Trekking
-
ఎకో టూరిజం: వీకెండ్లో నేచర్ని చుట్టొద్దామిలా..!
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో వీకెండ్లో ట్రెక్కింగ్, నేచర్ క్యాంప్, బర్డ్స్ వాక్ నిర్వహిస్తున్నట్లు టీజీఎఫ్డీసీ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు, అడవులు, జంతువులు, పక్షుల పట్ల అవగాహన కల్పించేందుకు ‘దక్కన్వుడ్స్, ట్రయల్ పేరుతో ప్రతి శనివారం, ఆదివారం వివిధ కార్యక్రమాలు రూపొందించామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 30 వరకూ ఎకో టూరిజం కార్యక్రమాల వివరాలు.. ఫిబ్రవరి 22న ఉదయం 6.30 – 9.30 గంటల వరకూ మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ ఫిబ్రవరి 23న వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో ఉదయం 7–10 గంటల వరకూ బర్డ్ వాక్, మార్చి 1న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 2న గజ్వెల్ ఫారెస్ట్లో ఉదయం 7–10 గంటల వరకూ బర్డ్ వాక్ మార్చి 8న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 9న ఉదయం 6.30 – 10 గంటల వరకూ బర్డ్ వాక్ మార్చి 15న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 16న ఉదయం 6.30 – 9.30 గంటల వరకూ ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ మార్చి 22న మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 23న వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో ఉదయం 7 – 10 గంటల వరకూ బర్డ్ వాక్, ట్రెక్కింగ్ మార్చి 29న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నేచర్ క్యాంప్ మార్చి 30న గజ్వెల్ ఫారెస్ట్లో ఉదయం 7 – 10 గంటల వరకు బర్డ్ వాక్ ఉంటుందన్నారు. అసక్తిగలవారు 94935–49399, 93463–64583 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. (చదవండి: దక్కన్ వేదికగా ఫ్రెంచ్–ఇటాలియన్) -
Lok Sabha Election 2024: ఆ ఊరి కోసం 3 రోజుల ట్రెక్కింగ్!
అది హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఓ గ్రామం. పేరు బారా – భంగల్. సముద్ర మట్టానికి 2,575 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాన్ని ఆనుకునే రావి నదీ ప్రవాహం సాగిపోతుంటుంది.ఆ ఊరికి రోడ్డు మార్గం లేదు. చేరుకోవాలంటే ట్రెక్కింగ్ ద్వారానే సాధ్యం. పైగా అందుకు మూడు నాలుగు రోజులు పాటు సాహసయాత్ర చేయాల్సిందే! హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రా జిల్లా బైజంత్ సబ్డివిజన్ పరిధిలో ఉన్న ఈ కుగ్రామంలో 468 మంది ఓటర్లున్నారు. హిమాలయాల్లో ఎక్కడో మూలన విసిరేసినట్టుండే ఈ గ్రామం ఏడాదిలో ఆర్నెల్ల పాటు పూర్తిగా మంచుమయంగా మారుతుంది. దాంతో నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా స్థానికులు కూడా సమీపంలోని బిర్కు వలస పోతారు. ఈ గ్రామాన్ని సందర్శించాలంటే మే నెల నుంచి అక్టోబర్ మధ్యే సాధ్యం! అయినా 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ గ్రామంలో అందరూ ఓటేయడం విశేషం! ప్రతికూల వాతావరణం వల్ల ఆ ఎన్నికలప్పుడు హెలికాప్టర్ను వాడటం కుదర్లేదు. దాంతో 18 మందితో కూడిన ఎన్నికల బృందం 40 కిలోమీటర్లు ట్రెక్ చేసి మరీ గ్రామానికి చేరుకుంది! ఈసారి కూడా ఎన్నికల సిబ్బంది ట్రెక్కింగ్నే నమ్ముకుంటున్నారు. ‘‘వారు పోలింగ్కు కొన్ని రోజుల ముందే బయల్దేరతారు. రోడ్డు మార్గంలో రాజ్గుండ్ దాకా చేరుకుంటారు. అక్కడి నుంచి మూడు రోజులు ట్రెక్ చేసి బారా భంగల్ చేరతారు’’ అని కాంగ్రా జిల్లా ఎన్నికల అధికారి హేమ్రాజ్ బైర్వా వివరించారు. ఈవీఎం తదితర పోలింగ్ సామగ్రి తరలింపు కోసం హెలికాప్టర్ సమకూర్చాలని కోరనున్నామన్నారు. ‘‘గ్రామస్తుల్లో బారా భంగల్లో ఎవరున్నారు, బిర్లో ఎవరున్నారో ఎన్నికల ముందు సర్వే చేసి తెలుసుకుంటాం. తదనుగుణంగా ఓటర్ల జాబితాను వేరు చేసి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం’’ అని ఆయన తెలిపారు. అన్నట్టూ, ఈ ఊళ్లో సెల్ నెట్వర్క్ కూడా ఉండదు. దాంతో ఎన్నికల సిబ్బంది శాటిలైట్ ఫోన్లు వాడతారు. ఇక్కడ జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
48 గంటలపాటు అంటిపెట్టుకొని ఉంది
సిమ్లా: ట్రెక్కింగ్లో భాగంగా పర్వతారోహణకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువతీయువకుల జాడను కనిపెట్టడంతో వారి పెంపుడు శునకం ఎంతగానో సాయపడింది. దాదాపు 48 గంటలపాటు అది అక్కడే ఉండి అరుస్తూ సాయం కోసం ఎవరైనా వస్తారేమోనని ఎదురుచూసింది. హిమాచల్ ప్రదేశ్లోని బిర్ బిల్లింగ్లో ఈ ఘటన జరిగింది. పంజాబ్లోని పఠాన్కోట్కు చెందిన 30 ఏళ్ల అభినందన్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల ప్రణీత వాలా సోమవారం బిర్ బిల్లింగ్ వద్ద ట్రెక్కింగ్కు బయల్దేరారు. ట్రెక్కింగ్ చేసి తిరుగుపయనంలో కిందకు దిగి వస్తూ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయారు. అపస్మారకస్థితిలో గంటలకొద్దీ సమయం మంచులో కూరుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ట్రెక్కింగ్ వేళ వీరితోపాటు పెంపుడు శునకం వెంట వచి్చంది. వీరు పడిపోవడంతో గమనించి ఘటనాస్థలికి పరుగున వచ్చింది. 48 గంటలపాటు అక్కడే సాయం కోసం అరుస్తూ నిల్చుంది. గాలిస్తున్న సహాయక బృందాలు ఎట్టకేలకు వీరి జాడను గుర్తించాయి. ఆ ప్రాంతంలో జర్మన్ షెపర్డ్ జాతి శునకం ఒకటి ఆపకుండా అరుస్తుండటంతో అటుగా వెళ్లి వీరి జాడను కనిపెట్టగలిగామని సహాయక బృందం తెలిపింది. -
Rescue operation Specialist: ప్రమాదమా..? టాన్యా ఉందిగా..!
కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు... సెలవుల్లో స్నేహితులతో కలసి ట్రెక్కింగ్కు వెళ్తుంటారు చాలామంది యువతీ యువకులు. అయితే అనుకోకుండా ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వారిని ఎవరు కాపాడతారు? అందుకే అలాంటి వారికి అండగా ఉంటోంది టాన్యా. అవును, సరదాగా గడపాల్సిన వయసులో ఇతరుల ప్రాణాలను రక్షిస్తోంది టాన్యా కోలి. ఐదోఏటి నుంచే కొండలు ఎక్కడం నేర్చుకుని, టీనేజ్లోకి వచ్చినప్పటినుంచి ఏకంగా రెస్క్యూ టీమ్ను నిర్వహిస్తూ ఎంతోమందిని ఆపదల నుంచి బయటపడేసింది. పెద్ద పెద్ద్ద కొండలను అవలీలగా ఎక్కేస్తూ, మరొకరికి సాయంగా నిలబడుతూ.. నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది టాన్యా. నాసిక్కు చెందిన టాన్యా కోలి ఐదేళ్ల వయసు నుంచే పర్వతాలు ఎక్కడం నేర్చుకోవడం మొదలు పెట్టింది. టాన్యా తండ్రి దయానంద్ కోలి నాసిక్ క్లైంబర్స్ అండ్ రెస్క్యూయర్స్ అసోసియేషన్లో పనిచేస్తుండడంతో తరచూ ట్రెక్కింగ్, రెస్క్యూ అనే పదాలను తండ్రి నోట వెంట వినేది. టాన్యాకూ ట్రెక్కింగ్పైన ఆసక్తి ఏర్పడడంతో తండ్రి దగ్గర ట్రెక్కింగ్ ఎలా చేయాలో నేర్చుకుంది. అలా ట్రెక్కర్గా మారిన టాన్యా, రెస్క్యూటీమ్ కలిసి ఎంతోమందిని ప్రమాదాల నుంచి బయటపడేస్తోంది. తండ్రి దగ్గర నేర్చుకున్న ట్రెక్కింగ్ మెళకువలతోపాటు, హిమాలయాల్లో ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంది. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడడంతోపాటు, పర్వతారోహకులకు ట్రెక్కింగ్లో శిక్షణ ఇస్తోంది టాన్యా. పర్వతాన్ని అధిరోహించేటప్పుడు జరిగే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పిస్తుంది. టాన్యా దగ్గర శిక్షణ తీసుకుంటున్నవారిలో మహారాష్ట్ర ΄ోలీసు అకాడమీ ట్రైనీలు కూడా ఉన్నారు. ప్రతిసారీ తను అందుబాటులో ఉండడం కష్టం కాబట్టి ఇతరులకు నేర్పించడం ద్వారా ప్రమాద సమయంలో వారిని వారే కాపాడుకోవడంతోపాటు, ఇతరులను కూడా కాపాడగలరు. అందుకే మరింతమందికి రెస్క్యూలో శిక్షణ ఇస్తున్నాను అని టాన్యా చెబుతోంది. ‘‘ప్రమాదంలో ఉన్నారు, కాపాడాలి అని సమాచారం తెలిస్తే వెంటనే బయలుదేరతాం. అది అర్ధరాత్రి అయినా ఫస్ట్ ఎయిడ్ కిట్తో సిద్ధంగా ఉంటాం. ట్రెకింగ్ చేసేవారిని, ప్రమాదంలో ఉన్న వ్యక్తుల్ని రక్షించడం థ్రిల్లింగ్ ఇచ్చేదే అయినప్పటికీ చాలా సవాళ్లతో కూడుకున్నది. సమస్యలు ఉన్నప్పటికీ అవతలి వారిని ప్రమాదం నుంచి కాపాడగలిగామన్న సంతృప్తి ముందు ఆ సమస్యలు, సవాళ్లు చిన్నబోవలసిందే’’ అని చెబుతోంది తాన్యా. -
కమి రిటా షెర్పా రికార్డు
కఠ్మాండు: నేపాలీ పర్వతారోహకుడు కమి రిటా షెర్పా(53) సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఎనిమిది వేల మీటర్లు పైబడి ఎత్తయిన పర్వత శిఖరాలను 42సార్లు అధిరోహించిన ఘనతను ఆయన సాధించారు. 8 వేల మీటర్లకంటే మించి ఎత్తయిన శిఖరాలను 41 పర్యాయాలు అధిరోహించిన మరో ప్రముఖ నేపాలీ పర్వతారోహకుడు నిమ్స్ పుర్జా పేరిట ఉన్న రికార్డును తాజాగా కమి రిటా బద్దలు కొట్టారు. ప్రపంచంలోని ఎనిమిదో ఎత్తయిన మౌంట్ మనస్లును మంగళవారం ఉదయం కమి రిటా షెర్పా అధిరోహించారని సెవెన్ సమిట్ ట్రెక్స్ అనే పర్వతారోహక సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని కమి రిటా 1994లో మొదటిసారి అధిరోహించారు. అది మొదలు ఇప్పటిదాకా 28 సార్లు ఎక్కారు. -
పర్వతారోహణలోనే పరలోకాలకు.. నల్లగొండ యువకుడు మృతి..
చిట్యాల: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే చిన్ననాటి కోరికను నెరవేర్చుకునే క్రమంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన అద్దెల ఉపేందర్, ఉమ దంపతులు 30ఏళ్ల క్రితం హైదరాబాద్లోని సాయినగర్కు వలస వెళ్లి స్థిరపడ్డారు. వీరికి ఓ కూతురుతో పాటు కుమారుడు రాజశేఖర్రెడ్డి(32) ఉన్నారు. రాజశేఖర్రెడ్డి ఇంజనీరింగ్ పూర్తిచేసి స్నేహితులతో కలిసి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోనే సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇతడికి ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతితో వివాహం జరిగింది. 2నెలలు శిక్షణ పొంది.. రాజశేఖర్రెడ్డి ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపు వరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అసోంలో రెండు నెలల పాటు పర్వతారోహణపై శిక్షణ పొందాడు. ఈ నెల 3వ తేదీన మరికొంత మంది పర్యాతారోహకులతో కలిసి నేపాల్కు వెళ్లాడు. ఖాట్మండు నుంచి వాహనంలో సముద్ర మట్టానికి 2,600 మీటర్ల ఎత్తులోని సల్లేరుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి పది రోజుల పాటు ప్రయాణించి 4,910 మీటర్ల ఎత్తులో ఉండే లోబూచే పర్వతాన్ని ఈ నెల 21న చేరుకున్నాడు. అక్కడ సీప్ర లాడ్జిలో బసచేశాడు. ఇక్కడి నుంచి మరో 600 మీటర్లు ట్రెక్కింగ్(పర్వతారోహణ) చేస్తే రాజశేఖర్రెడ్డి ఎవరెస్ట్ బేస్ క్యాంపు(5,500 మీటర్ల దూరం) చేరుకునేవాడు. అయితే, ఈ సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వాతావరణం అనుకూలించక రాజశేఖర్రెడ్డి లాడ్జిలోనే ఉండిపోయాడు. దీంతో ఆయన అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతిచెందాడు. లాడ్జి సిబ్బంది ఈ నెల 22న రాజశేఖర్రెడ్డి మృతిచెందిన విషయాన్ని గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు నేపాల్కు బయలుదేరి వెళ్లారు. కాగా, మృతదేహాన్ని అక్కడి అధికారులు నేపాల్లోని ఖాట్మండు వరకు తీసుకువచ్చారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. సోమవారం వరకు రాజశేఖర్రెడ్డి మృతదేహం హైదరాబాద్కు చేరుకోనుందని, సాయినగర్లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. చదవండి: యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా? -
18 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసిన సీఈసీ
చమోలి: ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరోసారి ఆదర్శంగా నిలిచారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర చమోలీ జిల్లాలో కొండప్రాంతంలోని మారుమూల పోలింగ్ స్టేషన్కు ఆదివారం 18 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లారు. ‘సుదూరంగా ఉండే డుమాక్ గ్రామంలో ఈ పోలింగ్ స్టేషన్ ఉంది. ఎన్నికల సిబ్బందిని ఉత్సాహపరచాలన్నదే నా ఉద్దేశం. ఈ పోలింగ్ స్టేషన్కు ఎన్నికల సిబ్బంది పోలింగ్కు మూడురోజులు ముందుగానే చేరుకుంటారు’అని సీఈసీ ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్లోని కొన్ని పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం సిబ్బందికి చాలా కష్టసాధ్యమైన విషయమని ఆయన అన్నారు. ఎన్నికల కమిషనర్గా ఉన్న సమయంలో కూడా ఆయన పలు సందర్భాల్లో రహదారి సౌకర్యం లేని పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఆదర్శంగా నిలిచారు. -
ప్రాణాలకు తెగించి మరీ సింహంతో పోరాడిన కుక్క: వైరల్
పెంపుడు జంతువులు మానవుని దైనందిన జీవితంలో మంచి ఆత్మీయులుగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. అందులోనూ కుక్కులకు ఉండే విశ్వాసం మరే జంతువుకు ఉండదు. తన యజమాని కోసం ఏం చేసేందుకైన వెనుకాడవు. తమ ప్రాణం ఉన్నంతవరకు యజమాని ఇంటిని కాపాడుతాయి. అంతేకాదు తమ యజమానిపై ఎనలేని ప్రేమను పెంచుకుంటాయి కూడా. అచ్చం అలానే ఇక్కడొక కుక్క ప్రమాదంలో చిక్కుకున్న తన యజమానిని రక్షంచేందుకు ఏం చేసిందో తెలుసా! కాలిపోర్నియాలోని ట్రినిటీ నదికి సమీపంలో ఎరిన్ విల్సన్ అనే మహిళ తన రెండున్నరేళ్ల పెంపుడు కుక్క ఎవాతో కలిసి ట్రెక్కింగ్కి వెళ్లింది. ఈ మేరకు ఆమె పర్వత ట్రెక్కింగ్ వెళ్లినపుడూ ఒక సింహం ఆమెపై దాడి చేస్తుంది. దీంతో ఆమె భయంతో తన పెంపుడు కుక్క ఎవాను పిలిచింది. అది తన యజమానిని రక్షించేందుక తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరి సింహంతో పోరాడి తన యజమానిని రక్షించింది. ఈ క్రమంలో ఎవా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఎవా ఆస్పుత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషయం ప్రస్తుతం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: దురదృష్టాన్ని పోగొట్టుకునేందుకు.. ఏకంగా పుట్టిన తేదినే మార్చుకున్న ప్రధాని) -
Visakhapatnam: ఐదు ఖండాలను చుట్టేసిన కామ్య.. ఎన్నెన్నో అవార్డులు!
‘మహిళలు, ఆడపిల్లలు అవరోధాల్ని అధిగమించి.. ఖండాతరాల్లో ఖ్యాతిని ఇనుమడింపజేయాలి. ఇలాంటి వారందరికీ విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్ అనే చిన్నారి స్ఫూర్తినిచ్చింది. దక్షిణ అమెరికాలోని అత్యంత ఎత్తయిన అకాన్కాగువా పర్వతాన్ని అధిరోహించి భారతీయులందరిలోనూ స్ఫూర్తి నింపింది. ఇది ఎంతో గర్వకారణం. అందుకే ఈ విషయాన్ని అందరితో పంచుకుంటున్నాను.’ – మన్కీబాత్లో ప్రధాని మోదీ ఈ ఒక్క ప్రశంస చాలు.. ఆమె సాధించిన ఘనత గురించి చెప్పుకోవడానికి.! బుడి బుడి అడుగులు వేసే వయసులోనే.. కొండలెక్కడం మొదలుపెట్టింది. బొమ్మలతో ఆడుకోవాల్సిన సమయంలో పర్వతారోహణ చేపట్టింది. అలా మొదలైన ప్రయాణం.. రికార్డులు తిరగరాసేంత వరకు చేరింది. మూడేళ్లకే ట్రెక్కింగ్.. తొమ్మిదేళ్లకే ఎవరెస్ట్, పదేళ్లకే కిలిమంజారో.. ఇప్పుడు సాహస్.. ఇలా ఆ బాలిక సంకల్పబలం ముందు శిఖరం సైతం సాహో అంటోంది. ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ.. ఇప్పటికే ఐదు అతి ఎత్తయిన శిఖరాగ్రాల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడించింది. వచ్చే నెలలో ఉత్తర అమెరికాలోని అతి ఎత్తయిన శిఖరం డెనాలీని చేరుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఆ సాహసి పేరే కామ్య కార్తికేయన్. – సాక్షి, విశాఖపట్నం ఐదు ఖండాల్లో త్రివర్ణ రెపరెపలు ఒక్కో రికార్డు తన ఖాతాలో వేసుకుంటున్న కామ్య.. 2017 మే 16 నుంచి రోజుకు 9 గంటల పాటు నడుస్తూ 9 రోజుల్లోనే 18 వేల అడుగుల ఎత్తయిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను పూర్తి చేసి.. ఈ ఘనత సాధించిన అతి చిన్న వయసున్న భారతీయ బాలికగా రికార్డు సొంతం చేసుకుంది. అప్పుడే ‘సాహస్’యాత్రకు బీజం పడింది. ఏడు ఖండాల్లోని అతి ఎత్తయి న పర్వతాలను అధిరోహించాలన్న సంకల్పం కామ్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అనుకున్నదే తడవుగా.. ఎవరెస్ట్ ఎక్కిన కొద్ది నెలల వ్యవధిలోనే ఆఫ్రికా ఖండంలో 19,340 అడుగులతో అతి ఎత్తయిన పర్వతమైన కిలిమంజారోని అధిరోహించింది. పిన్న వయసులోనే కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన రెండో భారతీయ బాలికగా మరో రికార్డు సాధించింది. పదేళ్ల వయసులో స్టాక్ కాంగ్రీ పర్వతారోహణను విజయవంతంగా పూర్తిచేసి మరో రికార్డు సృష్టించింది. ఆసియా, ఆఫ్రికా తర్వాత ఆస్ట్రేలియా ఖండంలో 7,310 అడుగుల అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ కోసియాజ్కోను 2019లో పూర్తి చేసింది. తల్లి లావణ్యతో కలిసి వెళ్లిన కామ్య.. మైనస్ 5 డిగ్రీల ఉష్ణోగ్రత వేధిస్తున్నా.. మౌంట్ కోసియాజ్కోను అధిరోహించిన అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. కామ్య పట్టుదలకు ఆస్ట్రేలియన్ ఎంబసీ అభినందనలు తెలిపింది. అనంతరం దక్షిణ అమెరికాలోని 22,837 అడుగుల అత్యంత ఎత్తయిన అకాన్కాగువా పర్వతాన్ని అవలీలగా అధిరోహించేసింది. రష్యాలోని 18,510 అడుగుల ఎత్తయిన ఎలబ్రుస్ పర్వతాన్ని అధిరోహించి ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలిగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించింది. ఆ అలవాటే.. అవార్డులు తెచ్చిపెడుతోంది! విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్ తండ్రి కార్తికేయన్ తూర్పు నౌకాదళంలో కమాండర్గా విధులు నిర్వహిస్తున్నారు. కార్తికేయన్ స్పోర్ట్స్ పర్సన్గా నేవీలో ప్రశంసలు అందుకున్నారు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది కామ్య కార్తికేయన్. కామ్యకు నడక రాని సమయంలో తండ్రి కార్తికేయన్, తల్లి లావణ్య ఆ చిన్నారిని ఎత్తుకొని ట్రెక్కింగ్కు, వాకింగ్కు వెళ్లేవారు. బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో తల్లిదండ్రులతో పాటు కామ్య కూడా ట్రెక్కింగ్ అలవాటు చేసుకుంది. ఆ అలవాటే.. కామ్యకు రికార్డులు తెచ్చిపెడుతున్నాయి. అలా నగరంలోని వివిధ కొండల్లో జరిగే ట్రెక్కింగ్ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించింది. మూడేళ్ల ప్రాయంలో ముంబయిలోని లొనోవ్లా ప్రాంతంలో ట్రెక్కింగ్లో తండ్రితో పాటు పాల్గొని అందరినీ అబ్బురపరిచింది. తల్లిదండ్రులతో కలిసి సహ్యాద్రి పర్వత శ్రేణులతో పాటు గుల్మర్గా దర్శనీయ స్థలానికీ నడుచుకుంటూ వెళ్లింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. మహారాష్ట్రలోని డ్యూక్స్ నోస్, రాజ్గడ్ పర్వతాలను నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో పాటు అవలీలగా ఎక్కి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏడేళ్ల ప్రాయంలో హిమాలయాల ట్రెక్కింగ్లో పాల్గొనేందుకు సిద్ధమైంది. మొదటి ప్రయత్నంలో 2015 మేలో హిమాలయ పర్వత శ్రేణిలో 12 వేల అడుగుల చంద్రశీల, 2016లో 13,500 అడుగుల హర్కిదున్, 13,500 అడుగుల ఎత్తయిన కేదార్కంఠ, 5,029 మీటర్ల ఎత్తులో ఉన్న రూప్కుండ్ మంచు పర్వతారోహణ పూర్తి చేసింది. తొమ్మిదేళ్ల వయసులోనే హిమాలయాల్లోని రూప్కుండ్ మంచు సరస్సును అధిరోహించి.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు అర్హత సాధించింది. ప్రశంసించిన మోదీ మన్కీ బాత్లో విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు జల్లు కురిపించారు. ఆసియా ఆవల ఉన్న దేశాల్లో 7 వేల మీటర్ల అత్యంత ఎత్తయిన శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన కామ్య ధైర్యం అందరిలోనూ స్ఫూర్తినింపిందంటూ కొనియాడారు. ‘మిషన్ సాహస్’లో భాగంగా పర్వతారోహణ చేస్తున్న కామ్య వివిధ దేశాల్లో ఉన్న అత్యంత ఎత్తయిన శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా ముందుకెళ్తోందన్నారు. ఈ మిషన్లో కామ్య సఫలీకృతమై. భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. శక్తి సామర్థ్యాల విషయంలో భారతీయ మహిళలందరికీ స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. సాహస యాత్రలకు గుర్తింపుగా ఇటీవలే పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాన్ని కూడా కామ్య అందుకుంది. ఉత్తర అమెరికా వైపు అడుగులు.. విశాఖ నేవీ స్కూల్లో చదువుతున్న కామ్య కార్తికేయన్.. ఆరో ఖండంలోనూ సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది. సాహస్ యాత్రలో ఉత్తర అమెరికాలోని అలస్కాలోని అతి ఎత్తయిన శిఖరం డెనాలీపై భారత కీర్తి పతాకాన్ని ఎగరేయాలని భావిస్తోంది. జూన్ 22వ తేదీన ఈ యాత్రను ప్రారంభించేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పూర్తి సన్నద్ధతతో కామ్య ఉన్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. డెనాలీ పర్వత శిఖరం 20,310 అడుగుల ఎత్తు ఉంటుంది. దీన్ని అధిరోహించే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తే.. మిగిలినది అంటార్కిటికాలో అతి ఎత్తయిన శిఖరం మౌంట్ విన్సెన్ మాసిఫ్. ఇది అంటార్కిటికా మంచు పర్వత శ్రేణుల్లో 16,050 అడుగుల ఎత్తులో ఉంది. దీనిని కూడా అధిరోహిస్తే.. కామ్య కార్తికేయన్ సాహస్ యాత్ర పూర్తవుతుంది. ఏడు ఖండాల్లోనూ దేశ కీర్తిని పెంచడమే లక్ష్యం తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ప్రతి అడుగు ముందుకేస్తున్నాను. అమ్మ లావణ్య నా వెన్నంటే ఉంటుంది. అందుకే.. అటు చదువులోనూ, ఇటు పర్వతారోహణలోనూ అపజయమే లేకుండా ముందుకెళ్లగలుగుతున్నాను. ఏడు ఖండాల్లో ఉన్న అతి ఎత్తయిన శిఖరాలను అధిరోహించి భారతీయ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం. జూన్లో ఉత్తర అమెరికా శిఖరాన్ని అధిరోహించిన తర్వాత.. అంటార్కిటికాలోని చివరి పర్వతాన్ని ఎక్కేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా. కష్టమైనా ప్రతి ఒక్క విజయాన్ని సాధించే తీరుతాను. –కామ్య కార్తికేయన్, పర్వతారోహణ చేస్తున్న బాలిక ఇకపై వేసే ప్రతి అడుగూ ఒక సవాలే.. చిన్నతనం నుంచి మాతో పాటు ట్రెక్కింగ్కు తీసుకెళ్లే వాళ్లం. ఏ మాత్రం ఇబ్బంది పడేది కాదు. మేము నడవొద్దని చెప్పినా.. వినకుండా మాతో పాటు ఎంత ఎత్తుకైనా నడుచుకుంటూ వచ్చేది. అలా అలవాటు చేసుకున్న కామ్య.. శారీరకంగానూ మానసికంగానూ పర్వతారోహణకు సిద్ధపడుతూ వచ్చింది. ఇప్పటి వరకూ ఐదు అతి పెద్ద శిఖరాలు అధిరోహించినందుకు గర్వంగా ఉంది. అయితే.. ఇకపై కామ్య వేసే ప్రతి అడుగూ సవాలుతో కూడుకున్నది. అంతే కాదు.. ఎక్కువ ఖరీదైన అంశం కూడా. ఎందుకంటే.. ఈ రెండు శిఖరాలను అధిరోహించాలంటే ఆర్థికంగా ముడిపడిన అంశం. ప్రభుత్వం తోడ్పాటునందించాలని కోరుతున్నాం. – లావణ్య కార్తికేయన్, కామ్య తల్లి -
కనువిందు చేసే ట్రెక్కింగ్.. వణుకుపుట్టించే చరిత్ర
కనువిందు చేసే ట్రెక్కింగ్తో పాటు వణుకుపుట్టించే చరిత్ర కూడా ఆ కోట సొంతం. భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన కోటగా గుర్తింపు తెచ్చుకున్న కళావంతిన్ దుర్గం గురించి మీరెప్పుడైనా విన్నారా? మహారాష్ట్ర, ముంబై సమీపంలోని పశ్చిమ కనుమలలో, మాథేరాన్, పన్వేల్ మధ్య ఉన్న ఈ కోట.. సముద్ర మట్టానికి 701 మీటర్ల (2,300 అడుగులు) ఎత్తులో ఉంది. ఈ కోటను కళావంతిన్ అనే రాణి గౌరవార్థం నిర్మించారనేది పురాణగాథ. ఎటువంటి ఆధారం లేని ఇరుకైన రాతి మెట్లు, ఏటవాలు మార్గం.. వర్షంతో ఏర్పడిన నాచు, జారుడు స్వభావం గల రాళ్ళు.. ఇవన్నీ ఆ కోట పైకి ఎక్కేందుకున్న అడ్డంకులు. అయితే అది ఎక్కిన తర్వాత తేలియాడే మేఘాల నడుమ.. చుట్టూ ఉన్న ప్రకృతి అందాలతో తడిసి ముద్దవ్వాల్సిందే. కోట శిఖరాగ్రంలో చిరస్మరణీయమైన క్షణాలను మూటకట్టుకోవాల్సిందే. అందుకే ఈ కోటను climb to heaven ‘స్వర్గారోహణం’గా పిలుస్తారు. స్థానికుల ప్రకారం ఈ కోట వెనుక భయానక కథలు కూడా ఉన్నాయి. అక్కడ ఏదో ప్రతికూల శక్తి ఉందనేది వారి వాదన. అక్కడకు వచ్చేవారిని అది ఆకర్షించి, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుందని చెబుతుంటారు. ‘ఆ కోట నుంచి అర్ధరాత్రి.. వింత శబ్దాలు, పెద్దపెద్ద అరుపులు వినిపిస్తాయి. అందుకే మేము ఆ కోటకు కొన్ని మైళ్ల దూరంలో నివసిస్తున్నాం’ అంటారు. ఏదేమైనా జీవితంలో ఒకసారైనా ఈ కోటను ఎక్కి తీరాల్సిందే అని చెప్తారు పర్వతారోహకులు. -
లడఖ్ మంచుకొండల్లో ట్రెక్కింగ్.. ఫోటోలు వైరల్
లడఖ్: లడఖ్లో ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీల ట్రెక్కింగ్ను ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు దళాలు నిర్వహించారు. ఈ ట్రెక్కింగ్లో 100 మంది బార్డర్ పోలీసులు పాల్గొన్నట్లు తెలిపారు. ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలను లడఖ్ లెఫ్ట్నెంట్ గవర్నర్ రాధా కృష్ణ మథూర్ శనివారం ప్రారంభించారు. ఈ పోటీలు జరగటం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలను నిర్వహించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులను లెఫ్ట్నెంట్ గవర్నర్ రాధా కృష్ణ అభినందించారు. Ladakh: Watch the glimpses of the Ice wall climbing competition in Ladakh organised for the 1st time in the Country by North West Frontier ITBP, Leh. More than 100 climbers are taking part.#Himveers@nwftr_itbp pic.twitter.com/KeOCtkBrfD — ITBP (@ITBP_official) February 27, 2022 ఆయన మాట్లాడుతూ.. ఐటీబీపీ 1962లో ఏర్పాటు చేయబడిందని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐటీబీటీ దేశానికి రక్షణగా నిలుస్తోందని అన్నారు. బార్డర్ పోలీసుల ట్రెక్కింగ్కు సంబంధించిన వీడియో, ఫోటోలను ఐటీబీపీ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Some glimpses of Ice Wall Climbing Competition in Ladakh organised for the 1st time in the Country by HQrs NW Frontier ITBP, Leh.#Himveers#IceWallClimbing pic.twitter.com/Mp2qLHTtFc — ITBP (@ITBP_official) February 27, 2022 -
62 ఏళ్ల బామ్మ పర్వత శ్రేణి ట్రెక్కింగ్! ఫిదా అవుతున్న నెటిజన్లు
అనుకున్నది చేయాలన్న కృత నిశ్చయం, తపన ఉంటే చాలు. అందుకు వయసుతో నిమిత్తం లేదు. కొంతమంది లేటు వయసులో చదువుకుని పీహెచ్డీలు చేసిన వాళ్లు ఉన్నారు. మరికొద్దిమంది కాస్త ముందడుగు వేసి వృద్ధాప్యలో ఉండి కూడా మారథాన్, బాక్సింగ్ వంటివి నేర్చుకుని శభాష్ అని ప్రశంసలు అందుకున్నారు. అలాంటివారి కోవకు చెందినవారే కేరళలోని 62 ఏళ్ల బామ్మ. ఇంతకీ ఆమె ఏం సాహసం చేసిందో తెలుసా!. వివరాల్లోకెళ్తే...బెంగళూరుకి చెందిన 62 ఏళ్ల నాగరత్నమ్మ ఫిబ్రవరి 16న పశ్చిమ కనుమలలోని శిఖరాలలో ఒకటైన 1,868-మీటర్లు (6,129 అడుగులు) - అగస్త్యర్కూడమ్ను అధిరోహించింది. ఆమె ఈ పర్వతారోహణ చేసేందుకు తన కొడుకు, స్నేహితులతో కలిసి బెంగుళూరు నుంచి కేరళకు వచ్చినట్లు తెలిపింది. అంతేకాదు నాగరత్నమ్మ గత 40 ఏళ్లుగా కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండటం వల్ల ఇతర కార్యక్రమాలకు సమయం కేటాయించలేకపోయానని పేర్కొంది. ఇప్పుడు తన పిల్లలందరూ స్థిరపడ్డారు కాబట్టి పర్వతారోహణకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వరకు, తిరువనంతపురం సమీపంలోని పర్వత శ్రేణి అయిన అగస్త్యర్కూడం శిఖరానికి ట్రెక్కింగ్ చేయడానికి మహిళలకు అనుమతి లేదు. స్థానిక గిరిజన సంఘం భద్రతా సమస్యల దృష్ట్యా 14 ఏళ్లలోపు మహిళలు, పిల్లలను నిషేధించింది. కానీ అగస్త్యర్కూడమ్కు ట్రెక్కింగ్ చేయాలనుకునే వారిపై లింగ ఆధారిత పరిమితులు విధించబడదని కేరళ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు 2018 చివరిలో ఈ నిబంధనలో మార్పు వచ్చింది. దీంతో రాష్ట్ర అటవీ శాఖ మహిళలు పర్వత శ్రేణి ట్రెక్కింగ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ను ప్రారంభించింది. పైగా అగస్త్యర్కూడం కేవలం ట్రెక్కింగ్ శ్రేణి మాత్రమే కాదు, నెయ్యర్ వన్యప్రాణుల అభయారణ్యంతో కూడిన పుణ్యక్షేత్రం కూడా. ఈ మేరకు ఆ బామ్మ సాహసోపేతంగా ఆ పర్వత శ్రేణిని అధిరోహించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమె ఫిట్నెస్ని చూసి ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Vishnu (@hiking_._) (చదవండి: హెలికాప్టర్ బొమ్మతో ఆడుకుంటుండగా హేళన.. సీరియస్గా తీసుకుని కొడుకు పెళ్లికి ఏకంగా హెలికాప్టర్!) -
ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!
British Sikh Woman Makes History With Solo Trip To South Pole: బ్రిటీష్లో జన్మించిన సిక్కు ఆర్మీ అధికారి ప్రీత్ చాందీ ఒంటరిగా దక్షిణ ధృవ సాహా యాత్రను పూర్తి చేసిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ మేరకు చాందీ సాహసయాత్ర గతేడాది నవంబర్లో ప్రారంభమైంది. పైగా ఆమె అంటార్కిటికా అంతర్గత అధికారుల సహాయ సహకారాలు తీసుకోకుండానే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. (చదవండి: అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ!!) అయితే ఆమె జనవరి 3న 700 మైళ్ల దూరాన్ని 40 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో ప్రీత్ చాందీ మాట్లాడుతూ..." భూమిపై అత్యంత, ఎత్తైన, శీతలమైన పొడి గాలులతో కూడిన ఖండం అంటార్కిటికా. అక్కడ ఎవరూ శాశ్వతంగా నివశించరు. నేను మొదట ప్లాన్ చేయడం ప్రారంభించినప్పుడు ఖండం గురించి నాకు పెద్దగా తెలియదు. అదే నన్ను అక్కడికి వెళ్లడానికి ప్రేరేపించింది. అంతేకాదు దక్షిణ ధృవ సాహసయాత్ర కోసం రెండున్నర సంవత్సరాలు నుంచి సిద్ధమయ్యాను. ఇందులో భాగంగా క్రేవాస్లో శిక్షణ తీసుకున్నా. చివరకు నేను మంచు కురుస్తున్న దక్షిణ ధృవానికి చేరుకున్నా" అని బావోధ్వేగంగా తెలిపింది. అంతేకాదు "పోలార్ ప్రీతీ" క్యాప్షన్ని జోడించి మరీ ఇన్స్టాగ్రామ్లో తన సాహాసయాత్రకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ మేరకు బ్రిటీష్ సైన్యం ప్రీత్ చాందీనిl అబినందించడమే కాక ధృఢమైన సంకల్పానికి స్ఫూర్తిదాయక ఉదాహరణ అని ప్రశంసించారు. (చదవండి: ఈ కేసును మేము వాదించం: న్యాయవాదులు) View this post on Instagram A post shared by Preet Chandi (@polarpreet) -
హిమాచల్లో ట్రెక్కింగ్ ప్రమాదం.. 11మంది మృతి
-
హిమాచల్లో ట్రెక్కింగ్ ప్రమాదం.. 11మంది మృతి
ఉత్తరకాశి: హిమాచల్ ప్రదేశ్లో పర్వతారోహణకు వెళ్లి కనిపించకుండా పోయిన బృందంలో మృతుల సంఖ్య 11కు చేరింది. మరో ఆరుగురు గల్లంతయ్యారు. తప్పిపోయిన వారి అచూకీ కనిపెట్టేందుకు హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీకి చెందిన 8 మంది పర్వతారోహకులతోపాటు ముగ్గురు వంటవాళ్లు ట్రెక్కింగ్ కోసం ఇటీవల హిమాచల్ ప్రదేశ్కు వచ్చారు. 11న ఉత్తరకాశి జిల్లాలోని హర్సిల్లో పర్వతారోహణ ప్రారంభించారు. లామ్ఖాగా పాస్ నుంచి చిట్కూల్ చేరుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురి మృతదేహాలను అధికారులు గురువారం గుర్తించారు. ఇద్దరిని ప్రాణాలతో రక్షించారు. శుక్రవారం మరో రెండు మృతదేహాలను కనిపెట్టారు. సెర్చ్ అండ్ రెస్క్యూ టీం గల్లంతైన మిగతావారి కోసం చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
నగరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
సాక్షి,చిత్తూరు: నగరి నియోజకవర్గంలో నగరి పట్టణం నుంచి పుత్తూరుకు వెళ్లే మార్గంలో 7 కిలోమీటర్ల దూరంలో ముక్కు కొండ ఉంది. హనుమంతుని ముక్కు ఆకారంలో ఉండటంతో కొండకు ముక్కు కొండ అన్నపేరు వచ్చింది. పుత్తూరు, నగరి జాతీయ రహదారిలో వెళ్లే వారికి సుదూర ప్రాంతం వరకు ఈ కొండ కనిపిస్తుంది. పడుకున్న మనిషి ముక్కు ఆకారంలో ఉండటంతో ఈ కొండకు ఈ పేరు వచ్చిందని నానుడి. సముద్ర మట్టానికి 855 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండ వంద కిలోమీటర్ల దూరం వరకు కనబడుతుంది. ట్రెక్కింగ్ ఇలా... నారాయణవనం మండలం, సముదాయం గ్రామంలోని అవనాక్షమ్మ ఆలయ సమీపం నుంచి ముక్కుకొండ ట్రెక్కింగ్ ప్రారంభం అవుతుంది. గైడ్లు లేకుండా కొండపైకి చేరుకోలేము. వారు కూడా వెళ్లే మార్గంలో చెట్లపై గుర్తులు పెట్టుకుంటూ, రాళ్లు పేర్చుకుంటూ తీసుకెళ్లి మళ్లీ ఆ గుర్తుల ఆధారంగా క్రిందకు చేరుస్తారు. ఈ కొండపైకి వెళ్లడం సాహసంతో కూడుకున్న పని. కొండ ఎక్కడానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. పైకి వెళ్లేవారు తినడానికి అవసరమైన ఆహారం, నీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వెళ్లే దారి పూర్తిగా రాళ్లతోను, ముళ్లకంపలతోను, బోదలతోను నిండి చిట్టడవిలా ఉంటుంది. ప్రాచీన లైట్ హౌస్ మధ్యయుగ కాలంలో ముక్కుకొండ బంగాళాఖాతంలో వచ్చే పడవలకు చెన్నై మార్గం చూపే దిక్సూచిగా ఉండేది. ఈస్టిండియా కంపెనీ వారి అభ్యర్థన మేరకు అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న కార్వేటినగరం రాజుల ఈ కొండ శిఖరంపై అఖండ ధీపం వెలిగించడానికి అంగీకరించారు. కొండశిఖరంపై ఒక అఖండాన్ని ఏర్పాటుచేసి అక్కడ మంటపెట్టడానికి జంగములనే చెంచులను నియమించారు. సూచించిన సమయాల్లో వారు అఖండం వెలిగించే ప్రక్రియను కొనసాగించడానికి కొండ క్రింద వారికి భూములు కేటాయించారు. అఖండంలో ఒక టన్ను కొయ్యలు వేసి నిప్పంటించగా అది సముద్రంలో ప్రయాణించే షిప్పులకు చిన్న దీపంలా కనిపించేది. ఇలా ముక్కుకొండపై వెలిగించే మంటలు సముద్రంలో ప్రయాణించే షిప్పులకు దారిచూపే లైట్హౌస్గా మారింది. ఈ దీపం ఆధారంగా షిప్పులు చెన్నై పోర్టుకు చేరుకునేవి. చెన్నై హార్బరులో లైట్ హౌస్ నిర్మించిన పిదప కొండపై షిప్పులకోసం దీపం వెలిగించడాన్ని ఆపేశారు. ప్రస్తుతం షిప్పులకోసం దీపం వెలిగించక పోయినా ప్రతి చిత్రాపౌర్ణమికి చెంచులు కొండపై అఖండాన్ని వెలిగిస్తారు. ముక్కుకొండ ఊరిపేరుగా మారింది ఈ కొండ కారణంగానే కొండ అంచున ఉన్న ప్రాంతానికి నగరి అనే పేరు వచ్చింది. ముక్కు ఆకారంలో ఉన్న ఈ కొండను ముక్కు కొండ అని నాశికగిరి అని పిలిచే వారు. నాశిక గిరి కాలక్రమేణా నగిరి అని క్రమేణా నగరి అని మారింది. హనుమంతుడు ప్రతిష్ఠించిన గగన వినాయకుడు కొండశిఖరంపై వినాయక విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. ఆకాశాన్ని తాకే విధంగా ఉండటంతో ఈ వినాయకుని గగన వినాయకునిగా పిలుస్తారు. హనుమంతుడు సీతాన్వేషణ చేసే సమయంలో ఢీకొన్న కారణంగా కొండ ఇలా ముక్కు ఆకారంలో మారిందని దీంతో హనుమంతడు అక్కడ ఆగి కొండపై ఆగి వినాయకుని ప్రతిష్టించి పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పౌర్ణమి రోజున కొండపై ధీపం వెలిగిస్తే హనుమంతుడు వచ్చి ఆశీర్వదిస్తారని ఇక్కడి ప్రజల నమ్మకం. కొండపైకి వెళ్లే వారు గగన వినాయకుని, ఆదిశేషుని ఆకారంలో ఉన్న బండను, అఖండాన్ని చూడవచ్చు. వీటితో పాటు వివిధ ఆకారాలోల్లో ఉన్న రాతి బండలను, చెట్లను చూడవచ్చు. చారిత్రక ప్రసిద్దిగాంచిన ఈ కొండపైకి ఆంద్రప్రదేవ్ టూరిజం వారు ట్రెక్కింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి కొండ విశేషాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: క్యాంబెల్: ఇద్దరు సీఎంలు జన్మించిన ఆసుపత్రి -
అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను: సవితారెడ్డి
‘‘జీవితంలో ఏదీ అసాధ్యం కాదు. అన్నీ సుసాధ్యమే. నూటికి నూరుపాళ్లు అనుకున్నది సాధించవచ్చు. నీ కలను నిజం చేసుకోవడానికి నీవే శ్రమించాలి. లక్ష్యాన్ని చేరే వరకు నీ ప్రయత్నాన్ని ఆపవద్దు. అప్పుడు విజయం నీదై తీరుతుంది. అనారోగ్యం నిన్ను చూసి పారిపోతుంది. ఇందుకు అసలైన నిర్వచనం ఈ సాహసి జీవితం. ‘‘సాహసం చేయకపోతే జీవితంలో అనేక అనుభవాలకు, ఆనందాలకూ దూరంగా ఉండిపోతాం. అందుకే సాహసించాల్సిందే’’ అంటున్న ఈ సాహసి పేరు సవితారెడ్డి. ఆమె ఫ్యాషన్ డిజైనర్, అడ్వెంచరస్ టూరిస్ట్. హైదరాబాద్ కొంపల్లిలో ఉంటారు. మసాబ్ ట్యాంకు నుంచి రాజేంద్రనగర్, హెచ్సీయూ, నార్సింగి, రోడ్ నంబర్ 45 నుంచి ఐకియా, ఖాజాగూడల్లో ఉదయం పూట జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో విశాలమైన రోడ్ల మీద సైక్లింగ్ చేస్తూ కనిపిస్తారు. ఈమె గత ఏడాది రెండు కాళ్లకు సర్జరీ చేయించుకున్నారు. ఫిట్నెస్ను తిరిగి సాధించుకోవడానికి సైక్లింగ్ ప్రాక్టీస్ చేస్తూ కశ్మీర్లోని ‘గ్రేట్ లేక్స్ ఆఫ్ కశ్మీర్’ట్రెకింగ్ టూర్కి సిద్ధమవుతున్నారు. మహిళకు సెలవేది? ఒక సామాన్యమైన కుటుంబం లో మహిళ జీవితం ఎలా ఉంటుంది? పిల్లల స్కూళ్లకు, కాలేజ్లకు సెలవులుంటాయి. భర్త ఆఫీస్కి సెలవులుంటాయి. తనకు మాత్రం సెలవు ఉండదు. తనకంటూ ఒక ఆటవిడుపు ఉండాలని కోరుకున్నా సరే సాధ్యపడదు. ఆ మహిళ గృహిణి అయినా ఉద్యోగి అయినా, ఎంటర్ప్రెన్యూర్ అయినా సరే... ఈ కుటుంబచిత్రమ్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. మహిళలు ఆ రొటీన్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా రెక్కలు తగిలించుకోవాలంటారు సవిత. ఈ విషయంలో హైదరాబాద్ మహిళ ఓ అడుగు ముందుకేసిందని కూడా అన్నారామె. మహిళ తన సంతోషం కోసం ఇంకా ఇంకా గొంతు విప్పాలనేదే నా కోరిక. అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాను. మరింత మందిని ప్రోత్సహిస్తున్నానని చెప్పారు సవిత. దేశమంతా పెరిగాను! సవిత తండ్రి ఎయిర్ఫోర్స్ అధికారి కావడంతో ఆమె బాల్యం దేశంలోని అనేక ప్రదేశాల్లో సాగింది. దాదాపుగా ముప్పై ఏళ్ల కిందట ఫ్యాషన్ డిజైనింగ్ ఒక కోర్సు రూపంలో యూనివర్సిటీ కరిక్యులమ్లో చేరిన తొలి రోజుల్లో, ఏ మాత్రం ఉపాధికి భరోసా కల్పించలేని ఆ కోర్సులో చేరాలనుకోవడమే పెద్ద సాహసం. అలాంటి రోజుల్లో ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారామె. పెళ్లి తర్వాత హైదరాబాద్లో సొంతంగా తన పేరుతోనే ఫ్యాషన్ డిజైనింగ్ యూనిట్ ప్రారంభించారు. ‘‘పాతికేళ్ల పాటు చాలా సీరియెస్గా ఫ్యాషన్ ఇండస్ట్రీ కోసం పని చేశాను. నా యూనిట్ చూసుకుంటూ మధ్యలో కార్ ర్యాలీలు, ట్రెక్కింగులతో జీవితాన్ని సంతోషంగా గడిపాననే చెప్పాలి. 2017లో ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహించాను. అయితే అన్ని రోజులూ ఒకేరకంగా ఉండవు కదా! ఆ తర్వాతి ఏడాది కాళ్లు నాకు పరీక్ష పెట్టాయి. మాల్ అలైన్మెంట్ సమస్యతో బౌడ్ లెగ్స్గా మారిపోయాయి. ట్రెకింగ్ కాదు కదా మామూలుగా నడవడం కూడా కష్టమైంది. ఆ క్షణంలో నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధమయ్యాను. హై టిబియల్ ఆస్టియోటమీ సర్జరీ చేయించుకున్నాను. మోకాళ్ల నుంచి మడమల మధ్య ఉండే ఎముకను వంపు తీసి సరిచేసి ప్లేట్ అమర్చి స్క్రూలతో బిగిస్తారన్నమాట. గత ఏడాది ఆగస్టులో ఒక కాలికి, నవంబరులో మరో కాలికి సర్జరీ అయింది. కొంతకాలం వీల్ చెయిర్కి పరిమితమయ్యాను. తర్వాత వాకర్తో రోజులు గడిచాయి. ఇక ఇప్పుడు నా ఫిట్నెస్ని తిరిగి తెచ్చుకోవాలి. అందుకే ఈ సైక్లింగ్. వారంలో మూడు రోజులు సైక్లింగ్ రోజుకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు, మరో మూడు రోజులు గంటపాటు వాకింగ్... ఇదీ ఇప్పుడు నా రొటీన్. ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కశ్మీర్లో ట్రెకింగ్కి సిద్ధమవుతున్నాను’’ అని చెప్పారు సవిత. ఇంత సాహసం అవసరమా? ‘‘నలభై ఎనిమిదేళ్ల వయసులో ఆ సర్జరీ అవసరమా, మందులతో రోజులు వెళ్లదీయవచ్చు కదా’ అని అడిగే వాళ్లకు నేను చెప్పే సమాధానం ‘అవసరమే’ అని. ఏ వయసులోనైనా మనిషి జీవితం తన చేతుల్లోనే ఉండాలి. అనారోగ్యం కారణంగా మరొకరి మీద ఆధారపడే పరిస్థితిలోకి జారిపోకూడదు. పైగా నలభై ఎనిమిది అంటే... అభిరుచులను కట్టిపెట్టి జీవితాన్ని నిస్సారంగా గడిపే వయసు కాదు. నాకు ఇష్టమైన కార్ ర్యాలీ, ట్రెకింగ్ వంటివేవీ చేయలేనప్పుడు, భారంగా అడుగులేసుకుంటూ రోజులు గడిపే జీవితం నాకు అవసరమా... అనేది నా ప్రశ్న. అందుకే ఈ సర్జరీలో సక్సెస్ రేట్ ఫిఫ్టీ– ఫిఫ్టీ అని తెలిసినప్పటికీ నేను రిస్క్ తీసుకోవడానికే సిద్ధపడ్డాను. మనం అనుకున్నట్లు జీవించడానికి అనారోగ్యాన్ని అధిగమించడానికి మొదట మానసికంగా సిద్ధం కావాలి. ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా, ఫిట్గా ఉన్నాను. నా డిజైనింగ్ స్టూడియోని నడుపుకుంటున్నాను. నా ట్రెకింగ్ ఇంటరెస్ట్ని ఫుల్ఫిల్ చేసుకోగలను కూడా’’ అని ఆత్మవిశ్వాసంతో కూడిన నవ్వుతో చెప్పారు సవిత. – వాకా మంజులారెడ్డి -
Seshachalam Hills: ట్రెక్కింగ్కు పెరుగుతున్న ఆదరణ
సాక్షి, చిత్తూరు: ఉరుకులు పరుగుల జీవితం. కాంక్రీటు వనాల్లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైన పని. ఒకేచోట నివసిస్తున్నామనే మాటే కానీ.. నోరు విప్పి మాట్లాడుకోలేని పరిస్థితి. పక్కింట్లో ఏమి జరుగుతుందో కూడా తెలుసుకోలేనంతగా మనిషి మారిపోతున్నాడంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా కుంగిపోతూ.. ఆయుష్షు క్షీణిస్తోంది. రోజంతా కష్టపడినా.. సాయంత్రానికి కష్టసుఖాలు పంచుకునే స్నేహితులు ఉంటే జీవితంలో అంతకు మించిన సుఖం మరొకటి లేదనేది వాస్తవం. కనీసం వారంలో ఒక్క రోజైనా స్నేహితులు, బంధువులతో కలిస్తే.. మనసు విప్పి మాట్లాడుకుంటే ఆ సంతోషమే సగం బలం. ఇలా కలవాలనుకునే వారిని ఒక్కటి చేస్తోంది ‘ట్రెక్కింగ్’. ఆ విశేషాల సమాహారమే ఈవారం ‘సాక్షి’ సండే స్పెషల్.. రొటీన్ జీవితానికి భిన్నంగా ఆటవిడుపు కోసం అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలో వీకెండ్లో పర్వతారోహణం చేస్తుంటారు. భారత దేశంలో పర్యటన పూర్తిగా మతంతో ముడిపడి ఉంటుంది. తీర్థయాత్రలు, యాత్రలు ఉంటాయి. ఇందుకు భిన్నంగా తిరుపతికి చెందిన బీవీ రమణ, పున్నా కృష్ణమూర్తి, ఈశ్వరయ్య 25 ఏళ్ల క్రితం అడవిలో చెట్ల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్లడం ఆరంభించారు. సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు, లోయలు, సెలయేళ్లు, నీటి ప్రవాహాలు, ఆ నీటి ప్రవాహ ఒరిపిడికి ఏర్పడిన శిలా రూపాలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తరువాత శ్వేత మాజీ డైరెక్టర్ భూమన్(74), సీనియర్ జర్నలిస్ట్ రాఘవశర్మ(70), మధు(స్విమ్స్లో డయాలసిస్ టెక్నీషియన్), యుగంధర్, ట్రెక్కింగ్ బాలసుబ్రమణ్యం గ్రూపులుగా ఏర్పడి ప్రతి ఆదివారం ట్రెక్కింగ్కు వెళ్లి వస్తున్నారు. మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కుమారుడు వైఎస్సార్సీపీ యువ నాయకుడు భూమన అభినయ్రెడ్డి మిత్ర బృందం సభ్యులు మరో గ్రూపుగా ఏర్పడి ట్రెక్కింగ్ను ఆస్వా దిస్తున్నారు. 1997లో జర్నలిస్టు పున్నా కృష్ణమూర్తి విజయవాడ నుంచి తిరుపతికి బదిలీపై వచ్చి.. విధులు ముగించుకుని అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఆ తరువాత స్థానిక ఉద్యోగి బీవీ రమణతో కలిసి శేషాచలంలో అన్వేషణ ప్రారంభించారు. ఇలా ట్రెక్కింగ్కు బీజం పడింది. ఆషామాషీ కాదు.. ట్రెక్కింగ్ అనేది ఆషామాషీ కాదు. సాహసంతో కూడుకున్న యాత్ర. చెప్పాలంటే మిలిటరీలో ట్రైనింగ్ లాంటిది. తాళ్లు, ట్యూబ్స్, టెంట్లు, నీరు, భోజనం, పండ్లు, బిస్కెట్స్ తీసుకుని నిట్టనిలువుగా ఉండే కొండలు, గుట్టలు ఎక్కడం సరికొత్త అనుభూతి. ఒక్కొక్కరు కనీసం 20 నుంచి 30 కిలోల బరువు మోసుకెళ్లాల్సి వస్తుంది. 25 ట్రెక్కింగ్ గ్రూపుల్లో కొందరు 100 నుంచి 200 సార్లు కొండా కోనల్లో తిరిగిరావటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ట్రెక్కింగ్తో లాభాలు ► ఫిట్నెస్కు, కష్టానికి శరీరం అలవాటు పడుతుంది. ► శరీరాన్ని ఎలా అయినా తిప్పేందుకు వీలు కలుగుతుంది. ► సమష్టితత్వం అలవడుతుంది. ► ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం నేర్పుతుంది. ► నడవలేని వారికి చేయి అందించడం, లేదా మోసుకెళ్లడం ద్వారా పరోపకారాన్ని తెలియజేస్తుంది. ► అడవిలో మంచి ఆక్సిజన్ పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి. ► కష్టమొచ్చినా, నష్టమొచ్చినా ఎదుర్కొనేలా మానసిక దృఢత్వం. పక్కా ప్రణాళికతో.. ►ట్రెక్కింగ్కు వారం ముందే ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సి వస్తుంది. ► ఏ అడవికి వెళ్లాలి, అక్కడకు ఎన్ని కిలోమీటర్లు? దారి ఎలా ఉంటుంది? అందుకు సంబంధించిన ఏర్పాట్లు. ► ట్రెక్కింగ్లో భాగస్వాములయ్యే సభ్యులతో ఓ వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసుకోవడం. ► ఎలాంటి సమాచారమైన అందులోనే చర్చించుకోవడం. లొకేషన్ షేరింగ్. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ► ట్రెక్కింగ్కు వెళ్లేవారు వేకువజామునే లేచి ఎంపిక చేసుకున్న ప్రాంతానికి ఉదయం 6–7 గంటల మధ్య చేరుకోవాలి. ► ప్రతి సభ్యుడు ఒక బ్యాగు, అందులో 2, 3 నీళ్ల బాటిల్స్, స్నాక్స్, ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్లాలి. ► కొండలు, గుట్టలు ఎక్కేందుకు వీలుగా కాటన్ దుస్తులు ధరించాలి. విధిగా షూ ధరించాలి. ► మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందస్తు ఏర్పాట్లు. ► ఎంపిక చేసుకున్న ప్రాంతానికి వెళ్లే కంటే ముందు సమీపంలోని గ్రామాల ప్రజలతో మమేకం కావడం. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం నేను 30 ఏళ్లకు ముందే ట్రెక్కింగ్ మొదలు పెట్టాను. ఇప్పటి వరకు సుమారు 200 ట్రెక్కింగ్లు చేసుంటా. నాతోపాటు ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు అందరినీ తీసుకెళ్తుంటా. నా భార్యను కూడా ట్రెక్కింగ్లో భాగస్వామిని చేశా. ప్రకృతి ఒడిలోకి వెళ్తే కలిగే సంతోషం మాటల్లో చెప్పలేం. జీవవైవిధ్యంతో పాటు జంతువులు, అనేక రకాల మొక్కలు, పూల మధ్య గడపడం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. – భూమన్, శ్వేత మాజీ డైరెక్టర్ పెద్ద పులిని చూసి షాక్ అయ్యాం 2006లో తలకోన నుంచి సుమారు 30 కి.మీ దూరంలో రుద్రగళతీర్థం వరకు వెళ్లాం. ఆ రోజు రాత్రి అక్కడే స్టే చేశాం. రాత్రి 10 గంటల సమయంలో కణితి అరుపులు వినిపించాయి. ఇది మామూలే అనుకున్నాం. 15 నిమిషాల తర్వాత పెద్దపులి గాడ్రింపుతో భయమేసింది. ఆ పెద్దపులి కణితి గొంతును పట్టుకుని ఈడ్చుకెళ్తుండడం చూసి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఆ సమయంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ చప్పుడు చేయకుండా ఉండిపోయాం. – కుమార రాధాకృష్ణ, కృష్ణాపురం, రాత్రి విగ్రహాల శిల్పి -
Ponmudi: కేరళ బంగారం.. పొన్ ముడి
కశ్మీరు లోయ... కన్యాకుమారి చెంతకు వచ్చినట్లుంది. సముద్రం అంటే ఏమిటో ఎరుగని కశ్మీర్ పశ్చిమ కనుమలను ఆసరాగా చేసుకుంటూ అరేబియా తీరం వెంబడే దక్షిణాదికి నడిచి వచ్చినట్లు ఉంటుంది పొన్ముడి. పొన్ముడి అంటే బంగారు శిఖరం అని అర్థం. ఇక్కడి వాతావరణాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించిన వాళ్లు ఈ ప్రదేశాన్ని కశ్మీర్తో పోలుస్తారు. కేరళలోని ఈ హిల్స్టేషన్లో ఏడాదంతా ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయి. పర్వత శిఖరాలను తాకుతూ ప్రయాణించే మబ్బులను దక్షిణాదిలో చూడాలంటే ఈ పొన్ముడిలోనే సాధ్యం. ఈ కేరళ కాశ్మీరం ఆ రాష్ట్ర రాజధాని త్రివేండ్రం నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరాన ఉంది. జ్ఞాపకంగా ఓ రాయి త్రివేండ్రం నుంచి మొదలైన రోడ్డు ప్రయాణంలో నగరాన్ని వదిలినప్పటి నుంచి పశ్చిమ కనుమల పచ్చదనం ఆహ్వానిస్తుంది. రోడ్డు మలుపులు తిరుగుతూ ఉంటుంది. కొంతసేపటికి ఏ దిక్కుగా ప్రయాణిస్తున్నామో కూడా అర్థం కాదు. ఈ మధ్యలో కల్లేరు నది పలకరిస్తుంది. ఈ నదిలో రాళ్లు నీటి ప్రవాహానికి అరిగిపోయి నునుపుదేలి ఉంటాయి. బాగా నునుపుదేలిన ఒక రాయిని వెంట తెచ్చుకుంటే పొన్ ముడి టూర్ జ్ఞాపకంగా ఉంటుంది. పొన్ ముడి శిఖరం మీద నిలబడి ఆత్మప్రదక్షిణం చేసుకుంటే ప్రకృతి విజయం కనువిందు చేస్తుంది. గ్లోబల్ వార్మింగ్లు, సునామీలు ఎన్ని విపత్తులు వచ్చినా ప్రకృతి తిరిగి చిగురించడం మానదు. అదే ప్రకృతి సాధించే విజయం. ఇక పొన్ ముడి టూర్లో తీరాల్సిన అద్భుతం అందమైన సూర్యోదయం. పశ్చిమ కోన వరయాడు అంటే నీలగిరి థార్. నీలగిరి థార్ ఉండే ఎల్తైన ప్రదేశమే వరయాడు మొట్ట. ఇది మూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తు ఉంటుంది. కల్లేరు నదికి పొన్ ముడి పర్వత శిఖరానికి మధ్యలో వరయాడు మొట్ట వస్తుంది. ఇది పదమూడు శిఖరాల సమూహం. ఇందులో సెకండ్ హయ్యస్ట్ వరయాడు మొట్ట. సౌత్ ఇండియాలో అడ్వంచరస్ ట్రెక్కింగ్ పాయింట్. ట్రెకింగ్ మొదలైన అరగంటకే ఉచ్ఛ్వాశ నిశ్వాసల వేగం పెరుగుతుంది, శబ్దం స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ట్రెకింగ్కి రెండు నెలలు ముందు బుక్ చేసుకోవాలి. జంతుప్రేమికులు, పక్షి ప్రేమికులు వాళ్ల ఆసక్తిని బట్టి వరయాడు మొట్ట, సీతతీర్థం మీదుగా పొన్ ముడి చేరుకోవచ్చు. ట్రావెల్ టిప్ ట్రెకింగ్కి వెళ్లే వాళ్లు షూస్ పట్ల ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. పాదానికి, మడమకు అదనపు ఒత్తిడి కలగకుండా సౌకర్యంగా ఉండాలి. అలాగే ట్రెకింగ్ మొదలు పెట్టేటప్పుడు సాక్స్ ధరించడానికి ముందు పాదానికి, వేళ్ల సందుల్లో టాల్కమ్ పౌడర్ చల్లాలి. ఇలా చేయడం వల్ల రోజంతా షూస్తోనే ఉన్నప్పటికీ పాదాలు తాజాగా ఉంటాయి. చెమటతో చిరాకు కలగదు. వరయాడు మొట్టకు పర్యాటకుల ట్రెకింగ్ -
ఫాస్టెస్ట్ ఉమన్: ఎవరెస్టును ఎక్కిన తొలి మహిళ
సరిగ్గా వారం క్రితం మే 23 వ తేదీ ఆదివారం ఈ ‘ఫీట్’ను సాధించారు హంగ్. బేస్ క్యాంప్ నుంచి ఆ ముందు రోజు మధ్యాహ్నం గం.1.20 లకు ఎవరెస్టును ఎక్కడం ప్రారంభించి, మర్నాడు మధ్యాహ్నం గం. 3.10 ని.లకు శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఆమె తన సంతృప్తి కోసం చకచకా ఎవరెస్టును ఎక్కారు తప్ప.. ‘ఫాస్టెస్ట్ ఉమన్’ అని అనిపించుకోడానికి ఎక్కలేదట! 25 గంటల 50 నిముషాల్లో ఎక్కడం పూర్తి చేశారు. అది రికార్డు అని అప్పుడు ఆమెకు తెలియదు. పక్కనే ఉన్న టీమ్ లీడర్ షేర్పాకు, ఆ టీమ్లోని తక్కిన పర్వతారోహకులకూ అంత కచ్చితంగా తెలీదు. వారంతా కిందికి దిగి వచ్చాక ఈ శుక్రవారం నేపాల్ ప్రభుత్వాధికారులు త్సాంగ్ ఇన్ హంగ్ 12 గంటల తేడాతో పాత రికార్డును బద్దలు కొట్టినట్లు ప్రకటించారు! ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతి వేగంగా ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మహిళగా నేపాల్కు చెందిన ఫున్జో ఝంగ్ము లానా పేరుతో రికార్డు ఉంది. 2018 మే 17న ఆమె ఆ రికార్డును నెలకొల్పారు. 39 గంటల 6 నిముషాల్లో బేస్ క్యాంప్ నుంచి ఫున్జో ఆ రికార్డును నెలకొల్పారు. ఫున్జో రికార్డును ఇప్పుడీ హాంకాంగ్ మహిళ త్సాంగ్ ఇన్ హంగ్ తనకు తెలియకుండానే బ్రేక్ చేశారు. నిజానికి మే 12 నే శిఖరాన్ని చేరుకోవలసింది హంగ్. ఆ రోజు గాలులు ఉద్ధృతంగా ఉన్నాయి. కుమ్మరించినట్లుగా ఒకటే మంచు. 8,750 మీటర్ల ఎత్తుకు వెళ్లి కూడా అక్కడే ఆగిపోయారు. ఇక వంద మీటర్లే కదా, ఎక్కేద్దాం అనుకోలేదు. తొలిసారి ఆమె 2017 మే 21న ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఇప్పుడు మళ్లీ ‘డ్రీమర్స్ డెస్టినేషన్ ట్రెక్స్ అండ్ ఎక్స్పెడిషన్’ కంపెనీ తరఫున మరొకసారి ఎవరెస్టును చేరుకున్నారు. అదీ అత్యంత వేగంగా. హంగ్ టీచర్. ఎవరెస్టు కంటే ముందు 2016లో ఆమె చైనాలోని ముజ్టాగ్ పర్వతాన్ని ఎక్కారు. ‘‘ఇదంతా నా స్టూడెంట్స్, నా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం’’ అంటారు హంగ్. కలను నిజం చేసుకోలేకపోతే జీవితంలో మనం తర్వాతి అడుగు వేయలేం అని హంగ్కు వాళ్ల అమ్మ చెబుతుండేవారట. 2011–2019 మధ్య కాలంలో హంగ్ ఐదు వేల నుంచి ఆరు వేల మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాలను ఇరవై సార్లు ఎక్కి దిగారు. పర్వతాలు సానుకూల ఆలోచనల్ని కలిగిస్తాయని, ఒదిగి ఉండటం నేర్పుతాయనీ హంగ్ అంటారు. -
Meenmutty Waterfalls: మీన్ముట్టి జలపాతం.. అద్భుతానికే అద్భుతం
మీన్ముట్టి... జలపాతం... వయనాడు తలమీద జల కిరీటం. వెయ్యి అడుగుల ఎత్తు నుంచి దూకే ప్రవాహవేగం తెల్లగా ... పాలధారను తలపిస్తుంది. నీటిచుక్కల సవ్వడి... ఝంఝామారుతాన్ని గుర్తు చేస్తుంది. కేరళ రాష్ట్రం అనగానే మనకు ఇండియా మ్యాప్లో దక్షిణాన అరేబియా సముద్రతీరానికి ఆనుకుని ఉన్న సన్నటి స్ట్రిప్ గుర్తుకు వస్తుంది. కేరళలో నివాస ప్రాంతాలన్నీ అరేబియా తీరానే ఉన్నాయేమో అని కూడా అనుకుంటాం. కానీ సాగరతీరాన్ని తాకకుండా కొన్ని జిల్లాలున్నాయి. వాటిలో ఒకటి వయనాడు. ఇది ఓ దశాబ్దం కిందట పర్యాటక ప్రదేశంగా బయటి ప్రపంచానికి పరిచయమైంది. రాహుల్గాంధీ 2019లో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవడంతో వయనాడు దేశమంతటికీ సుపరిచయమైంది. పశ్చిమ సుగంధం వయనాడు సుగంధ ద్రవ్యాలు పుట్టిన నేల. పశ్చిమ కనుమల మీద విస్తరించిన హిల్స్టేషన్, ఏడు వేల అడుగుల ఎత్తు ఉంటుంది. టూరిజం ఆధారంగా అభివృద్ధి చెందిన హోటళ్లు పెద్ద పెద్ద హోర్డింగులతో పర్యాటకులకు స్వాగతం పలుకుతుంటాయి. కొండ పైకి వెళ్లే కొద్దీ లోయలో పెరిగిన కొబ్బరి చెట్ల తలలు రోడ్డుకు సమాంతరంగా కనిపిస్తుంటాయి. కొబ్బరి, పోక, కాఫీ, టీ, ఏలకులు, మిరియాలు, లవంగాల చెట్లు, అక్కడక్కడా మామిడి, పేర్లు తెలియని లెక్కలేనన్ని జాతులు... అన్ని ఆకులూ పచ్చగానే ఉన్నా, దేని పచ్చదనం దానిదే. ఈస్టర్న్ ఘాట్స్ కంటే వెస్టర్న్ ఘాట్స్ అందంగా ఉంటాయి. వయనాడుకు వెళ్లే దారిలో కొండల్లో ప్రమాదకరమైన మలుపులున్నాయి. వాటిని హెయిర్పిన్ బెండ్లు అంటారు. మీన్ముట్టికి వెళ్లే దారిలో... వయనాడు కొండ మీదకు చేరేలోపు ఒక చోట పెద్ద మర్రి చెట్టు, ఆ చెట్టుకు రెండు పెద్ద ఇనుప గొలుసులు ఉంటాయి. బ్రిటిష్ పాలన కాలంలో ఒక విదేశీయుడు గిరిజనులు నివాసం ఉండే ఈ ప్రదేశాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి బయలుదేరాడు. దట్టమైన కొండల్లో దారి తప్పి పోకుండా ఉండడానికి స్థానిక గిరిజనుడిని సహాయంగా తీసుకెళ్లాడని, ఆ గిరిజనుడి మార్గదర్శనంతో దారి తెలుసుకున్న తర్వాత ప్రపంచానికి తను మాత్రమే తెలియాలనే దురుద్దేశంతో ఆ విదేశీయుడు, తనకు సహాయం చేసిన గిరిజనుడిని ఈ చెట్టుకు గొలుసులతో కట్టేశాడని చెబుతారు. అక్కడి నుంచి మరికొంత దూరం ప్రయాణం తర్వాత పూకాట్ లేక్కు చేరుకుంటాం. కొండల మీద ఉన్న పెద్ద మంచి నీటి సరస్సు ఇది. ఇందులో బోట్ షికారు చేయవచ్చు. మీన్ముట్టి జలపాతానికి చేరాలంటే ట్రెక్కింగ్కు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి పూకాట్ సరస్సులో బోటింగ్కి ఎక్కువ టైమ్ తీసుకోకపోవడమే మంచిది. పూకాట్ నుంచి ముందుకు సాగే కొద్దీ జనం ఆనవాళ్లు తగ్గుతుంటాయి. జలపాతం రెండు కిలోమీటర్లు ఉందనగా రోడ్డు ఆగిపోతుంది. అక్కడి నుంచి కొంత దూరం రాళ్ల బాటలో నడక. తర్వాత కొండవాలులో నడక. ఫారెస్ట్ సెక్యూరిటీ పాయింట్ దగ్గర టిక్కెట్లు తీసుకోవాలి. వాళ్ల రిజిస్టర్లో మన పేరు, ఊరు, ఫోన్ నంబరు రాయాలి. బృందంలో ఎంతమంది ఉంటే అన్ని కర్రలతో ఒక గార్డును సహాయంగా వస్తాడు. ఆ చెక్ పాయింట్ నుంచి ముందుకు వెళ్లిన వాళ్లు తిరిగి ఆ పాయింట్కు చేరే వరకు బాధ్యత వాళ్లదే. అదో జానపద చిత్రమ్ కొండవాలులో దట్టమైన అడవిలో ట్రెకింగ్. చెట్లకు పెద్ద పెద్ద తాళ్లు కట్టి ఉంటాయి. గార్డు పర్యాటకుల చేతికి కర్రలిచ్చి, ముందుగా తాను నడుస్తూ, ఎక్కడ రోప్ను పట్టుకోవాలో హెచ్చరిస్తూ తీసుకెళ్తాడు. ఎక్కువ లగేజ్ లేకపోతే ట్రెకింగ్ సులువుగా ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే ఎదురుగా కనిపించే కొండ తమిళనాడుది, మరోవైపు కర్నాటకకు చెందిన కూర్గ్ కొండలు కూడా కనిపిస్తాయి. నడుస్తూ ఉంటే చెట్ల సందుల్లో జలపాతం కనిపిస్తూనే ఉంటుంది. సవ్వడి వినిపిస్తూ ఉంటుంది. పొరపాటున కాలు జారితే... లోయలో ఎక్కడకు చేరుతామో కూడా ఊహించలేం. ‘ఇంతదూరం వచ్చిన తర్వాత భయపడి వెనక్కి పోవడమేంటి’ అని మనసులో సాహసాన్ని ఒడిసిపట్టుకుని ముందుకు నడిస్తే అద్భుతానికే అద్భుతం ఆవిష్కారమవుతుంది. అదే మీన్ముట్టి జలపాతం. పచ్చటి చెట్ల మధ్య తెల్లటి నీటిధారలు. ఆ జల్లులో తడిస్తే తప్ప టూర్ పరిపూర్ణం అనిపించుకోదు. మీన్ ముట్టి అంటే... చేపలకు అడ్డుకట్ట అని అర్థం. – వాకా మంజులారెడ్డి -
కొన్నిరోజులు మీకు కనిపించనంటున్న బిగ్ బాస్ బ్యూటీ
యాంకర్గా కెరీర్ను ఆరంభించి చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిపోయింది ఆరియానా గ్లోరీ. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. అందులో అదిరిపోయే ఆటతో పాటు తన దూకూడైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండేది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో సెలెబ్రిటీగా మారిపోయింది. తాజాగా ఈ భామ కొన్ని రోజులు మీకు కనిపించను అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పింది. నేను అక్కడికి ఒంటరిగానే వెళ్తున్న తాజాగా ఆరియానా తన ఇన్స్టాగ్రామ్లో ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ‘నేను రెండు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోతే తెగ ట్యాగ్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు చెబుతున్నాను, ఈ నెల 12వ తేదీ వరకు నేను కనిపించను. హిమాలయాలకు ట్రెక్కింగ్ కోసం ఒంటరిగానే వెళ్తున్నాను. ఒంటరిగా అంటే అక్కడ ట్రెక్కింగ్ గ్యాంగ్ ఉంటుంది. ఆ ప్రాంతంలో సిగ్నల్స్ కూడా ఉండదు కాబట్టి కొన్న రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండలేను. కనుక నన్నుఅర్థం చేసుకోండి. వచ్చాక అన్ని విషయాలను చెబుతానని అరియానా తెలిపింది. ఆ తర్వాత ఢిల్లీలో ల్యాండ్ అయిన ఫొటోను షేర్ చేసింది. ఈ అమ్మడు రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో కనిపించకపోతే, తెగ బాధ పడిపోతున్నారు ఆమె అభిమానులు. ఇటీవల అనారోగ్యానికి గురైన సమయంలోనూ ఇదే జరిగింది. ఈ కారణంగానే తాజాగా తన ఫాలోవర్లకు ఈ వీడియో పోస్ట్ చెసిందీ బోల్డ్ బ్యూటీ. ( చదవండి: వర్షపై బాడీషేమింగ్ చేసిన హైపర్ ఆది ) -
అనంతపురం అమ్మాయి లోకాన్ని చుట్టేస్తోంది
అనంతపురం నుంచి సమీరా ఖాన్ అనే అమ్మాయి హిమాలయాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే నేపాల్లోని అమా దబ్లమ్ పర్వతాన్ని అధిరోహించింది. ఎవరెస్ట్ను అందరిలా నేపాల్ వైపు నుంచి కాక టిబెట్ వైపు నుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. సైకిల్ మీద దేశంలోని ఈ మూల నుంచి ఆ మూలకు తిరిగేసిన సమీరా ఖాన్కు తల్లిదండ్రులు లేరు. కుటుంబ మద్దతు లేకపోయినా అమ్మాయిలు తాము అనుకున్నది సాధించగలరు అని ఎవరెస్ట్ శిఖరం మీద నుంచి అరచి చెప్పాలని ఉందని సమీరా అంటోంది. సమీరా ఖాన్ మన తెలుగమ్మాయి అయినా తెలుగువారి కంటే ఈశాన్య రాష్ట్రాల్లో చాలామందికి తెలుసు. పర్వతాలు ఎక్కాలనే సంకల్పంతో తరచూ ఆవైపే తిరుగుతుంటుంది సమీరా. నేపాల్, టిబెట్లకు పక్కింటికి వెళ్లినట్టు వెళుతుంటుంది. ‘పర్వతాన్ని అధిరోహించడం ఏదో సరదా కాదు నాకు. అదొక జీవన విధానం’ అంటుంది సమీరా. అనంతపురంకు చెందిన సమీరా ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్లో ఒక సంస్థలో పని చేస్తోంది. కాని టైలర్గా పని చేసే తండ్రి ఐదేళ్ల క్రితం మరణించాక ఆమె ఈ ప్రపంచమే తన ఇల్లు అనుకుంది. ఆమెకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు తల్లి చనిపోయింది. ఐదుమంది సంతానం లో చివరిదైన సమీరా ఇంటి నుంచి ఏ మద్దతు కోరకుండా ఒక్కదానిగా ఏదైనా సాధించాలనుకుంది. ‘నాకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. దేశంలో దాదాపు వెయ్యి కిలోమీటర్లు సైకిల్ మీద ఒక్కదాన్నే తిరిగాను’ అంటుంది సమీరా. కాని ఆమెకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది. ‘నేను పదో క్లాసు వరకు చదువుకున్నాను. ఆ తర్వాత కుటుంబ అవసరాల కోసం బెంగళూరులో ఒక బి.పి.ఓలో పని చేశాను. ఒక్కదాన్నే ప్రపంచం చూడటం మొదలుపెట్టాక ధైర్యం వచ్చింది. సైకిల్ వేసుకొని ఒక్కదాన్నే చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్లి రావడం మొదలుపెట్టాను’ అంది సమీరా ఖాన్. ‘2014లో కశ్మీర్కు వరదలు వచ్చినప్పుడు వాలెంటీర్గా పని చేయడానికి వెళ్లాను. ఆ సమయంలో రెండు రోజులు ట్రెక్కింగ్ చేశాను. ధైర్యం వచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లో ఎలా ఉండాలో అర్థమైంది. పర్వతారోహణ మీద ఆసక్తి ఏర్పడింది. నేపాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో దాదాపు 500 కిలోమీటర్ల ట్రెక్కింగ్ పూర్తి చేశాను. నా శక్తి ఇంకా పెరిగినట్టనిపించింది. నేపాల్లో, హిమాలయాల్లో ఉన్న నాలుగు పెద్ద పర్వతాలు ఎక్కాను. ఇక ఎవరెస్ట్ మిగిలింది. దానిని అందరూ సులువని నేపాల్ వైపుగా ఎక్కుతారు. ఏదో ఎక్కామంటే ఎక్కాం అని చెప్పడానికి ఎక్కడం ఎందుకు? నేను టిబెట్ వైపు నుంచి చాలా నైపుణ్యంతో సవాలుతో ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకున్నాను’ అంది సమీరా ఖాన్. ట్రెక్కింగ్, పర్వతారోహణలో సమీరా ఖాన్ ఆమె ఇంతవరకూ పర్వతారోహణలో ట్రైనింగ్ తీసుకోలేదు. లండన్ వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటోంది. దానికి రెండు మూడు లక్షలు కావాలి. ఎవరెస్ట్ అధిరోహణకు కూడా కొన్ని లక్షల ఖర్చు ఉంది. ‘నా దగ్గర కొంత డబ్బు ఉంది. ఇంకొంత స్పాన్సర్షిప్ కావాలి. ప్రభుత్వాన్ని సంప్రదిస్తే పర్వతారోహణ ఒక క్రీడ కాదు అని చెప్పి పంపించేశారు. ఏం చేయాలి’ అంది ఈ సాహసి. ‘నాకు స్త్రీలు ఏదైనా సాధించగలరు అని చెప్పాలని ఉంది. ఈ సమాజంలో నా గొంతు వినిపించాలని ఉంది. ఎవరెస్ట్ అధిరోహించి, ఆ యోగ్యతతో నేను చెప్పాలనుకున్నది స్త్రీల తరఫున అరచి చెప్తాను’ అంటోంది సమీరా ఖాన్. ఆమె పట్టుదల చూస్తుంటే త్వరలోనే స్త్రీల తరఫున ఒక గట్టి గొంతు వింటాం. – సాక్షి ఫ్యామిలీ -
సాహసమే శ్వాసగా సాగిపోతున్నారు
సాక్షి, గుంటూరు: దేనినైనా సాధించగలమనే ఆత్మ విశ్వాసం.. సాహస కృత్యాలపై మక్కువ.. కలగలిపిన వారి సంకల్ప బలం ముందు ఎత్తయిన పర్వతాలు చిన్నబోయాయి. జిల్లాకు చెందిన కొందరు యువతీ, యువకులు అవరోధాలను అధిగమిస్తూ.. శిఖరాలను ముద్దాడుతూ రికార్డులు కైవసం చేసుకుని తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలు అధిరోహించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు గుంటూరుకు చెందిన ఆశ దళవాయి. గుంటూరులో నివాసం ఆశకు చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి. నగరంలోని టీజేపీఎస్ కళశాలలో 2007లో బీఎస్సీ పూర్తి చేశారు. డిగ్రీ చదివే రోజుల్లో ఎన్సీసీలో హిల్ మౌంటెనీరింగ్ కోర్సుకు సెలక్ట్ అయి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (పర్వతారోహణ)లో శిక్షణ తీసుకున్నారు. డిగ్రీ అనంతరం డార్జిలింగ్లోని హిమాలయా మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో బేసిక్ అడ్వెంచర్స్, వివిధ రకాల పర్వతారోహణ కోర్సుల్లో తర్ఫీదు పొందారు. అక్కడి నుంచి వచ్చి తన స్నేహితులతో కలిసి హైదరాబాద్లో ఔట్రైవల్ అడ్వెంచర్స్ అనే సంస్థను ప్రారంభించి వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు అడ్వెంఛర్స్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంస్థ ద్వారా 5 వేల మందికి పర్వతారోహణపై అవగాహన కల్పించారు. పర్వతారోహణ ఇలా.... 2019 జులై 16 నుంచి 20 వరకూ ఐదు రోజులు ప్రయాణం చేసి ఆఫ్రికా ఖండంలోని 5,895 మీటర్ల ఎత్తయిన కిలిమంజారో అధిరోహించారు. అనంతరం అదే సంవత్సరంలో యూరప్లోని 5,642 మీటర్ల ఎత్తయిన ఎల్బ్రూ శిఖరాన్ని, అర్జెంటినాలోని 6,962 మీటర్ల ఎత్తయిన అకోంకగువా పర్వతారోహణ చేశారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహణకు సిద్ధమైన తరుణంలో గత ఏడాది కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ ఆంక్షలు ఉండటంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ప్రస్తుతం ఎవరెస్ట్ అధిరోహణకు సన్నద్ధం అవుతున్నానని ఈ ఏడాది అధిరోహణ పూర్తి చేస్తానని ఆమె చెబుతున్నారు. కిలిమంజారో శిఖరంపై సాయికిరణ్ (ఫైల్) యువకిరణం చిలకలూరిపేట పట్టణం ఎంవీఆర్ కాలనీకి చెందిన సాయికిరణ్కు పర్వతారోహణంపై మక్కువ. ఈ నేపథ్యంలో పాఠశాల దశలోనే అడ్వెంచర్ సంస్థలను సంప్రదించి పర్వతారోహణకు ప్రయత్నించాడు. అయితే వయసు సరిపోదని అందరూ చెప్పడంతో, 2019లో ఇంటర్మీడియట్ చదివేప్పుడు 18 ఏళ్లు నిండిన వెంటనే తెలంగాణ రాష్ట్రం భువనగిరి గుట్టలోని రాక్ క్లైంబింగ్లో జనవరి మాసంలో చేరి శిక్షణ పొందాడు. అనంతరం ఫిబ్రవరి నెలలో దాతల సహకారం లభించడంతో కిలిమాంజారో శిఖరాన్ని అధిరోహించాడు. అదే ఏడాది ఆగస్టు నెలలో సిక్కింలోని వెస్ట్టెంజింగ్కాన్లో శిక్షణ పొంది ఏ గ్రేడ్ సాధించాడు. అనంతరం ఉత్తర భారతదేశంలోని లీలాధన్లో 6,158 మీటర్ల ఎత్తయిన స్టోక్ కాంగ్రీ పర్వతాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరితో కలిసి ఎక్కి 365 అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల ఎత్తుగల జాతీయ పతాకాన్ని పర్వతంపై రెపరెపలాడించారు. ఇందుకు గాను హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సాయి కిరణ్ 2019 డిసెంబర్లో ప్రసంశ పత్రం అందుకున్నాడు. ప్రస్తుతం ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులు సహకరించక దాతల సహకారం కోసం ఎదురుచూస్తున్నాడు. ఘనతకు ప్రభుత్వ గుర్తింపు... వెల్దుర్తి మండలం చిన్నపర్లపాటి తండాకు చెందిన వడితె సంధ్యబాయి 2017 మే నెలలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 2017లో నాగార్జున సాగర్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో సంధ్య ఇంటర్ చదువుతున్న సమయంలో ఎవరెస్ట్ అధిరోహణకు దరఖాస్తులు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 170 మంది వరకూ దరఖాస్తు చేసుకోగా విజయవాడలో జరిగిన ప్రైమరీ సెలక్షన్స్లో 30 మంది ఎంపికయ్యారు. అనంతరం వీరిని జమ్మూ కశ్మీర్కు తరలించి అక్కడ ఫైనల్ సెలక్షన్స్ ముగిసే సమయానికి 13 మంది మిగిలారు. 13 మందిలో అబ్బాయిలు 11 మంది కాగా ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు సంధ్య, మరో అమ్మాయి పశ్చిమ గోదావరి వాస్తవ్యురాలు. ప్రత్యేక శిక్షణ అనంతరం దిగ్విజయంగా ఎవరెస్ట్ పర్వతారోహణ సంధ్య పూర్తి చేసింది. ఈమె సాధించిన ఘనతకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది. రూ.10 లక్షల రివార్డును అందించడంతో పాటు, ప్రస్తుతం ఆమె చదువుకు అయ్యే ఖర్చులను సర్కార్ భరిస్తోంది. -
కొండనెక్కిన ‘కొండ’
సాక్షి, హైదరాబాద్ : కొండ కొండనెక్కడం ఏంటనుకుంటున్నారా? అవునండి నిజమే, వయసుతో సంబంధం లేకుండా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఓ సాహసం చేశారు. సంక్షిష్టమైన దారులతో, ఒళ్లు గగుర్పొడిచేలా ఏటవాలుగా ఉండే మార్గాలతో ఆద్యంతం ప్రమాదకరంగా ఉండే అత్యంత కఠినమైన కలావంతిన్ దర్గ్పై విజయవంతంగా ట్రెక్కింగ్ చేశారు. మహారాష్ట్రాలో రాయిఘడ్ జిల్లాలోని కలావంతిన్ దర్గ్పై ట్రెక్కింగ్ చేసిన ఫోటోలను కొండా విశ్వేశ్వరరెడ్డి తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దారులు భయంకరంగా ఉన్నా, శారీరకంగా అలసిపోయినా, ఈ ట్రెక్కింగ్ మంచి అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కొండనెక్కాలంటే.. కొండంత ధైర్యం ఉండాలంటూ నెటిజన్లు విశ్వేశ్వరరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పశ్చిమ కనుమల్లోనే అత్యంత ప్రమాదకరమైన ఈ కొండపై ట్రెక్కింగ్కి వెళ్లి 2016లో హైదరాబాద్కి చెందిన 27 ఏళ్ల రచిత గుప్త అనే యువతి మృతిచెందారు. మరణించిన 10 రోజుల అనంతరం ఆమె మృతదేహం లభ్యమైంది. 2018లో పూణేకి చెందిన 28 ఏళ్ల చేతన్ దండే అనే ట్రెక్కర్ కొండ అంచు, ఇంకా 15 అడుగుల దూరంలో ఉండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందారు. -
శేషాచలం సానువుల్లో....
భ్రమణ కాంక్షే అసలైన మానవ కాంక్ష అని పెద్దలు అంటారు. తిరిగినవారే గెలుస్తారు అని కూడా అంటారు. నాలుగు వైపులకు వెళ్లకపోతే, నాలుగు దిశలలో నడవకపోతే బతుకు బావిలా మారుతుంది. కనుచూపు కురచబారుతుంది. ‘ఎదగాలంటే తిరగాలి’ అంటారు భూమన అభినయ్ రెడ్డి. అతనికి శేషాచలం కొండలు కొట్టిన పిండి. పదిహేనేళ్ల కిందట బ్రహ్మదేవుని గుండంకు చేసిన తొలి ట్రెక్కింగ్ నుంచి ఇటీవల తలకోనతో మొదలెట్టి యుద్ధగళ వరకు వారం రోజుల పాటు శేషాచలం అడవుల్లో సాగిన ట్రెక్కింగ్ వరకు అతడు పోగు చేసుకున్న అనుభూతులు ఎన్నో. వాటిలో కొన్ని ఇవి. ‘పదేళ్ల క్రితం మా అమ్మ రేవతి ‘యుద్ధగళ’కు వెళ్లి వచ్చి, ఆ విశేషాలు చెప్పినప్పుడు ఆ ప్రాంతాన్ని సందర్శించాలను కున్నాను. అందురూ నడిచే మార్గంలో కాకుండా కొత్తదారిలో ఆ తీర్థానికి వెళ్లాలనుకున్నాను. ట్రెక్కింగ్ చేసే ఔత్సాహికులతో కలిసి యుద్ధగళకు పయనమయ్యాను. యుద్ధగళ ట్రెక్కింగ్ అడుగడుగునా ఆశ్చర్యంతో పాటు ఆనందానుభూతిని కలిగించింది. వారం రోజులు అడవిలోనే! యాభై మందితో సాగిన మా ట్రెక్కింగ్ యాత్ర.. శేషాచలం కొండలకు పడమర దిక్కున ఉన్న తలకోన నుంచి తాబేలు బావి, యుద్ధగళ, మూడేళ్ల కురవ, కంగుమడుగు, ఆదిమానుబండలు, ఎర్రంరెడ్డి మడుగు మీదుగా వైఎస్సార్ కడప జిల్లాలోని కుక్కలదొడ్డి వరకు సాగింది. ఎత్తైన తలకోన జలపాతాన్ని తనివి తీరా చూసుకుంటూ, ఆ కొండ ఎక్కి నాగరికత ఆనవాళ్లకు దూరంగా వారం రోజులు అడవిలోనే గడిపాం. నా చిరకాల కాంక్షను తీర్చే నడక ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ఎత్తైన కొండలు, ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపించే మహావృక్షాలు, మానవ అలికిడికి భయపడి పారిపోయే జంతు జాలాలు, లెక్కలేనన్ని వృక్షజాతులు ఈ శేషాచలం అడవుల్లో ఉన్నాయి. జలపాత సోయగాల తలకోన అక్టోబర్ 8న ఉదయం తిరుపతి నుంచి తెల్లవారుజామునే బయల్దేరి తలకోనకు వెళ్ళాం. ఒక్కొక్కరి వీపుమీద దాదాపు ఇరవై కిలోల బరువుతో కొండపైకి నడక మొదలు పెట్టాం. రాష్ట్రంలోనే అతిపెద్ద జలపాతమైన తలకోన అందాలను, ఆ జలపాత సోయగాలను వీక్షిస్తూ ఆ కొండ కొసకు చేరాం. ఉదయం తొమ్మిదైంది. అప్పుడు కానీ మాకు సూర్యదర్శనం కాలేదు. అలా అడవిలో నాలుగు గంటలు నడిచాక మాకు అడ్డంగా ప్రవహిస్తున్న ఏరు కనిపించింది. ఆ ఏరు ప్రవాహానికి ఎదురుగా వెళితే తాంబేలేరు కనిపించింది. కొండపైన అంత ఎత్తులో ఎంతో స్వచ్ఛమైన నీళ్లు.! ఇక నేరుగా యుద్ధగళ తీర్థానికి వెళ్లాం. బొట్లు బొట్లుగా.. యుద్ధగళ యుద్ధగళ తీర్థంలో శ్రీవేంకటేశ్వర స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ గీసిన హనుమంతుడి బొమ్మలు చూశాం. ఆ రాత్రికి అక్కడే బసచేశాం. అడవిన కాసిన వెన్నెలను మేం తనివితీరా అనుభవించాం. మర్నాడు యుద్ధగళ తీర్థం దిగువున ఉన్న విష్ణుగుండంలోకి దిగాం. ఎనిమిది వందల మీటర్ల లోపలికి తాడు సాయంతో కిందకు దిగాం. అదొక గొప్ప అనుభూతి. మధ్యాహ్నం యుద్ధగళ తీర్థం సమీపంలో పెట్రోగ్లిఫ్లుగా పిలిచే చిత్రాలను పెద్ద బండపై ఉలితో చెక్కి ఉండడాన్ని చూశాం. ఆ చిత్రాలను ఎన్నో సామాజిక, సాంస్కతిక, మార్మిక అంశాలను పొందపరిచారు. ఉరకడానికి సిద్ధంగా ఉన్న రెండు ఆంబోతులు, ఒక గణాచారి ఈ చిత్రసంచయానికి హైలైట్. ఈ చిత్రాలపై పూర్తిస్థాయిలో పురావస్తు శాస్త్ర పరిశీలన జరగాల్సి ఉంది. పరిశోధన జరిగితే అదిమానవునికి సంబంధించిన ఆనవాళ్లు మరిన్ని బయటపడచ్చు. సాయంత్రం తిరిగి మడుగు వద్దకు వచ్చాం. యుద్ధగళ అసలు పేరు రుద్రగళ. ఆ తీర్థంలో రాత్రి నిద్రించినప్పుడు అందులో బొట్లు బొట్లుగా పడే నీళ్లు యుద్ధ శబ్దాలను తలపించేటట్టు ఉంటాయి. అందుకే ఈ తీర్థానికి యుద్ధగళ అని పేరొచ్చింది. మూడేర్ల కురవ.. కంగుమడుగు కంగుమడుగుకు సమీపంలో మూడేర్ల కురవ అనే ఏరు ఉంది. మూడు ప్రాంతాల నుంచి వచ్చే ఏర్లు కలిసి ప్రవహించడం వల్ల దీనికా పేరొచ్చింది. మరుసటి రోజు కంగు మడుగుకు ప్రయాణమయ్యాం. కంగు మడుగు పెద్ద ఏరు. ఏనుగులు నీటి కోసం, జలకాలాడటం కోసం వస్తాయి. కనుకే ఏనుగుల రాకను గమనిస్తూ ఉండాలి. అవి వచ్చి పడ్డాయంటే, తప్పించుకోవడం కష్టమే. ఇక్కడ ఏనుగులు సంచరించిన ఆనవాళ్లను గమనించాం. ఇక్కడ అటవీ శాఖ వారి బేస్ క్యాంప్ కూడా ఉంది. ఆ రాత్రి కంగుమడుగు ప్రాంతంలోనే బస చేశాం. తెల్లని వెన్నెల్లో.. అరిమాను బండలు మరుసటి రోజు ఉదయమే మళ్లీ మా నడక. మ«ధ్యాహ్నానికి అరిమాను బండలకు చేరుకోగలిగాం. అదొక ఎత్తైన ప్రదేశం. పౌర్ణమికి సరిగ్గా రెండు రోజులు ముందు కావడంతో ఆ రాత్రి చందమామ కురిపించే తెల్లని వెన్నెల ఎంత చల్లగా ఉందో. మరుసటి రోజు అరిమాను బండ కింద నుంచి గద్దలపీతుగుండం వెళ్లాం. ఇక్కడ కొన్ని గద్దలు సంచరించడం మాకు కనిపించింది. ఈ గుండానికి రెండు కిలోమీటర్ల దూరంలో మరో అద్బుతమైన సుందర ప్రదేశం బూడిదపునుకు. ఇది రమణీమైన గుండం. లేలేత సూర్యకిరణాలు నీటిని తాకుతున్న సుందర దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఆదిమానవుడు గీసిన చిత్రాలు ఇక్కడ కూడా చరిత్ర పూర్వయుగం నాటి ఆదిమానవుడు గీసిన చిత్రాలు ఉన్నాయి. అనంతరం ఓ నాలుగు వందల మీటర్ల దూరాన్ని చిన్న కొండల మధ్య నడిచాం. అక్కడ ఓ చిత్రం మా కంటపడింది. అది ఆదిమానవులకు సంబంధించిన ఆనవాళ్లను తెలియజేసేది. జంతువులను వేటాతున్న మహిళల చిత్రం చూసి అబ్బుర పడ్డాం. సాయంత్రం ఆరిమానుబండకు తిరిగి వచ్చాం. రాత్రి అక్కడే బస చేశాం. నీటి మడుగుల్లో దీపాలు మా అడవి యాత్రలో ప్రయాణం ఆఖరి ఘట్టానికి చేరింది. బూడిదపునుకు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రమరెడ్డి మడుగుకు మరుసటి రోజు నడక ప్రారంభించాం. ఆ రోజంతా అక్కడే గడిపాం. అక్కడ దగ్గర దగ్గరగానే రెండు మడుగులున్నాయి. ఆ రోజు పున్నమి. మడుగులను దీపాలతో అలంకరించాం. ఆ దీపాల ప్రతిబింబాలతో మడుగులు చూడచక్కగా ఉన్నాయి. కళ్లార్పకుండా ఎంత సేపైనా చూడాలనిపించేంత అద్భుతంగా వెలుగొందాయి. పౌర్ణమి రాత్రి నీటిలో దాదాపు మూడు గంటల పాటు తనివితీరా గడిపాం. మా యాత్రలో ఆ చివరి రాత్రి ఎర్రమరెడ్డి మడుగు వద్దే గడిచింది. మరునాడు సోమవారం ఉదయం అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లా కుక్కల దొడ్డికి చేరుకున్నాం.’ అని ముగించాడు అభినయ్. జీవవైవిధ్యం అన్ని సదుపాయాలూ ఉన్న నగరాలను, కాంక్రీటు వనాలను వదిలి అచ్చమైన, స్వచ్ఛమైన అడవిలోకి నడుచుకుంటూ వెళ్లి వారం రోజుల పాటు ఉండటం గొప్ప అనుభూతి. ప్రకృతితో లీనమైపోవడం, ప్రకృతిపైన ప్రేమను పెంచుకోవడం, అడవి అంటే ఇష్టం పెంచుకోవడం, అడవులను కాపాడాలన్న భావన కలిగించుకోవడం స్వయంగా అనుభూతించాం. మానవ మనుగడకు అడవుల రక్షణ, వాటిలోని జంతుజాలం రక్షణ ఎంతగా ఉపకరిస్తాయో స్వయంగా తెలుసుకున్నాం. – భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి -
29 ఏళ్లకే నూరేళ్లు నిండిన ప్రేమ
న్యూఢిల్లీ : లండన్లో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న 29 ఏళ్ల హన్నా లోవ్కు పర్వత శిఖరాగ్రాలపై విహరించడమంటే ఇంతో ఇష్టం. అందుకోసం చిన్నప్పటి నుంచే కొండలు ఎక్కడం, దిగడంపై శిక్షణ కూడా తీసుకున్నారు. ఆమెకు ఆడమ్ స్టనావే అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. ఆయనకు కూడా కొండ కోనల్లో విహరించడం అంటే ఎంతో సరదా. అందుకనే ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చారు. మొన్న సోమవారం నాడు ఇద్దరు కలిసి డెర్బ్శైర్లోని కిండర్ డౌన్ఫాల్కు వెళ్లారు. వారీ పర్యటనకు మరో విశేషం కూడా ఉంది. తెల్లవారితో మంగళవారం నాడు ఆడమ్కు 30 ఏళ్లు వస్తాయి. అతని పుట్టిన రోజును కొండల మధ్యనే జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. స్వఫోర్డ్శైర్లోని ఎట్టెక్సటర్కు చెందిన హన్నా లోవ్ తన తల్లి, సోదరిని కూడా తీసుకెళ్లారు. కొండపై ఓ స్థానంలో తల్లి, సోదరి విశ్రాంతి తీసుకుంటుండగా, లోవ్, ఆడమ్తో కలిసి పర్వతం అంచు వరకు వెళ్లారు. ఇప్పటి వరకు తాము గడిపిన జీవితం చాలా చాలా ఆనందంగా ఉందని, త్వరలో పెళ్లి చేసుకొని ఇంతకంటే ఎక్కువ ఆనందంగా గడపాలని బాసలు చేసుకున్నారు. అందుకు ఓ చిన్నపాటి ఇల్లును కూడా కొనుగోలు చేయాలనుకున్నారు. అందుకు ఎవరి వద్ద ఎంత డబ్బుందో లెక్కలు వేసుకున్నారు. బ్యాంకు నుంచి ఎంత రుణం అవసరం పడుతుందో కూడా అంచనా వేశారు. ఆ తర్వాత దిగువన కనిపిస్తున్న చిన్న వాటర్ ఫాల్ పై నుంచి అంచుల వరకు వెళ్లారు. ప్రకృతి అందాలను తిలకిస్తూ పక్కకు యథాలాపంగా అడుగేసిన హన్నా కాలుజారి లోయలోకి పడిపోయారు. తక్షణమే ఆడమ్ స్పందించినప్పటికీ లాభం లేకపోయింది. అమెను వెనక నుంచి పట్టుకోబోతే ఆమె భుజానున్న బ్యాగ్ అంచు తగిలిందని, పట్టు దొరకలేదని ఆడమ్ తెలిపారు. తాను కేకలు వేస్తు హన్నా తల్లిని, చెల్లెని తీసుకొని కిందకు వెళ్లికి చూడగా అప్పటికే హన్నా ప్రాణం పోయింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న లండన్ పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగానే కేసు నమోదు చేసుకున్నారు. పర్వతారోహరణలో ఎంత అనుభవం ఉన్నా చిన్న పొరపాటుకు ప్రాణాలు పోతాయి. -
కిలిమంజారో అధిరోహించిన పుణే బుడతడు
న్యూఢిల్లీ : పర్వతారోహణ అనేది ఎంత కష్టమైనదో అందరికి తెలిసిందే. ఈ సాహసం చేసే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రాణాలతో బయట పడతామో లేదో తెలియని పరిస్థితులు ఉంటాయి. అలాంటింది.. పుణేకు చెందిన తొమ్మిదేళ్ల అద్వైత్ ఇవేమీ లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నాడు. తాజాగా ఆఫ్రికాలోనే అత్యంత ఎతైన కిలిమంజారో పర్వతాన్ని అద్వైత్ అధిరోహించాడు. ఈ పర్వతం సుమద్ర మట్టానికి 19,341 ఫీట్ల ఎత్తులో ఉన్న సంగతి తెలిసిందే. తన ట్రైనర్ సమీర్ సారథ్యంలో అద్విత్ జూలై 31వ తేదీన ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అద్వైత్ మాట్లాడుతూ.. ‘పర్వతారోహణ అనేది చాలా కష్టమైనది.. కానీ చాలా సరదాగా కూడా ఉంటుంది. ట్రెక్కింగ్ చేసేటప్పడు గొప్ప అనుభూతి కలుగుతుంది. నేను చాలా త్వరగా ట్రెక్కింగ్ పూర్తి చేయాలనుకున్నాను. కానీ పర్వతాల్లో ఉన్న అందాలను చూడటానికి నేను చాలా సార్లు విరామం తీసుకున్నాను. పైకి వెళ్లే కొద్ది ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. అలాగే ఉష్ణోగ్రతలు మైనస్లలో ఉంటాయి. అలాగే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుంద’ని తెలిపాడు. అయితే అద్వైత్ తనకు ఆరేళ్లున్నప్పుడే(2016లో) ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. ఏడు రోజుల్లోనే ఆ ఘనత సాధించాడు. అలాగే వచ్చే ఏడాది యూరప్లో ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించేందుకు అద్వైత్ సిద్దమవుతున్నాడు. అద్వైత్ సాధించిన ఘనతపై అతని తల్లి పాయల్ ఆనందం వ్యక్తం చేశారు. అద్వైత్ను చూస్తే గర్వంగా ఉందని అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి అద్విత్ రెండు నెలల పాటు కఠిన శిక్షణ తీసుకున్నాడు. అద్వైత్ దినచర్య విషయానికి వస్తే.. రోజు గంటపాటు స్విమ్మింగ్ చేస్తాడు. మరో గంట పాటు ఫుట్బాల్, క్రికెట్, టెన్నిస్ ఆడతాడు. ఆ తర్వాత గంటపాటు ఆర్మీ జవాన్ల చేసే విన్యాసాలు చేస్తాడు. అద్వైత్కు ఉన్న పట్టుదల చూస్తే గర్వంగా ఉంది. పర్వతారోహణ చివరి రోజు అద్విత్ చాలా ఉద్వేగానికి లోనయ్యాడు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడ’ని చెప్పారు. -
శిఖరాన చేనేత
చేనేత గొప్పతనాన్ని శిఖరస్థాయికి తీసుకెళ్లేందుకు చీరలు, చేనేత వస్త్రాలు ధరించి ఆస్ట్రేలియాలోని కొసియోస్కో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి వచ్చిన ఈ ఐదుగురు పర్వతారోహకులు.. చేనేత కార్మికుల దైనందిన జీవన సాహస యాత్రలో పోలిస్తే తమదసలు కష్టమే కాదని అంటున్నారు. ట్రెకింగ్, మౌంటెనీరింగ్.. సాహసక్రీడలు. మగవాళ్లు వాటిని హాబీగా మలుచుకుంటే హీరోలుగా అభివర్ణిస్తుంది లోకం. మహిళలు ట్రాక్సూట్ వేసుకుంటే ‘ఇదేం పోకడ’ అంటూ పెదవి విరుస్తుంది. అదీ పెళ్లయి, పిల్లలు పుట్టాక ఈ అభిరుచికి ప్రాక్టికల్ రూపమిస్తామంటే హవ్వ అంటూ బుగ్గలు నొక్కకుంటుంది. ఇవన్నీ ఎదుర్కొన్నారు వీళ్లు. లక్షల్లో డబ్బునూ ఖర్చుపెట్టుకున్నారు. ట్రాక్సూట్ కాదు.. చీరకుచ్చిళ్లను బొడ్లో దోపుకొని మరీ 7,310 అడుగుల ఎత్తున్న కొసియోస్కో పర్వతాన్ని అధిరోహించారు. సరదా కోసం కాదు. తెలుగు నేతకు చేయూతనివ్వడానికి! మన చేనేత గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి! ‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ.. టాప్ ఆఫ్ మౌంట్ కొసియోస్కో’ థీమ్తో జరిగిన ఈ అధిరోహణలో రాజీ, లావణ్య, సృజన, హసిత, సమన్యు పాల్గొన్నారు. ఈ టీమ్లో అందరికన్నా చిన్నవాడు సమన్యు. ఏడేళ్లు. పిన్న వయసు పర్వతారోహకుడిగానూ (కిలిమంజారో) వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఒకరికి ఒకరు ఎలా పరిచయం? ఈ బృందానికి నాయకత్వం వహించిన రాజీ ప్రొఫెషనల్ మౌంటెనీర్. ఈమె చిన్ననాటి స్నేహితురాలే లావణ్య. ఉన్నత చదువులు, పెళ్లితో ఈ ఇద్దరి దారులు వేరయ్యారు. కూతురి కోసం తనూ పర్వతారోహకురాలిగా మారిన లావణ్య మౌంటెనీరింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చిన్నప్పటి ఫ్రెండ్ రాజీని కలుసుకుంది. జీవితంలోని మంచిచెడ్డలతోపాటు మౌంటెనీరింగ్ గురించీ మాట్లాడుకున్నారు. పెళ్లి, పిల్లలతో ఒళ్లుచేసిన తాను మౌంటెనీ రింగ్ చేయగలనా అన్న లావణ్య సందేహాన్ని పటాపంచలు చేస్తూ ధైర్యాన్నిచ్చింది రాజీ. అంతకుముందే ఇతర పర్వతారోహణలో సృజనతో పరిచయం ఉంది రాజీకి. అలా వీళ్లంతా ఒక ఫ్యామిలీలా మౌంటెనీరింగ్ స్టార్ట్ చేశారు. ఆ టైమ్లోనే వీవర్స్ కష్టనష్టాల గురించి విన్నది రాజీ. వాళ్లకు ఏదైనా సాయం చేయాలనుకుంది. లావణ్య, సృజనలతో చెప్పింది. అందరూ కలిసి సిద్దిపేట, నారాయణ్పేట, గద్వాల, పొచంపల్లి వెళ్లారు. గ్రౌండ్ వర్క్ చేశారు. నేయడమూ నేర్చుకున్నారు. రాజీ అయితే ఓ డాక్యుమెంటరీ కూడా తీసింది. ఈ నాలుగు ప్రాంతాలకు ప్రాతినిధ్యంగా నలుగురు నాలుగు చీరలను తీసుకున్నారు. రాజీ, లావణ్య, సృజన చీరలు కట్టుకుంటే గద్వాల చీరను మ్యాక్సిలా హసితకు, పోచంపల్లి కుర్తాను సమన్యుకి కుట్టించారు. దేశం హద్దులు దాటి ప్రపంచ పర్వతాల మీద ఈ నేతను రెపరెపలాడించాలనుకుని ఆస్ట్రేలియాలోని కొసియోస్కొ పర్వతం అధిరోహించారు. మామూలుగా ట్రాక్ సూట్లో అయితే ఆరుగంటల్లో ఎక్కి దిగొచ్చు ఈ పర్వతాన్ని. చీరలో కాబట్టి వీళ్లకు పదిగంటలు పట్టింది. భవిష్యత్లోనూ దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. చీరలు కట్టుకుని పర్వతం ఎక్కిన ప్పుడు ఫారిన్ మౌంటెనీర్స్ వీళ్లను ఆసక్తిగా గమనించి, దగ్గరకు వచ్చి ఆ చీరల గురించి, ఫ్యాబ్రిక్ గురించి, అవి ఎక్కడ దొరుకుతాయో అడిగి మరీ తెలుసుకున్నారట. అలా తమ మోటో, పర్పస్ సర్వైవ్ అయింది అంటున్నారు రాజీ. ‘‘యాక్చువల్గా యూత్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ను బిల్డప్ చేయడానికి మౌంటెనీరింగ్ను ప్రమోట్ చేస్తున్నాం. దాంతోపాటు చేనేతనూ థీమ్గా తీసుకున్నాం. యువత చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతోంది. ఆత్మహత్య దాకా వెళ్తోంది. ఆ టెండెన్సీని పోగొట్టి వాళ్లలో ధైర్యం నింపాలన్నదే మా లక్ష్యం. మౌంటెనీరింగ్ వల్ల.. మనకున్న సమస్యలు చాలా చిన్నగా కనిపిస్తాయి. వీటిని మనం ఇంత పెద్దగా చూస్తున్నాం అనిపిస్తుంది. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఉండే గుణం అలవడుతుంది. ముందసలు ‘వాట్ పీపుల్ విల్ సే’ అన్న థాట్కే చెక్ పెట్టే అటిట్యూడ్ అలవడుతుంది. దీనివల్ల లైఫ్లో ఎన్ని హర్డిల్స్ వచ్చినా గాభరాపడం. చాలెంజ్గాతీసుకుంటాం. స్పోర్టివ్గా ఉంటాం. ఇది మేం ఎక్స్పీరియెన్స్ అవుతున్నాం కూడా! మౌంటెనీ రింగ్లో విమెన్కు స్పెషల్ చాలెంజెస్ ఉంటాయి. ఎక్కడపడితే అక్కడ వాష్ రూమ్స్ ఉండవు. మెన్స్ట్రు వల్ సైకిల్ ఉంటుంది. ఇలాంటి ఆడ్ సిట్యువేషన్స్ అన్నిటినీ తట్టుకునే శక్తిని అలవాటు చేస్తాయి. షైని తగ్గించి కలివిడితనాన్ని పెంచుతాయి. మొత్తంగా స్ట్రాంగ్ అండ్ స్టబర్స్ పర్సనాలిటీ తయారవుతుంది’’ అంటారు రాజీ. మంచి షెఫ్ని అవుతా రాజీ ఆంటీ వాళ్లు ట్రెడిషనల్ క్యాస్టూమ్స్ వేసుకొని కొసియోస్కో వెళ్దామని చెప్పినప్పుడు అబ్బా... ఎందుకు అనిపించింది. కాని వాళ్లతోపాటు వీవర్స్ దగ్గరకు వెళ్లి డే టు డే లైఫ్లో వాళ్లు ఫేస్ చేస్తున్న హర్డిల్స్ చూసినప్పుడు వాళ్లకోసం ఏదైనా చేయాలనిపించింది. బేసిగ్గా నేను క్లాసికల్ డ్యాన్సర్ని. మౌంటెనీరింగ్ కంటే కూడా డ్యాన్స్, కుకింగ్ అంటే ఎక్కువ ఇష్టం. పెద్దయ్యాక మంచి షెఫ్ కావాలనుకుంటున్నా. ఆస్ట్రేలియాలో కొసియోస్కో దగ్గర రెస్టారెంట్ పెట్టాలనుంది. అక్కడ గైడ్తో మాట్లాడేసుకున్నా కూడా (నవ్వుతూ). – హసిత నాన్న డ్యాన్స్ చేశారు అక్క, అమ్మ వాళ్లతో ఫస్ట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు వెళ్లా. తర్వాత రాజీ ఆంటీతో కిలిమంజారో ఎక్కాను. కిలిమంజారో ఎక్కిన అందరికన్నా యంగెస్ట్ కిడ్ నేనే అని తర్వాత తెలిసింది నాకు. స్కూల్లో నా ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఫీలయ్యారు – పేపర్లో నీ పేరు వస్తుందిరా అని. టీచర్స్ క్లాప్స్ కొట్టించారు. నాన్నేమో ఎయిర్పోర్ట్లోనే డ్యాన్స్ చేసేశాడు. తాతయ్యేమో ఫైవ్ థౌజెండ్ పెట్టి సైకిల్ కొనిచ్చారు. కొసియోస్కో ఎక్కేప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశా. పెద్దయ్యాక కూడా మౌంటెనీరింగ్ కంటిన్యూ చేస్తా. – సమన్యూ నమ్మినదాని మీద ఎఫర్ట్స్ పెట్టాలి నేను ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ని.అరుణిమ సిన్హా (కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కిన పర్వతారోహకురాలు) ఇన్స్పిరేషన్తో మౌంటెనీర్నయ్యా. పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. హ్యాండ్లూమ్స్ ప్రమోషన్ కోసం చీరలతో మౌంటెనీరింగ్ చేద్దామన్న రాజీ థాట్ నచ్చడంతో ఆస్ట్రేలియా కొసియోస్కో ప్లాన్ చేసుకున్నాం. సక్సెస్ అయ్యాం. మా ఈ టూర్ వల్ల చేనేత కార్మికుల జీవితాల్లో రాత్రికిరాత్రే మార్పు రాకపోవచ్చు. కాని వాళ్ల కళను, కష్టాన్ని ప్రపంచానికి చాటామన్న సంతృప్తి మిగిలింది. మౌంటెనీరింగ్. ఇంజనీరింగ్ చదివి జాబ్ చేయకుండా కొండలు గుట్టలు పట్టుకు తిరుగు తోందని తెలిసినవాళ్లు చాలా కామెంట్సే చేస్తుంటారు. పెళ్లి చేయకుండా ఏంటీ ఇదంతా అని మా పేరెంట్స్ మీదా ప్రెజర్ ఉంటోంది. విని నవ్వుకోవడమే. లిజన్ టు యువర్ సెల్ఫ్ డోంట్ లిజన్ టు సొసైటీ.. మౌంటెనీరింగ్ నేర్పిన లెసన్, పెరిగిన సెల్ప్ కాన్ఫిడెన్స్ ఇది. – సృజన మా పాప వల్లే..! నేను, మావారు ఇద్దరం బిజినెస్ ఫీల్డ్లోనే ఉన్నాం. నిజానికి మౌంటెనీరింగ్ వంటివన్నీ నా కప్ ఆఫ్ టీ కాదు. మా అమ్మాయి (హసిత)కి తోడుగా మౌంటెనీరింగ్కి వెళ్లాల్సి వచ్చింది. మౌంటెనీరింగ్ కోసం ట్రైనింగ్ తీసుకోవడానికి ఇన్స్టిట్యూట్కి మాతో పాటు మా బాబునూ (సమన్యు) తీసుకెళ్లేదాన్ని. వాడూ ఇంట్రెస్ట్ చూపడంతో ఫిట్నెస్ టెస్ట్ చేశారు. అట్లా మావారు తప్పించి మా ఫ్యామిలీ అంతా మౌంటెనీరింగ్ స్టార్ట్ చేశాం (నవ్వుతూ). మా ఫస్ట్ ఎక్స్పీరియెన్స్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్. తర్వాత కిలిమంజారో ఎక్కాం. మా పాప వల్ల వచ్చి ఇలా కంటిన్యూ అవుతున్నా. దీనివల్ల కనిపించే ప్రాఫిట్ ఏమీ ఉండదు. పైనుంచి ఖర్చు. కాబట్టి చూసేవాళ్లకు ఇదంతా పిచ్చిగానే అనిపిస్తోంది. కాని మౌంటెనీరింగ్ వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ వేరు. దేన్నయినా ఎదర్కోగలమనే ధైర్యం వచ్చింది. ఫిట్నెస్ పెరిగింది. మొన్న ట్రిప్లోనే ఎయిట్ కేజెస్ తగ్గా. – లావణ్య వీవర్స్ ముందు మనమెంత? మా తమ్ముడు భరత్ మౌంటెనీర్. నాకు అక్రోఫోబియా (ఫియర్ ఫర్ హైట్స్). ఒకసారి తమ్ముడితో కలిసి మౌంటెనీరింగ్కు వెళ్లా. హైట్స్ æ భయం పోయి అప్పటి నుంచి నాకూ మౌంటెనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది.అంతకుముందు కార్పొరేట్ ఫీల్డ్లో వర్క్ చేసేదాన్ని. ఫైవ్ ఇయర్స్ కిందట మౌంటెనీర్గా జర్నీ స్టార్ట్ చేశా. ఆడపిల్లలు కూడా ఇండిపెండెంట్గా ఉండాలని అలాగే పెంచారు మా నాన్న. మా సొంతూరు కర్నూలు. ఎక్స్పోజర్ ఉండాలని నన్ను హైదరాబాద్లో, హాస్టల్లో ఉంచి చదివించారు నాన్న. లోకజ్ఞానం వచ్చేవరకే ఆయన నన్ను హాస్టల్లో దింపడం, హాలిడేస్లో తీసుకెళ్లడం చేశారు. తర్వాత నుంచి నన్నే రమ్మనేవారు. అలా చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్గా ఉండడం అలవాటు చేశారు. కాబట్టి నా మౌంటెనీరింగ్ పట్లా అభ్యంతరమేమీ లేదు వాళ్లకు. అత్తింట్లో కూడా అబ్జెక్షన్స్ లేవు. మావారు ఎంకరేజ్ చేశారు. నేను బయటిదేశాలకు వెళితే బాబునూ చూసుకుంటారు. చుట్టాలు, బయటి వాళ్ల నుంచే కామెంట్స్ తప్ప ఇంట్లో వాళ్లందరూ ఫుల్ సపోర్టే. – రాజీ -
ఐఐటీ విద్యార్థులు క్షేమం
సిమ్లా/సాక్షి ప్రతినిధి, చెన్నై: హిమాచల్ప్రదేశ్లో ట్రెక్కింగ్కు వెళ్లి అనూహ్యంగా చిక్కుకుపోయిన రూర్కీ ఐఐటీ విద్యార్థులను సైన్యం సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. వీరితోపాటు తమిళనాడుకు చెందిన 33 మంది విద్యార్థులు, 29 మంది ఉపాధ్యాయులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఐఐటీ రూర్కీకి చెందిన 45 మంది ఐఐటీ విద్యార్థులు రొహ్తంగ్ కనుమల్లో ట్రెక్కింగ్ కోసం రెండురోజుల క్రితం వచ్చారు. మంచు కురుస్తుండటంతో ట్రెక్కింగ్కు వెళ్లిన కొండ ప్రాంతంలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న లాహౌల్– స్పిటి జిల్లా అధికారులు విద్యార్థులతోపాటు సుమారు 500 మందిని మంగళవారం సురక్షిత ప్రాంతానికి తరలించి, వసతి కల్పించారు. ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు రంగంలోకి దిగిన సైన్యం హెలికాప్టర్ల దారా వారిని బయటకు తీసుకువచ్చింది. తమిళనాడులోని వివిధ ప్రైవేటు పాఠశాలలకు చెందిన 33 మంది విద్యార్థులు, 29 మంది టీచర్లు మనాలిలో సురక్షితంగా ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. మంచు కురుస్తుండటంతో లాహౌల్– స్పిటి జిల్లా కేంద్రం కీలాంగ్లో అత్యల్పంగా 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాలతో అతలాకుతలమవుతున్న హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి మంగళవారం కాస్త మెరుగైంది. వరదలతో రూ.1,200 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం జైరాం ఠాకూర్ తెలిపారు. -
మృత్యుంజయురాలు.. చదవాల్సిన కథనం
బ్రిస్బేన్: కొండ మీది నుంచి లోయలోకి పడ్డా.. ఆమెకు నూకలు మాత్రం చెల్లిపోలేదు. ఆరో రోజులు మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు ప్రాణాలతో బయటపడింది. గురువారం ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్ రాష్ట్రంలో ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన జోహీ హాన్(25) గత గురువారం క్వీన్స్ల్యాండ్లో టల్లీ పట్టణానికి వెళ్లారు. అక్కడి నుంచి తన స్నేహితురాలికి ఫోన్ చేసిన ఆమె.. కెర్నిస్ అటవీ ప్రాంతంలోని టైసన్ పర్వతంపైకి ట్రెక్కింగ్కు వెళ్తున్నట్లు చెప్పారు. అయితే ఆ తర్వాత ఆమె జాడ లేకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైన్యం హెలికాఫ్టర్ సాయంతో అధికారులు గాలింపు చేపట్టారు. అయినా లాభం లేకపోయింది. శనివారం అటవీ మార్గం గుండా వెళ్తున్న కొందరికి దూరంగా సాయం చేయాలన్న కేకలు వినిపించాయి. అయితే వారు పోలీసులకు సమాచారం అందించేసరికి కాస్త ఆలస్యమైంది. తిరిగి ఏరియల్ సర్వే ద్వారా గాలింపు చేపట్టిన అధికారులు.. ఎట్టకేలకు జలపాతం దగ్గర ఆమెను గుర్తించి రక్షించారు. టల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించగా, ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె డీహైడ్రేషన్తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. కొమ్మల్లో చిక్కుకుని... కొండ మీద ఉన్న ఓ రాయిపై నిల్చుని ఫోటో తీసుకునే సమయంలో ఆమె కిందపడినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ కింద ఉన్న రాక్సీ జలపాతం చెట్ల భాగంలో ఆమె చిక్కుకుపోయారు. అలా కొన్ని గంటలు స్పృహ లేకుండా పడి ఉన్న ఆమె.. మేలుకువ రాగానే కిందకు దిగి సాయం కోసం కేకలు వేయటం ప్రారంభించారు. అప్పటికే పూర్తిగా నీరసించిన ఆమె అక్కడే కుప్పకూలిపోయారు. పైన హెలికాఫ్టర్ శబ్ధం విన్న ఆమె కింద ఉన్న ఇసుక తిన్నెలపై రక్షించాలంటూ రాతలు రాశారు. అయితే అవి సైన్యం కంటపడలేదు. చివరకు శక్తిని కూడగట్టుకుని ఆమె వేసిన కేకలు స్థానికుల చెవిన పడటంతో ప్రాణాలతో ఆమె బయటపడగలిగారు. -
సాహో..‘సమన్యు’
కర్నూలు (గాయత్రీ ఎస్టేట్): ఈ బుడతని పేరు సమన్యు యాదవ్. వయసు ఏడేళ్లు. చదివేది మూడో తరగతి. ఇందులో ప్రత్యేకత ఏముందనుకుంటున్నారా? ఉంది మరి..ఈ బాలుడు అతి చిన్నవయసులోనే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. అంతేకాదు ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. కర్నూలు నగరం బాలాజీనగర్కు చెందిన లావణ్య, కృష్ణకాంత్ దంపతులు. కృష్ణకాంత్ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఉద్యోగి కాగా లావణ్య గృహిణి. వీరికి హసిత, సమన్యుయాదవ్ సంతానం. సమన్యు సికింద్రాబాద్లోని బోల్టన్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. హసిత మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు వెళ్లేందుకు ఫిట్నెస్ పరీక్షలో ఎంపికైంది. హసిత శిక్షణకు వెళుతుంటే ఆమెతో పాటు అక్కడికి వెళ్లిన క్రమంలో సమన్యు ట్రెక్కింగ్పై ఆసక్తి పెంచుకున్నాడు. తాను కూడా ఎవరెస్టు ఎక్కడానికి వెళతానని మారాం చేయడంతో నిపుణులు సమన్యు ఫిట్నెస్ను పరీక్షించారు. మిగతావారి కన్నా సమన్యు అతివేగంగా వ్యాయామాలు చేస్తుండటాన్ని గమనించిన ఫిట్నెస్ నిపుణులు ఈ బుడతడి ఉత్సాహాన్ని చూసి ఎవరెస్ట్ బేస్ క్యాంపు వెళ్లడానికి అనుమతినిచ్చారు. 45 రోజుల శిక్షణ అనంతరం సమన్యు సాహసయాత్రకు బయలుదేరి మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించాడు. మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన స్ఫూర్తితోనే సమన్యు కిలిమంజారో పర్వతారోహణకు గత నెల 17న హైదరాబాద్ నుంచి బయలుదేరి 29న కిలిమంజారోను అధిరోహించడం ఆరంభించాడు. ఈనెల 2న ఉదయం 11:52 గంటలకు (5,380 మీటర్ల) లక్ష్యాన్ని పూర్తి చేసి గిన్నిస్బుక్ రికార్డు నెలకొల్పాడు. కిలిమంజారో అధిరోహించిన అతి పిన్న వయసు వారిలో గతంలో 2,824 రోజుల వయసున్న క్యాష్ అనే బాలుడు (అమెరికా) ఉండగా, ఈ పర్వతం అధిరోహించేనాటికి సమన్యు వయసు 2,821 రోజులు. మూడు రోజుల వయసు తక్కువగా ఉండటంతో గత రికార్డును సమన్యు అధిగ మించి సరికొత్త రికార్డు నెలకొల్పి చరిత్రపుటల్లోకెక్కాడు. -
వీరి చావుకి కారణం ఎవరు?
తేని జిల్లా బోడినాయకనూరు కురంగని కొండల్లో రేగిన కార్చిచ్చు ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం నాటికి పది మంది మృతి చెందగా మదురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈరోడ్కు చెందిన దివ్య (25) మంగళవారం ఉదయం ప్రాణాలు విడిచింది. దివ్య భర్త వివేక్ ఇదే కార్చిచ్చులో సోమవారమే మృతి చెందాడు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని ఎవరు కదిలించినా కన్నీటి గాథను చెబుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇద్దరు చిన్నారులు సహా 36 మంది కురంగని కొండల్లో ట్రెక్కింగ్ నిర్వహిస్తూ కార్చిచ్చులో చిక్కుకున్న సంగతి పాఠకులకు విధితమే. అగ్నికీలలకు ఆహుతైన వారంతా ఐటీ ఉద్యోగులు, ఉన్నత చదువులు చదివినవారు, కొత్తగా పెళ్లయిన దంపతులు కావడం విచారకరం. కన్యాకుమారి జిల్లాకు చెందిన విపిన్ (30) చెన్నైలోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగి. తన సహోద్యోగిని దివ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇరువురు ఈ ప్రమాదంలో మృతిచెందారు. కడలూరు జిల్లాకు చెందిన శుభ (28) చెన్నై షోళింగనల్లూరులోని ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. అన్నాడీఎంకేకు చెందిన ప్రముఖ నేత కుమార్తె శుభ తన స్నేహితురాలు అఖిల ట్రెక్కింగ్కు వెళ్లడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే వెంటవెళ్లి అఖిలతోపాటు ప్రాణాలు కోల్పోయింది.. మదురై జిల్లాకు చెందిన హేమలత (30) ఒక హెచ్ఆర్ కంపెనీ ఉద్యోగిని. చెన్నై వేలాచ్చేరిలోని ఒక ఐటీ సంస్థ ఉద్యోగిని చెంగల్పట్టు జిల్లాకు చెందిన పునిత (26) ప్రాణాలు కోల్పోయి, రెండేళ్ల ఏళ్ల క్రితమే వివాహం చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగైన భర్త బాలాజీకి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈరోడ్ జిల్లాకు చెందిన తమిళ్సెల్వన్ (26) చెన్నైలోని ఒక ప్రముఖ టైర్ల కంపెనీ ఉద్యోగి. ఈరోడ్ గౌతంపాడికి చెందిన వివేక్ (28) దుబాయ్లో పనిచేస్తుండగా, భార్య దివ్య (26)తో కలిసి ట్రెక్కింగ్ వెళ్లి ప్రాణాలు విడిచారు. వీరికి వివాహమై వందరోజులు మాత్రమేకాగా ఇంతలోనే వీరిద్దరికి నూరేళ్లు నిండిపోయాయి. కుంభకోణంకు చెందిన అఖిల (27) వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం. చెన్నై నంగనల్లూరులోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. చెన్నై హార్బర్లో పనిచేస్తున్న విరుదునగర్ జిల్లాకు చెందిన ప్రభాకరన్ (28), కొండలు ఎక్కడంలో శిక్షణ కూడా ఇస్తుంటాడు. చెన్నై వేలాచ్చేరికి చెందిన నిషా (20) చెన్నై మనపాక్కంలోని ఒక ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. కన్నీరు తెప్పించిన సంఘటనలు: సహాయక చర్యలు చేపట్టినవారి కళ్లను చెమర్చిన సంఘటనలు అనేకం ఎదురయ్యాయి. కురంగని పరిసరాలకు చెందిన 30 మంది కొండలు, గుట్టలు ఎక్కుతూ బాధితులను వెతుక్కుంటూ అందరికంటే ముందుగా బయలుదేరారు. కొండలోతుల్లో పడిపోయిన వారు ఆవేదనతో పెట్టిన కేకలను విని రక్షించారు. తీవ్రంగా గాయపడిన వారంతా ఒంటిపై గుడ్డలు సైతం కాలిపోయి దయనీయావస్థలో చిక్కుకుపోయారు. మరికొందరు దాహం దాహం అంటూ కేకలు వేయడం, ఎలాగైనా మా ప్రాణాలు కాపాడండి...నా పేరు వివేక్ అంటూ ఒక యువకుడు మూలగడం బా«ధాకరంగా మారింది. డోలీల్లో వస్తున్న తమ వారిని చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి. 108 అంబులెన్స్లు అక్కడి చేరుకోగా కాలిన గాయాలతో తీవ్రంగా రోదిస్తున్న క్షతగాత్రులను గుర్తించి కురంగని ప్రభుత్వ ఆస్పత్రులకు చేర్చారు. అయితే కాలిన గాయాలకు అత్యవసర చికిత్సకు అవసరమైన ఎస్ఎస్టీ అనే సిల్వర్ సల్పాడయోడిన్ అనే మందు ఆస్పత్రిలో లేదు. దీంతో మదురై, తేనీ జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రులకు కబురంపగా వారు కూడా లేదన్నారు. ఈ సమయంలో కేంద్రసహాయ బృందాలు వెంటతెచ్చిన మందులతో చికిత్స ప్రారంభించాల్సి వచ్చింది. అంతవరకు క్షతగాత్రులంతా బాధను తట్టుకోలేక రోదిస్తూ గడపడం సహాయక సిబ్బందిని కన్నీరుపెట్టించింది. అగ్నికీలలు చుట్టుకుంటున్న దశలో అటవీశాఖ వాచర్ బైటపడేమార్గం చూపుతూ ముందు వెళుతుండగా 12 మంది అతన్ని అనుసరించారు. అయితే చెన్నైకి చెందిన 24 మంది వాచర్ చూపుతున్న మార్గంలో వెళ్లకుండా స్వతంగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వేడిగాలులతో మంటలు సమీపించడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు కొండపై నుంచి లోతుల్లోకి దూకారు. దీని వల్ల తీవ్రంగా గాయపడడంతో కదల్లేక పోయారు. ఇంతలో మంటలు వారి ప్రాణాలను హరించివేశాయి. కాలినగాయాలతో విలవిలలాడుతున్న ఇద్దరు యువతుల ఒకరినొకరిని పట్టుకుని మనల్ని దేవుడే కాపాడాలని అని కన్నీరుకారుస్తుండగా హెలికాప్టర్ వచ్చి వారిపై ఎగరసాగింది. దీంతో సంతోషంతోపడిన వారిద్దరూ అదిగో దేవుడు వాహనం పంపాడని సహాయక సిబ్బంది ఆసరాతో హెలికాప్టర్ ఎక్కి సురక్షితంగా బైటపడ్డారు. ఈ విషయాలను వైమానికి సిబ్బందికి వారే చెప్పుకుని కృతజ్ఞతలు తెలిపారు. కురంగని ప్రమాదం సహాయక చర్యల్లో వైమానికదళం ప్రముఖ పాత్ర పోషించింది. పేరుకు తగ్గట్లుగా వాయువేగంతో సహాయక చర్యలు చేపట్టి పలువురి ప్రాణాలను కాపాడింది. కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యక్ష పర్యవేక్షణ సాగిస్తూ ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. అటవీ దొంగలే అగ్గికి కారణమా: కురంగని కొండల్లో అకస్మాత్తుగా అగ్గిపుట్టడం అటవీ దొంగల పనేనని అనుమానిస్తున్నారు. 11 మంది ప్రాణాలను బలిగొన్న కార్చిచ్చు ఎలా పుట్టింది, ప్రకృతిపరమైన సంఘటన లేక మరేదైనా కోణం ఉందాని ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలేక పోతోంది. అయితే అటవీ సంపదపై పూర్తి అవగాహన ఉన్న మాజీ అధికారులు, సామాజిక సేవకులు మాత్రం పలుకోణాల్లో అరాతీయడం ప్రారంభించారు. అటవీప్రాంతాల్లోని వృక్షాలను ఆయాశాఖ అధికారులు ప్రతిఏడాది లెక్కకడతారు. ఎక్కడైనా వృక్షాలు నరికివేసినట్లు కనపడితే అటవీ సిబ్బందిని విచారించి నష్టపరిహారాన్ని జీతాల నుంచి మినహాయిస్తారు. సిబ్బంది ఇచ్చే వివరణ సమంజసంగా ఉంటే సదరు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. అవినీతి, అక్రమమని తేలితే శాఖాపరమైన కఠిన శిక్షకు గురిచేస్తారు. ఇరుకుగా ఉంటే ప్రాంతాల్లో మూంగిల్ వృక్షాలు ఒకదానికి ఒకటి రాసుకుని అగ్గిపుట్టే అవకాశం ఉంది. అయితే కురంగని కొండల్లో మూగింల్ వృక్షాలు అతికొద్దిగా ఉన్నందున అగ్నిరాజుకునే అవకాశాలు చాలా తక్కువ. పశువులు మేపేవారు, నాటుసారా కాచేవారు, అసాంఘిక శక్తులు కొండల్లోకి వెళ్లి తమ అవసరాల కోసం నిప్పురాజేసే అవకాశం ఉంది. అడవుల్లోని పచ్చగడ్డిని పశువులు ఆహారానికి అధికారులు అనుమతిస్తుండగా, ఈసాకుతో అడవుల్లోకి వెళ్లి చెట్లను నరికి సొమ్ముచేసుకునే వారు కొందరు తయారయ్యారు. దీంతో పశువుల మేత కోసం అడవుల్లోకి వెళ్లడాన్ని అధికారులు నిషేధించారు. కేవలం పశువుల దాణా కోసం అడవుల్లోకి వెళ్లేవారు ఏ కారణం చేతనూ నిప్పురాజేయరని, దొంగతనంగా అటవీ సంపదను అమ్మి సొమ్ముచేసుకునే వ్యక్తులు అధికారుల దృష్టి మరల్చేందుకు నిప్పురాజేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అదే నిజమైతే అటవీ దొంగల స్వార్థం అమాయకుల ప్రాణాలను బలిగొందని అంటున్నారు. అటవీ కార్చిచ్చు ప్రకృతి ప్రకోపమా, అరాచక శక్తులు సృష్టించిన ప్రమాదమా విచారణ జరపాలని నటుడు సత్యరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పర్యతారోహణ శిక్షణ కేంద్రాల జాబితా, వారి పనితీరు, కార్యకలాపాలపై ప్రభుత్వం ఆరా తీయడం ప్రారంభించింది. అధికారి సస్పెన్షన్ కురంగని కొండల్లో అగ్నిప్రమాదంలో చిక్కుకుని 11 మంది మృతి చెందిన సంఘటనపై బాధ్యుడిని చేస్తూ అటవీశాఖ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తేని జిల్లా అటవీశాఖ ఉన్నతాధికారి రాజేంద్రన్ మంగళవారం శాఖాపరమైన విచారణ జరిపారు. ఫారెస్టర్ జెయ్సింగ్ అనే వ్యక్తిని సస్పెండ్ చేశారు. అటవీశాఖ అనుమతి పొందకుండా కోండపైకి తీసుకెళ్లిన ప్రయివేటు సంస్థపై చర్య తీసుకోవాలని ఎస్టీపీఐ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అనుమతితోనే ట్రెక్కింగ్: అటవీశాఖ అనుమతి లేకుండా వెళ్లడమే పలువురు ప్రాణాలు కోల్పోవడానికి కారణమని ముఖ్యమంత్రి ఎడపాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం సోమవారం ప్రకటించారు. అయితే వారంతా ఒకరికి రూ.200 చొప్పున చెల్లించి, పాస్ను సైతం పొంది అనుమతి పొందిన తరువాత కొండ ఎక్కినట్లు తేలింది. గవర్నర్ పరామర్శ అడవుల్లో రేగిన కారుచిచ్చులో చిక్కుకుని మృతి చెందిన వారికి గవర్నర్ బన్వరిలాల్ సంతాపం ప్రకటించారు. మంగళవారం మదురై ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. బిడ్డలను, బంధువులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లాలని తాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. -
కార్చిచ్చులో నలుగురు ట్రెక్కర్ల సజీవదహనం
సాక్షి, చెన్నై / తేని: తమిళనాడులో ఘోరం జరిగింది. తేని జిల్లా బోడినాయకనూర్ అటవీప్రాంతంలో ఆదివారం అకస్మాత్తుగా కార్చిచ్చు చెలరేగడంతో ట్రెక్కింగ్కు వెళ్లి తిరిగివస్తున్న వారిలో నలుగురు సజీవ దహనమైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి కార్చిచ్చులో చిక్కుకున్న 15 మందిని రక్షించారు. తీవ్రమైన ఉష్ణోగ్రత ప్రభావంతో గత కొన్నిరోజులుగా ఈ ప్రాంతంలో మంటలు చెలరేగుతుండగా.. అటవీ అధికారులు అదుపుచేస్తూ వస్తున్నారు. ఈ విషయమై తేని జిల్లా కలెక్టర్ పల్లవి బల్దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోడ్కు చెందిన 13 మంది, కోయంబత్తూర్కు చెందిన 24 మంది ట్రెక్కర్ల బృందం బోడినాయకనూర్ ప్రాంతంలోని కొజుకుమలై ప్రాంతానికి శనివారం చేరుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చెన్నై ట్రెక్కింగ్ క్లబ్ నిర్వహించిందన్నారు. వీరిలో ముగ్గురు పిల్లలు, 8 మంది పురుషులతో పాటు 26 మంది మహిళలు ఉన్నట్లు వెల్లడించారు. కొజుకుమలైలోని ఓ ఎస్టేట్లో రాత్రి బసచేసిన అనంతరం తిరుగుప్రయాణం అవుతుండగా అడవిలో కార్చిచ్చు చెలరేగిందని పేర్కొన్నారు. దీంతో బెదిరిపోయి దట్టమైన గడ్డి ఉన్న ఇరుకైన ప్రాంతానికి చేరుకోవడంతో మంటలంటుకుని నలుగురు ట్రెక్కర్లు దుర్మరణం చెందినట్లు స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని భావిస్తున్నామన్నారు. ఈ ట్రెక్కింగ్కు వెళ్లినవారిలో పలువురు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఒకరికి 80 శాతం కాలిన గాయాలయ్యాయన్నారు. మరోవైపు ప్రమాద విషయం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి.. సాయం చేయాల్సిందిగా రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ను కోరారు. దీంతో సీతారామన్ ఆదేశాలతో సులుర్ బేస్ నుంచి బయలుదేరిన రెండు ఐఏఎఫ్ హెలికాప్టర్లు అటవీ ప్రాంతంలో ట్రెక్కర్ల కోసం గాలింపు చేపట్టాయి. వీరిని రక్షించేందుకు సోమవారం ఆర్మీతో పాటు కేరళ, తమిళనాడు అటవీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. -
శిఖరాగ్రాన చిన్నారి
విశాఖ సిటీ: నడక నేర్చుకున్నప్పటి నుంచే కొండలెక్కడం అలవాటు చేసుకుంది. మూడేళ్లకే ట్రెక్కింగ్.. తొమ్మిదేళ్లకే ఎవరెస్టు.. పదేళ్లకే కిలిమంజారో శిఖరాన్ని అలవోకగా అధిరోహించి రికార్డులను ఒడిసి పట్టుకుంది. సంకల్ప బలం ముందు శిఖరాలు సైతం చిన్నబోతాయని నిరూపిస్తోంది.. ఏడు ఖండాల్లోని ఎత్తయిన శిఖరాల్ని అధిరోహించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది విశాఖ నగరానికి చెందిన పదేళ్ల చిన్నారి కామ్య కార్తికేయన్. తల్లిదండ్రులే గురువులుగా పర్వతారోహణలో అంతర్జాతీయ ప్రతిభ కనబరుస్తోంది. కామ్య కార్తికేయన్ తండ్రి కార్తికేయన్ తూర్పు నౌకాదళంలో కమాండర్గా విధులు నిర్వహిస్తున్నారు. స్పోర్ట్స్ పర్సన్గా నేవీలో పలు ప్రశంసలు అందుకున్నారు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది చిన్నారి కామ్య. బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలోనే తల్లిదండ్రులతోపాటు ట్రెక్కింగ్పై ఆసక్తి పెంచుకుంది. ఆ అలవాటే ఆ బాలికకు రికార్డులు తెచ్చిపెడుతున్నాయి. మూడేళ్ల ప్రాయంలోనే.. క్రమంగా నడక, ట్రెక్కింగ్ అలవర్చుకున్న కామ్య మూడేళ్ల ప్రాయంలో ముంబై సమీపంలోని లొనోవాలా ప్రాంతంలో జరిగిన ట్రెక్కింగ్లో తండ్రితో పాటు పాల్గొని అందరినీ అబ్బురపరిచింది. అంతేకాదు.. ►సహ్యాద్రి పర్వత శ్రేణులతో పాటు జమ్మూకాశ్మీర్లోని గుల్మార్గ్ దర్శనీయ స్థలానికి నడుచుకుంటూ వెళ్లింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. ►మహారాష్ట్రలోని డ్యూక్స్ నోస్, రాజ్గఢ్ పర్వతాల్ని నాలుగేళ్ల వయసులో అవలీలగా తల్లిదండ్రులతోపాటు ఎక్కి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ►ఏడేళ్ల ప్రాయంలో హిమాలయాల ట్రెక్కింగ్లో పాల్గొనేందుకు సిద్ధమైంది. మొదటి ప్రయత్నంలో 2015 మేలో 12 వేల అడుగుల ఎత్తయిన చంద్రశీల పర్వతారోహణ చేసింది. ► ఆ తర్వాత 2016లో హిమాలయా పర్వత శ్రేణుల్లో ఒకటైన 13,500 అడుగుల ఎత్తయిన హర్కిదున్ని విజయవంతంగా పూర్తిచేసింది. కొద్ది రోజుల్లోనే 13,500 అడుగుల ఎత్తయిన కేదార్కంఠ పర్వతారోహణ చేసి ఔరా అనిపించింది. ►9 ఏళ్ల వయసులో హిమాలయాల్లో దాదాపు 5,029 మీటర్ల ఎత్తులో ఉన్న రూప్కుండ్ మంచు సరస్సును అధిరోహించి రికార్డు సృష్టించింది. దీన్ని అధిరోహించడం ద్వారా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (ఈబీసీ)కు కామ్య అర్హత సాధించింది. ఏడాదిలో మూడు రికార్డులు కామ్య కార్తికేయన్ ఈ ఏడాది మూడు రికార్డులు సృష్టించింది. 6 వేల మీటర్లు, 20 వేల అడుగుల ఎత్తయిన పర్వతాల్ని అధిరోహించిన ప్రపంచంలో అతిపిన్న వయసు బాలికగా కామ్య కార్తికేయన్ రికార్డు పుటల్లో స్థానం సంపాదించుకుంది. ఈ ఏడాది మే 16న రోజుకు 9 గంటల పాటు నడుస్తూ 9 రోజుల్లోనే 18 వేల అడుగుల ఎత్తయిన నేపాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను పూర్తిచేసి ఈ ఘనత సాధించిన అతి చిన్న వయసున్న భారతీయ బాలికగా రికార్డు సొంతం చేసుకుంది. తాజాగా ఈ నెల 25న ఆఫ్రికా ఖండంలో 19,340 అడుగులతో అతి ఎత్తయిన పర్వతమైన కిలిమంజారోని అధిరోహించి శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. తల్లి లావణ్య కార్తికేయన్తో పాటు వివిధ దేశాల బృందంతో కలిసి ఈ ఫీట్ సాధించిన కామ్య.. పిన్న వయసులోనే కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన రెండో భారతీయ బాలికగా రికార్డు సృష్టించింది. జమ్మూకాశ్మీర్లోని లేహ్ స్టాక్ కాంగ్రీ పర్వతారోహణల్ని విజయవంతంగా పూర్తిచేసిన కామ్య వయసు పదేళ్ల రెండున్నర నెలలు మాత్రమే. చదువులోనూ శిఖరమే.. విశాఖ నేవీ స్కూల్లో విద్యనభ్యసిస్తున్న కామ్య పర్వతారోహణలోనే కాదు.. చదువులోనూ ప్రతిభ కనబరుస్తోంది. ఐదో తరగతి చదువుతున్న ఆ బాలిక స్పెల్బీ కాంపిటేషన్లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించింది. వివిధ ఒలింపియాడ్లలో జిల్లా స్థాయి మెడల్స్ సాధించింది. సంగీతంలోనూ ప్రావీణ్యం పొంది పియానో వాయిద్యంలో 3 గ్రేడులు పాసైంది. కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం సాధించిన ఈ చిన్నారి భరతనాట్యంలోనూ అదరగొడుతోంది. ఏడు ఖండాల్లో త్రివర్ణ రెపరెపలే లక్ష్యం తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ప్రతి అడుగు ముందుకేస్తున్నాను. అమ్మ లావణ్య ఎప్పుడూ నా వెన్నంటే ఉంటోంది. అందుకే అటు చదువులోనూ, ఇటు పర్వతారోహణలోనూ అపజయం లేకుండా ముందుకెళ్లగలుగుతున్నాను. ఏడు ఖండాల్లో ఉన్న అతిఎత్తయిన శిఖరాల్ని అధిరోహించి భారతీయ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం. – కామ్య కార్తికేయన్ -
కలెక్టర్ అమ్రపాలి సాహసం..
సాక్షి, వరంగల్: ఇటీవల కాలంలో తన పనితీరుతో వార్తల్లో నిలుస్తున్న వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి మరోసారి తన ధైర్య సాహసాలను ప్రదర్శించి ఔరా అనిపించారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పాండువుల గుట్టలలో నిర్వహిస్తున్న రాక్ క్లైంబింగ్ ఫెస్టీవల్లో రెండో రోజు ఆమె పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె సేఫ్టీ హెల్మెట్ ధరించి కొండపైకి ట్రెక్కింగ్ చేస్తూ ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక మహిళలు అక్కడికి చేరుకొని కలెక్టర్ సాహసాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మెచ్చుకున్నారు. గతంలో మరో కలెక్టర్తో కలిసి అడవిలో దాదాపు 15 కిలో మీటర్లు నడిచి కలెక్టర్ అమ్రపాలి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఫెస్టీవల్ను శనివారం స్పీకర్ మధుసూధనాచారి ప్రారంభించగా ఫెస్టీవల్లో పాల్గొన్న విద్యార్థులు హిమాలయ పర్వతాన్ని అధిరోహించిన శేఖర్ బాబు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. ఈ ఫెస్టీవల్కు వరంగల్ అర్బన్ జిల్లా అటవీశాఖ అధికారి అర్పణ, జయశంకర్ భూపాలపెల్లి జిల్లా అటవీశాఖ అధికారి రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
మహారాష్ట్రలో హైదరాబాద్ ట్రెక్కర్ మృతి
-
మహారాష్ట్రలో హైదరాబాద్ ట్రెక్కర్ మృతి
హైదరాబాద్: ట్రెక్కింగ్ కోసం మహారాష్ట్రకు వెళ్లిన హైదరాబాద్కు చెందిన ట్రెక్కర్ రిచిత గుప్త ప్రమాదవశాత్తు మరణించారు. కుటుంబీకులకు సమాచారం లేకుండా ఒంటరిగా ట్రెక్కింగ్కు వెళ్లిన రిచితకు సంబంధించి నారా యణగూడ ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమె ముంబై వెళ్లినట్టు గుర్తించారు. పన్వేల్ సమీపంలోని ప్రముఖ ట్రెక్కింగ్ ప్రాంత మైన ప్రబల్గఢ్ కోట సమీపంలో రిచిత మృతదేహం మంగళ వారం లభించింది. ప్రాథమిక ఆధారాలు, మృతదేహం పడున్న స్థితుల్ని అధ్యయనం చేసిన పోలీసులు ప్రమాదంగా తేల్చారు. హిమాయత్నగర్ ప్రాంతానికి చెందిన రిచితకు ఐదేళ్లక్రితం వ్యాపారవేత్త అమిత్ కనోడియాతో వివాహమైంది. రిచిత సెప్టెంబర్లో కొందరితో కలసి ప్రబల్గఢ్ కోట సమీపంలోని కళావంతిన్ దుర్గ్ కొండను అధిరోహించారు. గతనెల 25న మరోసారి ఒంటరిగా ట్రెక్కింగ్కు బయలుదే రిన రిచిత.. హైదరాబాద్ నుంచి విమానంలో ముంబై వెళ్లారు. ముంబై విమానాశ్రయం నుంచి ట్యాక్సీలో పన్వేల్ తాలూకాలోని ఠాకూర్వాడికి చేరుకున్నారు. ప్రబల్గఢ్ కోట సమీపంలోని 2,100 మీటర్ల ఎత్తయిన కొండను ఎక్కడానికి సిద్ధమైన రిచిత అక్కడ నుంచే తన లోకేషన్ను దుబాయ్లో ఉన్న భర్త అమిత్కు వాట్సాప్లో షేర్ చేశారు. గత నెల 29నే రిచిత తిరిగి రావాల్సి ఉండగా.. రాకపోవడంతో ఈ నెల మొదటివారంలో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో గత నెల 25న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ముంబై వెళ్లినట్టు గుర్తించారు. ముంబై విమానాశ్రయంలో ఫుటేజ్ ద్వారా ఆమె ప్రయాణిం చిన ట్యాక్సీ డ్రైవర్ను గుర్తించారు. అతడిని విచారించగా.. రిచితను ఠాకూర్వాడిలో దించినట్లు చెప్పారు. అమిత్కు పంపిన లోకేషన్ ఆధారంగా హైదరాబాద్, పన్వేల్ పోలీసు లు కోటలో గాలింపు చేపట్టగా వెనుక భాగంలోని కొండకు 600 మీటర్ల దిగువలో రిచిత మృతదేహం లభించింది. 4 రోజుల క్రితమే మరణించినట్లు నిర్ధారించి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. రిచిత పర్సు, సెల్ఫోన్ ఇతర సామగ్రిని కొండ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. -
తెల్లారేలోపు ముగించేశారు!
- చీకట్లోనే రెండు కిలోమీటర్ల ట్రెక్కింగ్ - లక్ష్యాన్ని చేరగానే మెరుపుదాడి.. బంకర్లు ధ్వంసం పాకిస్తాన్పై సర్జికల్ దాడి చేసేందుకు భారత్ వారం రోజుల ముందునుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తోటి జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్ర వాదులను మట్టుబెట్టడం, వారి కేంద్రాలను కసితీరా బద్దలు కొట్టేందుకు అద్భుతమైన ప్రణాళికతో ముందడుగేసింది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో ఈ ఆపరేషన్ను అమలుచేసేందుకు బయలుదేరిన ప్రత్యేక బృందం సభ్యులు కూడా ‘ఉడీ’కి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో గంటలపాటు శత్రువుల కంటికి చిక్కకుండా రెండు కిలోమీటర్ల మేర పాక్ భూభాగంలో చీకట్లో కొండలు, గుట్టలు ఎక్కారు. - సాక్షి, నేషనల్ డెస్క్ చిమ్మచీకట్లో.. ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే పాక్పై సర్జికల్ దాడులకు అర్థరాత్రే సరైన సమయమని భారత్ నిర్ణయించుకుంది. ప్రత్యర్థులను నిద్రలో ఉన్నప్పుడే మట్టుబెట్టాలని ప్రణాళిక రూపొందించుకుంది. అమావాస్యముందు చీకటి, దీనికి తోడు వెళ్లాల్సిన లక్ష్యం కొండలు గుట్టల మధ్యలో. ప్రత్యర్థి ఏమాత్రం అప్రమత్తమైనా.. ప్రాణాలతో బయటపడటం అసాధ్యమే. ప్రత్యర్థులు పన్నిన ఉచ్చులెక్కడున్నాయో కనిపెడుతూ.. వాటిబారిన పడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే వారం రోజుల క్రితం నుంచే లక్ష్యాలను ఎలా చేరుకోవాలి? ఏయే మార్గాల్లో వెళ్లాలి? ఆపరేషన్ పూర్తయ్యేంతవరకు వ్యవహరించాల్సిన తీరుపై ప్రత్యేక బృందాలకు పరిస్థితులపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ బృందాలకు ప్రత్యేకంగా స్వీడన్ తయారీ కార్ల్ గుస్తవ్ రాకెట్ లాంచర్లు అందజేశారు. వీటి ద్వారా యుద్ధ ట్యాంకులు, బలమైన స్థావరాలను కూల్చేయవచ్చు. చీకట్లోనైతేనే ప్రత్యర్థి కోలుకునే లోపే చావుదెబ్బ కొట్టొచ్చన్నది భారత ఆర్మీ ప్లాన్. పక్కా ప్రణాళిక ప్రకారం.. సర్జికల్దాడుల స్పెషలిస్టులైన ప్రత్యేక బృందంలోని కమాండోలు పూంఛ్ జిల్లాలోని నౌగామ్ సెక్టార్ ద్వారా పాక్లోకి ప్రవేశించారు. కొండలు, గుట్టల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎల్వోసీలో రెండు కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లారు. ముందుగా వేసుకున్న పక్కా ప్రణాళిక ప్రకారం ఉగ్రవాద కేంద్రాలను గుర్తించి తెల్లవారుజామున 1.45 గంటలకు టార్గెట్ల వద్దకు చేరుకున్నారు. అప్పటివరకు అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. కానీ, అనుకోని ఘటన ఏమైనా జరిగితే వెంటనే చొచ్చుకెళ్లిన ప్రత్యేక బృందాలను కాపాడేందుకు జమ్మూకశ్మీర్, పఠాన్కోట్ ఎయిర్బేస్లలో హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. అంతా లైవ్లో గమనిస్తున్న ఉన్నతాధికారులు ఆపరేషన్ను విజయవంతం చేసేలా మార్గదర్శకత్వం చేశారు. లక్ష్యం ముందుకు చేరుకోవటం, ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్న అధికారుల ఆదేశాలు రావటమే ఆలస్యం.. భారత కమాండో బృందాలు.. ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపుదాడి చేశాయి. ఒక్కో బంకర్లో కనీసం 10-15 మంది మిలిటెంట్లు ఉన్నారని సమాచారం. వారిని మట్టుబెట్టడంతోపాటు బంకర్లను పూర్తిగా ధ్వంసం చేశారు. -
డిసెంబర్ 23న అరకు ట్రెక్కింగ్
బీచ్రోడ్: యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే కార్యక్రమాల బ్రోచర్ను బీచ్ రోడ్డులోని యూత్ హాస్టల్లో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ట్రెక్కింగ్, రాప్పిలింగ్, పేరా సైలింగ్, హాట్ బెలూనింగ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతీ ఏటా శీతాకాంలో నిర్వహించే అరకు ట్రెక్కింగ్ ఈ ఏడాది డిసెంబర్ 23 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఈ ఏడాది నూతనంగా, విశాఖ చరిత్రలోనే ప్రథమంగా హాట్ ఎయిర్ బేలూన్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి సీహెచ్ రవిపాల్, ఎం.సాయి రామరాజు, అచ్చితరామరాజు, కె.వి.రాజు పాల్గొన్నారు. -
హితుడా? హంతకుడా?
పట్టుకోండి చూద్దాం కేరళలోని ఓ కొండప్రాంతం... జనం గుమిగూడి ఉన్నారు. అందరూ కొండ మీద నిలబడి కింద ఉన్న లోయలోకి చూస్తున్నారు. వాళ్ల మధ్య నిలబడిన ఓ వ్యక్తి ‘సాగర్’ అని అరుస్తూ ఏడుస్తున్నాడు. అందరూ అతణ్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘ఏమైంది’’ అన్నాడు ఇన్స్పెక్టర్ వస్తూనే. ‘‘నా ఫ్రెండ్ సర్. ట్రెక్కింగ్ చేస్తూ లోయలోకి పడిపోయాడు. తనని కాపాడండి సర్. వెంటనే వెతకండి సర్’’ అంటూ మరింత బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టాడతను. ‘‘ఏడవకండి. అసలేం జరిగిందో వివరంగా చెప్పండి’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘మాది హైదరాబాద్ సర్. నా పేరు వినీత్. నేను నా ఫ్రెండ్ సాగర్ టూర్కి వచ్చాం. ఇందాక మేం ట్రెక్కింగ్ చేస్తుంటే నా ఫ్రెండ్ సాగర్ నడుముకి కట్టుకున్న బెల్ట్ ఊడిపోయింది. దాంతో తను జారి లోయలోకి పడిపోయాడు సర్.’’ లోయలోకి తొంగి చూశాడు ఇన్స్పెక్టర్. చాలా లోతు ఉంది. పడితే బతికే చాన్సే లేదు. అయినా అలా అనలేదు. ‘‘నేను వెతికిస్తాను, మీరు ధైర్యంగా ఉండండి’’ వెళ్లిపోయాడు. రెండు రోజులు గడిచినా సాగర్ సజీవంగా కానీ, నిర్జీవంగా కానీ దొరకలేదు. దాంతో పోలీసులు వినీత్ని వెళ్లిపొమ్మన్నారు. ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే తెలియజేస్తామన్నారు. దాంతో భారమైన మనసుతో హైదరాబాద్ బయలుదేరాడు వినీత్. రెండు రోజుల తర్వాత... సీరియస్గా ఫైల్ తిరగేస్తున్న ఇన్స్పెక్టర్ అభిమన్యును ఫోన్ రింగయిన శబ్దం డిస్టర్బ్ చేసింది. ‘ప్చ్’ అని విసుక్కుంటూ ఫోన్ తీసి హలో అన్నాడు. ‘‘నేను కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను మిస్టర్ అభిమన్యూ. ఇక్కడ లోయలో ఒక వ్యక్తి మృతదేహం దొరికింది. అతను హైదరాబాద్కి చెందినవాడే. తన ఫ్రెండ్తో పాటు టూర్కి వచ్చాడు. ట్రెక్కింగ్ చేస్తూ లోయలో పడిపోయాడు. దాంతో అతని ఫ్రెండ్ కంప్లయింట్ ఇచ్చాడు. రెండు రోజులు వెతికినా దొరక్కపోవడంతో అతన్ని వెళ్లిపొమ్మన్నాం. ఈరోజు ఉదయం డెడ్బాడీ దొరికింది. బాడీని హైదరాబాద్ పంపిస్తున్నాం. కాస్త మీరిది డీల్ చేయాలి’’ చెప్పాడు ఫోన్ చేసిన వ్యక్తి. ‘‘ష్యూర్... అది నా బాధ్యత’’ అన్నాడు అభిమన్యు. అవతలి వ్యక్తి చెప్పిన మిగతా వివరాలు కూడా విని ఫోన్ పెట్టేశాడు. కాసేపట్లో మృతుడి ఫొటోతో పాటు అతడి వివరాలు కూడా ఫ్యాక్స్లో వచ్చేశాయి. ఇరవై తొమ్మిదేళ్ల వయసు. దగ్గర దగ్గర ఆరడుగుల పొడవున్నాడు. చనిపోయినప్పుడు నల్లరంగు ప్యాంటు, లేత నీలం రంగు చొక్కా వేసుకున్నాడు. చనిపోయి అయిదు రోజులు కావడంతో మృతదేహం పాడైపోయి పోలికలు తెలియడం లేదు. కానిస్టేబుల్ని పిలిచాడు అభిమన్యు. మృతుడి వివరాలిచ్చి, ‘‘అతని కుటుంబానికి విషయం తెలియజెయ్యండి. అలాగే అతని ఫ్రెండ్కి కూడా’’ అని ఆదేశించాడు. ‘‘బాబూ సాగర్’’... మృతదేహం చూస్తూనే దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది తల్లి. ‘‘తండ్రి లేని పిల్లాడని కళ్లలో పెట్టుకుని పెంచుకున్నాను. వాడే ప్రపంచం అనుకున్నాను. ఇప్పుడు నాకు దిక్కెవరు’’ అంటూ ఆ ముసలి తల్లి కన్నీరు మున్నీరవుతుంటే అందరి మనసులూ తల్లడిల్లాయి. అయ్యోపాపం అన్నట్టుగా చూస్తున్నారంతా. సాగర్ తల్లిని ఓ వ్యక్తి ఓదారుస్తున్నాడు. ‘‘సర్... అతనే వినీత్. సాగర్తో కేరళ వెళ్లిన వ్యక్తి’’ అన్నాడు కానిస్టేబుల్ కామేష్. అలాగా అన్నట్టు తలూపాడు అభిమన్యు. అంతక్రియలు పూర్తయ్యేవరకూ అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత వినీత్ దగ్గరకు వెళ్లి అన్నాడు... ‘‘వినీత్... మీరో సారి స్టేషన్కు వస్తే స్టేట్మెంట్ తీసుకోవాలి.’’ ‘‘ఇంకా ఏం తీసుకుంటారు సర్ స్టేట్ మెంట్? చూస్తున్నారుగా మా పరిస్థితి? వాడు నా బెస్ట్ ఫ్రెండ్. నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. పాపిష్టివాణ్ని. నేనే తనని పట్టుబట్టి టూర్కి తీసుకెళ్లాను. నావల్లే వాడికిలా అయ్యింది. నా పాపం ఊరికే పోదు.’’ ‘‘అవును... మీ పాపం ఊరికే పోదు.’’ ఉలిక్కిపడ్డాడు వినీత్. ‘‘ఏమంటున్నారు?’’ అన్నాడు అయోమయంగా. ‘‘ఏమంటాను? స్నేహితుణ్ని నమ్మించి, ఊరు గాని ఊరు తీసుకెళ్లి, కొండమీద నుంచి తోసేసి క్రూరంగా చంపేసిన పాపం ఊరికే ఎలా పోతుంది అంటున్నాను.’’ అవాక్కయిపోయాడు వినీత్. ‘‘నేను నేను’’ ‘‘ఇక తప్పించుకోలేవు వినీత్. నాకు బలమైన సాక్ష్యం దొరికింది. ఇదిగో’’ అన్నాడు అభిమన్యు. అతని చేతిలో తన రిటర్న టికెట్ చూసిన వినీత్ నీరుగారిపోయాడు. మౌనంగా పోలీసుల వెంట నడిచాడు. ఇంతకీ ఆ టికెట్లో ఏముంది? అది చూసి వినీత్ హంతకుడని అభిమన్యు ఎలా కనిపెట్టాడు?! జవాబు: ఇన్స్పెక్టర్కి రిటర్న టికెట్ దొరికింది కదా! దానిమీద కేరళ వెళ్లినప్పుడు బుక్ చేసిన టికెట్ మీద ఏ డేటు ఉందో అదే ఉంది. అంటే రాను పోను ఒకేసారి బుక్ చేశాడు వినీత్. మరి రిటర్న టికెట్ తనకు మాత్రమే చేశాడంటే సాగర్ తనతో తిరిగి రాడనే కదా! దాన్ని బట్టి అతణ్ని చంపేయడానికి ముందే స్కెచ్ వేశాడని అర్థమవుతోంది. -
ట్రెక్కింగ్ @ 81
మనదేశంలోని అత్యంత శీతల ప్రదేశాలు హిమాలయాలే.. ఎముకలు కొరికేసే చలి ఉండే ఆ పర్వత శ్రేణుల్లో ఒకసారి పర్యటించడమే కష్టసాధ్యమైన పని. అలాంటిది ఈ పెద్దాయన హిమగిరి సొగసులూ...ఏమి హాయిలే అనుకుంటూ ఏకంగా పదిసార్లు హిమాలయాలు ఎక్కి దిగేశాడు . ఆయన పేరు గోపాల్ వాసుదేవ్. పుణేకు చెందిన ఈ పర్వతారోహకుడు ఈ మధ్యే లిమ్కా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కి ఔరా అనిపించాడు. ఇందులో గొప్పేముందని అనుకుంటున్నారా? అవును 81 ఏళ్ల వయసులో నడవడమే కష్టమైన విషయం. అలాంటిది ఏకంగా పర్వతాలు ఎక్కడమంటే మాటలు కాదు. కానీ, గోపాల్కు పర్వతారోహణే అత్యంత ఇష్టమైన పని. ఆటోమొబైల్ ఇంజనీర్గా 1964లో కెరీర్ను ప్రారంభించాక, చాలా ఏళ్లు పుణేలోనే వివిధ కంపెనీల్లో పనిచేశాడు. ఆ సమయంలోనే పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. తొలిసారిగా 1972లో ట్రెక్కింగ్ చేశాడు. అప్పటి నుంచీ చిన్నాపెద్దా పర్వతాలను అధిరోహిస్తూనే ఉన్నాడు. ట్రెక్కింగ్ చేసేవాళ్లకు దేహదారుఢ్యం చాలా అవసరమని ఆయన అభిప్రాయం. అందుకే, ఈ వయసులోనూ రోజుకు 8 కిలోమీటర్ల పాటు నడక సాగిస్తాడు, వారానికోసారి పుణే-ముంబై రహదారి సమీపంలోని చిన్నపాటి కొండను ఎక్కడం, దిగడం చేస్తుంటాడు. గతేడాది సెప్టెంబర్లో హిమాచల్ ప్రదేశ్లోని 15,350 అడుగుల ఎత్తై రూపిన్ పాస్ని అధిరోహించిన సందర్భంగా లిమ్కాబుక్ వాళ్లు పెద్ద వయసు పర్వతారోహకుడిగా ఆయన పేరుని చేర్చారు. 80 ఏళ్లు పైబడినా రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు లాంటి సమస్యలు ఈయన దరిచేరలేదంటే నమ్మాల్సిందే.! -
సాహసం చేయరా..
ఇప్పటికే సిటీలో రాక్థాన్, ట్రెక్కింగ్ వంటి ఈవెంట్లు ఎగ్జయిట్మెంట్కు వేదికగా నిలుస్తూనే ఉన్నాయి. ఇదే కాన్సెప్ట్ను విహారయాత్రలకు ఫిక్స్ చేసింది తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. అడ్వెంచర్ టూరిజాన్ని పరిచయం చేస్తామంటూ.. పర్యాటక ప్రియుల్లో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది. అడ్వెంచర్లు చేయడం కోసం పడమటి కనుమల్లోనో.. హిమాలయ పర్వతాల్లోనో.. చక్కర్లు కొట్టాల్సిన పనిలేదు. మీరు అడ్వెంచర్ చేయాలనుకుంటే మన సిటీకి కూతవేటు దూరంలోనే బోలెడన్ని స్పాట్స్ ఉన్నాయి. భువనగిరి, అనంతగిరి కొండలు.. సాహసవీరులకు వెల్కమ్ చెబుతున్నాయి. దాదాపు వెయ్యి మీటర్ల ఎత్తున్న ఈ కొండలను తొందర్లోనే రాక్ క్లైంబింగ్ స్పాట్స్గా తీర్చిదిద్దనున్నారు. భారీ కొండలు, గుట్టలున్న ప్రాంతాల్లో పారాగ్లైడింగ్, ర్యాపెలింగ్ వంటి ఈవెంట్లకు వేదికగా మలుస్తున్నారు. ఇక తెలంగాణలో పేరెన్నికగన్న లోయర్ మానేర్ డ్యామ్, పాకాల, రామప్ప చెరువులు, కడెం ప్రాజెక్ట్ తదితర జలాశయాల దగ్గర స్పీడ్ బోటింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ కూడాఅందుబాటులో తెస్తామంటున్నారు. మొత్తానికి టూరిజం డిపార్ట్మెంట్ ప్రకటించిన ఈ ఎగ్జయిటింగ్ ఆఫర్లు అమల్లోకి వస్తే.. సిటీవాసులు అడ్వెంచర్స్ను మస్తుగా ఎంజాయ్ చేసేయొచ్చు. -
ట్రెక్కింగ్కి ఈ వస్తువులు తప్పనిసరి...
వర్షాకాలం టూల్ టార్చ్: వర్షాకాలం ప్రయాణాలు పెట్టుకున్నవారికి ముఖ్యంగా ట్రెక్కర్స్కి టూల్ టార్చ్ చాలా అవసరం. టార్చ్లైట్, కత్తి, పట్టకార, ప్లైర్, కంపాస్ రోల్డ్... ఇవన్నీ ఒకే దాంట్లో కలిపి ఉంటే వెంట తీసుకెళ్లడం చాలా సులువు. హిట్ప్లే.ఇన్లో ఇది రూ.1,499కే లభిస్తుంది. దోమల నివారణ బ్యాండ్ ప్రయాణంలో ఎక్కడికెళ్లినా రాత్రిపూట దోమల బెడద తప్పదు. ఆరుబయట ఉన్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువ. అందులోనూ దోమలు ఎక్కువగా పిల్లలను టార్గెట్ చేస్తుంటాయి. దోమల నివారణ బ్యాండ్ (మస్కిటో రిపెల్లింగ్ బ్యాండ్) పిల్లల చేతికి తొడిగితే మీ ఆందోళన తీరుతుంది. ఇవి పిల్లలను ఆకట్టుకునే లిజార్డ్, కప్ప, బ్యాట్, సాలీడు.. వంటి రకరకాల మోడల్స్లో లభిస్తున్నాయి. రెండు బ్యాండ్స్ రూ.399కి లభిస్తున్నాయి. ఇవి నగరాలలోని పిల్లల వస్తువుల షాపుల్లోనూ, మెడికల్ స్టోర్లలోనూ లభిస్తాయి. పాదాలకు రక్ష... కాస్త రఫ్గా, ఇంకాస్త లైట్ వెయిట్గా, పాదాలకు సౌకర్యంగా, ఫ్యాన్సీ కలర్లలో లభించే షూని మగువ లు చాలా ఇష్టపడతారు. ట్రెక్కింగ్లో ఇలాంటి షూ కోసం వెదికేవారికి ఉడ్లాండ్ షాపులలో రూ.3,591 లకు లభిస్తున్నాయి. వీటిని స్నీకర్స్ అని అడిగి తీసుకోవాలి. బురదలోనూ, రాళ్లలోనూ పాదాలకు సౌకర్యంగా ఉండే ఈ షూలు మగవారికి సుఖంగా ఉంటాయి. వానాకాలపు ట్రెక్కింగ్లో రఫ్ అండ్ టఫ్ అనిపించే ఈ షూ ధర రూ.12,990. టింబర్లాండ్ ఔట్లెట్లలో లభిస్తున్నాయి. డ్రై బ్యాగ్... ప్రయాణానికి వెళ్లేటప్పుడు శుభ్రంగా సర్దుకున్న బ్యాగ్, మధ్యలోనే చిందరవందరగా మారిపోతుంది. విడిచిన దుస్తులు, వేసుకోవాల్సినవి అన్నీ ఒకే చోట పెడితే కొత్త ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి సమస్య లేకుండా ఈ డ్రై బ్యాగ్ ఉపయోగపడుతుంది. ఈ బ్యాగ్ 30 కేజీల బరువును ఆపగలుగుతుంది. పైగా వాటర్ప్రూఫ్ కూడా. హిట్ప్లే.ఇన్ లో లభించే ఈ బ్యాగ్ధర రూ.1,249. ఫోన్ సురక్షితం.. పర్వతారోహణలో ఫోన్లో జీపీఎస్ సిస్టమ్ ఆన్లో ఉంటే ఎంతో ఉపయుక్తం. కానీ, జిపిఎస్ సిస్టమ్ డెరైక్షన్స్ను ఫోన్లో అనుసరించడం వల్ల వర్షం పడుతున్నప్పుడు చూడటం కష్టం అవుతుంది. వర్షపునీటికి ఫోన్ పాడవుతుందనే భయం కూడా ఉంటుంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండటానికి ఈ వెదర్ ప్రూఫ్ ఫోన్ కేస్ సహాయపడుతుంది. హిట్ప్లే.ఇన్లో దీని ధర రూ.4,199. విశ్రాంతికి టెంట్... సాహస యాత్రికులకు ఈ టెంట్ ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. నీటిని, గాలిని తట్టుకునే సామర్థ్యం గల ఈ టెంట్ దారి మధ్యలో మీరెక్కడైనా రెస్ట్ తీసుకోవడానికి ఎంతో ఉపయోగకరం. ఈ టెంట్కి స్లీపింగ్ బ్యాగ్స్, బ్యాక్ప్యాక్స్ కూడా ఉన్నాయి. నైలాన్ ఫ్లోర్ ఉండటం వల్ల తడి నేలలోనూ అనువుగా ఉంటుంది. ఉడ్లాండ్ షాపులలో దీని ధర రూ.10 వేలు. -
ఇక పై కాలినడకన వచ్చే వారికి ఉచిత లడ్డూ