్రికి వెళ్లారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వర్గాలను ఆదేశించి రాజాను పరామర్శించారు.ఆదివారం పెరంబలూరులో పరమేశ్వరి అంత్యక్రియలు జరగనున్నాయి. (చదవండి: 22కు చేరిన అలీగఢ్ కల్తీ మద్యం మృతులు) -
‘సీఎం అక్రమ సంతానం’: రెండు రోజులు నిషేధం
చెన్నె: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు పళని స్వామిపై ‘అక్రమ సంతానం’ అని చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసిన డీఎంకే నాయకుడు, మాజీ ఎంపీ ఎ.రాజాపై మండిపడింది. ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఎన్నికల సంఘం రెండు రోజుల పాటు ప్రచారం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎ.రాజ రెండు రోజుల పాటు ఎక్కడ కూడా ప్రచారం చేయొద్దు. డీఎంకే అధినేత స్టాలిన్ గొప్పతనం చేస్తూ సీఎం పళనిస్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంబంధ జంటకు పళనిస్వామి జన్మించారని చెపాక్లో జరిగిన ప్రచారంలో రాజా ఆరోపించారు. ప్రీమెచ్చుర్గా పళని పుట్టాడని, ఢిల్లీకి చెందిన డాక్టర్ నరేంద్ర మోదీ హెల్త్ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్ర దుమారం రేపాయి. అన్నాడీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ వ్యాఖ్యలపై సీఎం పళనిస్వామి స్పందించారు. తన తల్లిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై భావోద్వేగానికి గురయ్యారు. దేవుడు వారిని శిక్షిస్తారని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే నాయకులు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించి అతడి వివరణ గురువారం తీసుకుంది. ఆ వివరణతో సంతృప్తి చెందని ఎన్నికల సంఘం డీఎంకే స్టార్ క్యాంపెయినర్గా ఉన్న రాజాను తొలగించడంతోపాటు రెండు రోజుల పాటు ప్రచారం చేయొద్దని నిషేధం విధించింది. రాజా వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని, మహిళలను కించపరిచేలా ఉండడంతో పాటు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు కిందకు వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు రాజాకు ఆ శిక్ష విధించింది. -
నా మాటల్ని వక్రీకరించారు: రాజా
సాక్షి, చెన్నై: తన వ్యాఖ్యలను వక్రీకరించి బయటకు విడుదల చేశారని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు డీఎంకే ఎంపీ రాజా వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సమగ్ర, న్యాయబద్ధంగా విచారణ జరగాలని కోరారు. పెరంబలూరు ఎన్నికల ప్రచారంలో డీఎంకే ఎంపీ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. సీఎం పళనిస్వామి, ఆయన తల్లిని కించపరిచే రీతిలో రాజా వ్యాఖ్యలు చేశారంటూ అన్నాడీఎంకే వర్గాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఆయనపై చర్యకు పట్టుబడుతూ అన్నాడీఎంకే నేతృత్వంలో నిరసనలు సైతం సాగాయి. సీఎం పళనిస్వామి సైతం ఆయన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఎన్నికల ప్రచారంలో ఉద్వేగానికి లోనయ్యారు. సీఎం ఉద్వేగానికి గురికావడంతో మనసు నొప్పించి ఉంటే మన్నించండి అంటూ రాజా క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణించిన ఎన్నికల కమిషన్ వివరణ కోరుతూ రాజాకు నోటీసులు జారీ చేసింది. న్యాయవాదితో వివరణ రాజా స్వయంగా వచ్చి ఈసీ సాహుకు వివరణ ఇస్తారన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే తన న్యాయవాది పచ్చయప్పన్ ద్వారా రాజా వివరణ లేఖను కేంద్ర, రాష్ట్ర కమిషన్లకు పంపించారు. అందులో తాను ఎన్నికల ఆదాయం కోసం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించ లేదని వివరించారు. తానేదో వ్యాఖ్యలు చేసినట్టుగా అన్నాడీఎంకే, బీజేపీలు తీవ్రంగా దుమారం రేపుతున్నాయని, వాస్తవానికి తన వ్యాఖ్యల్ని కత్తిరించి, వక్రీకరించి బయటకు వీడియోల రూపంలో విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర, న్యాయబద్ధంగా విచారణ జరిగితే, తాను ఏ తప్పు చేయలేదన్నది, వ్యాఖ్యలు చేయలేదనేది స్పష్టం అవుతోందన్నారు. సీఎం ఉద్వేగానికి గురయ్యారన్న సమాచారంతో ఒక వేళ తానేమైనా తప్పు చేశానా.. అని భావించి మనసు నొప్పించి ఉంటే మన్నించాలని క్షమాపణ కూడా కోరినట్టు గుర్తు చేశారు. అన్నాడీఎంకే వర్గాలు తనపై మోపిన ఆరోపణలకు సంబంధించిన ఫిర్యాదు నకలు అందించాలని, ఆ మేరకు పూర్తి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. -
సీఎం ‘అక్రమ సంతానం’ వ్యాఖ్యలపై రాజా క్షమాపణ
చెన్నె: అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడులో వ్యక్తిగత దూషణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ, డీఎంకే నాయకుడు ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం పళనిస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్పై అక్రమ సంబంధం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై రాజా మళ్లీ స్పందించారు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు కోరారు. తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం పడుతున్నట్లు రాజా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చెపాక్లో ఇటీవల జరిగిన ప్రచార కార్యక్రమంలో రాజా మాట్లాడుతూ సీఎం పళని స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంబంధ జంటకు పళనిస్వామి జన్మించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రీమెచ్చుర్గా పళని పుట్టాడని, ఢిల్లీకి చెందిన డాక్టర్ నరేంద్ర మోదీ హెల్త్ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అన్నాడీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేయగా ఈ వ్యాఖ్యలపై సీఎం పళని ఆదివారం స్పందించారు. తన తల్లిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై భావోద్వేగానికి గురయ్యారు. దేవుడు వారిని శిక్షిస్తారని ప్రచార సభలో పేర్కొన్నారు. అనంతరం సోమవారం ఏ.రాజ ఆ వ్యాఖ్యలపై స్పందించారు. ‘నా వ్యాఖ్యల ఉద్దేశం వ్యక్తిగతం కాదు. రాజకీయంగా మాత్రమే విమర్శలు చేశా’ అని రాజా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా క్షమాపణలు ప్రకటించారు. అయితే ఆ వ్యాఖ్యలు చేసినందుకు అన్నాడీఎంకే నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు కూడా నమోదైంది. దీంతోపాటు ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సీఎంని స్టాలిన్ చెప్పుతో పోల్చిన నాయకుడు -
సీఎంని స్టాలిన్ చెప్పుతో పోల్చిన నాయకుడు
చెన్నై: మరో రెండు వారాల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్ని ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి పళనిస్వామిపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం పళనిస్వామి.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కాలికి వేసుకున్న చెప్పు పాటి విలువ కూడా చేయరు’ అంటూ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ‘ఒకప్పుడు బెల్లం మార్కెట్లో కూలీగా పనిచేసి పళనిస్వామికి స్టాలిన్తో పోటీయా.. పళని కంటే స్టాలిన్ వేసుకునే చెప్పుకు విలువ ఎక్కువ.. అలాంటిది తనకు స్టాలిన్నే సవాల్ చేసే ధైర్యం ఉందా. నెహ్రూ, ఇందిరా గాంధీ, మోదీ సైతం చేయలేని సాహసం పళనిస్వామి చేస్తున్నాడంటే అందుకు కారణం డబ్బు. రాష్ట్రాన్ని లూటీ చేసిన తనను పార్టీని రక్షిస్తుందని భావిస్తున్నాడు. అటువంటి వ్యక్తి స్టాలిన్ను అడ్డుకుంటాను అంటున్నాడు. అదే జరిగితే సీఎం వాహనం తన నివాసం నుంచి కార్యాలయానికి వెళ్లదని నేను సవినయంగా మనవిజేస్తున్నాను’ అన్నాడు రాజా. డీఎంకే నేత రాజా చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు పళనిస్వామి. తాను ఒక రైతునని, పేద కుటుంబం నుంచి వచ్చానని, అందువల్ల వినయంగా ఉంటానంటూ ప్రజల్లో తన మీద సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో 2జీ స్పెక్ట్రం కుంభకోణాన్ని ప్రస్తావించిన సీఎం.. కంటికి కనిపించని గాలితో కూడా కుంభకోణాలు చేసిన ఏకైక పార్టీ డీఎంకే అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో మదురై జిల్లా మెలూర్లోని ఎన్నికల ప్రచారంలో పళనిస్వామి మాట్లాడుతూ..‘నేను కష్టపడి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాను. కానీ స్టాలిన్ తండ్రి సీఎంగా ఉన్నందున ఆయన సిల్వర్ స్పూన్తో పుట్టారు. రాజా మాట్లాడిన భాష ఎలా ఉందో చూడండి.. నా విలువ స్టాలిన్ ధరించే చెప్పు కన్నా తక్కువని.. పొగరుగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిని చెప్పుతో పోల్చి వారు ఎంతటి సంస్కారహీనులో నిరూపించుకున్నారు. నేను ఒక రైతును, మా పేదలు అలానే ఉంటారు.. మేము కష్టపడి పనిచేస్తాం.. మేం కొనుక్కోగలిగింది మాత్రమే కొనుగోలు చేస్తాం... కానీ వారు రూ. 1.76 లక్షల కోట్ల అవినీతి కుంభకోణం వెనుక ఉన్నారు. కాబట్టి కోరుకున్నది కొనుక్కుంటారు’ అంటూ పళనిస్వామి రాజాకు కౌంటర్ ఇచ్చారు. చదవండి: కింది స్థాయి నుంచి వచ్చా..: సీఎం -
అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే, అన్నా డీఎంకే
చెన్నై: తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు లోక్సభ ఎన్నికల కోసం తమ అభ్యర్థులను ఆదివారం ప్రకటించాయి. కనిమొళి, దయానిధి మారన్, ఎ.రాజ, టీఆర్ బాలు సహా పలువురికి డీఎంకే లోక్సభ టికెట్లను కేటాయించింది. డీఎంకే జాబితాలో ఏకంగా 12 కొత్త ముఖాలున్నాయి. 20లో ఇద్దరు మహిళలకు మాత్రమే ఆ పార్టీ టికెట్లు ఇచ్చింది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్తోపాటు తమిళనాడులోని పలు చిన్న పార్టీలు, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీతోపాటు చిన్న పార్టీలు ఉండటం తెలిసిందే. అన్నాడీఎంకే తమ పార్టీనేగాక, కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులను కూడా ప్రకటించింది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో కలిపి 40 లోక్సభ స్థానాలుండగా, డీఎంకే, అన్నాడీఎంకేలు రెండూ చెరో 20 స్థానాల్లో పోటీ చేస్తూ మిగిలిన 20 స్థానాలను మిత్రపక్షాలకు వదిలేశాయి. 8 స్థానాల్లో ఇరు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉండనుంది. డీఎంకే కూటమిలో అత్యధికంగా కాంగ్రెస్కు పది స్థానాలు దక్కగా, సీపీఐ, సీపీఎం, వీసీకేలు చెరో రెండు, మిగిలిన చిన్న పార్టీలు తలో సీటును దక్కించుకున్నాయి. ఇక అన్నా డీఎంకే కూటమిలో పీఎంకే 7, బీజేపీ 5, డీఎండీకే 4 చోట్ల పోటీ చేయనున్నాయి. మిగిలిన నాలుగు సీట్లను చిన్న పార్టీలకిచ్చారు. తొలిసారి లోక్సభకు కనిమొళి పోటీ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సోదరి కనిమొళి తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆమె ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉండగా, ఆ పదవీకాలం ఈ జూలైతో ముగియనుంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కనిమొళి తూత్తుకుడి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. లోక్సభ ఎన్నికలతోపాటే తమిళనాడు లో 18 నియోజకవర్గాలకు శాసనసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా డీఎంకే ప్రకటించింది. -
రాజా, కనిమొళికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేసుకు సంబంధించి టెలికం మాజీ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళికి ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. ఈ కేసులో వారిని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించాలని కోరింది. మనీ ల్యాండరింగ్ కేసులోనూ వారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఈడీ వేసిన పిటిషన్పై కూడా ఇలాంటి ఆదేశాలే జారీచేసింది. తదుపరి విచారణ జరిగే మే 25 లోగా స్పందనలు తెలపాలని వారికి సూచించింది. -
రాజా, కనిమొళికి నోటీసులు..
సాక్షి, న్యూఢిల్లీ: 2జీ కుంభకోణంలో టెలికంశాఖ మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితోపాటు ఇతర నిందితులకు ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. 2జీ స్కాంలో రాజా, కనమొళిని నిర్దోషులుగా ప్రకటిస్తూ.. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. సీబీఐ అభ్యర్థనపై విచారణ ప్రారంభించిన హైకోర్టు.. ఇప్పటివరకు నిందితులకు సంబంధించి ఈడీ, పీఎంఎల్ఏ అటాచ్ చేసిన ఆస్తుల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. గత ఏడాది డిసెంబర్ 21న 2జీ కేసులో కనిమొళి, రాజాలకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ.. వారిని నిర్దోషులుగా కింది కోర్టు ప్రకటించింది. కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సీబీఐ హైకోర్టును ఆశ్రయించడంపై టెలికం మాజీ మంత్రి ఏ రాజా స్పందించారు. సీబీఐ అప్పీలుకు వెళ్లడం సాధారణ పరిణామమేనని, ఇది తాము ఊహించిందేనని, ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదని ఆయన అన్నారు. -
మాజీ కాగ్పై రాజా సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ : డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ కాగ్ వినోద్ రాయ్ యూపీఏ ప్రభుత్వాన్ని నాశనం చేసేందుకు యత్నించాడంటూ రాజా ఆరోపించారు. శనివారం ‘2జీ సెగ అన్ఫోల్డ్స్’ అనే పుసక్త ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాజా ఈ విమర్శలు చేశారు. ‘‘కొన్ని దుష్టశక్తులు యూపీఏ(2) ప్రభుత్వాన్ని నాశనం చేసేందుకు యత్నించాయి. అందుకోసం వినోద్ రాయ్ను కాంట్రాక్ట్ కిల్లర్లా నియమించుకున్నాయి. ఆయనను ఓ ఆయుధంగా వాడుకుని కక్ష్య సాధింపు చర్యలకు దిగాయి. ఉన్నత పదవిని అడ్డుపెట్టుకుని వినోద్ రాయ్ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. దేశాన్ని, ప్రజలను దారుణంగా మోసం చేశాడు’’ అంటూ రాజా వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కొన్ని మీడియా సంస్థలపై రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఛానెళ్లు అదే పనిగా తనపై అసత్య ప్రచారాలను చేశాయని.. కానీ, సీబీఐ ముందు తానిచ్చిన వాంగ్మూలం గురించి మాత్రం అవి మాట వరుసకు కథనాలు ప్రసారాలు చెయ్యలేదని రాజా ఆక్షేపించారు. 2010లో వినోద్ రాయ్ కాగ్గా ఉన్న సమయంలోనే లక్షా 76వేల కోట్ల రూపాయల 2జీ స్కామ్ను వెలుగులోకి వచ్చింది. రాజా టెలికామ్ మంత్రిగా(2008) ఉన్న సమయంలో ఈ అవినీతి చోటు చేసుకుందని కాగ్ నివేదిక వెలువరించగా.. కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో చీటింగ్, పోర్జరీ, కుట్ర తదిర అభియోగాల కింద రాజాను 2011లో అరెస్టు చేశారు. ఏడాది జైలు తర్వాత బెయిలుపై ఆయన విడుదలయ్యారు. అయితే, సరైన సాక్ష్యాలు సీబీఐ సమర్పించకపోవటంతో 2జీ కుంభకోణంలో రాజా, కనిమొళి(కరుణానిధి కూతురు)తో సహా 17 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ గత నెలలో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన విషయం విదితమే. -
మన్మోహన్ మౌనాన్ని ప్రశ్నించిన రాజా
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో అప్పటి టెలికం పాలసీని సమర్థించకుండా మాజీ ప్రధాని మన్మోహన్ ఉద్దేశపూర్వక మౌనం వహించడాన్ని టెలికం మాజీ మంత్రి ఏ.రాజా ప్రశ్నించారు. 2జీ కుంభకోణం వాస్తవాల పేరిట ఆయన రాసిన పుసక్తం ‘2జీ సాగా అన్పోల్డ్స్’లో పలు కీలక విషయాల్ని ప్రస్తావించారు. కేసు విచారణ సమయంలో రాసిన ఈ పుసక్తంలో అప్పటి కాగ్ వినోద్ రాయ్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఈ పుసక్తం విడుదల కావాల్సి ఉంది. స్పెక్ట్రం కేటాయింపులపై సీబీఐ దాడులకు సంబంధించి మన్మోహన్కు కూడా ఎలాంటి సమాచారం లేదని రాజా తెలిపారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం వినోద్ రాయ్తో రాజీపడి పనిచేసిందని, స్పెక్ట్రం కేటాయింపుల ఖాతాల తనిఖీ సందర్భంగా వేరే ఉద్దేశాలు పెట్టుకుని రాజ్యాంగ విధుల నిర్వహణలో రాయ్ అతిగా వ్యవహరించారని రాజా ఆరోపించారు. కొత్త వారికి లైసెన్స్లివ్వడం టెలికం లాబీలకు ఇష్టం లేదని తెలిపారు. -
నిర్దోషులుగా తేలిన తర్వాత తొలిసారి చెన్నైకి..
సాక్షి, చెన్నై: 2జీ స్పెక్ట్రం కేసులో నిర్దోషులుగా తేలిన కేంద్ర మాజీ మంత్రి ఏ. రాజా, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి శనివారం డీఎంకే అధినేత కరుణానిధిని కలిశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ కుంభకోణంలో రాజా, కనిమొళితో సహా 17 మందిని సీబీఐ ప్రత్యేక కోర్టు రెండు రోజుల క్రితం నిర్దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో చెన్నైకి వచ్చిన కనిమొళి, రాజా ర్యాలీగా బయలుదేరి వెళ్లి కరుణానిధిని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరికి పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ స్టాలిన్, సీనియర్ నాయకులతో సహా వేలమంది కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. యూపీఏ హయాంలో చోటుచేసుకున్న 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణంలో రాజా, కనిమొళితో సహా మొత్తం 17మంది మీద సీబీఐ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు సరైన ఆధారాలను సీబీఐ సమర్పించలేదంటూ.. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పాటైన యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామి. గతకొంత కాలంగా డీఎంకేను 2జీ స్పెక్ట్రం కేసు వేధిస్తోంది. ఈ కేసులో రాజా సంవత్సరకాలం పాటు జైలులో గడపగా, కరుణానిధి కుమారై కనిమొళి ఏడునెలల పాటు జైలులో ఉన్నారు. ఈ కేసు కారణంగా కరుణానిధి గత ఎన్నికల్లో అధికారానికి దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు డీఎంకేకు అనుకూలంగా తీర్పు రావడంతో పార్టీ శ్రేణులు ఆనందంతో ఉన్నారు. కరుణానిధి అనారోగ్యం కారణంగా ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సంగతి తెలిసిందే. కనిమొళి నిర్దోషిగా తేలడంతో ప్రత్యక్ష రాజకీయాలలో ఆమె చురుగా పాల్గొనే అవకాశముందని మద్దతుదారులు భావిస్తున్నారు. -
అయ్యా.. ఇదిగో మీ కాళ్ల దగ్గర కోర్టు తీర్పు
సాక్షి, చెన్నై : హై ఫ్రోఫైల్ స్కాంగా అభివర్ణింపబడ్డ 2జీ స్పెక్ట్రమ్ కేసులో రాజా, కనిమొళిని నిర్దోషులుగా తేల్చాక డీఎంకేలో నెలకొన్ని సంబరం అంతా ఇంతా కాదు. పార్టీ కార్యకర్తల కోలాహలంతో తమిళనాడులో నిన్న అంతా పండగ వాతావరణం కనిపించింది. ఈ ఏడేళ్లు తాము ఎంతో నరకం అనుభవించామని తీర్పు అనంతం ఆ ఇద్దరూ చెప్పటం చూశాం. ఇక రాజా అయితే తన భావోద్వేగాలను ఓ లేఖ రూపంలో డీఎంకే వ్యవస్థాపకుడు అయిన కరుణానిధికి తెలియజేశాడు. ‘‘విధేయతతో చరిత్రాత్మక తీర్పును మీ పాదాల వద్ద ఉంచుతున్నా.. మీరే నా సంరక్షకుడు’’ అని కరుణను ఉద్దేశించి రాజా అందులో పేర్కొన్నాడు. ‘‘ఆరోపణలు ఎదుర్కున్న సమయంలో మీరు నాకు ఇచ్చిన మనోధైర్యం అంతా ఇంతా కాదు. ఇంతకాలం అదే నన్ను కవచంలా రక్షిస్తూ వస్తోంది. మీ బదులు కోసం ఎదురు చూస్తున్నా’’ అంటూ లేఖలో తెలియజేశాడు. ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను డీఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిందని.. కానీ, దానికి కొందరు అవినీతి మరకలను అంటించేశారని.. ఈ కుట్రలో కొందరు డీఎంకే నేతలు కూడా భాగస్వాములు అయ్యాయరని ఆయన లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. కాగా, సరైన సాక్ష్యాలు సీబీఐ సమర్పించకపోవటంతోనే తాము నిందితులను నిర్దోషులుగా విడిచిపెడుతున్నట్లు పటియాలా హౌజ్ కోర్టు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాల్ చేసేందుకు సీబీఐ సిద్ధమైపోయింది. -
2జీ స్కామ్పై ప్రముఖుల వ్యాఖ్యలు
న్యాయం జరిగింది: కనిమొళి 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసులో న్యాయం గెలిచిందని నిర్దోషిగా బయటపడిన డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. గత ఆరేళ్లు తనకు చాలా కష్టంగా గడిచాయని, ఎంతో మనోవేదన మిగిల్చాయని పేర్కొన్నారు. ‘ఈరోజు కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నా. ఇంతకాలం ఎంతో మనోవేదన అనుభవించా. ఏదో ఒకరోజు ఈ కష్టాల నుంచి బయటపడతానని అనుకున్నాను. కఠిన సమయంలో మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటా’ అని కోర్టు తీర్పు వెలువడిన అనంతరం కనిమొళి భావోద్వేగంగా మాట్లాడారు. కట్టుకథలని తేలింది: రాజా 2జీ కేటాయింపుల వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందన్న ఆరోపణలు కట్టుకథలేనని కోర్టు తీర్పుతో రుజువైందని అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజా అన్నారు. జాతీయ టెలికాం విధానం, ట్రాయ్ సిఫార్సులకు అనుగుణంగానే స్పెక్ట్రం కేటాయింపు నిర్ణయాలు తీసుకున్నా మని చెప్పారు. ‘దేశ ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకునే ఆనాడు నిర్ణయాలు తీసుకున్నాం. టెలికాం రంగంలో పోటీ వాతావరణం తీసుకురావడం వల్ల కాల్ చార్జీలు దిగి వచ్చాయి. నా నిర్ణయాలపై, న్యాయ వ్యవస్థపై ఎప్పుడూ విశ్వాసం కోల్పోలేదు. అవే ఈ రోజు నిజమయ్యాయి. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చా. గొప్ప పనులు చేసిన వారిని చరిత్రలో నేరగాళ్లుగా చూడటం కొత్తేమీ కాదు’ అని రాజా వ్యాఖ్యానించారు. క్షమాపణ చెప్పాలి: కాంగ్రెస్ స్పెక్ట్రమ్ కుంభకోణంపై తీర్పు ఇచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ బీజేపీపై ఎదురుదాడికి దిగింది. ఎట్టకేలకు సత్యం గెలిచిందని, తమపై తప్పుడు ప్రచారం చేసిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. 2జీ స్పెక్ట్రం కేటాయింపులను అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించిన అప్పటి కాగ్ వినోద్రాయ్ని బాధ్యుణ్ని చేయాలని పేర్కొంది. తమ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని తేల్చిన కోర్టు తీర్పును గౌరవించాలని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన పి.చిదంబరం స్పందిస్తూ...యూపీఏ 2 ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ కుంభకోణంలో చిక్కుకున్నారన్న ఆరోపణలు నిజం కాదని నిరూపితమైందని అన్నారు. కోర్టు తీర్పుతో బీజేపీ సాధించిందేం లేదని, తన వాదనే నెగ్గిందని టెలికాం మాజీ మంత్రి కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఆ కేటాయింపులు లోపభూయిష్టమే: కేంద్రం యూపీఏ హయాంలో జరిగిన 2జీ స్పెక్ట్రం కేటాయింపులు లోపభూయిష్టం, అవినీతిమయమని కేంద్రం పేర్కొంది. పరిమితంగా ఉన్న వనరులను వేలం వేయడమే ఉత్తమ మార్గమని, యూపీఏ ప్రభుత్వం ఆచరించిన ‘ముందొచ్చిన వారికి ప్రాధాన్యత’ విధానం సరైనది కాదని టెలికాం మంత్రి మనోజ్ సిన్హా అభిప్రాయపడ్డారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ...స్పెక్ట్రం కేటాయింపులో యూపీఏ నిర్హేతుకంగా వ్యవహరించిందని, కొద్ది మందికే ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ఈ కేసులో అవినీతి జరిగిందని నొక్కిచెప్పడానికి సుప్రీంకోర్టు గత ఆదేశాలను ఉటంకించిన జైట్లీ...విచారణ కోర్టు తీర్పును కాంగ్రెస్ గౌరవ సూచకంగా భావిస్తోందని ఎద్దేవా చేశారు. హైకోర్టుకెళ్తాం: సీబీఐ 2జీ కేసులో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేస్తామని సీబీఐ వెల్లడించింది. సాధారణంగా ఉన్నత న్యాయ స్థానాల్లో అప్పీల్కు వెళ్లే ముందు కోర్టు ఉత్తర్వులను క్షణ్నంగా అధ్యయనం చేసే సీబీఐ ఈసారి మాత్రం వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. ‘ 2జీ కేసు తీర్పును ప్రాథమికంగా పరిశీలించాం. ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలను కోర్టు సరైన రీతిలో పరిగణలోకి తీసుకోలేదు. ఈ విషయంలో న్యాయపరంగా దిద్దుబాటు చర్యలు చేపడతాం’ అని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ తెలిపారు. తీర్పును పరిశీలించిన తరువాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని ఈడీ కూడా చెప్పింది. క్లీన్చిట్ కాదు: బీజేపీ ఈ కేసులో నిందితులను సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడం కాంగ్రెస్కు క్లీన్చిట్ ఇచ్చినట్లు కాదని బీజేపీ పేర్కొంది. అప్పటి యూపీఏ ప్రభుత్వం చార్జిషీటును ప్రభావితంచేయడం వల్లే వారు నిర్దోషులుగా బయటపడ్డారని కేంద్ర మంత్రి జవదేకర్ ఆరోపించారు. ఏచూరీ లేఖతో వెలుగులోకి 2జీ కుంభకోణాన్ని బయటపెట్టింది ఎవరు? అని ప్రశ్నిస్తే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) అనే ఎక్కువ మంది బదులిస్తారు. అయితే ఈ దీన్ని వెలికి తీయడంలో అసలు సూత్రధారి మాత్రం సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరీ. టెలికం లైసెన్సుల వేలంలో అక్రమాలు జరిగాయని నాటి ప్రధాని మన్మోహన్కు ఆయన రాసిన లేఖతో 2జీ వ్యవహారం వెలుగుచూసింది. ఆ లేఖకు మన్మోహన్ జవాబివ్వకపోయినా.. పరిశీలన కోసం టెలికం శాఖకు పంపారు. అప్పుడు యూపీఏ సర్కారుకు సీపీఎం వెలుపలి నుంచి మద్దతిస్తోంది. ఆ తర్వాత మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి కూడా 2జీ కేటాయింపులపై ఆరోపణలు చేస్తూ.. 2008 నవంబర్ నుంచి ప్రధానికి అనేక ఉత్తరాలు రాశారు. అనంతరం ఏచూరి కూడా మరో రెండు సార్లు 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని మన్మోహన్ సింగ్కు లేఖలు రాశారు. -
2జీ స్పెక్ట్రమ్ కేసుల కథాకమామిషు
సీబీఐ వర్సెస్ ఎ.రాజా (ఏ–1),సిద్ధార్ధ బెహురా (ఏ–2), ఆరేకే చందోలియా (ఏ–3),షాహిద్ ఉస్మాన్ బల్వా (ఏ–4) వినోద్ గోయెంకా (ఏ–5), కనిమొళి కరుణానిది (ఏ–17) తదితరులు చార్జిషీట్లోని ప్రధానాంశాలు ః 2008లో యూనిఫైడ్ యాక్సెస్ సర్వీసెస్( యూఏఎస్) లైసెన్స్ల ఎంట్రీ ఫీజును టెలికాం శాఖ రూ.1,658గా నిర్ధారించింది. 2001లో టెలికాం శాఖ సెల్యులర్ మొబైల్ టెలిఫోన్ సర్వీస్ (సీఎంటీఎస్)లైసెన్స్లను వేలం వేశాక ఎంత మొత్తం వచ్చిందో 2008లోనూ «అవే ధరలను నిర్ణయించారు. యూఏఎస్ లైసెన్సులకు దరఖాస్తు చేసుకోవాలని 2007 సెప్టెంబర్ 25న ప్రకటన జారీచేసి, అక్టోబర్ 1 తరువాత వచ్చే వాటిని స్వీకరించమని టెలికాం శాఖ పేర్కొంది. కొన్ని కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకే ఈ మార్పు చేశారు. లైసెన్సుల కేటాయింపు నియమ నిబంధనల్లో మంత్రి రాజా ఆధ్వర్యంలో పలు మార్పులు జరిగాయి. కొన్ని కంపెనీలు వేలంలో పాల్గొనకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ 1) రాజా, 2) షాహిద్ ఉస్మాన్ బల్వా, 3) వినోద్ గోయెంకా, 4)ఆసిఫ్ బల్వా, 5) రాజీవ్ అగర్వాల్, 6)కరీం మెరానీ 7)శరద్ కుమార్ 8) ఎంకే దయాళు అమ్మాళ్, 9) కనిమొళి కరుణానిధి 10)పి.అమృతం, 11)మెసెర్స్ స్వాన్ టెలికాం 12)మెసెర్స్ సినీయుగ్ మీడియా తదితరులు. ఈడీ ప్రధాన అభియోగాలు ః సీబీఐ కేసుకు అదనంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ. నిందితులు మనీలాండరింగ్కు పాల్పడినట్లు రూ.223.55 కోట్ల ఆస్తుల జప్తు సందర్భంగా స్పష్టమైనట్లు వెల్లడి. తాము నమోదుచేసిన కేసుకు సంబంధించి తగిన ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్న ఈడీ. మనీలాండరింగ్ ద్వారా సంపాదించిన సొమ్ము ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయా వ్యక్తులు, సంస్థల వద్దే ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు వెల్లడి. సీబీఐ వర్సెస్ 1) రవికాంత్ రుయా, 2) అన్షుమన్ రుయా, 3) ఐపీ ఖైతాన్, 4) కిరణ్ ఖైతాన్ 5) వికాస్ షరాఫ్ తదితరులు చార్జిషీటులోని అంశాలుః లెటర్ ఆఫ్ ఇంటెంట్ సమర్పించిన అన్ని కంపెనీల అర్హతలను పరిశీలించిన సీబీఐ. 2007 సెప్టెంబర్లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న మెసెర్స్ లూప్ టెలికాం మెసెర్స్ ఎస్సార్ గ్రూపు బినామి అని తెలిసింది. యూఏఈ లైసెన్స్తో 2005 నుంచే ముంబయి సర్వీస్ ఏరియాలో మెసెర్స్ మొబైల్ ఇండియా కార్యకలాపాలు కొనసాగించింది. మెసర్స్ వొడాఫోన్ ఎస్సార్ లిమిటెడ్లో అప్పటికే మెసర్స్ గ్రూపునకు 33 శాతం వాటా ఉన్నట్లు నిర్ధారణ. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
2జీ స్కాం
2007 నుంచి 2017 ► కేంద్ర టెలికాం మంత్రిగా 2007, మేలో ఏ.రాజా బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టులో 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపునకు నోటిఫికేషన్ జారీచేసిన ప్రభుత్వం అదే ఏడాది అక్టోబర్ 1లోగా దరఖాస్తు చేసుకోవాలంది. దీంతో 46 సంస్థలు 576 దరఖాస్తులు దాఖలుచేశాయి. లైసెన్స్ జారీ ప్రక్రియను నిష్పాక్షికంగా చేపట్టాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రి రాజాకు నవంబర్లో లేఖ రాశారు. 2008, జనవరిలో ‘ముందు వచ్చినవారికి ముందుగా’ ప్రతిపాదికన టెలికాం శాఖ 122 కంపెనీలకు లైసెన్సులు జారీచేసింది. ► ఏడాది తర్వాత 2జీ కేటాయింపుల్లో అవకతవకలపై విచారణ జరపాలని కేంద్ర విజిలెన్స్ కమిషన్ సీబీఐని ఆదేశించింది. 2009, అక్టోబర్ 21న సీబీఐ గుర్తుతెలియని టెలికాం అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలపై కేసు పెట్టింది. ► టెలికాం లైసెన్సుల జారీలో రూ.70,000 కోట్ల కుంభకోణంపై పది రోజుల్లో స్పందించాలని కేంద్రం, రాజాకు సుప్రీం కోర్టు 2010, సెప్టెంబర్లో ఆదేశాలు జారీచేసింది. ► కేటాయింపుల విధానాల వల్ల ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోందని కాగ్ తెలిపింది. దీంతో రాజా నవంబర్ 14న తన పదవికి రాజీనామా చేశారు. అదే ఏడాది డిసెంబర్లో ఈ కేసు విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. రాజాతో పాటు అప్పటి టెలికాం కార్యదర్శి సిద్ధార్థ బెహురా, రాజాప్రైవేటు కార్యదర్శి రవీంద్ర కుమార్, స్వాన్ టెలికాం లిమిటెడ్ ప్రమోటర్ షహీద్ ఉస్మాన్ బల్వాలను 2011, ఫిబ్రవరి 2న సీబీఐ అరెస్ట్ చేసింది. ► 2011, ఏప్రిల్ 2న తొలి చార్జిషీట్లో రాజాతో పాటు రవీంద్రకుమార్, బెహురాలను ప్రధాన నిందితులుగా సీబీఐ పేర్కొంది. రిలయన్స్ అడాగ్ గ్రూప్ ఎండీ గౌతమ్ దోసీ, సీనియర్ వైస్ప్రెసిడెంట్ హరి నాయర్, ప్రెసిడెంట్ సురేంద్ర పిపారా, స్వాన్ టెలికాం ప్రమోటర్లు ఉస్మాన్ బల్వా, వినోద్ గోయెంకా, యూనిటెక్ లిమిటెడ్ ఎండీ సంజయ్ చంద్రల పేర్లనూ నిందితుల జాబితాలో చేర్చింది. వీరితో పాటు రిలయన్స్ టెలికాం లిమిటెడ్, స్వాన్ టెలికాం ప్రై.లిమిటెడ్, యూనిటెక్ వైర్లైస్ ప్రై.లిమిటెడ్ సంస్థల పేర్లను కూడా చార్జిషీట్లో చేర్చింది. ► అదే ఏడాది అక్టోబర్ సమర్పించిన రెండో చార్జిషీట్లో డీఎంకే చీఫ్ కరుణానిధి కుమార్తె కనిమొళితో పాటు మరో నలుగురి పేర్లను సీబీఐ చేర్చింది. 2జీ కేసుల్ని విచారిస్తున్న ప్రత్యేక జడ్జి ఓపీ సైనీ సీబీఐ వేసిన రెండు కేసుల్ని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలుచేసిన మరో కేసును విచారణకు స్వీకరించారు. ► ఎస్సార్ గ్రూప్ ప్రమోటర్లు రవి రుయా, అన్షుమన్ రుయా, లూప్ టెలికాం ప్రమోటర్లు కిరణ్ ఖైతాన్, ఆమె భర్త ఐపీ ఖైతాన్, ఎస్సార్ డైరెక్టర్ వికాస్ సరఫ్లతో పాటు లూప్ టెలికాం, లూప్ మొబైల్ ఇండియా, ఎస్సార్ టెలీ హోల్డింగ్ లిమిటెడ్ పేర్లను సీబీఐ మూడో చార్జిషీట్లో చేర్చింది. ► ఫిబ్రవరి 2న 9 కంపెనీలకు సంబంధించి 122 టెలికాం లైసెన్సుల్ని రద్దుచేసిన సుప్రీంకోర్టు. సహజ వనరుల్ని ముందు వచ్చినవారికి ముందుగా’ కేటాయించకూడదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో విధానపరమైన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం, స్పెక్ట్రమ్ కేటాయింపు విధానం, తదితర అంశాలను కేంద్రం రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లింది. ► 2012, మేలో ఈ కేసులో రివ్యూ పిటిషన్ను ఉపసంహరించుకున్న కేంద్రం. రాష్ట్రపతి నివేదనకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయం. మే 15న రాజాకు బెయిల్ మంజూరుచేసిన ప్రత్యేక న్యాయస్థానం. ► అన్ని వనరులకు వేలం తప్పనిసరి కాదనీ.. అన్ని సందర్భాల్లో అత్యధిక రెవిన్యూ సాధన వర్తించదని సుప్రీం కోర్టు సెప్టెంబర్ 27న వ్యాఖ్యానించింది. ► రాజకీయ నేతలు, కార్పొరేట్ పెద్దలతో లాబియిస్ట్ నీరా రాడియా మాట్లాడిన 5,800 ఆడియోటేపుల్ని, వాటి ప్రతులను 2013, జనవరి 8న ఐటీశాఖ సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టుకు అందజేసింది. దీంతో వీటిని పరిశీలించేందుకు ఆరుగురు జడ్జీలతో ప్రత్యేక బెంచ్ను సుప్రీం ఏర్పాటుచేసింది. ► ఈ కేసుకు సంబంధించి అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్కు, కేంద్ర మంత్రి చిదంబరానికి సెప్టెంబర్ 27న పార్లమెంటరీ కమిటీ క్లీన్చిట్ ఇచ్చింది. ► రాజాతో పాటు కనిమొళి, షాహీద్ బల్వా, వినోద్ గోయెంకా, బాలీవుడ్ దర్శకుడు కరీమ్ మొరానీ, తదితరులపై ఈ కుంభకోణంలో అక్రమ నగదు చెలామణి సంబంధించి 2014, ఏప్రిల్ 25న ఈడీ చార్జిషీట్ దాఖలుచేసింది. దీంతో పాటు డీఎంకే ఆధ్వర్యంలో నడిచే కలైంజర్ టీవీ చానెల్కు ఎస్టీపీల్ ప్రమోటర్లు రూ.200 కోట్ల మేర చెల్లించారంటూ కరుణానిధి భార్య దయాళు అమ్మాల్ పేరును ఈడీ చార్జిషీట్లో చేర్చింది. ► ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 మంది నిందితులకు జడ్జి 225పేజీల ప్రశ్నావళిని అందజేశారు. 2017, ఏప్రిల్ 19న ప్రత్యేక న్యాయస్థానంలో ముగిసిన వాదనలు. ► డిసెంబర్ 21న ఏ.రాజా, కనిమొళిలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 మందిని న్యాయమూర్తి నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కన్నీకి న్యాయం జరిగింది.. చాలా ఆనందంగా ఉంది!
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన 2జీ కుంభకోణంలో ఢిల్లీ సీబీఐ కోర్టు సంచలన తీర్పున్నిచింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కేంద్ర టెలికం మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే నాయకురాలు కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై డీఎంకే, కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. యూపీఏ సర్కారు ఏ తప్పూ చేయలేదనే విషయాన్ని ఈ తీర్పు చాటుతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అటు ఏ రాజా, కనిమొళి సన్నిహితులు కూడా ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనిమొళి సన్నిహితురాలు, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సులే 2జీ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. 'నా స్నేహితురాలైన కన్నీకి న్యాయం జరిగినందుకు ఆనందంగా ఉంది' అంటూ ఆమె ఫొటో పెట్టి సులే ట్వీట్ చేశారు. ఇక, 2జీ తీర్పు అనంతరం కనిమొళి మీడియాతో మాట్లాడుతూ.. తన తప్పులేకపోయినా తనపై కేసు నమోదుచేశారని, కలైంజర్ టీవీలో తాను మైనారిటీ వాటాదారును మాత్రమేనని ఆమె అన్నారు. తీర్పు అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీతో మాట్లాడానని, సత్యమే గెలిచిందని ఆయన అన్నారని చెప్పారు. So happy for my friend kanni.. justice done🙏🏽🙏🏽🙏🏽😀 @KanimozhiDMK pic.twitter.com/NffxsIE1ww — Supriya Sule (@supriya_sule) 21 December 2017 -
2జీ తీర్పుపై మన్మోహన్ కామెంట్స్..!
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేసిన 2జీ స్పెక్టం కుంభకోణంపై పటియాలా హౌజ్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ స్పందించారు. 2జీ స్కాం నేపథ్యంలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారమంతా దుష్ప్రచారమేనని ఈ తీర్పు స్పష్టం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. మన్మోహన్సింగ్ నేతృత్వంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా 2జీ స్కాం యూపీఏ సర్కారును అతలాకుతలం చేసింది. ఈ స్కాంలో నిందితుడిగా ఉన్న అప్పటి టెలికం మంత్రి ఏ రాజా, యూపీఏ సర్కారులో భాగస్వామిగా ఉన్న డీఎంకే ఎంపీ కనిమొళితోపాటు ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. 'తీర్పు చాలా సుస్పష్టంగా ఉంది. యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన తీవ్రస్థాయిలో చేసిన దుష్ప్రచారమంతా నిరాధారమని తీర్పు స్పష్టం చేసింది' అని మన్మోహన్సింగ్ హర్షం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బొగ్గు గనుల కేటాయింపులు, కామన్వెల్త్ క్రీడల వంటి విషయాల్లో జరిగిన కుంభకోణాలు యూపీఏ సర్కారును తీవ్రంగా కుదిపేశాయి. -
తీర్పుపై మాజీ సీబీఐ డైరెక్టర్ షాక్
సాక్షి,న్యూఢిల్లీ: 2జీ స్కామ్ కేసులో నిందితులందరినీ నిర్ధోషులుగా కోర్టు ప్రకటించడం పట్ల మాజీ సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ విస్మయం వ్యక్తం చేశారు.ఏ రాజాతో పాటు కార్పొరేట్ల అరెస్ట్కు నేతృత్వం వహించిన సింగ్ తీర్పుపై షాక్కు గురయ్యానన్నారు. 2జీ స్పెక్ర్టమ్ కేటాయింపుల్లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నట్టు సీబీఐ సాక్ష్యాధారాలతో ముందకొచ్చిందని విచారణలో ఏం జరిగిందో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు 2జీ కేసులో ప్రభుత్వంలోని అత్యున్నత స్ధాయిలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు అసత్యమని తేలిందని మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు.2జీ తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ స్పందించారు. 2జీ కేసులో నిరాధార ఆరోపణలు చేసిన కాగ్ క్షమాపక్షలు చెప్పాలని డిమాండ్ చేశారు. తీర్పు వెలువడిన అనంతరం కనిమొళి, రాజా హర్షం వ్యక్తం చేశారు.కష్టసమయంలో తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
రాజాపై సీబీఐ కేసు.. పలు ప్రాంతాల్లో సోదాలు
టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజాపై సీబీఐ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్కాంలో నిందితుడిగా ఉన్న రాజా గతంలో అరెస్టయ్యి, చాలా కాలం పాటు జైల్లోనే మగ్గి, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా రాజాతో పాటు మరో 16 మందిపై సీబీఐ వర్గాలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఢిల్లీ, చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు, పెరంబదూర్ సహా.. మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. డీఎంకే అధినేత ఎం.కరుణానిధికి ప్రియశిష్యుడిగా పేరొందిన ఎ.రాజాతో పాటు.. 2జీ స్కాంలో కరుణ కుమార్తె కనిమొళి కూడా నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. -
ఏ.రాజా, కనిమోళిపై అభియోగాల నమోదు.
-
ఎ.రాజా, కనిమొళిపై ఛార్జిషీట్ నమోదు
న్యూఢిల్లీ : 2జీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే రాజ్యసభ ఎంపీ కనిమొళిపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఈడీ దర్యాప్తు నివేదిక ఆధారంగా శుక్రవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఐపీసీ 120-బి కింద నిందితులపై కేసు నమోదు చేసింది. నేరం రుజువైతే వీరికి ఏడేళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఎం.రాజా, కనిమొళితో పాటు డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సతీమణి దయాళ్ అమ్మళ్ సహా 16మందిపై అభియోగాలు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో రాజా, కనిమొళి ఇప్పటికే జైలుకు వెళ్లివచ్చిన విషయం తెలిసిందే. అలాగే స్వాన్ టెలికాం ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్, వినోద్ గోయోంకాలపైనా అభియోగాలు నమోదు అయ్యాయి. మరోవైపు నిందితులు మాత్రం తాము ఎలాంటి నేరం చేయలేదని చెబుతున్నారు. తమపై వచ్చిన అభియోగాలపై విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. కాగా ఇదే కేసులో కేంద్ర మాజీ మంత్రి మారన్, ఆయన సోదరుడికి రెండు రోజుల క్రితం ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.. దయానిధి మారన్, కళానిధి మారన్ ఇద్దరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. వారిద్దరితో పాటు మలేషియా వ్యాపారవేత్త టి. ఆనంద్ కృష్ణన్కు కూడా కోర్టు సమన్లు జారీ అయ్యాయి. -
ప్రధానిని విచారించకుంటే దర్యాప్తు పూర్తికాదు : బిజెపి
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై నిర్ణయాలనూ ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకారంతోనే తీసుకున్నామని ఆ స్కాంలో ప్రధాన నిందితుడు, టెలికం మాజీ మంత్రి ఎ.రాజా కోర్టుకు చెప్పిన నేపథ్యంలో సీబీఐ ప్రధాని మన్మోహన్ సింగ్ను కూడా ప్రశ్నించాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాజా వాంగ్మూలం దిగ్భ్రాంతికరమని, ప్రధానిని విచారించకపోతే దర్యాప్తు పూర్తి కాదని పార్టీ ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఆ కుంభకోణంలో ప్రధాని ప్రమేయం ఉందని స్పష్టమైందని, ఈ వ్యవహారంపై ఆయన దేశానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బొగ్గు కుంభోణాన్ని ప్రస్తావిస్తూ, ప్రధాని ఆదేశాల మేరకే బొగ్గు గనుల కేటాంపులపైనా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. -
అవినీతిని నిరూపిస్తే జీవితాంతం జైల్లో ఉంటా
న్యూఢిల్లీ: విదేశాల్లో తాను రూ. 3000 కోట్ల అవినీతి సొమ్మును దాచినట్లు నిరూపిస్తే జీవితాంతం జైల్లో ఉండేందుకు సిద్ధమని 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ టెలికం మంత్రి ఎ. రాజా పేర్కొన్నారు. తాను అవినీతి సొమ్మును కూడబెట్టినట్లు సీబీఐ వర్గాలను ఉటంకిస్తూ 2011లో ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించిందని...అదే రోజు తాను ఆ అంశాన్ని ఓ జడ్జి దష్టికి తీసుకెళ్లానన్నారు. తన పేరిట ఒక రూపాయి లేక ఒక డాలర్ ఉన్నట్లు సీబీఐ, ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్లు నిరూపిస్తే కేసును సవాల్ చేయకుండా జీవితాంతం జైల్లో ఉంటానని జడ్జికి చెప్పినట్లు ఓ వార్తా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజా చెప్పుకొచ్చారు. ఈ కేసులో రాజాను 2011 ఫిబ్రవరి 2న సీబీఐ అరెస్టు చేసింది. బెయిల్పై విడుదలైన ఆయన ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులోని నీలగిరి స్థానం నుంచి పోటీ చేశారు. -
కనిమొళి, రాజాలపై త్వరలో ఈడీ చార్జిషీట్
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై డీఎంకే ఎంపీలు కనిమొళి, ఏ.రాజాలపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) త్వరలో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశముంది. అటార్నీ జనరల్ కార్యాలయం ఈడీ పంపిన చార్జిషీట్ను తదుపరి చర్యల నిమిత్తం న్యాయ శాఖకు పంపినట్టు తెలుస్తోంది.