uranium mining
-
యురేనియం.. ఆందోళన ఉగ్రరూపం
కర్నూలు(సెంట్రల్): కర్నూలు కలెక్టరేట్ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు పోలీసుల అడ్డగింపు..మరోవైపు యురేనియం బాధిత గ్రామాల ప్రజల ఆందోళనతో అట్టుడికింది. దేనకొండ మండలం కప్పట్రాళ్ల పరిసరాల్లో ఎలాంటి యురేనియం తవ్వకాలు చేపట్టబోమని కలెక్టర్ వచ్చి ప్రకటన చేయాలని 15 గ్రామాల ప్రజలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ గ్రామాలను పరిరక్షించాలని, తాము నమ్ముకొని ఉన్న భూములు, ఇళ్ల సమీపంలో యురేనియం తవ్వకాలు చేపడితే తమ గతి ఏమిటని, వచ్చే రోగాలకు బాధితులెవరని, పంటలు పండే భూములు బీడుగా మారితే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశి్నస్తూ 5 గంటల పాటు కలెక్టరేట్ను ముట్టడించారు. పోలీసులు ఎంతచెప్పినా ఆందోళనను విరమించలేదు.తమకు కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. అయితే కలెక్టర్ తనకు బదులుగా డీఆర్వో సి.వెంకటనారాయణమ్మను మొదట పంపారు. ఆమె కలెక్టర్ తరపున వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే వారు ఒప్పుకోలేదు. కలెక్టరే రావాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. చివరకు కలెక్టర్కు బదులుగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య ఆందోళనకారుల దగ్గరకు వచ్చారు. అందరూ ఏక కంఠంతో యురేనియం తవ్వకాలు ఆపాలని నినదించారు.తమ గ్రామాలను కాపాడాలని అభ్యరి్థంచారు. యురేనియం తవ్వకాలు చేపడితే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని, అధికారులే తమకు న్యాయం చేయాలని కోరడంతో జేసీ స్పందిస్తూ...ప్రస్తుతానికి ఆందోళన అక్కర్లేదని, కేంద్ర పర్యావరణ అనుమతులు రాలేదని, అప్పటివరకు యురేనియం తవ్వకాల నిర్థారణ కోసం గాని, యురేనియం తవ్వకాలు కాని చేపట్టబోమని చెప్పారు. అయితే అనుమతులు రాగానే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తారని, అప్పుడు అభ్యంతరాలను ప్రజలు తెలుపవచ్చని సూచించారు.జేసీ ప్రసంగానికి అడ్డంకులుజేసీ డాక్టర్ నవ్య ప్రసంగానికి కొందరు యువకులు అడ్డు తగిలారు. తాము అసలు యురేనియం తవ్వకాలపై ఎలాంటి ముందడుగు వేయడానికి వీలు లేదంటే అనుమతులు వచి్చన తరువాత గ్రామసభలు పెడతామని ఎలా మాట్లాడుతారని జేసీని ప్రశి్నంచారు. దీంతో పోలీసులు కలుగజేసుకొని వారిని వారించారు. మరోవైపు ఆందోళనలో చురుగ్గా ఉన్న యువకుల వివరాలను పోలీసులు తీసుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడడంలో భాగంగా ముందుగా జాగ్రత్తగా తీసుకొని ఉంటారని ఆమె వివరించారు. మొత్తంగా జేసీ వివరణతో తరువాత కప్పట్రాళ్ల చుట్టుపక్కల యురేనియం తవ్వకాలు చేపడతారని స్పష్టంగా అర్థమైపోయింది. కాగా, ప్రజలు ఎంత కోరినా కలెక్టర్ మాత్రం బయటకు రాకపోవడంతో గమనార్హం. ఆందోళనకు సీపీఎం నేతలు జి.రామకృష్ణ, పి.నిర్మల, పీఎస్ రాధాకృష్ణ, వీరశేఖర్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కప్పట్రాళ్ల, కోటకొండ, బేతపల్లి, నెల్లిబండ, గుడిమిరాళ్ల, బంటుపళ్లి, గుండ్లకొండ తదితర గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
పురుగుల మందు డబ్బాలు, పెట్రోల్ సీసాలతో రోడ్డుపై బైఠాయింపు
-
మళ్లీ మండుతున్న యురేనియం
కప్పట్రాళ్ల.. మొన్నటి వరకూ ఫ్యాక్షన్ భయంతో ఉలిక్కిపడిన ఊరు. ఇప్పుడీ ఊరుతో పాటు మరో 15 గ్రామాలు యురేనియం పేరు వింటే హడలిపోతున్నాయి. రేడియో ధార్మిక మూలకమైన యురేనియం మైనింగ్ జరిపితే తమ పొలాలు నిర్జీవమవుతాయని, ఆరోగ్యాలు గుల్ల అవుతాయని.. పీల్చేగాలి, తాగేనీరు, తినే తిండి అంతా కలుషితమై జీవితం దుర్భరమవుతుందని ఇక్కడి వారంతా ఆందోళన చెందుతున్నారు. యురేనియం తవ్వకాలు తమ ప్రాంతంలో జరిపేందుకు వీల్లేదని కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి కర్నూలు: అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (ఏఎండీ) కేంద్ర ప్రభుత్వ సంస్థ. దేశంలో అణు, రేడియో ధార్మిక ఖనిజ నిక్షేపాలను ఏఎండీ అన్వేషించి, పరిశోధనలు జరిపి మైనింగ్ చేపడుతుంది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల సమీపంలోని 15 గ్రామాల్లో యురేనియం నిల్వలున్నట్లు ఏఎండీ గ్రహించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో వీటి నిల్వలపై పరిశోధనలు జరిపేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ రీజినల్ ఆఫీసుకు రెండు దఫాలుగా అనుమతులిచ్చింది. అప్పట్లో 20 బోర్లు వేశారు. మట్టి నమూనాలూ సేకరించారు. అనంతరం ఎక్కడా యురేనియం ప్రస్తావనలేదు. ఆ తర్వాత విజయవాడలోని కేంద్ర అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఉప కార్యాలయం మరోసారి 50 మీటర్ల వరకూ 68 బోర్లు తవ్వేందుకు 2023 జూన్ 26న అనుమతులిచ్చింది. కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్టులోని 1,170.65 ఎకరాల్లో బోర్లువేసి యురేనియం ఖనిజం నిల్వలు ఏ మేరకు ఉన్నాయో అంచనా వేసి నమూనాలు సేకరించేందుకు ఏఎండీ ఫేజ్–1కు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అప్పుడు, ఇప్పుడు టీడీపీ పాలనలోనేనిజానికి.. కర్నూలు జిల్లాలో యురేనియం మైనింగ్కు వ్యతిరేకంగా 2019 అక్టోబరులో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. యురేనియం తవ్వకాలతో ప్రజలకు, రైతులకు సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆరోపించారు. కానీ, 2017లో తవ్వకాలకు అనుమతులిచ్చింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. అప్పుడు కేంద్రంలో టీడీపీ భాగస్వామి కూడా. ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ప్రజలు 10 రోజులుగా యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నప్పుడు ఎందుకు కూటమి నేతలు మాట్లాడటంలేదని ప్రజలు ప్రశి్నస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం స్పందించాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.రెండో విడత అనుమతులపై ఆందోళనఇప్పుడు తాజాగా రెండో విడత కింద 68 బోర్లకు అనుమతులివ్వడం, 50 మీటర్ల వరకూ తవ్వకాలు జరపడంతో ఇక్కడ యురేనియం నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే రెండో దఫాలో 15 గ్రామాల పరిధిలో బోర్లకు తవ్వకాలు జరుపుతున్నారని ప్రజల్లో భయం మొదలైంది. దీంతో.. కప్పట్రాళ్లతో పాటు దేవనకొండ మండలంలోని పి. కోటకొండ, జిల్లేడు, గుండ్లకొండ, దుప్పనగుర్తి, బంటుపల్లి, ఈదులదేవరబండ, నెల్లిబండ, మాదాపురం, నేలతలమరి, చెల్లెల చెలిమల, బేతపల్లితో పాటు పలు గ్రామాల ప్రజలు ఏకమయ్యారు. ఫ్యాక్షన్ దెబ్బకు అభివృద్ధికి నోచుకోకుండా దెబ్బతిన్న కప్పట్రాళ్ల, పి. కోటకొండ, ఈదులదేవరబండతో పాటు సమీప గ్రామాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయని ఈ క్రమంలో తవ్వకాలు సరికాదనే నిర్ణయానికి వచ్చారు. చీని, మిర్చి, పత్తితో పాటు మంచి వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగుచేస్తూ ఆర్థికంగా ఇప్పుడిప్పుడే స్థిరపడుతూ, పిల్లలను మంచి చదువులు చదివించుకుంటున్నామని ఇప్పుడు యురేనియం తవ్వకాలు జరిపితే పంటలు పండకపోవడంతో పాటు గ్రామాలను వదిలివెళ్లాల్సి ఉంటుందని.. లేదంటే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందనే భావన వారిలో ఏర్పడింది. దీంతో 10 రోజులుగా ఆందోళనకు దిగుతున్నారు. కప్పట్రాళ్లతో పాటు కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆధ్వర్యంలో దేవనకొండలో భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. తవ్వకాలు జరిపితే ఆత్మహత్యలకు తెగిస్తామని కూడా తేల్చిచెప్పారు. ప్రజల ఆందోళన నేపథ్యంలో.. తవ్వకాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించిన తర్వాతే పనులు చేయాలని, అంతవరకూ తవ్వకాలు జరపొద్దని కలెక్టర్ రంజిత్ బాషా ఏఎండీని ఆదేశించారు.ప్రాణాలు పోయినా లెక్కచేయంయురేనియం తవ్వకాలు జరిపితే మా ఊళ్లు, బతుకులు ఛిద్రమవుతాయి. గతంలో బోర్లు వేశారు. మళ్లీ ఇప్పుడు వేస్తామంటున్నారు. ఆర్డీఓ యురేనియం తవ్వకాలు జరగవంటున్నారు. మరి బోర్లు వేయడం ఎందుకు? తవ్వకాలు జరపబోమని కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేదాకా ఆందోళన చేస్తాం. మా ప్రాణాలు పోయినా లెక్కచేసేది లేదు. – నాగరాజు, దుబ్బనుగుర్తి ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చస్తాం.. మా కప్పట్రాళ్ల పేరు వింటే నరుక్కోవడాలు, సంపుకోవడాలే! ఎస్పీ రవికృష్ణ దేవుడిలా వచ్చి మా ఊరు దత్తత తీసుకుని ఊరినే మార్చాడు. బోర్లు వేసుకుని పంటలు పండించుకుంటూ సంతోషంగా బతుకుతాండాం. ఇప్పుడు యురేనియం తవ్వకాలంటూ భయపడెతాండారు. తవ్వకాలు మొదలైతే ఊళ్లు వదిలి వెళ్లాలంటున్నారు. ఊరు వదిలే సమస్యేలేదు. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చస్తాం. – సుంకులమ్మ, కప్పట్రాళ్ల గ్రామం ఈదుల దేవరబండలో రాస్తారోకో..కర్నూలు(అర్బన్): యురేనియం నిక్షేపాల వెలికితీతను ఆపాలని సోమవారం దేవనకొండ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఈదుల దేవరబండ గ్రామం వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అక్కడికి వచ్చిన డీఎస్పీ వెంకట్రామయ్య మాట్లాడుతూ ‘ఈనెల 4న సమావేశం నిర్వహించి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలనుకున్నాం. ఈలోపు రోడ్డెక్కారు.. సోషల్, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కావొచ్చు ప్రజలు అపోహ పడేలా చేశారు. వాటిని పోగొట్టే బాధ్యత మాపై ఉందన్నారు.బాబు హయాంలోనే అనుమతిఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికర్నూలు (సెంట్రల్): రాష్ట్రంలో ఎక్కడైనా మంచి జరిగితే చంద్రబాబు ఖాతాలో వేయడం, చెడు జరిగితే మాత్రం వైఎస్ జగన్పై నెట్టడం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారిందని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి ఆగ్రహం వ్యక్తంచేశారు. దేవనకొండ మండలం కప్పట్రాళ్లలో యురేనియం నిక్షేపాల అన్వేషణ కోసం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు ఇచ్చారని మంత్రి రామానాయుడు చెప్పడాన్ని విరూపాక్షి తీవ్రంగా ఖండించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 2017లోనే మొదటిసారి కప్పట్రాళ్లలో యురేనియం నిక్షేపాల గుర్తింపునకు డ్రిల్లింగ్ కోసం 27 బోర్ల ఏర్పాటుకు అనుమతిస్తూ జీవో జారీ చేశారని చెప్పారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత 2019 నుంచి ఐదేళ్లపాటు యురేనియం నిక్షేపాల గుర్తింపు, తవ్వకాల కోసం ఎలాంటి ప్రయత్నాలు జరగలేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ యురేనియం నిక్షేపాల గుర్తింపు కోసం 68 బోర్లు వేయడానికి అనుమతులు ఇచ్చారని తెలిపారు. యురేనియం నిక్షేపాలను గుర్తించి తవ్వకాలు చేపడితే తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందన్న భయంతోనే దేవనకొండ ప్రజలు ఆందోళనకు దిగుతున్నారని తెలిపారు. -
యురేనియం తవ్వకాలపై ఆందోళనలు
-
పురుగు మందు డబ్బాలతో నిరసన.. కర్నూలులో యురేనియం తవ్వకాలపై ఉద్రిక్తత
సాక్షి,కర్నూలు: జిల్లాలో యురేనియం తవ్వకాలపై ప్రజల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. యురేనియం తవ్వకాలపై స్థానిక గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చిన ఐఏఎస్ అధికారులు తిరిగి వెనక్కి వెళ్లారు. పురుగు మందు డబ్బాలు.. పెట్రోలు సీసాలతో రాస్తా రోకోలతో ప్రజల ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో సమావేశం నిర్వహించకుండానే అధికారులు వెనుదిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది.మరోవైపు, దేవనకొండ మండలం కప్పట్రాల రిజర్వు ఫారెస్ట్లో ప్రతిపాదించిన యురేనియం తవ్వకాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాల ప్రభావం 100 కిలోమీటర్ల మేర ప్రభావం ఉంటుందనే ప్రచారంతో దేవనకొండ మండలంతో పాటు పత్తికొండ మండల పరిసర ప్రాంతాల ప్రజలు సైతం ఆందోళన చేపట్టారు. కప్పట్రాళ్ల, కోటకొండ, పల్దొడ్డి గ్రామాల రైతులు సైతం యురేనియం తవ్వకాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇవాళ యురేనియం తవ్వకాలపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించేలా కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు కర్నూలు-బళ్లారి రహదారిలో బైఠాయించారు. కొందరు మహిళలు పురుగు మందు డబ్బాలు, పెట్రోలు సీసాలతో నిరసన తెలిపారు. అనుమతులు రద్దు చేయాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాగా, ప్రజల ఆందోళనతో యురేనియం తవ్వకాల పనులను అధికారులు నిలిపివేస్తారా? లేదంటే కొనసాగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
యురేనియం వార్.. కప్పట్రాళ్ల స్టేజి వద్ద ఉద్రిక్తత
కర్నూలు, సాక్షి: కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల స్టేజి వద్ద ఉద్రిక్తత చోటచేసుకుంది. యురేనియం తవ్వకాలపై గ్రామస్తులు నిరసనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. దీంతో బళ్లారి-కర్నూలు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.నిరసన తెలుపుతున్న ప్రజలకు మద్దతుగా ఎమ్మెల్యే విరుపాక్షి ధర్నాలో పాల్గొన్నారు. మద్దతు పలికేందుకు వస్తున్న ఎమ్మెల్యేకు పోలీసులు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా పోలీసుల అరెస్టు తప్పించుకుని కపట్రాళ్లకు ఎమ్మెల్యే విరుపాక్షి చేరుకున్నారు. ‘యురేనియం తవ్వకాలు వద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, సీఎం డౌన్ డౌన్ అంటూ ఆయా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.చదవండి: రాష్ట్రంలో రెండో బయోస్పియర్ పార్క్! -
నల్లమలలో ‘యురేనియం’ అంకానికి తెర!
సాక్షి, హైదరాబాద్: నల్లమలలో యురేనియం అన్వేషణ, వెలికితీత అంకానికి తెరపడింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో యురేనియం నిల్వలపై సర్వే చేపట్టే విషయంలో అటమిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ) సమర్పించిన ప్రతిపాదనలను తాజాగా రాష్ట్ర వన్యప్రాణి మండలి తిరస్కరించింది. దీంతో గత నాలుగేళ్లుగా యురేనియం సర్వేతో ముడిపడి సాగుతున్న చర్చ ముగిసినట్టయింది. సోమవారం అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. చదవండి: యురేనియం అన్వేషణకు నో.. కేంద్ర వన్య›ప్రాణి మండలి, కేంద్ర అటవీ శాఖకు ఈ తీర్మానాన్ని పంపాలని ఈ సమావేశం నిర్ణయించింది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల వెలికితీతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలంటూ కేంద్రం గత మే నెలలో కోరింది. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అటవీ సలహా మండలి సమావేశంలో ఏటీఆర్ పరిధిలో ప్రతిపాదిత యురేనియం నిల్వల సర్వే, వెలికితీత అంశం చర్చకు వచ్చింది. దీనిపై రాష్ట్ర వన్యప్రాణి మండలి నిర్ణయమేమిటో నివేదిక రూపంలో తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సమావేశం కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సమావేశమై యురేనియం సర్వే సాధ్యం కాదని పేర్కొంటూ గతంలోని ప్రతిపాదనలను తిరస్కరించడంతో ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్స్టాప్ పడింది. చదవండి: మినిట్స్ వచ్చేదాకా... వేచిచూద్దాం ఇదీ జరిగిందీ.. అటవీ ప్రాంతం, చెట్లకు నష్టం వాటిల్లకుండా యంత్రాలను వాడకుండా సర్వే నిర్వహిస్తామని ఏఎండీ సమర్పించిన ప్రతిపాదనలను 2016లో జరిగిన రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశం ఆమోదించింది. అడవికి ఎలాంటి నష్టం కలిగించరాదని, ఉన్న రోడ్లు, బండి, కాలినడక మార్గాలనే ఉపయోగించాలని, కేవలం సర్వేకే పరిమితం కావాలని, నిల్వలను వెలికి తీయొద్దని, చెట్లకు, వన్యప్రాణులకు ఎలాంటి నష్టం కలిగించొద్దంటూ ఈ సమావేశంలో మినిట్స్ను రికార్డ్ చేశారు.. దీనికి భిన్నంగా గతేడాది మళ్లీ సవరించిన ప్రతిపాదనలు ఏఎండీ పంపించింది. అడవిలోపలికి భారీ యంత్రాలు, వాహనాలు తీసుకెళ్తామని, అందుకు రోడ్డు, చెట్లు, పొదలను తొలగించాలని 200, 300 మీటర్ల లోతున 4 వేల బోర్లు వేస్తామని, నల్లమల అటవీ ప్రాంత వ్యాప్తంగా ఈ బోరింగ్ పాయింట్లు ఉంటాయని, దాదాపు ఐదేళ్ల పాటు ఈ సర్వే ప్రక్రియ సాగించేందుకు అనుమతినివ్వాలంటూ ఈ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. గతంలో ఆమోదించిన ప్రతిపాదనలకు భిన్నంగా ఉన్న కొత్తగా అనుమతులివ్వలేమని, కొత్త ప్రతిపాదనలను ఫారమ్–సీలో.. అంటే ఎన్ని బోర్లు వేస్తారు, ఎలా వేస్తారు, భారీ యంత్రాలు ఎలా తీసుకెళ్తారు, చెట్లకు ఎంత నష్టం వాటిల్లుతుంది, జీవవైవిధ్యంపై ప్రభావం, దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, వివరాలు అందజేయాలని ఏఎండీకి రాష్ట్ర అటవీశాఖ సూచించింది. ఈ పరిణామాలపై ఇటు అక్కడి గిరిజనులు, పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నల్లమలలో యురేనియం అన్వేషణ, వెలికితీతకు అనుమతించబోమంటూ రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఫీల్డ్ డైరెక్టర్ నుంచి నివేదిక.. ఏఎండీ పంపించిన కొత్త ప్రతిపాదనలను ఏటీఆర్ పరిధిలోని ఫీల్డ్ డైరెక్టర్కు పంపించగా, పార్ట్–3 ఫార్మాట్లో వాటిని తిరస్కరిస్తూ అటవీశాఖకు నివేదిక అందింది. ఏటీఆర్లో యురేనియం నిల్వలపై సర్వే, వెలికితీత ప్రతిపాదనల పరిశీలన సాధ్యం కాదంటూ క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ పంపించింది. ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించలేమని, వీటి వల్ల అడవికి, జంతువులు, వృక్షాలకు నష్టం వాటిల్లుతుందని ఈ నివేదికలో ఫీల్డ్డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ డ్రిల్లింగ్ వల్ల ఇక్కడి ప్రాంతం కలుషితమై ఆ నీళ్లు కృష్ణానదిలో కలసి, హైదరాబాద్కు సరఫరా అయ్యే నీటిలో కూడా యురేనియం కలుషితాలు చేరితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నివేదికను రాష్ట్ర వన్యప్రాణి మండలి సమక్షంలో ఉంచడంతో పాటు ఏఎండీ తాజా ప్రతిపాదనలను పరిశీలించి ఇవి ఆచరణ సాధ్యం కాదంటూ ఈ సమావేశం తిరస్కరించింది. ఏఎండీ ప్రతిపాదనలను రాష్ట్ర వన్యప్రాణి బోర్డు తిరస్కరించినందు వల్ల కేంద్ర బోర్డు కూడా దీన్ని తిరస్కరించడం లాంఛనమే కానుంది -
యురేనియం సర్వేపై మీ వైఖరేమిటి?
సాక్షి, హైదరాబాద్: నల్లమలలో యురేనియం నిక్షేపాల అన్వేషణ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో యురేనియం ని ల్వలు ఎక్కడెక్కడున్నాయన్న దానిపై సర్వే చేపట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కోరింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ అటవీ సలహా మండలి సమావేశంలో ఏటీఆర్ పరిధిలో ప్రతిపాదిత యురేనియం నిల్వల సర్వే, వెలికితీత అంశం చర్చకు వచ్చింది. ఈ విషయంపై రాష్ట్ర వన్యప్రాణి మండలి నిర్ణయమేమిటో నివేదిక రూపంలో తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమావేశం సూచించింది. గతంలో జరిగిందిదీ..: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ కోసం 200, 300 మీటర్ల లోతున అటవీ ప్రాంతవ్యాప్తంగా 4 వేల బోర్లు వేస్తామని, దాదాపు ఐదేళ్ల్లపాటు ఈ సర్వే ప్రక్రియ సాగించేందుకు అనుమతినివ్వాలంటూ గతేడాది టమిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ) నుంచి ప్రతి పాదనలు వచ్చాయి. గత ప్రతిపాదనలకు భిన్నంగా ఉన్న ఈ కొత్త ప్రతిపాదనలను తిరస్కరిస్తూ సంబంధిత ఫైల్ను జిల్లా, క్షేత్రస్థాయి అధికారులు తాజా గా తిప్పి పంపించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇటీవల వారం, పదిరోజుల క్రితమే ఈ మేరకు నివేదికను హైదరాబాద్లోని అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి నివేదించినట్టు తెలుస్తోంది. ఈ కొత్త ప్రతిపాదనలను పరిశీలించలేమని, వీటివల్ల అడవికి, జంతువులు, వృక్షాలకు నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. అడవిలో ప్రతిపాదిత బోరు వేసే పాయింట్లను ఏఎండీ సాంకేతిక బృందం వచ్చి చూపిస్తే తప్ప గుర్తించలేమని, ఈ బృందాల ప్రవేశానికి కూడా స్థానిక గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఈ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఈ నివేదికను రాష్ట్ర వన్యప్రాణి మండలి సమక్షంలో ఉంచి, ఏటీఆర్లో యురేనియం నిల్వలపై సర్వే, వెలికితీత సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ నివేదించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు తెలియజేసే అవకాశముందని సమాచారం. -
యురేనియం కలకలం!
అమ్రాబాద్: నల్లమలలో మళ్లీ యురేనియం తవ్వకాల కలకలం మొదలైంది. గతేడాది మూడు నెలల పోరాటం అనంతరం నల్లమలలో యురేనియం సర్వేకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ రాష్ట్ర ప్ర భుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. లాక్డౌన్ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు రోడ్లు, బోర్లు వేస్తూ యురేనియం తవ్వకాలకు రంగం సిద్ధం చేస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పరిశీలన అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని అడవిని, అడవిలో వేసిన రోడ్లను పరిశీలించేందుకు మంగళవారం అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ ఏకే సిన్హా, జిల్లా అటవిశాఖ అధికారి జోజీ వచ్చారు. వీరిని నల్లమల యురేనియం తవ్వకాల వ్యతిరేక జేఏసీ నాయకులు, స్థానిక ప్రజలు అమ్రాబాద్ సమీపంలోని ఎల్మపల్లి స్టేజీ వద్ద వారిని అడ్డుకున్నారు. అంతకుముందు నల్లమల యురేనిం తవ్వకాల వ్యతిరేక జేఏసీ నాయకుడు నాసరయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా యురేనియం తవ్వకాలకు అనుమతిస్తే ఊరుకోమని నిలదీశారు. తవ్వకాలకు అనుమతులిచ్చి నల్లమలోని ప్రజలు, వన్యప్రాణులు, నదీ జలాలను నాశనం చేయొద్దని కోరారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ బీసన్న, ఎస్ఐ పోచయ్య అక్కడికి వచ్చి జేఏసీ నాయకులు, స్థానిక ప్రజలతో మాట్లాడారు. అటవీశాఖ అధికారులతో కలిసి ముగ్గురిని పంపే ప్రయత్నం చేశారు. అటవీశాఖ అధికారులు కొద్దిసేపు అమ్రాబాద్ అటవీశాఖ కార్యాలయంలో వేచి ఉండి తిరిగి వెళ్లిపోయారు. అధికారులు ఎవరూ మాట్లాడకుండా తిరిగి వెళ్లిపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. పదిహేనుమందిపై కేసు అధికారులను అడ్డుకున్న నల్లమల యురేనియం తవ్వకాల వ్యతిరేక జేఏసీ నాయకులు నాసరయ్యతో నాటు మరో పద్నాలుగు మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులను అడ్డగించడం సరైంది కాదని కౌన్సెలింగ్ ఇచ్చారు. -
యురేనియం తవ్వకాల అనుమతులు రద్దు
సాక్షి, హైదరాబాద్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ, తవ్వకాలకు సంబంధించి అటామిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ)కు రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు ఇచ్చిన అనుమతులు రద్దయ్యాయి. యురేనియం నిల్వలున్నాయో లేదో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్తోపాటు వెలికితీతకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని రాష్ట్ర అటవీ శాఖ స్పష్టం చేసింది. గత ఏఎండీ ప్రతిపాదనలకు పూర్తి భిన్నంగా ప్రస్తుత ప్రాజెక్టు స్వరూపం మారడం తో నల్లమలలో 4 వేల బోర్లు వేసి యురేనియం అన్వేషిస్తామంటూ ఏఎండీ పంపించిన కొత్త ప్రతి పాదనలు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అటవీ శాఖ స్పష్టీకరించింది. యురేని యం అన్వేషణకు 2016 డిసెంబర్లో తెలం గాణ స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశం ఇచ్చిన అనుమతులు, ఒప్పందాలు రద్దయినట్టుగా ఏఎండీ, కేంద్ర అటవీశాఖ, కేంద్ర వన్యప్రాణి బోర్డుకు తాజాగా లేఖల ద్వారా స్పష్టం చేసింది. కలిసొచ్చిన నిబంధనలు.. నల్లమలలో ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం లో యురేనియం అన్వేషణలో అడవికి నష్టం కలి గించేలా ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదనే అటవీ నిబంధనల్లో పొందుపరచడం రాష్ట్ర అటవీ అధికారులకు కలిసొచ్చింది. అందుకు విరుద్ధంగా ఏఎండీ ప్రతిపాదిత చర్యలున్నందున గతంలో ఆమోదించిన ప్రతిపాదనలకు ఎలాంటి విలువలేకుండా పోయిందని అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 2016లో జరిగిన వైల్డ్లైఫ్ బోర్డు సమావేశంలో పర్యావరణవేత్తలుగా ఉన్న పలువురు సభ్యులు టైగర్ రిజర్వ్లో అన్వేషణకు ఎలాంటి తవ్వకాలు జరపరాదని, అందుబాటులో ఉన్న మార్గాలు, ఇతర నియమ, నిబం ధనలను మినిట్స్లో నమోదు చేశారు. ఈ నేపథ్యంలో 2016 సమావేశంలోని నమోదు చేసిన మినిట్స్కు వ్యతిరేకంగా తాజా ప్రతిపాదనలున్నందున గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నట్టు అటవీశాఖ ప్రకటించింది. శాస్త్ర, సాంకేతికపరమైన అవసరాల కోసం యురేనియం అన్వేషణ అవసరం పడితే అది ఎలా చేస్తారు, దానికి అనుసరించే పద్ధతులు, సాంకేతికతకు సంబంధించి ఏఎండీ కొత్త ప్రతిపాదనలను స్టేట్ వైల్డ్లైఫ్ బోర్డుకు పంపిస్తే వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఉభయసభల తీర్మానంతో.. రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసేం దుకు అనుమతివ్వబోమని కౌన్సిల్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. యురేనియం నిక్షేపాల పరిశోధన, తవ్వకాలకు అనుమతులు ఇచ్చేది లేదంటూ ఉభయసభల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించడంతో అటవీ అధికారులు తాజాగా శాఖాపరంగా తమ వైఖరి స్పష్టంచేశారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అటవీ శాఖ పూర్తిస్థాయిలో కట్టుబడిఉందని, డ్రిల్లింగ్ చేయకుండా యురేనియం నిక్షేపాల అన్వేషణ చేపడతామంటూ ఏఎండీ సమర్పించిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఇచ్చిన అనుమతులు కూడా రద్దయినట్టుగా లేఖ ద్వారా వెల్లడించింది. -
‘ముఖ్యమంత్రులు కాదు.. ప్రజలు శాశ్వతం’
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్టోబర్ 10 నుంచి 16 వరకు ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. రెండు రోజులుగా సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఈ సమావేశంలో అనేక అంశాలపై తీర్మానాలు చేశామని అన్నారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక దేశంలో తిరోగమనంలో వెళ్తుందని దుయ్యబట్టారు. గోదావరి నీళ్లు కృష్ణా నదిలోకి తరలించడం మంచి నిర్ణయమని.. కానీ అందరి అభిప్రాయాలను తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలని చాడ వెంకట్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రులు శాశ్వతం కాదని, ప్రజలు శాశ్వతంగా ఉంటారని అన్నారు. ప్రజల అభిష్టానికి విరుద్ధంగా పని చేస్తే పతనం తప్పదని హెచ్చరించారు. యురేనియం తవ్వకాలను సీపీఎం పార్టీ వ్యతిరేకిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం తవ్వకాలకు సంబంధించిన పనులను నిలిపివేయాని పేర్కొన్నారు. యురేనియం వెలికితీత కారణంగా మానవ మనుగడకే ప్రమాదకరమని, కృష్ణా నది నీళ్లు సైతం కలుషితమవుతాయని తెలిపారు. దీనిపై పెద్ద ఎత్తున సీపీఐ ఆందోళన కార్యక్రమం చేపడుతుందని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. -
‘రేవంత్... నా ముద్దుల అన్నయ్య’
సాక్షి, హైదరాబాద్ : తనకు యురేనియం విషయంలో ఏబీసీడీలు కూడా తెలియవని, పవన్ కల్యాణ్తో సెల్ఫీ అవకాశం ఇవ్వనందుకే తాను టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడానంటూ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి తాను చాలా బాధపడ్డానని ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్కుమార్ పేర్కొన్నారు. రేవంత్ తనకు ముద్దుల అన్నయ్య అని, ఆయన మాట్లాడిన మాటలకు తాను స్పందించాల్సిన అవసరం వస్తుందని ఎప్పుడూ భావించలేదని చెప్పారు. -
‘గతంలో అనుమతులిచ్చాం.. ఇప్పుడు వద్దంటున్నాం’
సాక్షి, హైదరాబాద్ : నల్లమలలో యురేనియం అన్వేషణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చిందన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. రాష్ట్ర జంతు పరిరక్షణ బోర్డుతో సమావేశం ఏర్పాటు చేసి అనుమతులు వెనక్కు తీసుకోవాలని కోరారు. లేకపోతే అచ్చంపేట నుంచి ‘ఛలో ప్రగతి భవన్’ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం మల్లు రవి అధ్యక్షతన కాంగ్రెస్ అధికార ప్రతినిధుల సమావేశం గాంధీభవన్లో జరిగింది. ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ.. యురేనియం కంటే బొగ్గు గనుల వల్ల ఎక్కువ నష్టం ఉంటుందని కిషన్రెడ్డి అనడం ఆయన అవగాహనారాహిత్యమన్నారు. ఈ విషయంలో శాస్త్రవేత్తలను పిలుచుకొని తెలుసుకోవాలని కేంద్రమంత్రికి సలహా ఇచ్చారు. యురేనియం ద్వారా గాలి, నీరు కాలుష్యమవుతాయని.. అడవి, చెంచులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చామని ఒప్పుకున్న మల్లురవి, కడపలో జరుగుతున్న నష్టం చూశాక వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. యురేనియం పేరుతో తెలంగాణ ప్రజల మీద దాడి చేసినట్టవుతుందనీ, రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడి మైనింగ్ను రద్దు చేయించాలని సూచించారు. మరోవైపు నేటి నుంచి కాంగ్రెస్ నేతలు టీవీ చర్చలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు మల్లు రవి వెల్లడించారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు ఆయన తెలిపారు. కాగా, ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు టీవీ చర్చలకు దూరంగా ఉంటుండగా కాంగ్రెస్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
రాష్ట్ర ప్రతిపాదననే కేంద్రం అంగీకరించింది
సాక్షి, న్యూఢిల్లీ: నల్లమల అడవుల్లో యురేనియం అన్వేషణకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో చేసిన ప్రతిపాదననే కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి అన్నారు. సీఎం చైర్మన్గా వ్యవహరించే వన్యప్రాణి బోర్డు–2016 డిసెంబర్లో వైస్ చైర్మన్ అయిన అప్పటి అటవీ శాఖ మంత్రి జోగురామన్న అధ్యక్షతన సమావేశమై నల్లమల అడవుల్లో 2 వేల హెక్టార్లలో యురేనియం అన్వేషణకు ఆమోదం తెలిపిందని చెప్పారు. నాడు యురేనియం అన్వేషణకు ఆమోదం తెలిపిన టీఆర్ఎస్.. నేడు దానికి వ్యతిరేకం అని అసెంబ్లీలో తీర్మానాలు చేస్తూ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందన్నారు. యురేనియం తవ్వకాలపై అన్ని వర్గాల నుంచి కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంపై కిషన్రెడ్డి స్పందించారు. గురువారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అధ్యయనం కోసమే.. నేషనల్ మినరల్ పాలసీలో భాగంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఖనిజ సంపద లభ్యత, వాటి నాణ్యత, ప్రయోజనాలపై అధ్యయనం జరిపేందుకు కేంద్రం యురేనియం అన్వేషణ జరుపుతోందని కిషన్రెడ్డి చెప్పారు. దీని లో భాగంగా నల్లమల అడవుల్లో యురేనియం ఏ స్థాయిలో ఉంది, దాని నాణ్యతెంత, భవిష్యత్తు తరాలకు అది ఏ మేరకు ఉపయోగపడుతుందన్న విషయాలపై అధ్యయనం జరిపించేందుకు అన్వేషణ మాత్రమే జరుపుతోందన్నారు. అయితే ఎక్కడా కూడా తవ్వకాలకు ఎలాంటి అనుమతులివ్వలేదని చెప్పారు. హైదరాబాద్లో ఎన్ఆర్సీ (నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్) చేపట్టడంపై కిషన్రెడ్డిని ప్రశ్నించగా.. జమ్మూ కశ్మీర్ తర్వాత హైదరాబాద్లోనే అధిక సంఖ్యలో రోహింగ్యాలున్నారని.. అక్కడ ఎన్ఆర్సీ చేపట్టడం అన్నది కేవలం ప్రతిపాదన మాత్రమేనని బదులిచ్చారు. -
‘యురేనియంపై టీఆర్ఎస్ రెండు నాలుకల ధోరణి’
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్ఎస్ పార్టీ యురేనియం తవ్వకాలపై రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. గతంలో యురేనియం తవ్వకాలకు టీఆర్ఎస్ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక సంప్రదింపుల తరువాతే ఈ ప్రక్రియ మొదలు పెట్టిందని, అయితే ఇప్పటి వరకు యురేనియం తవ్వకాల గురించి ఎవరికి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని అనేక ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలపై పరిశోధనలు జరుగుతున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యురేనియం తవ్వాకాలపై కొన్ని పార్టీలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని, గతంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు యురేనియం నిక్షేపాల వెలికితీత గురించి అన్వేషణలు చేశాయని మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నల్లమలలో యురేనియం గురించి పరిశోధనలు చేసిందని, అధికారం ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఒకలా ఊసరవెల్లిలా మాటలు మార్చుతుందని ఆరోపించారు. కేంద్ర పభుత్వం అనేక సంప్రదింపుల తర్వాతే ఈ ప్రక్రియ మొదలు పెట్టిందని, ప్రస్తుతం టీఆర్ఎస్ అసెంబ్లీలో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసిందని మండిపడ్డారు. గ్యాస్, బొగ్గు, బంగారం, సీసం, విద్యుత్ ఎంత ఉన్నదో తెలుసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని, కాగా ఇంత వరకు అసలు ఎంత యురేనియం ఉందో ఇంకా తేల్చలేదని కిషన్రెడ్డి పేర్కొన్నారు. -
పవన్కల్యాణ్ మీటింగ్కు మనమెందుకు?: సంపత్
సాక్షి, హైదరాబాద్: ‘పవన్ కల్యాణ్కు తెలంగాణలో యురేనియం తవ్వకాలకు ఏం సంబంధం? జనసేన బ్యానర్పై స్టార్ హోటల్లో నిర్వహించిన సమావేశానికి 130 సంవత్సరా ల చరిత్ర కలిగిన పార్టీ ప్రతినిధులుగా మనం వెళ్లడం ఏంటి? టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వీహెచ్లాంటి నాయకులు అక్కడకు వెళ్లి 4 గంటలు కూర్చోవడం ఏంటి? మన బలం తో పవన్ను హీరో చేయడమెందుకు? అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్కుమార్ కాంగ్రెస్ ముఖ్య నేతలను నిలదీశారు. పవన్ సమావేశానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడంపై మంగళవారం జరిగిన టీపీసీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో వాడివేడిగానే చర్చ జరిగింది. తవ్వకాలపై ఢిల్లీలో ఉన్నతాధికారులను కలిశామని, మాజీ ఎమ్మెల్యే వంశీ పోరాటం చేస్తున్నారని, ఉత్తమ్ సీఎంకు లేఖ రాశారని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా కల్పించుకొని దీన్ని పునరావృతం కానివ్వమని అన్నారు. -
అభివృద్ధి పేరుతో అంతం చేస్తారా?
చర్ల: అభివృద్ధి పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ తెగలను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నాయని గోండ్వానా సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి ఆరోపించారు. సోమవారం చర్లలోని ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ములుగు జిల్లా అధ్యక్షుడు వాసం నాగరాజుతో కలిసి ఆయన మాట్లాడారు. ఆదివాసీ తెగలను అందమొందించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని ఆరోపించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. నల్లమల ప్రాంతం రెండు రాష్ట్రాలు, ఆరు జిల్లాల నైజర్గిక స్వరూపాన్ని కలిగి ఉండగా 1961 జనాభా లెక్కల ప్రకారం ఆ ప్రాంతంలో ఆదిమ జాతి తెగలలోని చెంచు కులస్తులు సుమారు 45 వేల మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ప్రభుత్వాల వ్యవహార శైలి వల్ల 10 వేలకు పడిపోయిందని ఆరోపించారు. ఆదిమ తెగలను కాపాడాల్సిన ప్రభుత్వాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఆదివాసీ తెగలు నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న 10 వేల మంది ఉన్న చెంచు తెగలో కేవలం 150 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మాత్రమే ఉన్నారంటే ఆ తెగను ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తూ నిర్వీర్యం చేస్తుందో గ్రహించవచ్చని ఆయన అన్నారు. యురేనియం తవ్వకాలు చేపట్టాలని యోచిస్తున్న నల్లమల అటవీ ప్రాంతం రెండు రాష్ట్రాలు, ఆరు జిల్లాలను కలుపుకుని విస్తరించి ఉండగా ఆ అటవీ ప్రాంతంలో 250 రకాల పక్షిజాతులు, వేలాది రకాల ఆయుర్వేద మొక్కలు ఉన్నాయని అన్నారు. యురేనియం తవ్వకాల వల్ల వీటి మనుగడ లేకుండా పోతుందని ఆయన అన్నారు. యురేనియం తవ్వకాల ఇటువంటి నష్టాలు కలుగనున్న నేపథ్యంలో పర్యావరణ శాస్త్రవేత్తలు ఎందుకు నోరుమెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో గతంలో మంచినీటి పరీక్షల పేరుతో 40 బోర్లు వేశారని మళ్లీ కేంద్ర ప్రభుత్వం 2 వేల ఎకరాల్లో 4 వేలకు పైగా బోరు వేసి భూగర్భంలో ఉన్న యురేనియాన్ని బయటకు తీయాలని చూస్తోందని అన్నారు. యురేనియం తవ్వకాలు చేపట్టడం వల్ల అటవులు అంతమవ్వడంతో పాటు అటవీ ప్రాంతాల్లో జీవనాన్ని కొనసాగిస్తున్న చెంచు తెగ అంతరించిపోతుందని అన్నారు. తక్షణమే అలాంటి ప్రయత్నాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఖనిజ సంపదను దోచుకోవడాన్ని బుర్జువా రాజకీయ వేత్తలు కుట్రలు చేస్తున్నారని వీటిని ప్రతీ ఆదివాసీ ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని లేకుంటే ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన పిలుపునిచ్చారు. గిరిజనేతరలు స్వాధీనంలోకి వెళ్లిన భూ వ్యవహరంపై రెవెన్యూ యంత్రాంగం తక్షణమే సమగ్ర దర్యాప్తు జరిపి, ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ చట్టాలైన 1/70, పీసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రభుత్వాలు గుర్తించి వాటిని కాపాడాలని అన్నారు. ఇత్తు పండగ, కొత్తల పండగలకు ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. -
యురేనియం అన్వేషణ ఆపేయాలి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో యురేనియం అన్వేషణ, తవ్వకాలను తక్షణమే నిలిపేయాలని వివిధ పార్టీలు, స్వచ్ఛంద, ప్రజాసంఘాలు, నిపుణులతో కూడిన అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానంలోని అంశాలపై ఇంకా స్పష్టతివ్వాలని పేర్కొంది. పలు డిమాండ్లను అఖిలపక్షం ఏకగ్రీవంగా ఆమోదించింది. అయోమయానికి గురిచేస్తున్నారు.. సోమవారం దస్పల్లా హోటల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ‘యురేనియం ఆపాలి.. నల్లమలను పరిరక్షించాలి’అంశంపై ఈ సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. యురేనియం పరిశోధన, అన్వేషణ, వెలికితీత ఏ రూపంలో ఉన్నా వాటిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంద న్నారు. యురేనియం అన్వేషణ నల్లమలపై ఎక్కుపెట్టిన తుపాకీ అని, దాన్ని తప్పక దించాలని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లి, యురేనియం అన్వేషణకు అనుమతించబోమని చెప్పా లని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. యురేనియం తవ్వకాలు, అన్వేషణ ఆపేస్తామన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలపాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అనంతరం మాజీ న్యాయమూర్తి గోపాల్గౌడ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి మాట్లాడారు. సమావేశంలో నిపుణులు, పర్యావరణవేత్తలు బాబూరావు, కె.పురుషోత్తంరెడ్డి, డి.నర్సింహారెడ్డి, ప్రొ.జయధీర్ తిరుమలరావు, కొండవీటి సత్యవతి, వి.సంధ్య, అరవింద్, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, కాంగ్రెస్ నేత వీహెచ్, మూమెంట్ అగెన్ట్ యూరోనియం ప్రతినిధి కె.సజయ, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఇమ్రాన్ సిద్దిఖీ తదితరులు పాల్గొన్నారు. -
యురేనియంకు అనుమతించం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి, జీవావరణానికి, ప్రకృతి రమణీయతకు నెలవైన నల్లమల అడవులతోపాటు రాష్ట్రంలో ఎక్కడా కూడా యురేనియం తవ్వకాలను అనుమతించేదిలేదని శాసనసభ తీర్మానించింది. యురేనియం నిక్షేపాల తవ్వకాలను వ్యతిరేకిస్తూ గనులు, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. యురేనియం నుంచి వెలువడే అణుధార్మికతతో పంటలు పండే భూమి, పీల్చే గాలి, తాగే నీరు కలుషితమయ్యే ప్రమాదముందని.. యురేనియం తవ్వకాల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీ కేంద్రాన్ని కోరింది. ప్రజల ఆందోళనలతో ప్రభుత్వం ఏకీభవిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. అరుదైన జంతు జీవజాలం, వృక్షజాలంతో జీవవైవిధ్యానికి ఆలవాలమైన అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతినే ప్రమాదముందని, మానవాళితోపాటు సమస్త ప్రాణకోటి మనుగడకు ముప్పు పరిణమించే అవకాశాలున్నందున యురేనియం తవ్వకాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సవరణలతో మళ్లీ... ముందుగా నల్లమల అడవుల్లో మాత్రమే యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే దానిపై కాంగ్రెస్ సభ్యులు కొన్ని సవరణలు కోరుతూ చర్చకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ తీర్మానాన్ని అప్పటికే ఆమోదించినందున అవకాశం ఇవ్వడం కుదరదని స్పీకర్ తేల్చిచెప్పారు. యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని మీరే అడిగి.. ఇప్పుడు చర్చకు పట్టుబట్టడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. అయినా సభ్యులు బిగ్గరగా మాట్లాడుతుండటంతో కేటీఆర్ కాంగ్రెస్ సభ్యుల దగ్గరకు వెళ్లి మాట్లాడి సర్ది చెప్పడంతో వారు కూర్చున్నారు. అనంతరం ఆ తీర్మానానికి సవరణలు చేసి సభలో మళ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నల్లమల అటవీ ప్రాంతమే కాదు... రాష్ట్రంలో ఎక్కడా యురేనియం తవ్వకాలను అనుమతించబోమంటూ సవరణ చేశారు. ఆ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని స్పీకర్ పోచారం ప్రకటించారు. ఐక్యంగా ముందుకు...: కేటీఆర్ యురేనియం తవ్వకాల విషయంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, వ్యతిరేక పోరాటంలో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. యురేనియం విషయంలో రెండు అంశాలు ఉన్నాయని, ఒకటి అన్వేషణ కాగా రెండోది తవ్వకాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఏఎండీకి మైదాన ప్రాంతంలో అన్వేషణకు ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అదే అటవీ ప్రాంతమైతే రాష్ట్ర వన్య సంరక్షణ మండలి అనుమతి తప్పనిసని చెప్పారు. 1992 నుంచి 2013 వరకు అన్వేషణ, తవ్వకాలకు అనుమతులిచ్చారని... తాము అధికారంలోకి వచ్చాక ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. అన్వేషణ అనేది పూర్తిగా కేంద్రం చేతిలోనే ఉన్నా మైనింగ్కు మాత్రం రాష్ట్ర ఆమోదం అవసరమన్నారు. అప్పుడే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని అమలు చేస్తుందన్నారు. కేంద్రం జాతి ప్రయోజనాలు అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తే సంఘటితంగా ముందుకు సాగుదామన్నారు. అన్వేషణ కూడా ఆపాల్సిందే: భట్టి విక్రమార్క రాష్ట్రంలో యురేనియం తవ్వకాల విషయంలోనే కాకుండా యురేనియం అన్వేషణను కూడా కేంద్రం ఆపాల్సిందేనని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. నల్లమల అటవీ ప్రాంతమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని సవరించడంపట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, పాషా ఖాద్రీ మాట్లాడారు. -
ప్రకటనలు కాదు తీర్మానం చేయాలి: సీతక్క
సాక్షి, హైదరాబాద్: నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అసెంబ్లీ, మండలిలో తీర్మానం చేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఆదివారం అసెంబ్లీ ఆవరణలో ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే అధిక సంఖ్యలో పులులు సంచరించే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతానికి యురేనియం తవ్వకాలతో ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా టీఆర్ఎస్ సర్కార్ ఎందుకు మౌనం వహించిందో చెప్పాలని నిలదీశారు. ఈ తవ్వకాల వల్ల నల్లమల నాశనమవుతుందని, తద్వారా పరిసర నదులు ప్రభావితమై ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. -
తప్పు చేయబోం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాల విషయంలో ఎలాంటి తప్పుచేయదు, చేయబోదని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. యురేనియం పరిశోధన, తవ్వకాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు, భవిష్యత్లో ఇవ్వబోదని అన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలున్నా యని భావించినా బయటకు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వదన్నారు. ఆదివారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ అంశంపై ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వేసిన ప్రశ్నకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో సహా కాంగ్రెస్ సభ్యుడు టి.జీవన్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఎంఐఎం సభ్యుడు అమీనుల్ జాఫ్రీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, కర్నె ప్రభాకర్ వేసిన అనుబంధ ప్రశ్నలు లఘు చర్చకు దారితీశాయి. సభ్యులు వెలిబుచ్చిన ఆందోళనలు, సందేహాలపై కేటీఆర్ వివరణనిచ్చారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ మండలి, అసెంబ్లీలో తీర్మానం చేయాలని, నిక్షేపాల అన్వేషణను ఆపే అవకాశం ఉంటే పరిశీలించి కేంద్రానికి పంపించాలని పలువురు సభ్యులు సూచించారు. దీనిపై సీఎంతో మాట్లాడి, కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ చెప్పారు. బాధ్యతారాహిత్యం... యురేనియం విషయంలో కొందరు రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఒక పార్టీ అధ్యక్షుడు అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండగానే అనుమతులిచ్చిన విషయాన్ని మరిచి, టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించే చర్యలను సీఎం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమన్నారు. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం అన్వేషణకు అనుమతి ఇచ్చిందన్నారు. దీనిపై ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పరిధిలోని అటమిక్ మినరల్ డైరెక్టరేట్ (ఏఎండీ) అన్వేషణకు సంబంధించిన పనులు చేస్తోందన్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదన్నారు. భయాందోళనలు వాస్తవమే... యురేనియం తవ్వకాలపై ప్రజల్లో భయాందోళన లు ఉన్న మాట వాస్తవమేనని కేటీఆర్ అన్నారు. ఏఎండీ అన్వేషణ పూర్తయ్యాక, ప్రభుత్వాల నుంచి తవ్వకాలకు అనుమతి లభిస్తే యురేనియం కార్పొరేషన్ వాటి ని చేపడుతుందన్నారు. అయితే యురేనియంను గుడ్డిగా వ్యతిరేకించడం కూడా సరికాదన్నారు. ఏఎండీ ఉద్ధేశం కేవలం విద్యుత్ ఉత్పాదనకే అయి ఉండదని, న్యూక్లియర్ రియాక్టర్లు, అణ్వాయుధాలు, అంతరిక్ష పరిశోధనలు, సెటిలైట్లలో వాడే ఇంధనంగా, అంతరిక్ష ప్రయోగాలకు యురేనియం ఉపయోగిస్తారన్నారు. యురేనియం ఉందని తేలినా శుద్ధిచేసే వరకు రేడియేషన్ రాదని తెలిపారు. రాష్ట్ర వన్యప్రాణి బోర్డుకు సీఎం చైర్మన్గా వ్యవహరిస్తారని, 2016లో జరిగిన బోర్డు సమావేశంలో యురేనియం మైనింగ్కు అనుమతులు ఇవ్వలేదన్నా రు. ఈ నిక్షేపాల అన్వేషణకు సంబంధించి ఒక్క చెట్టు కొట్టరాదని, కాలినడకన వెళ్లాలని, రాత్రి పూట పనిచేయరాదని, బోర్లు వేశాక వాటిని మూసేసి యధాతథస్థితికి తీసుకురావాలంటూ మినిట్స్లో పొందుపరిచినట్లు కేటీఆర్ తెలిపారు. -
ఉరేనియం తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదు
-
మేము తప్పు చేయం.. యురేనియంపై కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్ : ‘‘ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వదు. నల్లమలలో యురేనియం ఉందా లేదా అని తెలుసుకోవటానికి మాత్రమే ఏఎమ్డీ వాళ్లు పరీక్షలు చేస్తున్నారు. కేసీఆర్ పర్యావరణ ప్రేమికుడు.. అటవిని కూల్చరు. 2009లో తవ్వకాలకు పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తవ్వుతున్నది బీజేపీ అని మేము చెప్పవచ్చు.. కానీ, మేము చెప్పం. యురేనియం తవ్వకాలపై సీఎంతో చర్చించి అధికారికంగా తీర్మానం పెట్టేలా ప్రయత్నం చేస్తాం. మేము తప్పు చేయం.. చెయ్యబోం’’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదివారం శాసనమండలి సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా యురేనియం తవ్వకాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కొందరు రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక పార్టీ అధ్యక్షుడు ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలవకుండా వారు మాట్లాడుతున్నారని అన్నారు. వార్తా పేపర్లు కూడా తప్పులు ప్రచురిస్తున్నాయని తెలిపారు. నర్సీ రెడ్డి పేపర్ చూసి మాట్లాడినట్టు ఉన్నారని, పేపర్లో రాసినట్టు ఏమీ ఉండదన్నారు. ఒక ఎంపీ అక్కడి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి వేళ పనులు చేయకూడదని, బోర్లు తవ్విన వాటిని పూడ్చాలని చెప్పామన్నారు. -
‘కేటీఆర్ ట్వీట్ కొండంత అండనిచ్చింది’
సాక్షి, హైదరాబాద్: సేవ్ నల్లమల్ల పేరుతో మేధావులు, సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఎంతో ఊపిరినిచ్చిందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నల్లమల్లకు మద్దతుగా చేసిన ట్విట్ మాకు కొండంత అండగా అనిపించిందిని సంతోషం వ్యక్తం చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. గతంలో వజ్ర నిక్షేపాలు రాబర్ట్ వాద్రాకు కేటాయిస్తే సీఎం కేసీఆర్తో కలిసి తామంతా ముక్తకంఠంతో ఖండించినట్లు ఆయన గుర్తుచేశారు. తన నియోజకవర్గ ప్రజలకు ఇంత మంది అండగా ఉంటూ నాకు మరింత ధైర్యం ఇచ్చారన్నారు. నల్లమల్ల యూరేనియం తవ్వకాలపై కేసీఆర్ స్పందించటం లేదు అనటం పూర్తి అవాస్తవమని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..‘టీఆర్ఎస్ ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకునే నైజం మాది కాదు. ఉద్యమం చేసి తెలంగాణ సాధించాం. పోరాటం చేసే శక్తి మాకుంది. నల్లమల్లపై కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ప్రధానమంత్రి స్వయంగా పులుల దినోత్సవం రోజు అమ్రాబాద్లో పులుల సంఖ్యను చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద పులులు ఉన్న అడవిగా ఆమ్రాబాద్కు పేరుంది. అడవులు కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ అటవిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. యురేనియంపై నేను ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తా. సీఎం కేసీఆర్ సూచనలు, సలహాలు తీసుకొని మరో ఉద్యమానికి స్వీకారం చూడతాం. నా నియోజకవర్గంలోని ప్రజలకు అండగా ఉన్న మీడియా,సామాజిక కార్యకర్తలకు ధన్యవాదాలు’ అని వ్యాఖ్యానించారు. -
నల్లమల పై ఉరేనియం
-
యూరేనియం వ్యతిరేక కమిటి చైర్మన్గా వీహెచ్
సాక్షి, హైదరాబాద్: నల్లమల్ల అడవి యూరేనియం తవ్వకాల వ్యతిరేక కమిటి చైర్మన్గా మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ.హనుమంతరావు నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీలో మొత్తం 16 మంది సభ్యులు ఉంటారని ఆయన పేర్కొన్నారు. కాగా నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపకుండా పెద్దఎత్తున ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీపీసీసీ కోర్ కమిటీ తీర్మానించిన విషయం తెలిసిందే. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సేవ్ నల్లమల (#SaveNallamala) పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు ఈ విషయంపై గళమెత్తుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఈ విషయంపై స్పందించారు. -
‘యురేనియం’తో మానవ మనుగడకు ప్రమాదం
సాక్షి, షాద్నగర్: నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరిగితే వన్యప్రాణులతో పాటుగా మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉందని సామాజిక ఉద్యమకారిణి, సీనియర్ పాత్రికేయురాలు సజయ ఆందోళన వ్యక్తం చేశారు. నల్లమల్లలో యురేనియం తవ్వకాలను ఎందుకు వ్యతిరేకించాలనే అంశంపై పట్టణంలోని పెన్షనర్ భవనంలో గురువారం ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సజయ హాజరై మాట్లాడారు. నల్లమల్లలో యురేనియం తవ్వకాలు జరిపితే ఎంతోమంది ఉపాధిని కోల్పోయి నిరాశ్రయులుగా మారతారన్నారు. కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు కృష్ణానది నీటిని వినియోగించడమే కాకుండా అడవిలో 4వేల బోర్లను తవ్వించేందుకు నిర్ణయించిందని తెలిపారు. దీంతో ఆ ప్రాంతం బోరు బావులు, కృష్ణానది ప్రాజెక్టులోని నీరు పూర్తిగా కలుషితమయంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియాన్ని వెలికితీసే క్రమంలో నీటితో పాటుగా వాతావరణం కలుషితంగా మారుతుందన్నారు. నల్లమల్ల అడవుల చుట్టూ ఉన్న మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలతోపాటు కృష్ణానది నీటిని వినియోగించే ప్రాంతాలు యురేనియంతో ప్రత్యక్ష, పరోక్షంగా ప్రభావితమవుతాయని హెచ్చరించారు. యురేనియం వెలికితీసి అణు విద్యుత్ను ఉత్పత్తి చేస్తామని కేంద్రం చెబుతోందని తెలిపారు. యురేనియం భూమిలో ఉన్నంత వరకు జీవకోటికి ఎలాంటి హాని లేదని, దానిని బయటకు తీసేటప్పుడు వెలువడే రేడియేషన్ వల్ల భూమి, వాతావరణం, నీళ్లు పూర్తిగా కలుషితమతాయని చెప్పారు. తద్వారా చర్మవ్యాధులు రావడంతో పాటుగా రేడియేషన్ తీవ్రత పెరిగి ప్రజలకు భయానకమైన క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. పుట్టబోయే శిశువులు అంగవైకల్యం వస్తుందని, రోగాల బారిన పడతారని అన్నారు. సమస్యలు వచ్చినప్పుడు ప్రతిఒక్కరూ ప్రశ్నించే గొంతుకగా మారాలని పిలుపునిచ్చారు. ఉద్యమాలు, పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. యురేనియం వ్యతిరేక పోరాటం తెలంగాణ ఉద్యమ తరహాలో చేపట్టాలని అన్నారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీర్లపల్లి శంకర్, బాల్రాజ్గౌడ్, శ్రీకాంత్రెడ్డి, అశోక్, ప్రజాసంఘాల నాయకులు టీజీ శ్రీనివాస్, రవీంద్రనాథ్, తిరుమలయ్య, అర్జునప్ప, చంద్రారెడ్డి, సత్యం, శివారెడ్డి, శ్రీనివాస్, సిద్ధార్థ, కరుణాకర్, రఘు తదితరులు ఉన్నారు. -
యురేనియం తవ్వకాలపై పోరు
సాక్షి, హైదరాబాద్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపకుండా పెద్దఎత్తున ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీపీసీసీ కోర్ కమిటీ తీర్మానించింది. శనివారం రాత్రి హైదరాబాద్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి కుంతియా అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. యురేనియం తవ్వకాలు, రైతులు, వ్యవసాయ సమస్యలు, డెంగీ జ్వరాలు, యాదాద్రిలోని చిత్రాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన నేతలు.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టే అంశాలపై ఏఐసీసీ ఆదేశాల ప్రకారం త్వరలో కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. ఉద్యమాలకు సంబంధించి పలు కమిటీలు వేయాలని, త్వరలో పెద్దఎత్తున ఉద్యమ కార్యచరణ చేపట్టాలని నిర్ణయించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ బృందం ఆదివారం యాదగిరిగుట్టకు వెళ్లనుంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్యెల్యే శ్రీధర్బాబు, వీహెచ్, పొన్నాల, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, కొండపల్లి విద్యాసాగర్ ఈ బృందంలో ఉన్నారు. ఈ నెల 15న మహబూబ్నగర్లో నిర్వహించే టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో సభ్యత్వనమోదు కార్యక్రమం షెడ్యూల్ నిర్ణయించనున్నారు. ఇప్పటికే 22 లక్షల సభ్యత్వం ఉండగా, దానిని 40 లక్షలకు పెంచాలని పార్టీ భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల సంసిద్ధతపైనా చర్చించింది. -
‘యురేనియం’ గ్రామాల్లో నిపుణుల కమిటీ పర్యటన
సాక్షి, అమరావతి: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నియమించిన నిపుణుల కమిటీ ఈ నెల 9, 10 తేదీల్లో వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని యురే నియం ప్రాజెక్టు పరిసర గ్రామాల్లో పర్యటిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల వేల్పుల, మేడిపెంట్ల, కొట్టాల గ్రామాల్లో భూగర్భ జలమట్టం కలుషితమైందని, పంటలు పండటం లేదని, ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయ డం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు పీసీబీ నిపుణుల కమిటీని నియమించింది. ముంబైలోని అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు న్యూక్లియర్ ప్రాజెక్టు సేఫ్టీ డివిజన్ అధిపతి డాక్టర్ ఎల్ఆర్ బిష్ణోయ్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ–హైదరాబాద్) సీనియర్ ప్రిన్సి పల్ సైంటిస్టు డాక్టర్ ఈవీఎస్ఎస్కే బాబు, తిరుపతి ఐఐటీ సివిల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సురేష్ జైన్, డాక్టర్ ప్రసన్న వెంకటేశ్ సంపత్, డాక్టర్ శిభాబుద్దీన్, ఆంధ్రా వర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (విశాఖపట్నం) జియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం.జగన్నాథరావు, ఆంధ్రా వర్సిటీ ఫిజికల్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, కెమికల్ ఓషనోగ్రఫి విభాగాల అధిపతి డాక్టర్ పి.శ్యామల, రాష్ట్ర భూగర్భ జలాలు, గనులు, వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉప సంచాలకులు బి.నాగేశ్వరరావు, సి.మోహన్రావు, బాలూనాయక్, డి.మధుసూదన్రెడ్డితో కూడిన బృందం ఈ నెల 9, 10 తేదీల్లో ఆయా గ్రామాల్లో పర్యటిస్తుంది. భూగర్భ జలంపై యురేనియం ప్రాజెక్టుకు చెందిన టెయిలింగ్ పాండ్ ప్రభా వం, ఇక్కడ భూమిలోని నీటిలో రేడియో యాక్టివిటీ, వ్యవ సాయ, ఉద్యాన పంటలపై ప్రభావం, ఇతర అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. పూర్తిస్థాయిలో పరీక్షలు చేసి ఈ నెల 11వ తేదీన పీసీబీకి సమగ్రమైన నివేదిక ఇస్తుంది. -
నల్లమల అగ్నిగుండంగా మారుతుంది: చాడ
సాక్షి, మహబూబ్నగర్ : యురేనియం తవ్వకాలకు అనుమతినిస్తే నల్లమల అగ్నిగుండంగా మారుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక సైద్ధాంతిక రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యురరేనియం తవ్వకాలను ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చి అన్నిదేశాలు వెనక్కి తగ్గుతుంటే మన దేశంలో ఇలాంటి మైనింగ్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడం దారుణమని వ్యాఖ్యనించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలు జరిపితే రెండు రాష్ట్రాల్లోని ఏడు జిల్లాల్లో తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. 2003లో ఇలాంటి తవ్వకాలు జరిపితే అసెంబ్లీలో తామంతా వ్యతిరేకించామని గుర్తు చేశారు. అయితే తాజాగా మళ్లీ ఆ ప్రాంతంలోని ప్రజలు యురేనియం ప్రభావంపై నిరసనలకు దిగడంతో సీఎం జగన్ వాటిపై అధ్యయన కమిటీ వేశారని తెలిపారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమ్రాబాద్లో అధికంగా యురేనియం
సాక్షి, నాగార్జునసాగర్: కృష్ణానది తీర ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ పరిధిలోని పలు ప్రాంతాల్లో యురేనియం ఖనిజం తవ్వకాలు జరపాలని, అపారమైన నిల్వలు వెలికితీసి ఖర్మాగారాలను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రదేశమంతా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయతీరాలలోనే ఉండటంతో ఆయా ప్రాంతాలలోని నివాసితులంతా యురేనియం నిల్వలు వెలికి తీసేందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో యురేనియం ప్రాముఖ్యత ఏమిటి? దీన్ని ఎలా వెలికితీస్తారు? ఎలా శుద్ధి చేస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే దాదాపు 92 మూలకాల్లో యురేనియం ఒకటి. మొత్తం మూలకాల్లో దీని ద్వారా మాత్రమే అణువిద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అస్థిరమైన అణు నిర్మాణం, రేడియో ధార్మికత లక్షణాలు దీనికి కారణం. దాంతో ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్ ఉత్పత్తిలో యురేనియం కీలక పాత్ర పోషిస్తుంది. నేల, నీరు మనిషితో పాటు అన్ని జంతువుల్లో అతి తక్కువ మోతాదులో యురేనియం ఉంటుంది. కానీ వీటి నుంచి వాణిజ్య స్థాయిలో యురేనియంను ఉత్పత్తి చేయలేం. అందువల్ల యురేనియం ఎక్కువగా ఉన్న ఖనిజాలను గుర్తించి వాటినుంచి యురేనియంను వేరుచేసి ఉపయోగిస్తారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లోని నల్లమల అడవులు గల ప్రాంతాల్లో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో ఇటువంటి ఖనిజాలు అభ్యమవుతున్నాయి. యురేనియం సాధారణంగా పిచ్బ్లెండ్, యురేనైట్ అనే ఖనిజాల్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఖనిజాల నుంచి ఎలా వేరు చేస్తారు? ముడి ఖనిజాన్ని ముందు బాగా వేడి చేస్తారు. ఫలితంగా అందులో ఉన్న కర్భన, గంధక సంబంధ పదార్థాలు తొలిగిపోతాయి. తర్వాత ఆమ్ల, క్షార ద్రవాలతో ఖనిజాన్ని శుద్ధిచేస్తారు. దీనివల్ల యురేనియం మినహాయించి మిగిలిన మూలకాలు ఇతర రూపాల్లోకి మారిపోతాయి. మిగిలిన ద్రవానికి సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నిషియం వంటి వాటిని కలుపుతారు. దీంతో యురేనియం ఉన్న పదార్థం అవక్షేపంగా మిగిలిపోతుంది. ఇది పసుపురంగులో ఉంటుంది. దీన్నే ఎల్లో కేక్ అంటారు. దీనిని మళ్లీ శుద్ధిచేసి అణువిద్యుత్ రియాక్టర్లలో ఉపయోగిస్తారు. ఎల్లో కెక్ నైట్రిక్ యాసిడ్తో కలిపి ఒక ద్రావణంగా తయారు చేస్తారు. ఈ ద్రావణానికి ట్రైబ్యూటైల్ ఫాస్పేట్, కిరోసిన్ లేదా తగిన హైడ్రోకార్బన్లను కలపడం ద్వారా యురేనియంను వేరు చేస్తారు. దీనికి ఆమ్లంతో కలిపిన నీటిని చేరుస్తారు. దీనివల్ల శుద్ధ యురేనైల్ నైట్రేట్ వేరవుతుంది. ఈ యురేనైల్ నైట్రేట్కు కొన్ని రసాయనాలను కలుపుతారు. అప్పుడు జరిగే రసాయన చర్య వల్ల యురేనియం ఫ్లోరైడ్ ఏర్పడుతుంది. దీని నుంచి ఫ్లోరైడ్ను వేరు చేస్తారు. అప్పుడు అణువిద్యుత్ రియాక్టర్లలో వాడే యురేనియం లోహం తయారవుతుంది. దీన్ని కనుగొన్నదెవరు ? యురేనియంను జర్మనీ రసాయనిక శాస్త్రవేత్త మార్టిన్క్లాప్రోత్ 1798లో కనుగొన్నారు. యురేనియం రేడియో ధార్మికత లక్షణాన్ని 1896లో హెన్రీ ఆంటోని బెక్యూరెల్ అనే శాస్త్రవేత్త తొలిసారి గుర్తించారు. శుద్ధి చేసిన యురేనియం వెండి రంగులో ఉంటుంది. యురేనియం సహజ సిద్ధంగా వెండికంటే దాదాపు 40 రెట్లు ఎక్కువగా లభిస్తుంది. యురేనియం అణువులను విడగొట్టడం ద్వారా శక్తిని రాబట్టవచ్చని 1938లో ఒట్టోహన్, ఫిట్జ్, స్ట్రాట్స్మన్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక టన్ను యురేనియం ద్వారా దాదాపు నాలుగు కోట్ల కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది 16 వేల టన్నుల బొగ్గు, లేదా 8 వేల బ్యారెళ్ల ముడిచమురు ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తుకు సమా నం. అణువిద్యుత్తు, అణ్వాస్త్రాల్లో కాకుండా రంగురంగుల అద్దాల తయారీలోనూ యురేనియంను ఉపయోగిస్తారు. చిన్నచిన్న అణురియాక్టర్లలో యురేనియం ఐసోటోపులను తయారు చేసి వైద్య, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. 2001 నాటికి ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయిన యురేనియం 35,767 మెట్రిక్ టన్నులు. అణ్వాస్త్రాల్లో ఉపయోగించే ప్లూటోనియం కూడా యురేనియం ద్వారానే లభిస్తుంది. అణు రియాక్టర్లలో ఇంధనంగా యురేనియంను వాడిన తర్వాత మిగిలే వ్యర్థ పదార్థాల్లో ఫ్లూటోనియం ఒకటి. ఇంత విలువ కలిగిన యురేనియం నిల్వలు జిల్లాలోని పెద్దవూర, పెద్దఅడిశర్లపల్లి, నేరడుగొమ్ము, చందంపేట మండలాలతో పాటు మహబూబ్నగర్ నాగర్కర్నూల్ జిల్లాలో అపారమైన నిల్వలున్నాయి. సాగర్ తీరంలోగల పెద్దగట్టు, నంబాపూర్ తదితర ప్రాంతాల్లో 490 టన్నుల యురేనియం నిల్వలు లభించే అవకాశమున్నట్లుగా కేంద్ర అణుపరిశోధన సంస్థ గుర్తించింది. రిజర్వాయర్ వెంట 1337.62 ఎకరాల విస్తీర్ణంలో గనుల తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. ఇందులో 1140.91 ఎకరాలు అటవీశాఖ ఆధీనంలో ఉండగా 196.70 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసి సేకరించాల్సి ఉంది. 2005లోనే యూసీఐల్ దాదాపుగా రూ.300 కోట్ల అంచనా వ్యయంతో యురేనియం ప్రాజెక్టు పనులను నిర్వహించేందుకు నిర్ణయించింది. పెద్దగట్టు ప్రాంతాన్ని మూడు బ్లాకులుగా విభజించింది. పెద్దగట్టుప్రాంతంలో మొదటి, రెండవ బ్లాకుల్లో అండర్ గ్రౌండ్మైనింగ్ నిర్వహించేందుకు నిర్ణయించారు. అప్పట్లో పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన విషయం తెలిసిందే. -
‘ఆ ఆలోచన విరమించుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: తక్షణమే యురేనియం తవ్వకాలను నిలిపివేయకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి హెచ్చరించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. యురేనియం తవ్వకాలకు అనుమతులిచ్చి..చెంచుల జీవితాలతో ఆడుకోవద్దని పేర్కొన్నారు. నల్లమల అడవులను కాపాడాలని కోరారు. రాష్ట్ర్ర ప్రభుత్వం యురేనియం కార్పొరేషన్లకు అనుమతి ఇచ్చిందనే ప్రచారం జరుగుతుందని..తక్షణమే ఆ ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. యురేనియం తవ్వకాలతో అభయరణ్యంలో పులులు అంతరించిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీరు కూడా కలుషితమవుతుందన్నారు. -
‘తక్షణమే తవ్వకాలు ఆపాలి’
సాక్షి, న్యూఢిల్లీ: నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ.. పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు, ఏఐసీసీ సెక్రటరీ వంశీచందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్, వంశీ కృష్ణలు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారటీ అదనపు డైరక్టర్ డా.అనూప్ కుమార్ నాయక్ను కలిసి మెమోరాండం ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నల్లమలలో యురేనియం తవ్వకాలకు అనుమతులిచ్చాయన్నారు. దాదాపు 25 వేల ఎకరాల్లో తవ్వకాలకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ.. పెద్ద ఎత్తున ఆందోళన చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజల జీవన విధానంలో మార్పులు వస్తాయనుకున్నాం.. కానీ ఇలాంటి అన్యాయాలు చూడాల్సి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది లాభం కోసం యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చి బహుళ జాతి కంపెనీలకు లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. యురేనియం తవ్వకాలను తక్షణమే ఆపాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరామన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. తవ్వకాలతో వన్యప్రాణులకు నష్టం: వంశీ కృష్ణ దేశంలోనే అతిపెద్ద ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ ఆరోపించారు. యురేనియం తవ్వకాలతో అడవులకు, వన్య ప్రాణులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణ నది నీరు తాగే ప్రజలకు నష్టం వాటిల్లుతుందన్నారు. వెంటనే యురేనియం తవ్వకాలు ఆపేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నామన్నారు వంశీ కృష్ణ. గిరిజనుల బాధలు వినిపించాలని వచ్చాం: సంపత్ నల్లమల ఆమ్రాబాద్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు గిరిజనుల తరఫున.. వారి బాధలు వినిపించాలని ఢిల్లీ వచ్చామన్నారు మాజీ ఎమ్మెల్యే సంపత్. నల్లమలలో అటవీ సంపదను నాశనం చేసే కుట్ర జరుగుతుందన్నారు. నల్లమల అడవుల్లో ఎవరైనా అడుగుపెడితే బాగోదని, తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని సంపత్ హెచ్చరించారు. -
యురేనియం కోసమే మరోమారు చక్కర్లు కొట్టిన హెలికాప్టర్?
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి: యురేనియంపై ప్రజలు మరోసారి అనుమానపడేలా హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. ఈనెల 22న ఓసారి హెలి కాప్టర్ చక్కర్లు కొట్టగా తాజాగా మండలంలోని పెద్దగట్టు, నంబాపురం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం సుమారు 3 గం టల ప్రాంతంలో సమయంలో కనిపించిం ది. దీంతో యురేనియం అన్వేషణలో భాగంగానే హెలికాప్టర్ చక్కర్లు కొట్టిందంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యురేనియం అన్వేషణ, వెలికితీసే చర్యలను మానుకోవా లంటూ ఇప్పటికే ఆయా గ్రామాల ప్రజలు తమ నిరసన తెలుపుతుండగా వారికి ప్రజా సంఘాలు సైతం మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండోసారి హెలికాప్టర్ చక్కర్లు కొట్టడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్ ఎందుకోసం వచ్చిందో తెలపాలని అధికారులను కోరుతున్నారు. ‘యురేనియం వెలికితీస్తే వినాశనమే’ పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ): యురేనియం వెలికితీయడం వల్ల ప్రజలు, జీవరాశులకు వినాశక పరిణామాలు తప్పవని డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని పెద్దగట్టును ఆయన పరిశీలించి.. యురేనియం వెలికితీయడం వల్ల కలిగే నష్టాలను గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా గతంలో యురేనియం కోసం వేసిన బోరు బావులను ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యురేనియం వెలికి తీస్తే చూస్తూ ఊరుకోబోమని, అడ్డుకుని తీరుతామని చెప్పారు. యురేనియం తవ్వకాలపై కేంద్ర, రాష్ట్రాలు పునరాలోచన చేయాలని సూచించారు. కాంగ్రెస్ పెద్దలు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు రానున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట త్రిపురారం జెడ్పీటీసీ భారతిభాస్కర్, ఎంపీపీ పాండరమ్మశ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు నారాయణ, సైదులు, మాధవరెడ్డి, నాయకులు బోడ్యానాయక్ ఉన్నారు. -
‘ప్రభుత్వం నల్లమల అడవుల్ని కాపాడాలి’
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సేవ్ నల్లమల (#SaveNallamala) పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు ఈ విషయంపై గళమెత్తుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఈ విషయంపై స్పందించారు. ‘నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టబోతున్నారు. దీని వల్ల మన పర్యావరణానికి తీవ్ర నష్టం. చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం, అంతరించిపోతున్న పులులు నివసించే ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనం అవుతుంది. కృష్ణ, దాని ఉపనదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేయకూడదు. వెంటనే ప్రభుత్వం స్పందించి చెంచులని, ఇతర ఆదివాసులని, పర్యవారణాన్ని మొత్తంగా నల్లమల అడవుల్ని కాపాడాలి’ అని ట్వీట్ చేశారు. #savenallamala pic.twitter.com/ytsPoP2kuL — Sekhar Kammula (@sekharkammula) August 27, 2019 -
యురేనియం అంటే.. యుద్ధమే..!
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన గ్రామాల్లో ఒకానొకటి నందికొండ. నందికొండ నుంచి ముంపువాసులుగా అక్కడి కుటుంబాలు చెట్టుకొకటి.. పుట్టకొకటిగా చెల్లాచెదురయ్యాయి. ఇదంతా యాభై ఏళ్ల కిందటి ముచ్చట. కానీ, ఆ ప్రాంతంతో పెనవేసుకున్న పేగు బంధాన్ని తెంచుకోలేని కొన్ని కుటుంబాలు నందికొండ నుంచి పెద్దగట్టుకు చేరుకుని అక్కడే నివాసం ఉంటున్నాయి. ఇప్పుడా గ్రామంలో కనీసం 400 దాకా కుటుంబాలు.. 1400 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. రమారమి నాలుగు వేల ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో పూర్తిగా పత్తి సాగు చేస్తున్నారు. పెద్దగట్టు చుట్టూ కనుచూపు మేరలో పచ్చగా పరుచుకున్న పత్తి చేలే కనిపిస్తాయి. ఇలాంటి... ఈగ్రామం మరోమారు ఉలిక్కి పడింది. మళ్లీ పోరాటం చేస్తాం తప్ప ఇక్కడినుంచి కదిలేదని లేదని మూకుమ్మడిగా చెబుతున్నారు. యురేనియం ప్రాజెక్టు ప్రతిపాదిత గ్రామాల్లోని తాజా పరిస్థితులపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. సాక్షి, నల్లగొండ : ప్రభుత్వం తాజాగా యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందన్న వార్తలతో నంబాపురం, పెద్దగట్టు ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గతంలోనే యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడిన తాము.. ఊర్లను ఇప్పుడెలా వదిలిపోతామని ప్రశ్నిస్తున్నారు. మరోమారు పోరాటం చేస్తాం తప్ప ఇక్కడినుంచి కదిలేదని లేదని మూకుమ్మడిగా చెబుతున్నారు. యురేనియం పరిశోధనల కోసం అధికారులు వస్తే వారిని అడ్డుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. దేవరకొండ నియోజకవర్గం పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలోని పెద్దగట్టు ప్రాంతంలో భూగర్భంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయని గుర్తించారు. దానిని వెలికితీసేందుకు పరీక్షలు నిర్వహించిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) గనుల కోసం తమకు ఈ ప్రాంతంలో 1300 పైచిలుకు ఎకరాల లీజు కావాలని 2002లోనే నాటి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. 2003 నాటికి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను కూడా రూపొందించింది. కానీ, ఈ ప్రాంతంలో ప్రజలనుంచి వచ్చిన వ్యతిరేకతతో వెనకడుగు వేసింది. కేవలం పెద్దగట్టు తండా మాత్రమే కాకుండా.. కొత్తగా ఏర్పాటైన పెద్దగట్టు పం చాయతీ ఆవాసమైన బూడిద గుట్ట తండా, నంబాపురం (యూసీఐఎల్ నివేదికల్లో లంబాపురం అని పేర్కొంటున్నారు), ఎల్లాపురం, పులిచర్ల తదితర గ్రామాలు సైతం యురేనియం ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల జాబితాలో ఉన్నాయి. ‘ఒక సారి ఇప్పటికే ఇళ్లూ గొడ్డూ–గోదా పోగొట్టుకుని నందికొండ నుంచి లేచి వచ్చి పెద్దగట్టుపై పడ్డాం. ఎన్ని సమస్యలున్నా ఇక్కడే బతుకుతున్నాం. పదుల ఎకరాలను నందికొండ ముంపులో పోగొట్టుకున్నా.. కుటుంబానికి 5 ఎకరాలే ఇక్కడ మాకు పునరావాసం కింద ఇచ్చారు. మళ్లీ ఇక్కడి నుంచి తరిమితే మేం ఎక్కడికి పోవాలి....’ పెద్దగట్టు సర్పంచి నరేందర్ ఆవేదన ఇది. ఈ ఒక్క తండానుంచే.. ప్రస్తుతం ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులు, పోలీసు, పోస్టల్ తదితర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ గ్రామంలో ఐదో తరగతి వరకు ఆశ్రమ పాఠశాల పక్కా భవనంలో నడుస్తోంది. రెండు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రెండుమూడేళ్ల కిందటే పెద్దగట్టుకు రూ.7కోట్ల పైచిలుకు నిధులతో బీటీ రోడ్డు కూడా నిర్మించారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా 40వేల లీటర్ల తాగునీటిని అందించే ట్యాంకూ నిర్మించారు. ఇన్ని సౌకర్యాలు ఒనగూరాకా .. అన్నీ వదిలి మళ్లీ తట్టాబుట్టా ఎలా సర్దుకుపోవాలన్నది వీరి వాదన. ప్రాజెక్టు .. కథాకమామీషు లంబాపూర్–పెద్దగట్టు ప్రాంతంలో యురేనియం నిక్షేపాలను గుర్తించాక యూసీఐల్ రాంచీకి చెందిన మెకాన్ సంస్థతో ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయించింది. ఈ ప్రాంతంలో పరీక్షల కోసం వేసిన బోర్లు ఇప్పటికీ రైతుల పొల్లాలో దర్శన మిస్తున్నాయి. ఇప్పటికీ నెలా నెలా నీటి నమూనాలు తీసుకెళ్తున్నారని పెద్దగట్టు వాసులు చెబుతున్నారు. అయితే ప్రాజెక్టు కోసం మొత్తంగా 1301.35 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఇందులో 1,104.64 ఎకరాల భూమి అటవీ భూమిగా తేల్చారు. ఇక, మిగిలిన 196.7 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అయితే, సర్వేనంబర్లు 23/16 నుంచి 23/46 వరకు తమ భూములే ఉన్నాయని, నందికొండ పునరావాసం కింద ప్రభుత్వం ఇచ్చిన భూమి ఇందులోనే 180 ఎకరాల దాకా ఉంటుందని పెద్దగట్టు వాసి పాండు చెప్పారు. ఇది కాకుండా లంబాపూర్ ప్రాంతంలో 468 ఎకరాల విస్తీర్ణంలో యురేనియం నిక్షేపాలు విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. ఇదంతా గుట్టపైన (హిల్టాప్) ఉన్నందున సంప్రదాయ పద్ధతిలో ఓపెన్ కాస్ట్ గనిలో తవ్వాలన్న ప్రతిపాదన ఉందంటున్నారు. ఇక్కడే మరో భూగర్భ గని, పెద్దగట్టు తదితర ప్రాంతాల్లో మరో మూడు భూగర్భ గనులు తవ్వాలన్న నివేదికలను యూసీఐఎల్ వద్ద సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ఒక్కసారి తవ్వకాలు అంటూ మొదలైతే.. లంబాపూర్ గనులు 12 ఏళ్లపాటు, పెద్దగట్టు గనులు 20 ఏళ్ల పాటు కొనసాగనున్నాయి. ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నందున అనివార్యంగా పేలుళ్లు (బ్లాస్టింగ్స్) జరపాల్సి ఉంటుంది. ఇలా వారానికి మూడు సార్లు చొప్పున ఏటా కనీసం 162 పర్యాయాలు బ్లాస్టింగ్స్ జరుపుతారని తెలుస్తోంది. నంబాపురానిది మరో కథ యురేనియం కార్పొరేషన్ అధికారులు నంబాపురం తండాను లంబాపూర్ అంటున్నారు. తమ గ్రామం పేరెలా మారిందో తెలవదని గ్రామస్తులు అంటున్నారు. కృష్ణా బ్యాక్ వాటర్ తండాను తాకుతున్నా.. తమకు తాగునీరు లేదని వీరంటున్నారు. గతంలోనే యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడమని, ఇప్పుడెలా ఊరిని వదులుతామని ప్రశ్నిస్తున్నారు. నాగార్జున ప్రాజెక్టులో ముంపునకు గురైన గ్రామాల్లో నంబాపురం ఒకటి. ఈ గ్రామానికి చెందిన వారు చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినా.. కొన్ని గిరిజన కుటుంబాలు మాత్రం కృష్ణమ్మ ఒడిలో మునిగిపోయిన తమ గ్రామానికి గుర్తుగా అదే నంబాపురం పేరుతో తండాను ఏర్పాటు చేసుకున్నారు. ‘ఇక్కడ తాగునీటికి కష్టం. చెంతనే కృష్ణమ్మ ఉన్నా.. చుక్క నీరు పొలాలకు పారవు. నా యకుల మీద మాకు నమ్మకం పోయిం ది. రాగ్యానాయక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నంబాపురానికి లిఫ్ట్ స్కీమ్ ఇస్తామని హామీ ఇచ్చారు. రవీంద్రకుమార్ మూడు సార్లు ఎమ్మెల్యే అయినా.. బాలూనాయక్ ఎమ్మె ల్యే అయినా.. జెడ్పీ చైర్మన్ అయినా.. ఇన్నేళ్లుగా మా సమస్య మాత్రం తీరలేదు. పొలాలకు నీరిచ్చేందుకు ఎత్తిపోతల పథకం రాలేదు. పిల్లలంతా బతకడానికి హైదరా బాద్, ఒంగోలు , ఇతర ప్రాంతాలకు వెళ్లారు.. అ యినా, ఊరిని విడవలేక ఇక్కడే బతుకుతున్నాం... అని రమావత్ లస్క ర్ చెప్పుకొచ్చాడు. పెద్దగట్టుతండాకు చెందిన ఓ రెతు పొలంలో వేసిన బోరు. యురేనియం నిక్షేపాల అన్వేషణలో భాగంగా ఈ బోరు వేసినట్లు తండావాసులు చెబుతున్నారు. అందులోనుంచి ప్రత్యేకమైన పదార్థాలు ఇంకా బయట పడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ నెలనెలా పరీక్షల కోసం నీటిని తీసుకెళ్తుం టారని పెద్దగట్టు తండా వాసులు చెబుతున్నారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధి లోని రిజర్వ్ఫారెస్ట్లో, ఇక్కడ కూడా యురేనియం తవ్వకాలంటూ వస్తున్న వార్తలు ఇక్కడి ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. మా జీవితాలపై దెబ్బ కొట్టకండి ‘పదహారేళ్ల కిందట ఏం చేశామో.. ఇప్పుడదే చేస్తాం. యూసీఐఎల్ కార్యకలాపాలను కచ్చితంగా అడ్డుకుని తీరుతాం. మా బువ్వ మెతుకును ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు’.. అని దేపావత్ శ్రీను ఒకింత ఆవేశంగానే చెప్పాడు. ప్రభుత్వం తాజాగా యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చిందన్న వార్తలతో బెంబేలెత్తుతున్నారు. కాగా, పెద్దగట్టు ప్రాంతంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అటవీ భూములకు పట్టాలు ఇవ్వలేదు. దీంతో తమకు రైతు బంధు అందకుండా అయ్యిందని చెప్పారు. పట్టాలు కావాలని ధర్నాలు కూడా చేశారు. అధికారిక సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం అటవీ భూముల సరిహద్దులు ఖరారు చేసేందుకు, వారికి పట్టా పుస్తకాలు ఇచ్చేందుకు సర్వే కోసం వెళుతున్నారని సమాచారం. ఇందులో మతలబు ఏమన్నా దాగి ఉందా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. గతంలోనే వ్యతిరేకించాం యురేనియం తవ్వకాలను గతంలోనే వ్యతిరేకించాం. ఎంతోమంది ఈ ఇక్కడి భూమిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. మా బతుకులను దెబ్బతీసే యురేనియం తవ్వకాలు చేపట్టవద్దు. యురేనియం వెలికి తీస్తే అనార్థాలే ఎక్కువగా ఉంటాయి. అధికారులు మా గోడును విని తమ ప్రయత్నాలను విరమించుకోవాలి. యురేనియం తవ్వకాల కోసం వస్తే ఊరుకునేది లేదు. – దేపావత్ నరేందర్నాయక్, సర్పంచ్, పెద్దగట్టు కృష్ణా జలాలు కలుషితం అవుతాయి యురేనియం వెలికితీయడం వల్ల కృష్ణా జలాలు కలుషితమవుతాయి. కృష్ణా వెనుక జలా లను ఆనుకొని ఎన్నో కుటుం బాలు జీవనం సాగిస్తున్నాయి. వాతావరణంతో పాటు జీవరాశుల ఉనికికి ప్రమాదకరమైన యురేనియం తవ్వకాలు వద్దు. అధికారులు మొండికి పోతే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. యురేనియం తవ్వకాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం. – సపావత్ ఖీమా, పెద్దగట్టు -
ఉరుముతున్న యురేనియం: మొదలైతే.. ఇరవై ఏళ్ల దాకా తవ్వకాలు
సాక్షి, నల్లగొండ: జిల్లాపై యురేనియం పిడుగు పడనుందా..? పదహారేళ్ల కిందట, 2003 లోనే అటకెక్కిన యురేనియం గనుల తవ్వకం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్ల బూజు దులుపుతున్నారా..? పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలోని ‘లంబాపూర్–పెద్దగట్టు’ ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టాలని తలపెట్టి నివేదికలు కూడా పూర్తి చేసిన యూసీఐఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) నాడు జరిగిన ప్రజాందోళనలతో వెనక్కి తగ్గింది. ఒక ఓపెన్ కాస్ట్మైన్ , మూడు భూగర్భ గనులతో పాటు మల్లాపూర్ వద్ద యురేనియం శుద్ధికర్మాగారం (ప్రాసెసింగ్ ప్లాంట్) ఏర్పా టు చేయాలన్న ప్రతిపాదనలు నివేదికల వరకు వచ్చి ఆగాయి. ఇప్పుడు మరో మారు లంబాపూర్–పెద్దగట్టు గనుల వ్యవహారం తెరపైకి వచ్చింది. మొదలైతే.. ఇరవై ఏళ్ల దాకా తవ్వకాలు దేవరకొండ నియోజకవర్గలోని పెద్ద అడిశర్లపల్లి (పీఏ పల్లె)మండలంలోని లంబాపూర్, నామాపురం, ఎల్లాపురం, పులిచర్ల, పెద్దగట్టు తదితర ప్రాంతాల్లో ఒక ఓపెన్ కాస్ట్ గనితో పాటు, మరో మూడు భూగర్భ గనుల్లో తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించి, 2003 వరకు డీపీఏ (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) రూపొందించారు. ఈ గనులకు అనుంబంధంగా మల్లాపూర్లో ట్రీట్ మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. కానీ, అన్ని వర్గాలనుంచి వచ్చిన వ్యతిరేకతతో యూసీఐఎల్ అధికారులు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం తుమ్మలపల్లిలో కొత్త గనులు ఏర్పాటయ్యాయి. ఈ మధ్యలో నల్లమలలో తవ్వకాలు చేపట్టాలని నమూనా సేకరణల కోసం అచ్చంపేట నియోజకవర్గంలోని పల్లెలు, చెంచు పెంటల్లో పదుల సంఖ్యలో బోర్లు తవ్వారు. ఇప్పుడు అకస్మాత్తుగా నల్లగొండ జిల్లాలోనే తవ్వకాలు అంటూ కొత్త వార్తలు వెలువడ్డాయి. పాత నివేదికల ప్రకారం జిల్లాలో ఏర్పాటయ్యే గనుల ద్వారా ప్రతిరోజూ 1250 టీపీడీ (టన్ పర్ డే) ల చొప్పున ఇరవై ఏళ్ల పాటు తవ్వకాలు చేపట్టొచ్చని తేల్చారు. దీనికోసం 1301.35 ఎకరాలు అవసరమని గుర్తించారు. కాగా, ఇందులో 1104.64 ఎకరాలు రిజర్వ్ అటవీ భూమి కావడంతో అనుమతులు అవసరం అయ్యాయి. మరో 196.71 ఎకరాలు మాత్రమే అనుమతులు అక్కర్లేని భూమిగా గుర్తించారు. ఇక, మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేయాలని తలపెట్టిన ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం 760 ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాంతాల్లో భూ సేకరణకు సంబంధించి ప్రభుత్వంనుంచి తమకు ఎలాంటి ఆదేశాలూ అందలేని జిల్లా రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా జిల్లాలో యురేనియం తవ్వకాల ప్రచారం, వార్తలు ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతున్నాయి. నల్లమల అనుకుంటే.. కృష్ణపట్టెపై ఉరుము వాస్తవానికి గడిచిన కొద్ది రోజులుగా నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో యురేనియం వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రధానంగా అమ్రాబాద్ మండల పరిధిలోని గ్రామాలు, చెంచు పెంటలు అట్టుడుకుతున్నాయి. ఆయా పార్టీలూ, ప్రజా సంఘాలు గ్రామాలను, చెంచు పెంటలను చుట్టివస్తున్నారు. సేవ్ నల్లమల ఉద్యమాలూ బయలుదేరాయి. ఎట్టి పరిస్థితుల్లో తమ గ్రామాలను వీడబోమని, పెంటలు దాటి బయటకు రామని అటు సాధారణ ప్రజలు, ఆదివాసీలైన చెంచులు తెగేసి చెబుతున్నారు. అమ్రాబాద్ నల్లమల్ల అటవీ ప్రాంతాన్నే ఆనుకుని ఉన్న దేవరకొండ నియోజకవర్గం పరిధిలో సుమారు ఏడు చదరపు కిలోమీటర్ల పరిధిలో తవ్వకాలు ఉంటాయన్న ప్రచారం జరిగింది. ఒక విధంగా అందరి దృష్టీ నల్లమలపై కేంద్రీకృతమై ఉండగా.. అసలు తవ్వకాలు అక్కడ కాదు, నల్లగొండ జిల్లాలో అని వార్తలు వెలువడడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 2003లోనే ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టారని భావిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లంబాపూర్–పెద్దగట్టు యురేనియం గనులకు అనుమతులు ఇచ్చిందని, పర్యావరణ అనుమతులూ లభించాయని జరుగుతున్న ప్రచారంతో ఈ ప్రాంతం ఒక్క సారిగా ఉలిక్కి పడుతోంది. అడ్డుకుని తీరుతం ‘పీఏపల్లి మండలంలో తిరిగి యురేనియం త వ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం ముందు కు వచ్చి అనుమతులు ఇస్తే.. యూసీఐఎల్ను, వారి కార్యకలాపాలను అడ్డుకుని తీరుతం. తవ్వకాలు మొదలైతే.. కృష్ణా జలాలు పూర్తిగా విషతుల్యం కావడం అనివార్యం. ఈ ప్రాంత ప్రజలు, జీవజాతులపై, గాలిపై, నీరుపై తీవ్ర ప్రభావం చూపే యురేనియం తవ్వకాలు జరగనీయం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం దూకుడును అడ్డుకోవాలి..’ లంబాపూర్–పెద్దగట్టు యురేనియం ప్రాజెక్టుపై గతంలో ఉద్యమాలు చేపట్టిన మట్టిమనిషి సంస్థ వ్యవస్థాపకుడు వేనేపల్లి పాండురంగారావు పేర్కొన్నారు. -
‘నల్లమలను లూటీ చేయాలని చూస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు ఊటీ లాంటి నల్లమల ప్రాంతాన్ని పాలకులు లూటీ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో తామంతా ఉద్యమిస్తే తవ్వకాలు నిర్ణయంపై వెనక్కు తగ్గారని, కానీ కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చాయని మళ్లీ తవ్వకాలు మొదలు పెట్టాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీభవన్లో నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘నల్లమల టైగర్ రిజర్వు ఫారెస్టు. చెంచులు, ఆదివాసీలు బతుకుతున్న ప్రాంతం. ఇక్కడ తవ్వకాలను మేం ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. బహుళ జాతి కంపెనీలకు కోట్ల రూపాయలు కట్టబెట్టడానికి ఇక్కడి ప్రజలను, అటవీ సంపదను బలి చేస్తారా. విదేశాల్లో, కడపలో కూడా యురేనియం తవ్వకాలను ఆపేశారు. యురేనియం తవ్వకాల వల్ల పుట్టబోయే బిడ్డలకు కూడా అంగవైకల్యం ఏర్పడుతుంది. ప్రకృతి పూర్తిగా నాశనమవుతుంది. శ్రీశైలం నదీ జలాలు కలుషితం అవుతాయి. నాగార్జునసాగర్ నీరు తాగే హైదరాబాద్ ప్రజలపై కూడా ఈ ప్రభావం పడనుంది. గతంలో కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాతో కలిసి వచ్చే అందరితో కలిసి పోరాటాలు చేస్తాం. ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం. తవ్వకాల నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మా ఉద్యమం ఆగదు’అన్నారు. -
అచ్చంపేటలో కోదండరామ్ అరెస్టు..!
సాక్షి, నాగర్కర్నూల్ : అచ్చంపేట మండలం నల్లమల యురేనియం సమస్యలపై ప్రజలతో చర్చించేందుకు వెళ్తున్న టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన హజీపూర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే అరెస్టు చేశారు. ఆయన అరెస్టుకు నిరసనగా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై యురేనియం వ్యతిరేక పోరాట సమితి నాయకులు, పదర, అమ్రాబాద్ మండలాల ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. యురేనియం వెలికితీత వల్ల వాటిల్లే నష్టాల గురించి ప్రజలతో చర్చించడానికి వచ్చిన కోదండరామ్ బృందాన్ని అక్రమంగా అరెస్టు చేయడం సరైందని కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అడవి ఎదపై అణుకుంపటి
తెలంగాణ–ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో ఇపుడు ‘యురేనియం’ తవ్వకం కలకలం సృష్టిస్తోంది. మన్ననూరు పులుల అభయారణ్యం ఉనికికే ఇది ప్రమాదం. అరుదైన చెంచు తెగ మనుగడకు శాపం. యురేనియం నిల్వల అన్వేషణ, తవ్వకాల కోసం సర్కారు సాగిస్తున్న ప్రయత్నాలొకవైపు, తలెత్తుతున్న నిరసనోద్యమాలు మరోవైపు.. ‘అమ్రాబాద్’ చుట్టూ వాతావరణం వేడెక్కుతోంది. సమగ్ర నిర్వచనం లేని అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని పణంగా పెట్టాల్సిందేనా? ‘‘మైళ్లకు మైళ్ల దూరం అందమైన ఇప్పచెట్ల అడవి ఉన్న చోటే స్వర్గం. కానీ, మైళ్లకు మైళ్ల ఇప్పచెట్ల అడవి ఉండీ అందులో ఓ అటవీ రక్షకుడుంటే నరకం’’ పొరుగు రాష్ట్రం ఛత్తీస్ఘడ్లోని ఓ గిరిజన తెగలో ఈ సామెత వాడుకలో ఉంది. రక్షకులే భక్షకులవుతున్న కాలమిది. అటవీ అధికారులో, చట్టబద్ద ప్రాధికార సంస్థలో, అటవీ శాఖో, ప్రభుత్వాలో... ఏవైతేనేం, కట్టలు తెంచుకున్న స్వార్థం, అవినీతి, పరస్పర విరుద్ద విధనాలతో అడవుల్ని ధ్వంసం చేస్తున్నాము. పెంచాల్సిన పరిస్థితుల్లో అడవుల విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు. పర్యావరణపరంగా యోచిస్తే కొన్ని చర్యలు, తను కూర్చున్న కొమ్మని మనిషి తానే నరుక్కున్నట్టుంటాయి. అడవుల్ని బలిపెట్టడం ఇటువంటిదే! ఫలితమే పెచ్చుమీరిన కాలుష్యం, జీవవైవిధ్య విధ్వంసం, సహజవనరుల నాశనం, వాతావరణ మార్పులు. అభివృద్ధి పేరిట జరిగే విధ్వంసాలను పౌరసమాజం అడ్డుకునే క్రమంలో ఘర్షణ తప్పటం లేదు. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో ఇపుడు ‘యురేనియం’ తవ్వకం కలకలం సృష్టిస్తోంది. పులుల అభయారణ్యం ఉనికికే ఇది ప్రమాదం. చెంచు తెగ మనుగడకు శాపం. యురేనియం నిల్వల అన్వేషణ, తవ్వకాల కోసం సర్కారు సాగిస్తున్న అంచెలంచెల యత్నాలొకవైపు, ఇప్పుడిప్పుడే పురుడుపోసుకుంటున్న నిరసనోద్యమాలు మరో వైపు.. ‘అమ్రాబాద్’ చుట్టూ వాతావరణం వేడెక్కుతోంది. రాష్ట్ర–కేంద్ర ప్రభుత్వాల తదుపరి చర్యలు ఎలా ఉంటాయో! నిర్వచనం లేని అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని పణంగా పెట్టాల్సిందేనా? ప్రస్తుత–భవిష్యత్తరాల ప్రయోజనాలు మనకు పట్టవా? చెంచులు, గిరిజన జాతుల ప్రగతి మనం ప్రచారం చేసే అభివృద్ధిలో భాగం కాదా? వారి కనీస మనుగడనే లక్ష్యపెట్టని అభివృద్ధి ఎవరికోసం? ఇటువంటి ప్రశ్నలెన్నో? జనాన్ని ఉద్యమాలవైపు పురిగొల్పుతున్నాయి. సాంకేతికత విస్తరించి, సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిన పరిస్థితుల్లో ఉద్యమ స్వరూప –స్వభావాలూ మారిపోయాయి. ప్రభుత్వాలు మరింత స్పృహతో, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరముంది. దూళి కూడా శాపమే! యురేనియం తవ్వకాలు, వెలికితీత, రవాణా, నిల్వ, వినియోగం.. ఇవన్నీ భయం కలిగించేవే! దాని స్వభావం–ప్రభావం అలాంటిది. యురేనియం గనుల సంఖ్య, గనుల విస్తీర్ణం ఎక్కువ చేయడానికి కేంద్రం యత్నిస్తోంది. ప్రస్తుత ఉత్పత్తిని నాలుగు రెట్లు పెంచేలా రూ.1,05,700 కోట్ల ఖర్చుతో 13 గనులను ఏర్పాటు చేసే యత్నాల్లో యురేనియం కార్పొరేషన్ ఆప్ ఇండియా లిమిటెడ్ (యూసీఐల్) ఉంది. ఇందులో చిత్రియాల్ (నల్గొండ), మన్ననూర్–అమ్రాబాద్ (శ్రీశైలం అడవుల్లో) కూడా ఉన్నాయి. ఈ కార్పొరేషన్కు ఇప్పటికే ఏడు గనులు జార్ఖండ్లో, ఒకటి ఏపీ(కడప)లో ఉన్నాయి. రెండు అవసరాల కోసం ఈ యురేనియం అన్వేషణ. యురేనియం ముడి పదార్థంగా దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తిని 22,000 మెగావాట్లకు తీసుకెళ్లడం, దేశ రక్షణ కోసం బాంబుల తయారీకి దీని ఉప ఉత్పత్తిని వాడటం లక్ష్యం. చెప్పు కోవడానికి ఈ కారణాలు బాగానే ఉన్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అణు విద్యుదుత్పత్తి అసాధారణ ఖర్చుతో కూడుకున్నదే కాక ప్రమాదభరితమైంది. న్యూక్లియర్ పదార్థాలు, అణు ధార్మికత వల్ల పర్యావరణ విధ్వంసమే కాక అడవులు–ఇతర సహ జవనరులు, తరాల తరబడి జీవరాశి ఆయురారోగ్యాలు క్షీణిస్తాయి. అణు వ్యర్థాలు, ఆ కణాలు కలిసిన నీరు, చివరకు ఆ రేణువుల ధూళి, గాలి కూడా ప్రమాదమే! తవ్వకాలు, వెలికితీత జరుగుతున్న చోట ఇప్పటికే కాలుష్యాల దుష్ప్ర భావంతో క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు, రేడియేషన్ ప్రభావంతో గర్భస్రావ్యాలు, అంగ వైకల్య జననాలు... ఇలా ఎన్నెన్నో సమస్యలతో జనం సతమతమౌతున్నారు. అందుకే, అగ్ర రాజ్యాలన్నీ ఈ రకం ఉత్పత్తిని నిలిపివేశాయి. దేశ రక్షణకు అవసరమైన అణు బాంబులు మన వద్ద ఉన్నాయి. బాంబుల తయారీకి అవసరమైన యురేనియం, ఉప ఉత్పత్తులు ఇప్పటికే టన్నుల కొద్ది ఉన్నాయి. ఆరు దేశాల నుంచి యురేనియం దిగుమతి చేసుకుంటున్నాము. అంతర్జాతీయ ఆంక్షల తొలగింపు నేపథ్యంలో ఇంకా దిగుమతి చేసుకోవచ్చు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా యురేనియం తవ్వకాలు, అదీ, అపార సహజ సంపదకు నెలవైన నల్లమల అడవుల్లో చేయడం దారుణం. అడవికి, ఔషధ మొక్కల వంటి విలువైన అటవీ సంపదకు, పులుల అభయారణ్యానికి, చెంచులు, వన్యప్రాణులు ఇతర జీవరాశికి నష్టమే కాకుండా భూగర్భ జలాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు సమీపంగా ఉన్నందున ఆ నీళ్లు కలుషితమవుతాయి. వాటిని తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాలు, గ్రామాల తాగు, సాగు అవసరాలకు వాడుతున్నందున సగటు మనిషి మనుగడ, భవిష్యత్తరాల బతుకు అగమ్యగోచరమౌతుంది. మరోమార్గం చూసుకోవాలి క్లీన్ ఎనర్జీ అయినంత మాత్రాన ఇంత ఖర్చుకు, ఇన్ని ప్రమాదాలకూ సిద్ధపడాల్సిందేనా? మేధావులు, ఉద్యమకారుల ప్రశ్న. యూనిట్ అణు విద్యుత్ ఉత్పత్తి వ్యయమే రూ.30 వరకుంటుంది. భద్రతకు అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ, దీర్ఘకాలిక ఖర్చుల్నీ లెక్కిస్తే యూనిట్ ధర ఇంకా పెరగొచ్చని పాలసీనిపుణుడు దొంతి నర్సింహారెడ్డి అంటున్నారు. ఇంత చేశాక కూడా ప్రమాదాలు జరగవనే గ్యారెంటీ లేదు. రష్యా, జపాన్ వంటి సాంకేతిక నైపుణ్యపు దేశాలే చెర్నోబిల్, ఫుకుషిమా ప్రమాదాలపుడు విలవిల్లాడాయి. ఇక, అందులో వందో వంతు భద్రతకూ భరోసాలేని మన వంటి దేశాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి? ఎన్ని వేల, లక్షల కుటుంబాలకు, భవిష్యత్తరాలకది శాపంగా మారుతుందో ఊహకూ అందని భయం! ప్యారిస్ ఒప్పందం ప్రకారం శిలాజ ఇంధన వినియోగం తగ్గించి, పునర్వినియోగ యోగ్య ఇంధనాలకు వెళ్లాలనే మాట నిజమే! అయితే, అది అణువిద్యుత్తే కానవసరం లేదు. భారీ ప్రాజెక్టులు కాకుండా చిన్న, మధ్యతరగతి జల విద్యుత్తు, సౌర, పవన విద్యుత్తు కావొచ్చు. అవి ప్రమాదరహితం. సౌర విద్యుదుత్పత్తి వ్యయం ఇప్పటికే బాగా తగ్గింది. ఇంకా తగ్గించే పరిశోధనలు జరగాలి. వందల, వేల ఎకరాల్లో పలకలు (ప్యానల్స్) వేయడం కాకుండా వికేంద్రీకృత పద్ధతిన ఇళ్లపైన, వ్యవసాయ క్షేత్రాల వద్ద ఏర్పాటు చేసుకునే వ్యవస్థను బలోపేతం చేయాలి. అణువిద్యుత్తే అనివార్యమైతే పది రూపాయలు ఎక్కువ పెట్టయినా యురేనియం దిగుమతి చేసుకోవాలే తప్ప ప్రమాద భరితమైన తవ్వకాలు జరపొద్దని సామాజిక కార్యకర్తలంటారు. అడవిని కల్లోల పరచి ప్రకృతి సంపదను విధ్వంసం చేయొద్దనేది వారి వాదన. ఇప్పుడు తెలంగాణ,ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి వైఖరి తీసుకుంటాయన్నది ఆసక్తికరం. కృష్ణా–గోదావరి (కేజీ) బేసిన్ సహజవాయు ఉత్పత్తి సమయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక న్యాయమైన అంశాన్ని లేవనెత్తారు. ప్రాజెక్టు తాలూకు కష్ట– నష్టాల్ని స్థానికులుగా మేం భరిస్తున్నపుడు ప్రయోజనాల్లో తమకు సహ జసిద్ధమైన వాటా ఉండాలని కేంద్రంతో వాదించారు. ఆ స్ఫూర్తిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అంది పుచ్చుకోవాలి. తీరు మారుతున్న ఉద్యమాలు ఒకప్పటిలా ఉద్యమాలంటే కేవలం ధర్నాలు, రాస్తారోకోలు కాదు. ఆధునిక సాంకేతికత పుణ్యమా అని ప్రజాఉద్యమాలు కొత్త బాట పట్టాయి. సంప్రదాయ, సామాజిక మాధ్యమాలు వేదికగా ప్రజాభిప్రాయాన్ని బలోపేతం చేస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టుల వల్ల రానున్న ప్రమాద తీవ్రతపై సమాచారాన్ని చిట్టచివరి వ్యక్తికీ చేర్చి మద్దతు కూడగడుతున్నారు. ప్రజాందోళనల్ని సమైక్యపరచి ఉద్యమోధృతి పెంచుతున్నారు. పారిస్ వంటి అంతర్జాతీయ ఒప్పందాల నేపథ్యంలో పర్యావరణ అంశాల్ని, జీవవైవిధ్య ప్రమాదాల్ని ఎత్తి చూపుతూ ఐక్యరాజ్యసమితి (యూఎన్) తదితర సంస్థల్ని ప్రభావితం చేస్తున్నారు. అరుదైన జాతులు అంతరించిపోయే ప్రమాదాల్ని ఎత్తిచూపి ప్రపంచ దృష్టి ఆకర్షిస్తున్నారు. పంజాబ్–హర్యానా సరిహద్దుల్లోని గోరక్పూర్లో ఇటువంటి ఆందోళన వచ్చినపుడు అక్కడి కృష్ణజింక, చుక్కల జింక మనుగడ ఎంతటి ప్రమాదంలోకి జారనుందో అధ్యయనం చేశారు. ఎమ్సీ మెహతా, డా‘‘ సాయిభాస్కర్ వంటి నిపుణులు ఆధారాలతో జాతీయ హరిత ట్రిబునల్ (ఎన్జీటీ) ముందు వాదించి, సానుకూల నిర్ణయాలు వచ్చేలా చేశారు. దేశవ్యాప్తంగా ఉద్యమకారులు ‘ఆవాజ్’ తదితర వేదికల్ని వాడుకుంటూ సంతకాల సేకరణ ద్వారా జనాభిప్రాయాన్ని ప్రోది చేసి, విశాల ఉద్యమాల్ని నిర్మిస్తున్నారు. అన్ని పద్ధతుల్లో ఒత్తిడి పెంచి, ప్రభుత్వాలు మొండిగా, ఏకపక్షంగా వ్యవహరించలేని పరిస్థితిని కల్పిస్తున్నారు. ఉద్యామాల్లో స్థానికత, వ్యూహం–ఎత్తుగడ కొరవడితే లక్ష్య సాధన కష్టం. నాగార్జునసాగర్ అణురియాక్టర్ వ్యతిరేకోద్యమం విజయవంతమైతే కూడంకులం పోరాటాలు విఫలమవ్వడం ఇందుకు ఉదా‘‘గా ప్రముఖ పర్యావరణవేత్త డా‘‘ పురుషోత్తమ్రెడ్డి పేర్కొంటారు. అడవికేది రక్ష? యురేనియం తవ్వకాలకు ‘ఇంకా అనుమతులివ్వలేద’ని అటవీ అధికారులు పక్కా సాంకేతిక భాష మాట్లాడుతున్నారు. మరో పక్క అన్నీ జరిగి పోతూనే ఉన్నాయి. అడవుల్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరికన్నా అటవీ అధికారులపైనే ఎక్కువగా ఉంది. మనవన్నీ పరస్పర విరుధ్ద విధానాలే! చెంచుల వల్ల అడవి అంతరిస్తోందని వారిని బయటకు తరలించే చర్యలు తీసుకుంటారు. ఇదంతా ఖనిజ తవ్వకాలు జరిపే కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే! దానికి ‘అభివృద్ధి’ ముసుగు కప్పే పాలకవర్గాలు అదే చెంచుల్ని, గిరిజనుల్ని, సదరు అభివృద్ధిలో భాగస్వాముల్ని చేయవు. నిజానికి చెంచులు, ఇతర గిరిజన జాతులు అడవికి రక్షగా ఉంటారే తప్ప అడవినెప్పుడూ పాడు చేయరు. వారి జీవనోపాధి పరిరక్షిస్తూ వారినే అటవీ రక్షకులుగా వాడే సమన్వయ చర్యలేవీ ప్రభుత్వాలు చేపట్టవు. అడవి అంచుల్లో, చెట్లు అంతరించిన చోట పోడు వ్యవసాయం చేసుకోండని ప్రత్యామ్నాయం చూపించి వారిని ప్రోత్సహిస్తారు. అందుకోసం, అడవి మధ్యలోంచి వారిని బలవంతంగా తరలిస్తారు. వారికి భూమి హక్కులు కల్పించాలని ‘అటవీ హక్కుల చట్టం’ సుస్పష్టంగా చెబుతున్నా, దాన్ని సవాల్ చేస్తూ మన ప్రభుత్వాలు సుప్రీం కోర్టుకెక్కుతాయి. ఇంత వైరుధ్యముంటుంది. చట్టాలు అమలు చేయా ల్సిన సమయంలో నిద్ర నటించి, గిరిజనావాసాల్లో గిరిజనేతరు లొచ్చి భూములు ఆక్రమిస్తున్నా ఉపేక్షిస్తారు. ప్రాజెక్టుల కోసం అడవుల్ని నరికినపుడు ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం లభించే నష్టపరిహార (కంపా) నిధుల్నీ సవ్యంగా వినియోగించరు. రక్షకులే భక్షకులుగా మారు తుంటే ఇక అడవికేది రక్ష? జనం అప్రమత్తం కావడమొకటే పరిష్కారం. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
యురేనియం తవ్వకాలను అడ్డుకుంటాం: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అమ్రాబాద్(అచ్చంపేట) : ప్రజా ఉద్యమాలతో నల్లమలలో యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. అమ్రాబాద్, పదర మండలాల్లో యురేనియం తవ్వకాల అనుమతులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అమ్రాబాద్లో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలు 21రోజులుగా కొనసాగుతున్నాయి. ఆదివారం పదర మండలం వంకేశ్వరం గ్రామస్తులు దీక్షలో కూర్చున్నారు. వంశీకృష్ణ దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలతో మానవ మనుగడ కనుమరుగవుతుందని అన్నారు. అంతేగాకుండా తెలంగాణ ఊటీగా పిలుచుకుంటున్న ప్రకృతి అందాలు, అడవులు, వన్యప్రాణులు ధ్వంసమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత పరిరక్షణ కోసం అన్ని గ్రామాలలో దూంధాం కార్యక్రమాలతో ప్రజలను చైతన్యం చేసి ప్రజా ఉద్యమాలతో యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని ఆయన అన్నారు. దీక్షలో కాంగ్రెస్ మండల అధ్యక్షడు జెట్టెప్ప, మాజీ ఎంపీటీసీ విజ్జప్ప, సత్యాలు, చిన్నరామయ్య, సింగిల్విండో డైరెక్టర్ వెంకటేశ్వర్లు రామయ్య, శ్రీనివాసులు, సత్యం, వెంకటయ్య, రాఘవులు, రామలింగయ్య, వెంకటేశ్వర్లు, రాజేష్, తిరుపతయ్య, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నిజాంను తలపిస్తున్న కేసీఆర్ పాలన
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దేవరుప్పుల: అమరుల ఆత్మత్యాగాలతో సిద్ధించిన తెలంగాణను నిజాం సర్కారును తలపించేలా కేసీఆర్ కుటుంబం పాలన సాగిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మహాజన పాదయాత్ర శనివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్మారక స్తూపం వరకు చేరింది. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక తెలంగాణ న్యాయం కోసం తాము పాదయాత్ర చేస్తుంటుంటే అవహేళన చేసే కేసీఆర్ అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పై చర్చ జరుగుతుంటే గైర్హాజరయ్యారని విమర్శించారు. అమ్రాబాద్లో యురేనియం తవ్వకాలు వద్దు సాక్షి, హైదరాబాద్: నాగర్కర్నూలు జిల్లా అమ్రాబాద్లో యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. యురేనియం లాంటి ఖనిజ తవ్వకాలపై విస్తృత చర్చ జరగాలన్నారు. ఎలాంటి చర్చా లేకుండా చుట్టు పక్కల ఉండే గిరిజనులను నిర్వాసితులను చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించారు. ఖనిజ తవ్వకాల నేపథ్యంలో ఆయా గ్రామాల్లో నిలిపివేసిన అభివృద్ధి పనులను తిరిగి చేపట్టాలని డిమాండ్ చేశారు.