-
Fact Check: ‘ప్రగతి’ రథంపై ‘పచ్చ’ బురద
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం హయాంలో నెలనెలా అప్పులు చేస్తూ, డొక్కు బస్సులతో ముక్కుతూ మూలుగుతూ నడిచే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి బాటలో నడిపించారు. ఉద్యోగులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా సిబ్బందికి మేలు చేయడమే కాకుండా, సంస్థపై పెను ఆర్థిక భారాన్ని తొలగించారు. సీఎం వైఎస్ జగన్ చర్యలతో ఆర్టీసీ ఇప్పుడు కొత్త బస్సులతో కళకళలాడుతోంది. ఉద్యోగులందరూ నెలనెలా సక్రమంగా జీతాలు, అలవెన్సులు పొందుతూ సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ఏ ఆర్టీసీ ఉద్యోగిని అడిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారికి చేసిన మేలును వివరిస్తారు. కానీ, రామోజీ నేతృత్వంలోని పచ్చ మీడియా, పచ్చ పార్టీలకు కావాల్సింది ఇది కాదు. ఆర్టీసీ ఉద్యోగులు, ఆ సంస్థ నిత్యం సమస్యలతో సతమతమవుతుంటే చూసి ఆనందించే బ్యాచ్ ఇది. సహజంగానే వారికి మంచి అనేది నచ్చదు కాబట్టి ఈనాడులో రామోజీ ఆర్టీసీపై ఓ కుట్రపూరిత బురద కథనాన్ని అచ్చే శారు. అవాస్తవాలు, అభూతకల్పనలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. ఆర్టీసీ సాధించిన ప్రగతి ఏమిటో ఓ సారి చూద్దాం.. 1,406 కొత్త బస్సులు కొనుగోలు దశాబ్దాలుగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు వేగవంతం చేసింది. 2019 – 20లో 406 బస్సులు కొనుగోలు చేసింది. పాత బస్సుల స్థానంలో 900 సరికొత్త డీజీల్ బస్సులను ప్రవేశపెట్టింది. అంతేకాదు రాష్ట్రంలో తొలిసారిగా ఇ–బస్సులను ప్రవేశపెట్టింది. తిరుమల – తిరుపతి ఘాట్రోడ్డుతో పాటు తిరుపతి సమీప పట్టణాల్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టిన ఘనత కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. రెండేళ్లపాటు కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ 2019 నుంచి 2023 మధ్య ఆర్టీసీ 1,406 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. తాజాగా 1,500 కొత్త డీజిల్ బస్సుల కొనుగోలు ప్రక్రియను చేపట్టింది. ఆర్డర్లు కూడా జారీ చేసింది. మరో 1,125 డీజిల్ బస్సుల కొనుగోలు చేయనుంది. మరో వేయి విద్యుత్ బస్సుల కొనుగోలుకు నిర్ణయించింది. 2024 – 25లో 950 విద్యుత్ బస్సులతోపాటు రానున్న ఐదేళ్లలో దశలవారీగా 7వేల విద్యుత్ బస్సుల కొనుగోలు ప్రణాళికను ఆర్టీసీ ఆమోదించింది. మరోవైపు కొత్త బస్సుల తయారీకి బిల్డింగ్ యూనిట్లు ప్రారంభించింది. ఉన్నత ప్రమాణాలతో బస్సుల నిర్వహణ బస్సుల సక్రమ నిర్వహణపై ఆర్టీసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 15 ఏళ్లు పూర్తి చేసుకున్న 214 పాత బస్సులను తొలగించింది. మరోవైపు బస్సుల మెరుగైన నిర్వహణకు ఉన్నత ప్రమాణాలను పాటిస్తోంది. బస్సుల విడిభాగాల కొనుగోలు, ఇతర నిర్వహణ వ్యయం కోసం గత నాలుగేళ్లలో ఆర్టీసీ పూర్తిస్థాయిలో నిధులు కేటాయించింది. గత ఐదేళ్లలో నిర్వహణ నిధులిలా.. 2020–21, 2021–22లో కోవిడ్ మొదటి, రెండో వేవ్లలో ఆర్టీసీ బస్సు సర్వీసులను బాగా కుదించింది. దాంతో స్పేర్ పార్టుల కోసం బడ్జెట్ ప్రతిపాదనలు తగ్గాయి. 2021–22, 2022–23, 2023–24లో పూర్తిస్థాయిలో బస్సులను పునరుద్ధరించింది. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక నిర్వహణ వ్యయం కింద రూ.50 కోట్లు ఖర్చు చేసింది. ఉద్యోగుల జీవితాల్లో నవోదయం 2019కి ముందు ఆర్టీసీ చరిత్ర మొత్తం జీతాల కోసం నెలనెలా అప్పులు చేయడమే అన్నట్టుగా ఉండేది. ఉద్యోగుల జీతాల కోసం నెలకు అయ్యే ఖర్చు దాదాపు రూ.300 కోట్లు అప్పు చేస్తేనే చెల్లింపులు అన్నట్లుగా ఉండేది. ఆ అప్పుల మీద ఏడాదికి వడ్డీల భారమే దాదాపు రూ.350 కోట్లు. కానీ సీఎం వైఎస్ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో సంస్ధ దశ, దిశ మారిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం నంబర్లు కేటాయించి సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు నెలనెలా సక్రమంగా చెల్లిస్తోంది. ఇందుకోసం ఏడాదికి రూ.3,600 కోట్ల భారాన్ని మోస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లపాటు ఆర్టీసీ రాబడి గణనీయంగా తగ్గినప్పటికీ, ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో ఎటువంటి లోటు రాలేదు. జీతాల భారం లేకపోవడంతో ఆర్టీసీ క్రమంగా నష్టాల ఊబి నుంచి బయటపడుతోంది. 2020 జనవరి నాటికి ఆర్టీసీకి దాదాపు రూ.4 వేల కోట్ల అప్పులుండగా, ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుండటంతో ఇప్పటికే ఆర్టీసీ రూ.2 వేల కోట్ల అప్పులు తీర్చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్న మరిన్ని ప్రయోజనాలు ♦ పీఎఫ్ చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయి. ♦ ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సహకార సొసైటీకి 2014 నుంచి ఉన్న బకాయిలు రూ.200 కోట్లను యాజమాన్యం చెల్లించింది. దాంతో సొసైటీ ద్వారా ఉద్యోగులు కొత్తగా రుణాలు పొందుతున్నారు. ♦ ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ (ప్రమాద బీమా) ప్యాకేజీని మొదట రూ.45 లక్షలకు, ఆ తర్వాత ఏకంగా రూ.1.10 కోట్లకు ప్రభుత్వం పెంచడం విశేషం. ♦ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచింది. ♦ 2020 జనవరి తరువాత రిటైరైన ఉద్యోగుల గ్రాట్యుటీ కోసం రూ.23.25 కోట్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాల కోసం రూ.271.89 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ♦ ఏపీ గవర్నమెంట్ ఇన్సూ్యరెన్స్ స్కీమ్ ద్వారా 55 ఏళ్లకంటే ఎక్కువ వయసు ఉన్న 44,500 మందికి ప్రయోజనం కలుగుతోంది. ఈ పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులకూ వర్తింపజేశారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను కూడా ఉద్యోగులు పొందుతున్నారు. ♦ 2016 నుంచి పెండింగులో ఉన్న కారుణ్య నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ♦ 2020 జనవరి 1 తరువాత అనారోగ్య సమస్యలతో ఉద్యోగ విరమణ చేసిన 100 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ♦ 2016 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 మధ్య మరణించిన 845 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు, 2020 జనవరి 1 తరువాత మరణించిన 955 మంది ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య ఉద్యోగాలిచ్చింది. ♦ ఉద్యోగుల డిమాండ్ మేరకు ఆర్టీసీలో రెండు కేటగిరీలుగా పదోన్నతుల విధానాన్ని ఆమోదించింది. ప్రభుత్వంలో విలీనానికి ముందు ఉన్న ఉద్యోగులకు ఆర్టీసీ సర్వీసు నిబంధనల ప్రకారం, ఆ తరువాత చేరిన ఉద్యోగులకు ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పిస్తారు. ♦ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ, ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం జీతంతోపాటే అలవెన్స్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
AP: సంక్రాంతి కానుక.. స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే..
అదనపు చార్జీల భారం లేకుండా సాధారణ చార్జీలతోనే సంక్రాంతి పండుగ ప్రత్యేక బస్సులు నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి 18 వరకు మొత్తం 6,795 ప్రత్యేక బస్సులను నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నాలుగో ఏడాది సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లోని ఇతర ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది. వీటిల్లో రిజర్వేషన్ల కోసం కూడా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. – సాక్షి, అమరావతి ప్రత్యేక బస్సుల వివరాలు.. ► ఈ నెల 6 నుంచి 14 వరకు 3,570 సర్వీసులు నిర్వహిస్తారు. తిరుగు ప్రయాణం నిమిత్తం ఈనెల 16 నుంచి 18 వరకు 3,225 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటుచేస్తున్నారు. ► సంక్రాంతికి ముందుగా నిర్వహించే ప్రత్యేక సర్వీసుల విషయానికొస్తే.. హైదరాబాద్ నుంచి 1,600, బెంగళూరు నుంచి 250, చెన్నై నుంచి 40 సర్వీసులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఏర్పాటుచేశారు. ► అలాగే, రాష్ట్రంలో విజయవాడ నుంచి 300, విశాఖపట్నం నుంచి 290, రాజమహేంద్రవరం నుంచి 230, తిరుపతి నుంచి 70, రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాల నుంచి 790 బస్సు సర్వీసులు నిర్వహిస్తారు. ► సంక్రాంతి తరువాత ఈ నెల 16 నుంచి 18 వరకు హైదరాబాద్ నుంచి 1,500, బెంగళూరు నుంచి 495, చెన్నై నుంచి 85 సర్వీసులను రాష్ట్రంలోని ప్రాంతాలకు ఏర్పాటుచేశారు. ► విజయవాడ నుంచి 200, విశాఖపట్నం నుంచి 395, రాజమహేంద్రవరం నుంచి 50, తిరుపతి నుంచి 50, రాష్ట్రంలోని ఇతర జిల్లా కేంద్రాల నుంచి 700 సర్వీసులు నిర్వహిస్తారు. ► చార్జీలకు చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూటీఎస్ మెషిన్ల ద్వారా టికెట్ల జారీ విధానాన్ని ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఫోన్పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కానుక ఇదీ.. నిజానికి.. సంక్రాంతి, దసరా పండుగల ప్రత్యేక బస్సు సర్వీసుల్లో అధిక చార్జీలు వసూలు చేయడం రాష్ట్రంలో దశాబ్దాలపాటు అమలవుతూ వచ్చింది. ఒకటిన్నర రెట్లు చార్జీలు అంటే సాధారణ చార్జీలపై 50శాతం అధికంగా చార్జీలు వసూలు చేసేవారు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు సాధారణ చార్జీల కంటే రెండుమూడు రెట్లు అధికంగా వసూలు చేసేవి. ఫలితంగా ప్రయాణికులు భారీ ఆర్థిక భారాన్ని వహించాల్సి వచ్చేది. ఈ విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. సాధారణ చార్జీలతోనే పండుగ ప్రత్యేక సర్వీసులను కూడా నిర్వహించాలని నిర్ణయించింది. 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020, జనవరి 1న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. అనంతరం పరిస్థితిని సమీక్షించి 2021 నుంచి పండుగ ప్రత్యేక బస్సులను సాధారణ చార్జీలతోనే నిర్వహిస్తోంది. వరసగా నాలుగో ఏడాదీ ప్రత్యేక బస్సులను సాధారణ చార్జీలతోనే నిర్వహించాలని నిర్ణయించింది. రిజర్వేషన్లలో 10శాతం రాయితీ.. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా ఆర్టీసీ కల్పించింది. ఒకేసారి రానూపోనూ రిజర్వేషన్ చేసుకుంటే 10శాతం రాయితీ ఇస్తోంది. దీంతో సాధారణ చార్జీల కంటే తక్కువతోనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసేందుకు సూపర్వైజర్లను నియమించింది. బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్, 24 గంటలు సేవలు అందించే సమాచార కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. కాల్ సెంటర్ నంబర్లు 149, 0866–2570005. సద్వినియోగం చేసుకోండి ప్రయాణికులపై భారం పడకూడదనే సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది నిర్ణయించింది. సంక్రాంతి ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లూచేసింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. – ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ ఎండీ -
అర్చన... అనుకున్నది సాధించింది
‘నేర్చుకోవాలి’ అనే తపన ఉంటే ఏ విద్య అయినా చేతికి చిక్కుతుంది. సైకిల్ తొక్కడం కూడా రాని అర్చనా ఆత్రమ్ పెద్ద బస్సును నైపుణ్యంగా నడుపుతూ ‘భేష్’ అనిపించుకోవడానికి ఆ తపనే కారణం.... మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) తొలి మహిళా డ్రైవర్గా వార్తల్లో నిలిచింది అర్చనా ఆత్రమ్. నాందేడ్ జిల్లాలోని కివ్వత్ తాలూకలోని సర్కానీ గ్రామానికి చెందిన అర్చన డ్రైవింగ్ ఫీల్డ్ను ఎంచుకోవడం తండ్రికి నచ్చలేదు. బంధువులు ‘అది ఆడవాళ్లు చేసే ఉద్యోగం కాదు’ అన్నారు. కొందరైతే...‘నీకు సైకిల్ తొక్కడమే రాదు. బస్సు నడుపుతావా!’ అని బిగ్గరగా నవ్వేవాళ్లు. ఎన్నో ప్రతికూల మాటలను ఈ చెవిన విని ఆ చెవిన వదిలేసిందేగానీ ఒక్క అడుగు వెనక్కి వేయలేదు అర్చన. ‘పట్టుదల ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు’ అంటున్న అర్చన పుణెలో జరిగిన శిక్షణ తరగతులలో ఎన్నో విషయాలు నేర్చుకుంది. క్లచ్, గేర్ అంటే ఏమిటో తెలియని అర్చన జీరో నుంచి ప్రయాణం ప్రారంభించి హీరో అయ్యింది. డిపో మేనేజర్ నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరకు ఎంతో మంది అర్చనా ఆత్రమ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. -
ప్రగతి చక్రం !
సాక్షి, హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఆదాయ ఆర్జనలో వరంగల్ రీజియన్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 11 రీజియన్లు ఉండగా.. ఒక్క వరంగల్ రీజియన్ మాత్రమే లాభాల్లో ఉండడం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలోని సెప్టెంబర్ మాసం వరకు వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో అర్ధ సంవత్సరం సెప్టెంబర్ నాటికి రూ.18.62 కోట్ల లాభంతో ముందంజలో ఉంది. వరంగల్ రీజియన్ పరిధిలో నిత్యం 980 బస్సులు రోజుకు 3.80 లక్షల కిలో మీటర్లు దూరం తిరగడం ద్వారా రోజుకు రూ.కోటికి పైగా ఆదాయం సంపాదిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం అర్థ సంవత్సరం (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) వరకు ఆర్టీసీ రూ.3 కోట్ల నష్టంలో ఉంది. దీన్ని అధిగమించడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి రూ.18.62 కోట్ల లాభంతో రాష్ట్రంలోనే వరంగల్ రీజియన్ ఎవరికీ అందనంత దూరంలో పరుగులు పెడుతోంది. మహబూబాబాద్ మినహా అన్ని డిపోలు లాభాల్లోకి.. ఆర్టీసీ వరంగల్ రీజియన్ పరిధిలో తొమ్మిది డిపోలు ఉన్నాయి. ఒక్క మహబూబాబాద్ మినహా మిగతా ఎనిమిది డిపోలు లాభాల్లోకి వచ్చాయి. మహబూబాబాద్ డిపో గత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి రూ.3 కోట్ల నష్టంలో ఉండగా ఈ దఫా రూ.2.59 కోట్ల అధనపు ఆదాయాన్ని సంపాదించి నష్టాన్ని రూ.41 లక్షలకు తగ్గించుకుంది. తొర్రూరు, భూపాలపల్లి, నర్సంపేట, జనగామ, వరంగల్–1, పరకాల, వరంగల్–2, హన్మకొండ డిపోలు లాభాల బాటలో నడుస్తున్నాయి. తొర్రూరు డిపో రూ.90 లక్షల నష్టాల్లో నుంచి రూ.4.13 కోట్ల లాభాల్లోకి చేరుకుంది. వరంగల్–2 డిపో రూ.1.20 కోట్లు, భూపాలపల్లి డిపో రూ.3.4 కోట్ల లాభాల్లో ఉంది. వరంగల్–1 డిపో రూ.6.50 కోట్లు, వరంగల్–2 , నర్సంపేట డిపోలు రూ.1.3 కోట్ల చొప్పున, జనగామ డిపో రూ.1.5 కోట్లు, పరకాల డిపో రూ.50 లక్షలు, హన్మకొండ డిపో రూ.5 లక్షల లాభాల్లోకి వచ్చాయి. రాష్ట్రంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో మన డివిజన్లే.. లాభాలకు సంబంధించి వరంగల్ రీజియన్లోని రెండు డివిజన్లు రాష్ట్రంలో తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. లాభాల్లో వరంగల్ రూరల్ డివిజన్ తొలిస్థానంలో నిలవగా.. వరంగల్ అర్బన్ డివిజన్ రెండో స్థానంలో ఉంది. వరంగల్ రూరల్ డివిజన్ గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నాటికి అర్ధ వార్షికోత్సవంలో రూ.6 కోట్ల నష్టం నుంచి రూ.9 కోట్ల లాభాల్లోకి వచ్చింది. వరంగల్ అర్బన్ రూ.4 కోట్ల నుంచి రూ.9 కోట్ల లాభాల్లోకి చేరుకుంది. వరంగల్ రూరల్ డివిజన్ రూ.కోట్ల నష్టాన్ని పూడ్చుకుని అదనంగా రూ.14 కోట్ల ఆదాయాన్ని రాబట్టుకుని రూ.9 కోట్ల లాభాలతో రాష్ట్రంలో అగ్రభాగంలో నిలిచింది. ముందంజలో ఏడు డిపోలు.. వరంగల్ రూరల్ డివిజన్ పరిధిలో పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, మహబూబాబాద్, తొర్రూరు డిపోలున్నాయి. వరంగల్ అర్బన్ డివిజన్ పరిధిలో వరంగల్–1, వరంగల్–2, హన్మకొండ, జనగామ డిపోలున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం సాధించే మొదటి పది డిపోలలో వరంగల్ రీజియన్కు చెందిన ఏడు డిపోలు ముందు భాగంలో ఉన్నాయి. తొర్రూరు డిపో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా.. భూపాలపల్లి డిపో ద్వితీయ స్థానంలో ఉంది. అ తర్వాత వరుసగా నర్సంపేట, జనగామ, వరంగల్–1, పరకాల, వరంగల్–2 డిపోలు ఉన్నాయి. సంస్కరణలు, సమష్టి కృషే కారణం వరంగల్ రీజినల్ మేనేజర్గా తోట సూర్యకిరణ్ వచ్చిన రెండేళ్ల కాలంలో రీజియన్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. డ్రైవర్లకు గుర్తింపు తీసుకొచ్చేలా డ్రైవర్స్ డే నిర్వహించారు. కండక్టర్, డ్రైవర్ సమన్వయంగా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అద్దె బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. అద్దె బస్సు యజమానులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తూ, అద్దె బస్సు డ్రైవర్లకు ప్రశంసపత్రాలు అందజేస్తూ ప్రోత్సహించారు. కార్మికులు, ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు ఇచ్చి ఉద్యోగ, కార్మిక వర్గాల్లో ఉత్సాహం నింపారు. ఉద్యోగులు, కార్మికులకు సకాలంలో ఇంక్రిమెంట్లు ఇస్తూ, అద్దె బస్సుల యజమానులకు సమయానికి చెల్లింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ రీజియన్లో కార్మికులు, ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పని చేసి లాభాల బాటలోకి తీసుకొచ్చారు. గత ఏడాది 40 వేల పాస్లు జారీ చేయగా ఈ ఏడాది 80 వేల విద్యార్థి పాస్లు జారీ చేసి విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులను ఆర్టీసీ బస్సులో ప్రయాణించేలా చేశారు. ప్రతి నెలా ఉద్యోగులు, కార్మికులు రిటైర్ అవుతున్నా.. కొత్తగా నియామకాలు చేపట్టకుండా.. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, కార్మికులతో పని చేయించుకుంటూ రీజియన్ను లాభాల బాటల్లోకి తీసుకురావడంలో కృషి చేశారు. ఈ ఏడాది 320 కొత్త బస్సులను ప్రవేశ పెట్టారు. 180 ఆర్టీసీ సొంత బస్సులు కాగా.. 150 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకొచ్చారు. బెంగళూర్కు 3 నుంచి 5 బస్సులకు పెంచారు. దీంతో పాటు విశాఖపట్నం, మచిలీ పట్నం, శ్రీశైలానికి అదనంగా.. పుట్టపర్తికి కొత్తగా బస్సులు ప్రవేశ పెట్టారు. దీంతో పాటు అధికారులు, ఉద్యోగులు సమష్టిగా పని చేసి అతి పెద్ద విజయం సాధించారు. అందరికి ఆదర్శంగా నిలిచారు. -
కోలాహలం
♦ ఆర్టీసీలో ఎన్నికల సందడి ♦ సాధారణ ఎన్నికలను తలపిస్తున్న వైనం ♦ మిన్నంటిన ప్రచార హోరు ♦ ఒంటరిగా బరిలోకి టీఎంయూ ♦ జత కలిసిన ఈయూ, ఎస్డబ్ల్యూఎఫ్ సంగారెడ్డి మున్సిపాలిటీ : జిల్లాలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కార్మిక సంఘం గుర్తింపునకు ఈ నెల 19న ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కార్మిక సంఘాలు సాధారణ ఎన్నికలను తలపించేలా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో ఎంప్లాయీస్ యూనియన్తో కలిసి తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఎన్నికల్లో పోటీచేసింది. ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ గెలుపొందిన అనంతరం రెండుగా విడిపోయాయి. ఈసారి నిర్వహించే ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం) ఒంటరిగా పోటీ చేస్తోంది. ఎంప్లాయీస్ యూనియన్ ఈ సారి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్తో కలిసి పోటీ చేస్తోంది. టీఎం యూ ఆవిర్భవించిన ఏడాది కాలంలోనే ఆర్టీసీలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సంఘంగా పేరొందింది. మిత్రపక్షమైన ఎంప్లాయీస్ యూనియన్తో విభేదాలు తలెత్తడంతో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి జిల్లా కావడంతో పాటు యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తు న్న మంత్రి హరీశ్రావు కూడా జిల్లాకు చెందిన వారే కావడంతో ఈసారి జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. టీఎం యూ రీజినల్ కన్వీనర్ పీరయ్య, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో ఇప్పటికే డిపోల వారీగా గేటు మీటింగ్లు నిర్వహించారు. గతంలో మాదిరిగా జిల్లాలోని 7 డిపోల్లో క్లాస్-6తో పాటు క్లాస్-3లో కూడా టీఎంయూ గెలుపు కోసం కార్మికుల మద్దతు కూడగట్టుకుంటున్నారు. గతేడాదిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వేతన సవరణ కోసం సమ్మె నిర్వహించిన విషయం తెలిసిందే. కార్మికులు ఊహించిన దాని కంటే 42 శాతం ఫిట్మెంట్ను ప్రకటించడం టీఎంయూకు కలిసివచ్చే అవకాశముంది. దాంతో పాటు కొన్నేళ్లుగా నిలిచిపోయిన కారణ్య నియామకాలు, కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి రెగ్యులరైజ్ చేయడంతో పాటు పదోన్నతులు కల్పించండం కలిసొచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే.. టీఎంయూ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే ఈ ఎన్నికల్లో ఎస్డబ్ల్యూఎఫ్తో కలిసి పోటీ చేస్తున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి అంజాగౌడ్ తెలిపారు. మొత్తంగా ఆర్టీసీలో కురుక్షేత్రాన్ని తలపించేలా కార్మిక సంఘాల నాయకులు ప్రచారాలను నిర్వహిస్తున్నారు. -
ఆర్థిక సంక్షోభంలో ఆర్టీసీ
♦ రికార్డు స్థాయి నష్టాలతో కుదేలవుతున్న సంస్థ ♦ ఈ ఆర్థిక సంవత్సరం పది నెలల్లో రూ.545 కోట్ల నష్టం ♦ గతేడాది కన్నా రూ.211 కోట్లు ఎక్కువ నష్టం ♦ వేతన సవరణతో భారీగా పెరిగిన జీతాల భారం ♦ ప్రభుత్వం నుంచి సాయం అందక దుర్భర పరిస్థితి ♦ చార్జీల పెంపుతో గట్టెక్కాలని యోచిస్తున్న ఆర్టీసీ సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ తీవ్ర నష్టాలు మూటగట్టుకునే దిశగా సాగుతోంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చరిత్రలో ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈ ఆర్థిక సంవత్సరం పది నెలల (జనవరి నాటికి) ఆ ర్థిక పరిస్థితిపై అధికారులు తాజాగా లెక్కలు వేశారు. జనవరి నాటికి సంస్థ నష్టాలను రూ.545 కోట్లుగా తే ల్చారు. అంతకుముందు ఏడాది పది నెలల నష్టాల తో పోలిస్తే ఇది ఏకంగా రూ.211 కోట్లు అధికం. 2014-15లో జనవరి నాటికి రూ.334 కోట్ల నష్టాలు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెల ల నష్టాలు ఇంకా తేలాల్సి ఉంది. అవి కూడా కలిపితే నష్టాల మొత్తం రూ.650 కోట్లు దాటుతుందని అంచ నా వేస్తున్నారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోతోంద న్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం సాయం చేయని పక్షంలో సంస్థకు ప్పకూలుతుందని పేర్కొంటున్నారు. 2016 -17 ఆర్థి క సంవత్సరానికిగాను 14న ప్రవేశపెట్టను న్న బడ్జెట్ లో ఆర్టీసీకి పెద్దగా నిధులు ప్రకటించలేదని సమాచా రం. కేవలం కొత్త బస్సులు కొనేందుకు మాత్రమే రూ.42 కోట్లను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. బ స్సు పాసుల రాయితీ కింద ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.500 కోట్ల రీయింబర్స్మెంటు మొత్తాన్ని ప్ర భుత్వం నేరుగా చెల్లించకుండా బ్యాంకుల నుంచి అ ప్పు ద్వారా సమకూర్చుకోవాలని సూచించబోతోం ది. ఇటీవలి కేబినెట్లో ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. దీంతో సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు కూ డా ఆర్టీసీ వద్ద నిధులు లేవు. జీతాల భారం తడిసిమోపెడు గత సంవత్సరం ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వం 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన తర్వాత సంస్థ ఖజానా పరిస్థితి తీవ్రంగా దిగజారింది. ఆ భారాన్ని పూర్తిగా సంస్థపై పడకుండా ఆదుకుంటానన్న ప్రభుత్వం ఇ ప్పటి వరకు పెద్దగా చర్యలు తీసుకోలేదు. గత ఆర్థిక సంవత్సరం (వేతన సవరణకు ముందు) ఏప్రిల్ నుం చి జనవరి వరకు జీతాల రూపంలో రూ.1,375 కోట్లు చెల్లించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం రూ.1,813 కోట్లకు చేరింది. అంటే అదనంగా రూ.438 కోట్ల భారం పడిందన్న మాట. ఇక ఫిట్మెం ట్ బకాయిలకు సంబంధించి తొలివిడతగా రూ.200 కోట్లు చెల్లించాల్సి రావటం నష్టాలను మరింత పెంచేసింది. కనీసం ఆ బకాయిలనైనా ప్రభుత్వం చెల్లిస్తుందని ఆశించిన ఆర్టీసీకి నిరాశే ఎదురైంది. చార్జీల పెంపుతో గట్టెక్కాలని.. ప్రభుత్వం సాయం లేక, నష్టాలను అధిగమించలేక చతికిలపడ్డ ఆర్టీసీ ఇక బస్సు చార్జీలపైనే ఆశలుపెట్టుకుంది. ఇప్పటికే చార్జీల పెంపునకు సంబంధించి మూడుసార్లు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అవి పెండింగులో ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత చార్జీలను పెంచలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేనందున మరోసారి ప్రతిపాదించి సీఎంను ఒప్పించాలని ఆర్టీసీ భావిస్తోంది. తాజా నష్టాల తీవ్రతను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. సాయం చేయాలని కోరింది. కానీ ఆ పరిస్థితి లేదని పరోక్షంగా సీఎం తే ల్చి చెప్పినందున ఇక చార్జీల పెంపు అనివార్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. 12 శాతం నుంచి 15 శాతం మేర పెంచి రూ.800 కోట్ల మేర రాబడిని పెంచుకోవాలని ఆర్టీసీ చూస్తోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
నష్టాల్లో ఉంటే మూసేయండి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల్లో ఉందని పదే పదే చెప్పడం కన్నా ఒకే సారి మూసేయండి అని ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు చురకలు అంటించింది. 700 బస్సులు జప్తులో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రూ.1.72 కోట్ల మేరకు టోల్ చార్జీల్ని ప్రైవేటు సంస్థలకు గురువారం చెల్లించింది. సాక్షి, చెన్నై: ఇటీవల మద్రాసు హైకోర్టులో రోడ్ల దుస్థితిపై ఓ పిటిషన్ దాఖలు అయింది. జాతీయ రహదారుల్లో టోల్ చార్జీల మోత మోగిస్తున్నా, రోడ్లు అక్కడక్కడ అధ్వానంగా ఉన్నాయని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రధానంగా బెంగళూరు జాతీయ రహదారిలో అయితే, మూడు చోట్ల టోల్ బాదుతున్నా, రోడ్ల నిర్వహణ సక్రమంగా లేదని వివరించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పయనిస్తున్న ప్రయాణికుడి నెత్తిన టోల్ చార్జీ మోపుతున్నా, ఆయా టోల్ వసూళ్ల సంస్థలు రోడ్లను సక్రమంగా ఎందుకు పర్యవేక్షించడం లేదో ప్రశ్నించి, చర్యలు తీసుకోవాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ విచారించి ఆయా టోల్ వసూళ్ల సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇందుకు వివరణ ఇచ్చిన ఆ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వమే కోట్లాది రూపాయల మేరకు టోల్ బకాయి ఉంచినప్పుడు, తాము ఎలా రోడ్లను సక్రమంగా పర్యవేక్షించ గలమన్న ప్రశ్నను లేవ దీశారు. దీనిపై స్పందించిన బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గురువారం ఆ పిటిషన్ మళ్లీ విచారణకు వచ్చింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సోమయాజులు హాజరై తన వాదనను వినిపించారు. వాదన సమయంలో పదే పదే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీవ్ర నష్టాల్లో ఉందని గుర్తు చేశారు. తాము నష్టాల్లో ఉన్నా ప్రజలకు సేవల్ని అందిస్తున్నామని, నష్టం భర్తీ చేసుకోవడం తీవ్ర కష్టంగా ఉందని వాదన వినిపించారు. ఈ వాదనను విన్న బెంచ్ పదే పదే నష్టాల్లో ఉన్నామని చెప్పుకోవడం కన్నా ఒకేసారి మూసేయండి ఓ పనై పోతుందని ప్రభుత్వానికి చురకలు అంటించారు. టోల్ సంస్థలకు చెల్లించాల్సిన రూ.కోటి 72 లక్షలకు గాను ఐదు చెక్కులను కోర్టు ద్వారా అందజేశారు. అనంతరం రవాణా సంస్థకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల గురించి వివరించండంటూ బెంచ్ ప్రశ్నించగా, ఇప్పటి వరకు 700 బస్సులు జప్తుల్లో ఉన్నాయంటూ అడ్వొకేట్ జనరల్ పేర్కొనడంతో తదుపరి విచారణను ఏప్రిల్కు వాయిదా వేశారు. -
ఆర్టీసీలో ‘టిమ్స్’ ఘంటికలు
ఇబ్బందులు.. నష్టాలు..ఇంతకుముందు డ్రైవర్లు బస్సు నడిపితే.. కండక్టర్లు టిక్కెట్లు ఇచ్చేవారు. ఇప్పుడు కొన్ని బస్సుల్లో కండక్టర్లు లేకుండా చేశారు. వారి బదులు డ్రైవర్లే టిమ్స్తో టిక్కెట్లు ఇస్తున్నారు. ప్రభుత్వం చేసిన చట్ట సవరణ ప్రకారం.. ఇక ముందు అన్ని బస్సుల్లోనూ కండక్టర్లు ఉండరు. వారి విధులను డ్రైవర్లే నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ విధానంతో కండక్టర్ల వ్యవస్థకు మంగళం పాడినట్లే. ఇప్పుడున్న కండక్టర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడటంతో పాటు.. భవిష్యత్తులో ఈ నియామకాలే ఉండవు. ఇది నిరుద్యోగులకు నష్టం. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:టిమ్స్.. ప్రస్తుతం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న యంత్రం ఇది. సంస్థ ఉద్యోగులు, యాజమాన్యం మధ్య వివాదం రేపిన ఈ యంత్రం.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ భద్రత, కండక్టర్ల ఉద్యోగ భద్రతను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తోంది. దీనికి కారణం ప్రభుత్వం ఇటీవల రవాణా చట్టంలో చేసిన సవరణే. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు లేకుండా టిమ్స్(టిక్కెట్ ఇష్యూయింగ్ మెషీన్) ద్వారా డ్రైవర్లతోనే టిక్కెట్లు కొట్టించాలన్నది ఈ సవరణ సారాంశం. ఇప్పటికే కొన్ని బస్సుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇది కష్టసాధ్యమని, డ్రైవర్లపై ఒత్తిడి పెరుగుందని.. ఓ వైపు డ్రైవింగ్ చేస్తూ, మరోవైపు టిక్కెట్లిచ్చే ఈ పద్ధతిని వ్యతిరేకిస్తూ గతంలో కొందరు ఉద్యోగులు హైకోర్టు కెళ్లారు. హైకోర్టు కూడా వారి పక్షానే నిలిచింది. అయితే రవాణా చట్టంలో సవరణలు తీసుకురావడం ద్వారా ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోవాలని చూస్తోంది. టిమ్స్ వినియోగంపై డ్రైవర్లకు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చి, వారికే కండక్టర్ బాధ్యతలు అప్పగించాలన్న ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డ్రైవర్లకు విశ్రాంతి అక్కర్లేదా? శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 30 టిమ్స్ పని చేస్తున్నాయి. శ్రీకాకుళం డిపో-1 పరిధిలో 10, డిపో-2 పరిధిలో 20 టిమ్స్ ఉండా వీటితో 60 మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. రీజియన్ పరిధిలో 60 టిమ్స్తో ఇద్దరు చొప్పున 120 మంది డ్రైవర్లు పని చేస్తున్నారు. గతంలో దూరప్రాంత బస్సులకు ఓ డ్రైవర్ ఆరుగంటల పాటు బస్సు నడిపితే అక్కడి రెస్ట్రూమ్లో విశ్రాంతి పొందుతున్న మరో డ్రైవర్ రెండో షిఫ్టులో వచ్చి బస్సు నడిపేవాడు. ఇప్పుడు కండక్టర్ లేకపోవడం వల్ల ఇద్దరు డ్రైవర్లూ విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తోంది. మొదటి డ్రైవర్ ఆరుగంటల పాటు బస్సు నడిపి బస్సులోనే విశ్రాంతి తీసుకునేందుకు సిద్ధమైతే, అప్పటికే టిమ్స్తో టిక్కెట్లు కొట్టిన రెండో డ్రైవర్ డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది. మరోవైపు అప్పటికే బస్సు నడిపిన మొదటి డ్రైవర్కు మళ్లీ టిమ్స్ విధులు తప్పడం లేదు. దీనివల్ల వారిపై ఒత్తిడి పెరిగి రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయి. ఇదే విషయమై కార్మిక నాయకులు గతంలో కార్మికశాఖ అధికారులకు టిమ్స్ ఇబ్బందుల్ని విన్నవించుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ అన్ని ప్రాంతాల సర్వీసులకూ టిమ్స్ ప్రవేశపెడితే ప్రయాణికుల భద్రతతో పాటు డ్రైవర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆర్టీసీ సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. సిబ్బందిని కుదించేందుకేనా? ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా రాష్ర్ట వ్యాప్తంగా 3200 టిమ్స్ను వినియోగంలోకి తెచ్చిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఎంపికై శిక్షణ పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న 1000 మంది కండక్టర్ అభ్యర్థులను పక్కన పెట్టి సిబ్బందిని కుదించేందుకు సంస్థ యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆందోళన చెందుతున్నాయి. జనవరి 23న హైకోర్టు కూడా కార్మికులకు అనుకూలంగా తీర్పునిచ్చినా రవాణా చట్టాలను సవరించి జీవో నెంబర్ 8 ద్వారా ఆర్టీసీ అనుకున్న పని చేసుకుపోతోంది. కేవలం మూడు రోజులు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా టిమ్స్ను అమలు చేస్తామని చెబుతున్న ఆర్టీసీ వైఖర్ని కార్మిక సంఘాలు తప్పుబడుతున్నాయి. గతంలో దూర ప్రాంతాలైన హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం లాంటి ప్రాంతాలకే ఏసీ, ఇంద్ర, సూపర్ డీలక్స్ సర్వీసుల్లో టిమ్స్ అమలు చేసినా భవిష్యత్తులో ఎక్స్ప్రెస్, పల్లెవె లుగు సర్వీసుల్లోనూ కండక్టర్ లేకుండా టిమ్స్ ద్వారా డ్రైవర్లనే పంపించేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోందని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించేందుకు 13 జిల్లాల ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు మంగళవారం మంగళవారం విజయవాడలో సమావేశమవుతున్నారు. ప్రమాదాలు తప్పవు డ్రైవర్లే టిమ్స్ నిర్వహిస్తే రోడ్డు ప్రమాదాలు తప్పవు. సంస్థ లాభం కోసం చూసుకోకుండా ప్రయాణికుల, సిబ్బంది భద్రతపై దృష్టి సారించాలన్నదే మా డిమాండ్. టిమ్స్ యంత్న్రాలను మేం తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నాం. చేంజింగ్ లేకుండా డ్రైవర్లే టిమ్స్ ఉపయోగించడం, రాత్రి వేళ నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయడం కష్టం. ఆర్టీసీ తన తీరు మార్చుకోకపోతే ఉద్యమిస్తాం. -ఎస్.అప్పారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగ భద్రత ఎక్కడ? ఇంటికో ఉద్యోగమంటున్న ప్రభుత్వం వెయ్యి మంది శిక్షణ పొందిన కండక్టర్ల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. కారుణ్య నియామకాల్లోనూ ఆర్టీసీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. సాక్షాత్తు హైకోర్టు చెప్పినా వినకుండా డ్రైవర్లతోనే టిమ్స్ నిర్వహించేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. ఆర్టీసీ తన జీవో రద్దు చేసుకోకుంటే భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవు. -పలిశెట్టి దామోదర్రావు, రాష్ట్ర ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి, ఈయూ -
16న ఢిల్లీకి రండి..
* ఆర్టీసీ విభజనపై ఇరు సీఎస్లకు నితిన్ గడ్కారీ పిలుపు * సమస్యపై ఎట్టకేలకు దృష్టి సారించిన కేంద్రం * ఇద్దరు ప్రధాన కార్యదర్శులతో భేటీకానున్న కేంద్రమంత్రి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినా ఉమ్మడిగానే సాగుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)పై ఎట్టకేలకు కేంద్రం దృష్టి సారిం చింది. దీనికి సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారీ ఈ నెల 16న ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశమవుతున్నారు. ఈ మేరకు ఢిల్లీకి రావాల్సిం దిగా గడ్కారీ కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులకు లేఖలు అందాయి. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఆర్టీసీలో చోటు చేసుకున్న పరి ణామాలు, రెండు ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల వాదనలు, ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు, వాటి జారీ తర్వాత ఉత్పన్నమవుతున్న పరిస్థితులు, ఆస్తులు-అప్పులు, వాటి కేటాయింపునకు షీలాభిడే కమిటీ నిర్ణయాలు... ఇలా అన్ని వివరాలను గడ్కారీకి సమర్పించనున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు సీఎస్లు విడివిడిగా నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. సెలవు రోజైనప్పటికీ శనివారం ఆర్టీసీ ఈడీలు బస్భవన్లోనే ఉండి ఈ వివరాలను క్రోడీకరించారు. కేసీఆర్ జోక్యంతో వేగంగా..: ఆస్తులు, అప్పుల పంపకం జఠిలంగా మారిన నేపథ్యంలో ఆర్టీసీ విభజనలో అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో వాటి పంపకంతో సంబంధం లేకుండా టీఎస్ ఆర్టీసీ ఏర్పాటుకు అనుమతించాలంటూ ఇప్పటికే టీ సర్కార్ కేంద్ర ఉపరితల రవాణా శాఖ ను కోరింది. ఇటీవల రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్రెడ్డి.. గడ్కారీని కలసి ప్రభుత్వ పక్షాన వినతిపత్రం అందజేయడంతో పాటు సీఎం కేసీఆర్ ఫోన్లో చర్చించారు. దీంతో రెండు రాష్ట్రాల సీఎస్లను ఢిల్లీకి రావాల్సిందిగా శుక్రవారం లేఖలు పంపారు. వెంటనే బోర్డు సమావేశం? నితిన్ గడ్కారీతో భేటీ అయిన వెంటనే ఆర్టీసీ పాలకమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల కేటాయింపుపై ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. తెలంగాణ ఉద్యోగుల పంపిణీకి జారీ అయిన కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలనే ఆర్టీసీ పేరు మార్చి అనుసరించింది. ఇందులో ఆప్షన్లకు అవకాశం కల్పించడాన్ని తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా వ్యతి రేకిస్తున్నారు. ఇక నగరంలోని ఆర్టీసీ ‘ఉమ్మడి ఆస్తుల’కు సంబంధించి కేంద్రం నియమించిన షీలాభిడే కమిటీ ఆదేశంతో ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ మూల్యాం కనం చేసి ఓ నివేదికను అందజేసింది. వీటి కి బోర్డు ఆమోదం అవసరమున్నందున సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఢిల్లీ సమావేశంలో గడ్కారీ సూచనల ఆధారంగా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. -
ఆర్టీసీ వరం...రాయితీ ప్రయాణం
విశాఖపట్నం: భద్రతకు, సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా నిలుస్తున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రయాణికులకు అనేక రాయితీలు కల్పిస్తోంది. కొన్ని సేవలను ఉచితంగా కూడా అందిస్తోంది. ప్రైవేటు రవాణా నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని, ప్రయాణికులకు దగ్గరయ్యేందుకు సంస్థ అనేక చర్యలు తీసుకుంటోంది. వీటితో ప్రయాణికులకు ఎక్కువ లబ్ధి చేకూరుతోంది. ఈ సంస్థ అందిస్తున్న సేవల వివరాలు.. బాలికలకు ఉచిత పాస్ : 18 సంవత్సరాలోపు బాలికలు పదో తరగతి వరకు చదువుకునేందుకు ఆర్టీసీ ఈ పాస్ను జారీ చేస్తోంది. ఆయా విద్యా సంస్థల నుంచి విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే పాస్లు జారీ చేస్తారు. 20 కిలోమీటర్ల వరకు ఈ కార్డుపై ఉచితంగా బాలికలు ప్రయాణించవచ్చు. అలాగే 12 ఏళ్లులోపు బాలురకు సైతం ఉచితంగా బస్పాస్ అందిస్తున్నారు. సిల్వర్, గోల్డ్ కార్డు గతంలో కొనసాగిన నెలవారీ సీజన్ టికెట్ స్థానంలో సిల్వర్ కార్డు, మూడు నెలల వెలిడిటీతో గోల్డ్కార్డును ఆర్టీసీ ప్రవేశపెట్టింది. పల్లె వెలుగు బస్సుల్లో 20 రోజుల చార్జీ చెల్లించి 30 రోజులపాటు ప్రయాణం చేయవచ్చు. ఈ కార్డులు కలిగిన వారు రూ.5 అదనంగా చెల్లించి ఎక్స్ప్రెస్లో, రూ.10 అదనంగా చెల్లించి డీలక్స్ బస్సుల్లో ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఈ కార్డులను 5 కి.మీ. స్లాబ్ నుంచి 75 కి.మీ. వరకు జారీ చేస్తారు.76 కి.మీ. నుంచి 100 కిమీ వరకు 80 కి.మీ. చార్జీని పరిగణనలోకి తీసుకుంటారు. జనరల్ పాస్ : అన్ని వర్గాల ప్రజలు ప్రయాణించేందుకు వీలుగా ఆర్టీసీ జనరల్ బస్పాస్ను ప్రవేశపెట్టింది. నెలకు రూ.750 చెల్లించి జనరల్ బస్ టికెట్ పొందవచ్చు. దీని ద్వారా నగరంలో మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లయినా ప్రయాణించవచ్చు. వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు ఈ పాస్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎన్జీవోస్ బస్పాస్ : చిరుద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లి వచ్చేందుకు ఈ పాస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రూ.14.860లోపు స్కేల్ కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తే ఎన్జీఓస్ జనరల్ బస్టికెట్ పొందవచ్చు. నెలకు రూ.235 చెల్లించి సిటీ బస్సుల్లో 20 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. మెట్రో, జెఎన్ఎన్యూఆర్ఎం బస్సుల్లో కూడా ఈ పాస్లను అనుమతిస్తారు. వికలాంగుల బస్పాస్ : అంగవైకల్యం కలిగిన వారికి చేయూతనందించేందుకు ఆర్టీసీ బస్పాస్ సౌకర్యం కల్పిస్తోంది. వంద శాతం వైకల్యం కలిగిన వారికి పూర్తి రాయితీ అందిస్తున్నారు. వికలాంగుడితోపాటు సహాయకుడూ ఉచితంగా ప్రయాణించే వీలుం టుంది. వికలాంగత్వం తక్కువగా ఉంటే 50 శాతం రాయితీలపై ప్రయాణించే సౌకర్యం ఉంది. విహారి కార్డు జూబ్లీ హైటెక్ కార్డు, కపుల్ గిఫ్ట్ కార్డు స్థానంలో ఆర్టీసీ ఇటీవల విహారి కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డు కొన్న వారు ఏసీ బస్సులు మినహా ఏ బస్సుల్లోనైనా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా 50 శాతం రాయితీపై ప్రయాణించవచ్చు. రూ.550 చెల్లించి ఈ కార్డును పొందవచ్చు. ఇది ఏడు రోజులపాటు చెల్లుబాటు అవుతుంది. విహారి కార్డును రద్దు చేసుకునే అవకాశం సైతం ఉంటుంది. ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు కార్డు కొనుగోలు చేసిన చోటే రద్దు చేసుకుంటే కార్డు విలువలో 75 శాతం తిరిగి పొందవచ్చు. రాయితీలు సద్వినియోగం చేసుకోవాలి ఆర్టీసీ బస్సులో తిరిగే ప్రయాణికులు సంస్థ కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకొని సురక్షతమైన ప్రయాణం చేయాలి. ప్రయాణికులే మా దేవుళ్లు. సంస్థ చేపట్టే ఈ పథకాలను విశాఖలో 63 శాతం వినియోగించుకుంటున్నారు. త్వరలో మరిన్ని రాయితీలు ప్రవేశపెట్టనున్నాం. -పి. జీవన్ప్రసాద్,ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ డిప్యూటీ మేనేజర్ (రూరల్) నవ్య క్యాట్ కార్డు ఆర్టీసీలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్డు నవ్య క్యాట్ కార్డు. క్యాట్ కార్డు స్థానంలో ఆర్టీసీ నవ్య క్యాట్ కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డు ద్వారా పది శాతం రాయితీతో ఏసీ బస్సులు మినహాయించి అన్ని బస్సుల్లో ప్రయాణించవచ్చు. రూ.250 చెల్లించి కార్డు తీసుకుంటే ఏడాదిపాటు చెల్లుబాటులో ఉంటుంది. సంవత్సరం తర్వాత రూ.150 చెల్లించి రెన్యూవల్ చేసుకోవచ్చు. రూ.వంద అదనంగా చెల్లించి నలుగురు కుటుంబ సభ్యులకు అనుబంధ కార్డు పొందవచ్చు. నూతన కార్డు తీసుకున్నవారికి రూ.1.75 లక్షలు, రెన్యూవల్ చేసుకున్న వారికి రూ.2లక్షలు ప్రమాద బీమా వర్తిస్తుంది. అదనపు కార్డుదారుడికి సైతం ఈ బీమా వర్తిస్తుంది. -
ఇక.. రోడ్ల మీదకి పచ్చ వెలుగులు!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏపీలో అమల్లో ఉన్న ఒక్కో పథకానికీ పేరు మార్చుకుంటూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా పల్లె వెలుగు బస్సులకు కూడా పేరు మార్చాలని నిర్ణయించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సంస్కరణల పేరుతో పల్లె వెలుగు బస్సులను పచ్చ వెలుగు బస్సులుగా మార్చడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. పల్లె వెలుగు బస్సులకు పసుపు రంగు వేయాలని నిర్ణయించారు. దీనికిగాను ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. అదేవిధంగా బస్సులపై మాజీ సీఎం ఎన్టీఆర్ ఫొటోను ముద్రించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ‘తెలుగు వెలుగు’ అని కొత్త పేరు పెట్టనున్నారు. -
నాలుగు నెలల్లో ఆర్టీసీ విభజన
రవాణామంత్రి మహేందర్రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(ఆర్టీసీ)ను నాలుగు నెలల్లోగా విభజిస్తామని రవాణామంత్రి మహేందర్రెడ్డి చెప్పారు. శనివారం హెచ్ఐసీసీలో జరిగిన మహిళా పారిశ్రామిక వేత్తల అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన కొద్దిసేపు విలేకరులతో విడిగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బస్సులు వెళ్లని గ్రామాలు 1300 వరకున్నాయని, త్వరలోనే వాటికి బస్సు సదుపాయం కల్పిస్తామన్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఆహ్లాదకరంగా కనిపించేలా ప్రత్యేక రంగు వేయించాలని నిర్ణయించామన్నారు. పలు డిజైన్లను ఎంపిక చేశామని, అంతిమనిర్ణయం సీఎం కేసీఆర్ తీసుకోవాల్సి ఉందన్నారు. హైదరాబాద్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులకోసం ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడపనున్నట్టు మంత్రి చెప్పారు. సొంత కార్ల కన్నా ఆర్టీసీ బస్సుల్లోనే మహిళా ఉద్యోగులకు భద్రత ఉంటుందన్నారు. మరో 20 ఏళ్లు మా ప్రభుత్వమే.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మేలు కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలను చూసే ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లోకి వస్తున్నారని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరో 20ఏళ్లపాటు టీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణలో ఉంటుందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కొద్దిరోజుల్లోనే ఖాళీ అవుతాయన్నారు. -
ఎన్నికల విధుల్లో స్కూలు బస్సులు
అందుబాటులో సుమారు 1000 వాహనాలు * రెండు రోజుల పాటు ఆర్టీసీ ఆధీనంలోనే... * 13వ తేదీనుంచే దీపావళి సెలవులు ప్రకటించిన ఎక్కువ శాతం స్కూళ్లు సాక్షి, ముంబై: ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులను ఆయా ప్రాంతాలకు చేరవేసేందుకు దాదాపు 1,000 పాఠశాల బస్సులను ఉపయోగించనున్నారు. ఈ బస్సుల్లో దాదాపు 70 శాతం ప్రభుత్వ ఉద్యోగులను మంగళ, బుధవారాల్లో విధులకు చేరవేయనున్నారు. సిబ్బందిని చేరవేసే బాధ్యతను వారికి రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ అప్పగించింది. ఈ బస్సుల్లో బ్యాలెట్ బాక్సులు, పత్రాలతోపాటు ఓటింగ్కు అవసరమున్న ఇతర సామగ్రి స్టాంపులు, ఇంక్లు కూడా తరలించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దీంతో నగరంలోని అన్ని పాఠశాలలు ఈ నెల 15 తేదీన బంద్ చేయగా కొన్ని పాఠశాలలు మాత్రమే 14వ తేదీన నడువనున్నట్లు అధికారి తెలిపారు. అంతేకాకుండా కొన్ని పాఠశాలలు ఆ రోజు పరీక్షలను కూడా నిర్వహిస్తున్నాయన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఒక్క రోజు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు మరో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఆర్టీవో అధికారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల విధుల కోసం బస్సులను అందించాల్సిందిగా ఈ నెల 9వ తేదీన అన్ని పాఠశాలలు అదేవిధంగా స్కూల్ బస్ అసోసియేషన్లకు సర్క్యూలర్ జారీ చేశామన్నారు. అద్దె స్కూల్ బస్సులే కాకుండా పాఠశాలలకు చెందిన స్కూల్ బస్సులను కూడా ఎన్నికల నిమిత్తం అందించాలని కోరామన్నారు. కాగా ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి బస్సులు విద్యార్థుల కోసం అందుబాటులో ఉండవని అధికారి ఒకరు తేల్చి చెప్పారు. అంతేకాకుండా కొన్ని స్టేట్ బోర్డ్ పాఠశాలలను కూడా ఓటింగ్ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారన్నారు. దీంతో 14వ తేదీన కూడా కొన్ని పాఠశాలలను బంద్ చేయనున్నారు. అయితే కొన్ని పాఠశాలలు ఈ నెల 13వ తేదీ నుంచి దీపావళి సెలవులను ప్రకటించాయి. ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ కి చెందిన కొన్ని పాఠశాలలు మిడ్ టర్మ్ పరీక్షలను ఇంతకు ముందే పూర్తి చేశాయి. ప్రస్తుతం బోధనా క్లాసులను నిర్వహిస్తున్నారు. బస్సుల కొరత వల్ల తాము పాఠశాలలను మూసి ఉంచబోమని అంధేరిలోని రాజ్హన్స్ విద్యాలయ ప్రిన్సిపల్ దీప్షిక శ్రీవాస్తవ్ తెలిపారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు తమ విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సహకరిస్తారని చెప్పారు. వారు తమ పిల్లలనుపాఠశాలలకు పంపించేందుకు ప్రత్నామ్నాయం చూసుకుంటారని తెలిపారు. ఇదిలా ఉండగా, కానీ కొన్ని స్టేట్ బోర్ట్ పాఠశాలలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. 14వ తేదీన బస్సులు నడవవని ముందే సమాచారం ఉన్నందున తాము 9వ, 10వ తరగతులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎస్వీపీ స్కూల్ ప్రిన్సిపల్ సంగీత శ్రీవాస్తవ్ తెలిపారు. దీంతో తాము ఇతర రవాణాను చూసుకోవాల్సిందిగా తల్లిదండ్రులు కోరామన్నారు. అయితే చిన్న పిల్లలకు మాత్రం సెలవు ప్రకటించినట్లు శ్రీవాస్తవ్ పేర్కొన్నారు. -
ఆర్టీసీ ఆస్తుల మూల్యాంకనంతో రగడ
షీలాభిడే కమిటీ ఆదేశంతో కసరత్తు షురూ రంగంలోకి ప్రైవేటు ఏజెన్సీ ఉమ్మడి ఆస్తులనడంపై భగ్గుమన్న తెలంగాణ అధికారులు శుక్రవారం నుంచి ఆందోళన? హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో మరోసారి విభజన చిచ్చు రాజు కుంది. కొద్దిరోజుల్లో ప్రశాంతంగా తెలంగాణ ఆర్టీసీ ఏర్పడుతుంది అని అనుకుంటున్న దశలో ఒక్కసారిగా వేడి రగులుకుంది. తెలంగాణ అధికారులు, కార్మికులు మళ్లీ ఆందోళన బాట పట్టేం దుకు సిద్ధమయ్యారు. వచ్చే శుక్రవారం నుంచి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమని తెలంగాణ అధికారులు సంఘం ప్రకటించింది. ఆస్తులు, అప్పుల పంపకంతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కేంద్ర ఉపరితల రవాణా శాఖకు దరఖాస్తు చేయాలని నిర్ణయించిన తరుణంలో కొత్త వివాదం తలెత్తింది. కార్పొరేషన్ల విభజన అంశాన్ని పర్యవేక్షిస్తున్న షీలాభిడే కమిటీ తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయం తాజాగా అగ్గిని రాజేసింది. ఇదీ సంగతి... కార్పొరేషన్ల విభజన కోసం కేంద్రం షీలాభిడే కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే రెండుసార్లు ఆర్టీసీ సహా ఆయా కార్పొరేషన్ల అధికారులతో భేటీ అయింది. హైదరాబాద్లోని ఆర్టీసీ ఆస్తులను ఉమ్మడి ఆస్తులుగా పేర్కొంటూ వాటి విలువల మూల్యాంకనం చేయాలని నిర్ణయిం చింది. ఈ బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఆ సంస్థ ఆయా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు సేకరించి మూల్యాంకన మొదలుపెట్టింది. మార్కెట్ ధరలను ప్రామాణికంగా తీసుకున్నట్టు సమాచారం. దాదాపు పది రోజులుగా జరుగుతున్న ఈ కసరత్తు గురించి తెలుసుకున్న ఆర్టీసీలోని తెలంగాణ అధికారులు అగ్గిమీదగుగ్గిలమయ్యారు. ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ తంతును సాగిస్తున్నారని ఆరోపిస్తూ ఆర్టీసీ తెలంగాణ ఆఫీసర్స్ అసోసియేషన్, సూపర్వైజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దాదాపు వందమంది మంగళవారం బస్భవన్లో అత్యవసరం గా భేటీ అయ్యారు. హైదరాబాద్లో ఉన్న ఆస్తు లు తెలంగాణకే చెందినవని, ‘ఉమ్మడి ఆస్తులు’ అనే పదానికి అర్థమేలేదని పేర్కొంటూ గతంలో ఆర్టీసీ అంతర్గత విభజన కమిటీకి నివేదించి ఆ పదాన్ని తొలగింపచేసినా మళ్లీ కుట్రపూరితంగా తెరపైకి తెచ్చారని ఆరోపించారు. వెంటనే ఈ కసరత్తును అడ్డుకోవాలని తీర్మానించారు. ఇందుకోసం గురువారం ఆర్టీసీ ఈడీలతో రౌండ్టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో సానుకూల నిర్ణయం రానిపక్షంలో శుక్రవారం నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం కావాలని తీర్మానించారు. తొలుత బస్భవన్ ఎదుట ధర్నా చేయాలని నిర్ణయించారు. ‘తాజా మూల్యాంకనంతో హైదరాబాద్లోని అన్ని స్థిరాస్తుల విలువగట్టి దాన్ని 58:42 నిష్పత్తిలో రెండు రాష్ట్రాల మధ్య పంచే కుట్రజరుగుతోంది. దీన్ని సాగనివ్వం’ అని వారు పేర్కొన్నారు. సమావేశంలో ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సురేందర్, విజయభాను, వాసుదేవరావు, కృష్ణమోహన్, శ్రీనివాసరావు, రాములు, గిరిమహేశ్, లవన్న తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు నెలలు... రూ.450 కోట్లు
ఆర్టీసీకి రికార్డుస్థాయి నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం వేయి కోట్లు ఉంటుందని అంచనా పరిస్థితి చేయి దాటిపోతోందంటూ ప్రభుత్వానికి అధికారుల నివేదిక వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని విన్నపం హైదరాబాద్: రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థకు డేంజర్ హారన్ మోగుతోంది. అప్పులు, నష్టాలతో ఇప్పటివరకు ఎలాగోలా ‘నెట్టుకుంటూ’ వచ్చిన రవాణా సంస్థ ఇక చేతులెత్తేసే పరిస్థితికి చేరుకుం ది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెల ల్లో ఆర్టీసీ చరిత్రలో కనీవినీ ఎరుగని నష్టాలను చవిచూసింది. దీంతో దిమ్మతిరిగిన ఆర్టీసీ యాజ మాన్యం ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ఉన్నఫళం గా ఆదుకోకపోతే సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని తేల్చిచెప్పింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.902 కోట్ల నష్టానికే బిత్తరపోయిన ఆర్టీసీకి ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు (ఏ ప్రిల్-జూలై) మాసాల్లో ఏకంగా రూ.450 కోట్ల నష్టాలు కోలుకోకుండా చేశాయి. తాజాగా లెక్కలేసిన యాజమాన్యం విషయాన్ని ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి, ఈ సారి నష్టం వేయికోట్లు దాటుతుందని ముందస్తు అంచనాను సమర్పించింది. పదుల నుంచి వందల్లోకి... గత సంవత్సరం మే నెలలో ఆర్టీసీకి రూ.35 కోట్ల నష్టం మాత్రమే వాటిల్లింది. కానీ, ఈ ఏడాది మేలో ఏకంగా రూ.188 కోట్ల నష్టం వచ్చిపడింది. గత ఏడాదితో పోల్చితే ఎప్పటికప్పుడు నష్టాలు తీవ్రమవుతుండడంతో ఆర్టీసీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం కాలంగా ఉమ్మడి రాష్ర్టం లో ఉద్యమాల నేపథ్యంలో ఆర్టీసీ పరిస్థితిని ప్ర భుత్వం సమీక్షించలేకపోయింది. నష్టాలు క్రమం గా పెరుగుతున్నాయన్న విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా పట్టుతప్పింది. ముఖ్యంగా గత సంవత్సరం ఆగస్టు నుంచి నష్టాల తీవ్రత మరింత పెరిగింది. ఆ నెలలో ఏకంగా రూ.113 కోట్ల నష్టాలు రావడంతో అధికారులు బిత్తరపోయారు. ఒకేనెలలో నష్టాలు రూ.వంద కోట్లు దాటడం సాధారణ విషయం కాదు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గత డిసెంబర్లో రూ.65 కోట్లు, ఈ ఏడాది జనవరిలో రూ.71 కోట్లు, ఫిబ్రవరిలో రూ.58 కోట్లు, మార్చిలో రూ.195 కోట్లు... ఇలా ఆర్టీసీని నష్టాలు చుట్టుముట్టాయి. గడిచిన మూడునెలల్లో వరుసగా వంద కోట్లకు పైగానే నష్టం రావడంతో పరిస్థితి తమ చేయిదాటిపోయిందని అధికారులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అయితే, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రూ.250 కోట్ల చొప్పున గ్రాంటు మంజూరు చేయడం మినహా దిద్దుబాటుకు ఉపక్రమించకపోవడం విశేషం. పదవీ విరమణ సిబ్బందికి పైసలేవీ.... ఆర్టీసీలో పెరుగుతున్న నష్టాలు బస్సుల నిర్వహణపైనే కాదు... సిబ్బంది సంక్షేమ కార్యక్రమాలపైనా పడుతోంది. సిబ్బంది భవిష్యనిధి దాదాపు రూ.160 కోట్లు సొంతానికి వాడుకున్న ఆర్టీసీ.. తాజాగా పదవీ విరమణ సిబ్బందికి చెల్లించాల్సిన మొత్తాలను దాదాపు నిలిపివేసింది. ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన సిబ్బందికి పక్షం రోజుల్లో రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించడం ఆనవాయితీ. కానీ, నష్టాల తీవ్రత కారణంగా ఆ చెల్లింపులు నిలిపివేసింది. గత రెండు నెలల్లో 650 మంది కార్మికుల ఫైళ్లు పెండింగ్లోకి వెళ్లాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే గాని వీరికి చెల్లింపులు జరిపే పరిస్థితి లేదు. -
ఆర్టీసీని కాపాడే దారేది?
11 నుంచి సమ్మెపై వెనక్కు తగ్గేది లేదు: ఈయూ విజయవాడ బ్యూరో: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం కచ్చితమైన చర్యలు తీసుకునేవరకూ పోరాటం చేయాలని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నిర్ణయించింది. ఈనెల 11వతేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో ఈయూ ఆధ్వర్యంలో ఆదివారం అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎస్డబ్ల్యూఎఫ్, సీపీఐ, సీపీఎం ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ నేతలు దీనికి హాజరయ్యూరు. ఆర్టీసీ మనుగడ కోసం చేస్తున్న ఈ ఆందోళనకు అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు బాసటగా నిలవాలని ఈయూ నేతలు విజ్ఞప్తి చేశారు. గతంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు సంస్థను నిలబెట్టుకునేందుకు ఉద్యమ బాట పడుతున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీకి రూ.250 కోట్లు ఇస్తానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ై మూడు రోజులపాటు నిరవధిక దీక్షలు చేపట్టినా ప్రభుత్వం, యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం బకారుులు చెల్లించాలి ఆర్టీసీ చట్టం 1950 ప్రకారం 1: 2 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1995-96 తరువాత విస్మరించాయని ఈయూ నేతలు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద కార్మికులు దాచుకున్న రూ.444 కోట్లను యాజమాన్యం ఖర్చు చేసిందని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రూ.700 కోట్లు రావాల్సి ఉందన్నారు.బకారుుల విడుదల, ప్రైవేటీకరణను విరమించుకోవాలని, సీసీఎస్ సొమ్మును యాజమాన్యం నుంచి రికవరీ చేయాలనే 8 డిమాండ్లతో రౌండ్ టేబుల్ భేటీల్లో తీర్మానాలు చేశారు. కార్మికులతో 9న యూజమాన్యం చర్చలు హైదరాబాద్: సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈనెల 9వ తేదీన ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కార్మిక సంఘాల నాయకులను పిలిచారు. ఇప్పటికే ఒకసారి మంత్రి సిద్ధా రాఘవరావు వారితో చర్చలు జరిపినా ఎలాంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో మరోసారి చర్చలకు వివిధ యూనియన్ల నాయకులను ఆహ్వానించారు. -
‘బెస్ట్’ సిబ్బందికి మర్యాద పాఠాలు
సాక్షి, ముంబై: నష్టాల బాటలో నడుస్తున్న బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్పోర్టు (బెస్ట్) ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తోంది. ప్రయాణికులను సంస్థకు మరింత సన్నిహిత చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రయాణికులతో మర్యాదగా ఎలా నడుచుకోవాలో బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్య పెరిగి ఆదాయం కొంత మెరుగుపడవచ్చని బెస్ట్ యాజమాన్యం భావిస్తోంది. 20 సంవత్సరాల కిందట రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కు ఇదే పరిస్థితి ఎదురయింది. డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడం, చిల్లర విషయంలో గొడవకు దిగడం, చేయి చూపినా బస్సులు ఆపకపోవడం, దూషించడం వంటివి చేసేవారు. అదే సమయంలో ఆర్టీసీ బస్సులకు పోటీగా గ్రామీణ ప్రాంతాల్లో ఆటోలు, జీపులు వచ్చాయి. దీంతో కాలక్రమేణా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గి ఆదాయానికి గండిపడింది. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ యాజమాన్యానికి ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఎదురైంది. దీంతో తన తప్పు తెలుసుకున్న సంస్థ డ్రైవర్లు, కండక్టర్ల ప్రవర్తనలో మార్పులు తెచ్చింది. చెయ్యి చూపిన చోట బస్సు ఆపాలని, ప్రయాణికులను ఇష్టమున్న చోట దింపాలని ఆదేశించింది. కాలక్రమేణా ఆదాయం పెరగడంతో ప్రస్తుతం ఆర్టీసీ పరిస్థితి కొంత మెరుగుపడింది. ఇదే పద్ధతిలో బెస్ట్ ఉద్యోగులకు కూడా పాఠాలు నేర్పాలని, అప్పుడే సంస్థ ఆర్థిక పరిస్ధితి గాడిన పడుతుందని కొందరు నిపుణులు బెస్ట్కు సూచించారు. ముంబైలో అనేక రవాణా సాధనాలు ఉన్నప్పటికీ నగరవాసుల్లో చాలా మంది బెస్ట్ బస్సులకే ప్రాధాన్యం ఇస్తారు. కొందరు కండక్టర్లు, డ్రైవర్లు తమ ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పగ లే కాదు కనీసం రాత్రి వేళల్లోనూ చెయ్యి ఊపినా బెస్ట్ డ్రైవర్లు పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. బస్టాప్కు పరుగెత్తుకుంటూ వస్తున్నా వారిని చూసీచూడనట్లుగా వెళ్లిపోతారు. నగరవ్యాప్తంగా పలు లోకల్ రైల్వే స్టేషన్ల బయట బెస్ట్ బస్టాపులు ఉన్నాయి. రైలు దిగిన ప్రయాణికులకు ఈ బస్సులే ఆధారం. కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లు వారిని ఎక్కించుకోకుండానే వెళ్లిపోతారు. చేసేదిలేక బాధితులు ఆటోలను ఆశ్రయిస్తారు. ఇలాంటి సిబ్బంది నిర్వాకం వల్ల బెస్ట్కు రావాల్సిన ఆదాయం ఆటో యజమానులు తన్నుకుపోతున్నారు. ఉద్యోగుల ప్రవర్తనలో మార్పు వస్తే మినహా ప్రయాణికుల సంఖ్య పెరగబోదని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలి.. ఆక్యుపెన్సీ పెంచేందుకు ఏం చేయాలి.. తదితర అంశాలపై బెస్ట్ సిబ్బందికి త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నారు. -
‘టో(తో)ల్’ తీస్తున్నారు
సాక్షి, బెంగళూరు : అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేట్ సంస్థలు ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచేస్తూ ప్రజల తోలు తీస్తున్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొన్న బీఎంటీసీ, నిన్న కేఎస్ఆర్టీసీ బస్ చార్జీలు పెంచేసి ప్రజలపై పెను భారాన్నే మోపాయి. ఇంకా ఈ పెంపు భారం నుంచి నగర వాసులు తేరుకోక ముందే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఉన్న టోల్గేట్ చార్జీలను కూడా రాత్రికి రాత్రే పెంచేశారు. దేవనహళ్లి ప్రాంతంలో ఉన్న టోల్గేట్ను నవయుగ సంస్థ నిర్వహిస్తోంది. శనివారం రాత్రికి రాత్రే ఆ సంస్థ టోల్గేట్ చార్జీలను సుమారు మూడు రెట్లు పెంచేసింది. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్యాక్సీలు నడిపే డ్రైవర్లు శనివారం రాత్రి నుంచే టోల్గేట్ వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ మార్గంలో సంచరించే ట్యాక్సీలు టోల్గా రూ.30 చెల్లిస్తుండగా ఈ మొత్తాన్ని మూడు రెట్లు పెంచడంతో ఒకసారి టోల్ ఫీజ్గా దాదాపు రూ.115 వరకు చెల్లించాల్సి వస్తుందని డ్రైవర్లు వాపోతున్నారు. ప్రభుత్వానికి ‘ధరల పెంపు’ రోగం ... రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ‘ధరల పెంపు’ అనే రోగం పట్టుకుందని కన్నడ చళువలి వాటాల్ పార్టీ వ్యవస్థాపకుడు వాటాల్ నాగరాజ్ విమర్శించారు. బీఎంటీసీ, కేఎస్ ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ శనివారమిక్కడి మైసూరు బ్యాంక్ సర్కిల్లో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒంటెద్దు బండిపై ప్రయాణిస్తూ తన నిరసనను వ్యక్తం చేశారు. రవాణా సంస్థలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను నిరోధించి తద్వారా రవాణా సంస్థను లాభాల బాటలోకి తీసుకురావాల్సిన ప్రభుత్వం అలా కాకుండా ప్రజలపై భారాన్ని మోపుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే అన్ని నిత్యావసరాల ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యను మరింత పెంచేలా బస్సు చార్జీలను కూడా పెంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. -
దిల్సుఖ్నగర్ డిపోను మూసేయం: ఆర్టీసీ ఎండీ
చైతన్యపురి, న్యూస్లైన్: ప్రయాణికులకు మెరుగైన సేవలందించి ఆక్యుపెన్సీ రేషియో ద్వారా సంస్థను లాభాల బాటలో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఎండీ జె. పూర్ణచందర్రావు పేర్కొన్నారు. మంగళవారం దిల్సుఖ్నగర్ సిటీ డిపోను సంద ర్శించి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిపో సిబ్బంది బస్సుల నిర్వాహణ, జీత భత్యాలు, ఆదాయం తదితర అంశాలపై ఎండీ ఆరా తీశారు. దిల్సుఖ్నగర్ డిపో నష్టాల్లో నడుస్తున్నందున మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించినట్లు వార్తాలు రావడం, కార్మిక వర్గాల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో స్వయాన సంస్థ ఎండీ పర్యటించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా టీఎన్ఎంయూ నాయకులు మల్లేష్, ఎస్కేజే పాషా, ఇతర కార్మిక సంఘాలు, డిపో సిబ్బంది ఎండీని ఘనంగా సత్కరించారు. అనంతరం ఎండి పూర్ణచందర్రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదాయం పెంచే మార్గాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామే తప్పా ఈ డిపోను మూసివేసే ఆలోచన లేదన్నారు.