Rajiv Ranjan Acharya
-
‘2024లో బీజేపీకి రెండే సీట్లు.. ఎక్కడ మొదలయ్యారో అక్కడికే’
పాట్నా: బిహార్లో ఎన్డీయే కూటమికి టాటా చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనతా దళ్ యునైటెడ్(జేడీయూ). రెండు రోజుల్లోనే నితీశ్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. దీంతో బీజేపీ, జేడీయూల మధ్య తీవ్ర మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో బీజేపీపై విమర్శలు గుప్పించారు జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్(లలన్ సింగ్). బిహార్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకేనన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో బిహార్లోని మొత్తం 40 పార్లమెంటరీ స్థానాల్లో జేడీయూ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. బీజేపీ ప్రస్థానం 2 సీట్లతో ప్రారంభమైందని, భవిష్యత్తులో తిరిగి మళ్లీ అదే స్థాయికి పడిపోతుందని జోస్యం చెప్పారు. మరోవైపు.. బీజేపీకి 2024 ఎన్నికల్లో 50 సీట్లు మాత్రమే వస్తాయని శనివారం ఓ సమావేశం వేదికగా అంచనా వేశారు జేడీయూ అధినేత నితీశ్ కుమార్. విపక్ష పార్టీలు కలిసి పని చేస్తే అది సాధ్యమవుతుందన్నారు. ఆదివారం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ సమావేశం అనంతరం మరోమారు విపక్షాల ఐక్యతపై మాట్లాడారు నితీశ్ కుమార్. విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి కలిసి పని చేస్తే విజయం తథ్యమన్నారు. కానీ, తాము ఎన్ని సీట్లు సాధిస్తామనేదానిపై మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇదీ చదవండి: రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ మెగా ర్యాలీ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై రాహుల్ ఫైర్ -
తెలంగాణ టెట్ పేపర్ 1 ప్రారంభం
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరుగుతుంది. అన్ని సెంటర్లో పరీక్ష మొదలైంది. పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. రెండు పరీక్షలకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,73,494 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఎడ్యూకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య పేపర్ 1 కు సెట్-1 కోడ్ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసి విడుదల చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ లలో, ఆంధ్రప్రదేశ్ లో విశాఖ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. -
టెట్ పేపర్ 1కు సెట్-1 ప్రశ్నాపత్రం ఎంపిక
హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం నిర్వహిస్తున్నారు. పేపర్ 1, పేపర్ 2 అనే రెండు విభాగాలుంటాయి. ఉదయం 10 గంటలకు పేపర్ 1 పరీక్ష ప్రారంభమవుతోంది. మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్ష జరుగుతుంది. ఎడ్యూకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య పేపర్ 1 కు సెట్-1 కోడ్ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసి విడుదల చేశారు. అభ్యర్థులను నిర్ధేశిత సమయం కంటే అరగంట ముందే పరీక్ష హాలులోకి అనుమతిస్తామని... ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 3.75 లక్షల మంది విద్యార్థులు టెట్ కు హాజరవనున్నట్లు అధికారులు తెలిపారు. -
నేడే టెట్
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ - హాజరుకానున్న 3.73 లక్షలమంది అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతాయి. రెండు పరీక్షలకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,73,494 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులను నిర్ధేశిత సమయం కంటే అరగంట ముందే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని... ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పేపర్-1 పరీక్షకు సంబంధించిన సెట్ కోడ్ను ఉదయం 6 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ ఆచార్య విడుదల చేస్తారని... పేపర్-2 పరీక్ష సెట్ కోడ్ను ఉదయం 10 గంటలకు విద్యాశాఖ సంచాలకుల కార్యాలయంలో డెరైక్టర్ కిషన్ విడుదల చేస్తారని టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి తెలిపారు.