Varasudu Movie
-
సూపర్ హిట్ సాంగ్.. రష్మిక అదరగొట్టేసిందిగా!
గతేడాది యానిమల్ సూపర్ హిట్ కొట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఆమె ప్రస్తుతం పుష్ప-2 మూవీలో నటిస్తున్నారు. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ మూవీని డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరో నెల రోజుల షూటింగ్తో పాటు వీఎఫ్ఎక్స్ పనులు పెండింగ్లో ఉండడం వల్లే పోస్ట్పోన్ చేస్తున్నట్లు వెల్లడించారు.అయితే తాజాగా పుష్ప భామ రష్మికకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. వారసుడు మూవీలోని 'రంజితమే' అనే సాంగ్కు స్టేజీపైనే డ్యాన్స్ వేస్తూ కనిపించింది. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి సరసన వారసుడు చిత్రంలో రష్మిక నటించారు. అందులోని పాటకు కేరళలో జరిగిన ఓ ఈవెంట్లో స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Rashmika dancing for Ranjithame in Karunagapally, Kollam (Kerala). pic.twitter.com/p8phqgYDWe— AB George (@AbGeorge_) July 25, 2024 -
రష్మికను కేవలం పాటల కోసమే వాడుకున్నారు: పరుచూరి
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వారసుడు. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించింది. దాదాపు రూ.200 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమాపై తాజాగా ప్రముఖ సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు. 'హీరోను పరిచయం చేసిన ఫస్ట్ షాట్ అద్భుతంగా ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేసిన విజయ్, వంశీలను అభినందించాలి. పెద్దింటి పేరెంట్స్కు ముగ్గురు కొడుకులు ఉంటారు. వారు ఇల్లు వదిలి వెళ్లిపోతే తిరిగి ఇంటికి తీసుకొచ్చే తమ్ముడి కథ ఇది. హీరో అమ్మచాటు బిడ్డ. కానీ నాన్న కోసం ఎంతో త్యాగం చేస్తాడు. తండ్రి బతికే అవకాశం లేదని తెలిసినప్పుడు మూడో కొడుకును తన స్థానంలో హెడ్గా కూర్చోబెడతాడు. దీంతో కోపంతో మిగతా ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. తన సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని చాలామంది ఎదురు చూస్తున్నారని, అలాంటి వారి బారి నుంచి కాపాడాలంటే చిన్నవాడే బెటర్ అనుకుంటాడు తండ్రి. ఎందుకంటే అప్పటికే పెద్ద కొడుకు శ్రీకాంత్కు ఒకరితో ఎఫైర్ ఉంటుంది. రెండో కుమారుడు సొంత కుటుంబానికే ద్రోహం చేయాలని చూస్తాడు. 2.49 గంటల సినిమాలో ప్రేమ చాలా తక్కువగా ఉంది. పాటల కోసం రష్మికను వాడుకున్నారు. ఉమ్మడి వ్యవస్థ, కుట్రలు, కుతంత్రాలు, విడిపోవడాలు.. వీటికి ఎక్కువ నిడివి ఇచ్చారు. దాన్ని కొంచెం కట్ చేసి హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను ఎక్కువ చూపించి ఉంటే బాగుండేది. ఓ సీన్లో విజయ్ను చైర్మన్గా ఎన్నుకోవడానికి తక్కువ ఓట్లు పడ్డాయి. అప్పుడు విజయ్ ఓటేసేవాళ్ల తప్పులను ఎత్తిచూపడంతో వెంటనే వారు మనసు మార్చుకుని హీరోకే ఓటేస్తారు. ఆ సీన్ బాగుంది. వందమందినైనా కొట్టే హీరో తన అన్నయ్య మీద ఒక్క దెబ్బ కూడా వేయడడు. మరొకటి.. తండ్రి అనారోగ్యాన్ని తల్లికి, అన్నలకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడతాడు. అయితే ఒకానొక దశలో తండ్రి సామ్రాజ్యం కుప్పకూలేట్లుగా ఉంటే హీరో దాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఇద్దరు అన్నయ్యలను హీరో ఇంటికి తీసుకొచ్చేస్తాడు. లెవంత్ అవర్లో తండ్రి అస్థికలు నదిలో కలిపినట్లు చూపించారు. అంతా బాగుంది కానీ ఆ షాట్ చూపించకపోయుంటే బాగుండేది. అస్థికలు కలిపినట్లు కాకుండా హీరోయిన్తో హీరో పెళ్లి చేసి తండ్రి అక్షింతలు వేసినట్లు చూపించాల్సింది. ఎంతో కష్టపడ్డ హీరో తండ్రిని కాపాడుకోలేనట్లు చూపించకుండా.. 'నాన్నా.. అంతా సెట్ చేశాను. ఇక నేను తిరిగి అమెరికా వెళ్లిపోతున్నాను' అని చెప్పి ఉంటే బాగుండేది. హీరోయిన్ క్యారెక్టర్ ఇంకో పావుగంటయినా పెంచాల్సింది. అలాగే శ్రీకాంత్తో ఎఫైర్ పెట్టుకున్న అమ్మాయి ఏమైందో చూపించలేదు? చిన్నచిన్న పొరపాట్లు మినహా సినిమా బాగుంది' అని చెప్పుకొచ్చాడు పరుచూరి. -
ఈ వారం థియేటర్స్లో చిన్న చిత్రాలు..ఓటీటీలో బ్లాక్ బస్టర్స్
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా నడుస్తోంది. సంక్రాంతి పండగా కారణంగా జనవరిలో అన్ని పెద్ద చిత్రాలే విడుదలయ్యాయి. చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం కష్టంగా మారింది. దీంతో ఫిబ్రవరి నెలలో వరుసగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే వాటిలో రైటర్ పద్మభూషన్.. సార్, వినరో భాగ్యము విష్ణు కథ లాంటి సినిమాలు పాజిటివ్ టాక్ సంపాదించుకోగా.. పెద్ద చిత్రాలుగా వచ్చిన అమిగోస్, మైఖేల్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. ఇక ఈ నెల చివరి వారంలో థియేటర్స్ సందడి చేసేందుకు చిన్న చిత్రాలు రెడీ అయితే.. ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పెద్ద చిత్రాలు రాబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీ, థియేటర్స్లో సందడి చేసే చిత్రాలపై ఓ లుక్కేద్దాం. మిస్టర్ కింగ్ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నటుడు టాలీవుడ్కి పరిచయం కాబోతున్నాడు. దివంగత దర్శకురాలు విజయ నిర్మల మనవడు శరణ్ కుమార్ హీరోగా శశిధ్ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ కింగ్’. యశ్విక నిష్కల, ఊర్వి సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కోససీమ థగ్స్ ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా తెరకెక్కించిన ఇంటెన్స్ యాక్షన్ తమిళ చిత్రం ‘థగ్స్’. హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సింహ, ఆర్కే సురేష్, మునిష్కాంత్, అనస్వర రంజన్ కీ రోల్స్ చేశారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై జీయో స్టూడియోస్ భాగస్వామ్యంతో రియా షిబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. తెలుగులో ‘కోనసీమ థగ్స్’పేరుతో ఈ చిత్రం రిలీజ్ రాబోతుంది. డెడ్లైన్ అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం డెడ్ లైన్. బొమ్మారెడ్డి.వి.ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న థియేటర్స్లో విడుదల కాబోతుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న పెద్ద చిత్రాలు వారసుడు తమిళస్టార్ విజయ్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన లేటెస్ట్ మూవీ వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో విడుదలై భారీ విజయం సాధించింది. ది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఫిబ్రవరి 23నుంచి ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్లో వీరసింహారెడ్డి స్ట్రీమింగ్ కానుంది. మైఖేల్ సందీప్ కిషన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 3న విడుదలై బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో అనుకున్న సమయానికంటే ముందే ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేస్తుంది. ఫిబ్రవరి 24 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించగా, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ని షేక్ చేసింది. దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మెగాస్టార్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ నెల 27 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. -
ఓటీటీలోకి సంక్రాంతి బ్లాక్ బస్టర్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సంక్రాతి బరిలో నిలిచి సూపర్ హిట్గా నిలిచిన చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రాలు ఓటీటీలోనూ అలరించనున్నాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పటికే రెండు చిత్రాలు స్ట్రీమింగ్ అవుతుండగా.. మిగతా సినిమాలు వచ్చే వారం స్ట్రీమింగ్ కానున్నాయి. థియేటర్లలో చూడలేక మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. వాల్తేరు వీరయ్య మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం మూడు రోజుల్లోనే వాల్తేరు వీరయ్య వందకోట్లు కలెక్ట్ చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి వాల్తేరు వీరయ్య స్ట్రీమింగ్ తీసుకురానున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఓటీటీలో వీరసింహారెడ్డి నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుంచి హాట్ స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కళ్యాణం కమనీయం యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. పేపర్ బాయ్ చిత్రంతో హీరోగా పరిచయం అయిన అతడు ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అతడు నటించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. తాజాగా ఈ ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. తునివు తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ తునివు. జీ సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్లో తెగింపు పేరుతో విడుదలైంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోలీవుడ్లో హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అలరిస్తుంది. ఫిబ్రవరి 8 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. వచ్చేస్తున్న వారసుడు దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వారిసు(వారసుడు). వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళంలో సూపర్ హిట్గా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. సంక్రాంతికి రిలీజైన వారసుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. -
అఫీషియల్: ఓటీటీలోకి వారసుడు.. అప్పటినుంచే స్ట్రీమింగ్
దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వారిసు/వారసుడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు, తమిళంలో సూపర్ హిట్గా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. సంక్రాంతికి రిలీజైన వారసుడు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ అధికారికంగా వెల్లడించింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. థియేటర్లో చూసి చాలారోజులవుతుందని ఫీలవుతున్న విజయ్ ఫ్యాన్స్ ఎంచక్కా బుధవారం నుంచి మరోసారి వారసుడు మూవీ చూసేయొచ్చు. hold tight because the wait is over! here he comes 🤩#VarisuOnPrime, Feb 22 coming soon in Tamil, Telugu and Malayalam!#Thalapathy @actorvijay @directorvamshi @iamrashmika @MusicThaman @karthikpalanidp pic.twitter.com/AM8xYn44bi — prime video IN (@PrimeVideoIN) February 17, 2023 #VarisuOnPrime #Thalapathy @actorvijay @directorvamshi @iamrashmika @MusicThaman @karthikpalanidp @Cinemainmygenes @ramjowrites @rgvhari @ahishor @vaishnavi141081 @Yugandhart_ @SVC_official pic.twitter.com/CLIB7WyO5s — prime video IN (@PrimeVideoIN) February 17, 2023 #VarisuOnPrime #Thalapathy @actorvijay @directorvamshi @iamrashmika @MusicThaman @karthikpalanidp @Cinemainmygenes @ramjowrites @rgvhari @ahishor @vaishnavi141081 @Yugandhart_ @SVC_official pic.twitter.com/xqPBlFyYEg — prime video IN (@PrimeVideoIN) February 17, 2023 చదవండి: ఉపాసనకు సీమంతం జరిపిన ఫ్రెండ్స్.. ఫోటోలు వైరల్ -
వారసుడుతో దిల్ రాజుకు ఎన్నికోట్ల లాభం అంటే..?
-
అప్పుడే ఓటీటీకి వారసుడు మూవీ! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్?
తమిళ స్టార్ హీరో విజయ్-టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషల్లో వచ్చిన రీసెంట్ మూవీ వారీసు(తెలుగు వారసుడు). సంక్రాంతి కానుక తమిళంలో జనవరి 11న, తెలుగు జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక్కడ దాదాపు 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 210 కోట్లకు పైగా వసూలు చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. చదవండి: SSMB28 సెట్లో క్రికెట్ ఆడిన తివిక్రమ్.. వీడియో వైరల్! ఏ సినిమా అయిన బాక్సాఫీసు ఫలితాన్ని బట్టి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక స్టార్ హీరో సినిమాల గురించి చెప్పనవసరం లేదు. థియేట్రికల్ రిలీజ్ అనంతరం రెండు నెలల తర్వాత ఆ చిత్రం ఓటీటీలోకి వస్తుంది. కానీ అంతకుమందే విజయ్ వారసుడు ఓటీటీకి రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైం వీడియోస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విజయ్కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా భారీ ధరకు అమెజాన్ వారీసు డిజిటల్ రైట్స్ను దక్కించుకున్నట్లు తెలస్తోంది. చదవండి: అప్పట్లో సంచలనమైన మాధురీ లిప్లాక్, అత్యంత కాస్ట్లీ కిస్ ఇదేనట! విడుదలైన నెల రోజుల లోపే అంటే ఫిబ్రవరి 10న ఈ చిత్రం స్ట్రిమింగ్ కాబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజా బజ్ ప్రకారం వారసుడు ఫిబ్రవరి 22న అమెజాన్లో అందుబాటులోకి రానుందని సమాచారం. స్టార్ హీరో, పెద్ద బ్యానర్ సినిమా అయినందున వారసుడు చిత్రాన్ని నెల రోజుల తర్వాతే ఓటీటీలో అందుబాటులోకి తీసుకురావాలని అమెజాన్ నిర్వహుకులు భావిస్తున్నారట. అందుకే ఫిబ్రవరి మూడో వారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ చేయనుందట. త్వరలోనే అమెజాన్ దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవ్వునుందని సమాచారం. -
దిల్ రాజు ఇంట్లో వారసుడు సంబరాలు (ఫొటోలు)
-
సక్సెస్ పార్టీ.. దిల్ రాజు మనవరాలిని ఎత్తుకున్న విజయ్
దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం వారసుడు(వారిసు). రష్మిక మందన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళంలో బ్లాక్బస్టర్ హిట్ సాధించింది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు తన ఇంట్లోనే సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ కోసం విజయ్ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాడు. శనివారం రాత్రి జరిగిన ఈ పార్టీలో వారసుడు టీమ్లోని ముఖ్యులంతా సందడి చేశారు. అయితే రష్మిక మాత్రం ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. ఇక దిల్ రాజు మనవరాలు ఇషిత రంజితమే పాటకు స్టెప్పులేయడంతో మురిసిపోయిన విజయ్ ఆమెను ఎత్తుకుని అభినందించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. Celebrations everywhere #Varisu 🤩#MegaBlockbusterVarisu pic.twitter.com/1ILDidzH75 — Vijay Fans Trends (@VijayFansTrends) January 21, 2023 Video from #Varisu success celebration last night 😍pic.twitter.com/lkQK7C7eFT — Vijay Fans Trends (@VijayFansTrends) January 22, 2023 #Varisu Success Celebration! pic.twitter.com/GIjsdqMGDU — #VARISU (@VarisuMovieOff) January 22, 2023 Images from #Varisu success meet 😍 pic.twitter.com/j4aPBZsNoU — Vijay Fans Trends (@VijayFansTrends) January 21, 2023 చదవండి: కొత్త బిజినెస్ మొదలుపెట్టిన మంచు విరానిక -
అయితే ఏంటీ..? అది నా సొంత నిర్ణయం: రష్మిక
తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వారసుడు(వారిసు). వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతి కానుకగా తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో జనవరి 14న రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం హాట్ టాపిక్గా మారింది. టాప్ హీరోయిన్ను ఈ చిత్రంలో కేవలం పాటలకే పరిమితం చేయడంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా ఆమె వారసుడు సినిమాలో తన పాత్రపై తొలిసారి స్పందించింది. ప్రాధాన్యత లేకపోయినా కేవలం విజయ్ కోసమే ఈ సినిమా ఒప్పుకున్నట్లు తెలిపింది పుష్ప బ్యూటీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చింది భామ. రష్మిక మాట్లాడుతూ..'తన పాత్రకు స్కోప్ లేకపోయినా నటించా.అవును ఇది నా సొంత నిర్ణయం. నా ఇష్ట ప్రకారమే ఒప్పుకున్నా. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే వారసుడులో నటించా. ఇందులో నా పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని తెలుసు. రెండు పాటల కోసమేనని నాకు తెలుసు. ఈ విషయాన్ని సినిమా షూట్లో ఉన్నప్పుడు విజయ్కి సరదాగా చెప్పేదాన్ని. ఈ సినిమాలో నాకు పాటలు తప్ప ఏమీ లేవు అంటూ జోక్స్ వేసేదాన్ని. ఆయన కొన్ని విషయాలను కూడా నేర్చుకున్నా. అని అన్నారు. ఈ చిత్రంలో రష్మిత జిమిక్కి పొన్ను, రంజితమే పాటల్ తన డ్యాన్స్తో రష్మిక అదరగొట్టింది. ప్రస్తుతం రష్మిక సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘మిషన్ మజ్ను’ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పాటు రణ్బీర్ కపూర్, సందీప్రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న ‘యానిమల్’, అల్లు అర్జున్ పుష్ప-2 లో కనిపంచనుంది. -
రంజితమే సాంగ్.. కాలు కదిపిన కడుపులో బిడ్డ
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన సినిమా వారసుడు(వారిసు). నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ బాక్సాఫీస్ మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా.. టాలీవుడ్ చిత్ర నిర్మాత దిల్ రాజు నిర్మించారు. అయితే ఈ సినిమాలోని రంజితమే రంజితమే అంటూ సాగే సాంగ్ విజయ్ ఫ్యాన్స్తో పాటు థియేటర్లను ఓ రేంజ్లో ఊపేసింది. రిలీజైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ను సైతం షేక్ చేసింది. అయితే ఈ పాటకు తాజాగా ఓ మహిళ కడుపులోని బిడ్డ సైతం కదలడం వైరల్గా మారింది. రంజితమే సాంగ్ ప్లే చేస్తున్నప్పడు ఆస్పత్రిలో బెడ్పై ఉన్న కదలడం కనిపించింది. దీంతో ఆ మహిళ ఆనందంతో మురిసిపోయింది. తన బిడ్డ డ్యాన్స్ చేయడాన్ని చూసి ఆనందంతో పొంగిపోయింది. ఈ వీడియోను చూసిన సంగీత దర్శకుడు తమన్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'ఈ వీడియో చూస్తుంటే చాలా మధురానుభూతికి లోనవుతున్నా.. ఇది నా రోజును ఎంతో సంతోషంగా మార్చేసింది.' అని పోస్ట్ చేశారు. Such a divine feel How Cute this is made my day 🥹❤️ #Ranjithame 💃🤍🍭 https://t.co/3eRNztekDP — thaman S (@MusicThaman) January 14, 2023 -
వైజాగ్ మా సెంటిమెంట్ : వంశీ పైడిపల్లి
అల్లిపురం (విశాఖ దక్షిణం): వైజాగ్ మా సెంటిమెంట్ అని వారసుడు చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. వైజాగ్ వచ్చినప్పుడల్లా నగరంలో సంపత్ వినాయగర్ ఆలయం, సింహాచలం సింహాద్రి అప్పన్న గుడికి వెళ్లడం ఆనవాయితీ అన్నారు. తన సినిమాలన్నీ విశాఖలోనే షూటింగ్లు జరుపుకున్నాయన్నారు. భారత్ సూపర్ స్టార్ విజయ్ ఇటువంటి కథ ఒప్పుకోగానే తనకు భయమేసిం దన్నారు. వారసుడు చిత్ర యూనిట్ నగరంలోని మెలోడి థియేటర్లో శుక్రవారం సాయంత్రం సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ వారసుడు తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కావడం గర్వంగా ఉందన్నారు. తమన్ సంగీతం సినిమాకు వెన్నెముకగా నిలిచిందన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ బృందావనం తరువాత దర్శకుడు వంశీతో మళ్లీ పని చేశానన్నారు. దిల్రాజు ఉత్తమ నిర్మాత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నటి సంగీత, డి్రస్టిబ్యూటర్ ప్రతినిధి దిల్ శ్రీనివాస్, థియేటర్ మేనేజర్లు గౌరీ శంకర్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ 'వారీసు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు. వంశీ పైడిపల్లి రూపొందించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కోలీవుడ్ సహా తెలుగులోనూ పాజిటివ్ రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. విజయ్కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా భారీ ధరకు అమెజాన్ వారీసు డిజిటల్ రైట్స్ను దక్కించుకున్నట్లు తెలస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఫిబ్రవరి 10న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉండనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
వారిసు, తునివు థియేటర్ యాజమాన్యాలకు నోటీసులు
తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ చిత్రాల విడుదల చేసిన థియేటర్ల యాజమాన్యానికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విజయ్ నటించిన వారిసు, అజిత్ తుణివు చిత్రాలు పొంగల్ సందర్భంగా ఈ నెల 11వ తేదీన భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలు విడుదలకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. ముఖ్యంగా 11, 12వ తేదీల్లో మాత్రమే ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. చదవండి: వారి వల్లే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిందా? అదేవిధంగా థియేటర్ల ముందు భారీ కటౌట్లు ఏర్పాటు చేయరాదని, వాటికి పూజలు, పాలాభిషేకాలు వంటివి నిర్వహించరాదని, సినిమా టికెట్లను అధిక రేట్లకు విక్రయించకూడదని నిబంధనలు విధించింది. అయితే ఈ రెండు చిత్రాలను ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ థియేటర్ యాజమాన్యం ఈనెల 17వ తేదీ వరకు ప్రత్యేక ఆటలను ప్రదర్శించారు. అంతేకాదు టికెట్లను బ్లాక్లో రూ.1000, రూ.2000 వరకు విక్రయించినట్లు ప్రచారం జరిగింది. ఇకపోతే థియేటర్ల ముందు అభిమానులు రచ్చ రచ్చ చేశారు. చదవండి: అల్లు అర్జున్కు దుబాయ్ ప్రభుత్వం అరుదైన గౌరవం కాగా నటుడు విజయ్ నటించిన వారిసు చిత్రం ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లోనే రూ. 210 కోట్లు వసూలు చేసినట్లు, అజిత్ నటించిన తుణివు రూ.150 కోట్లకుపైగా వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కాగా ఇలాంటి అన్ని విషయాలపై వివరణ కోరుతూ ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. వారు సరైన వివరణ ఇవ్వకుంటే 1957లోని ప్రభుత్వం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. -
అంతకుమించి సాధించేది ఏముంటుంది
‘‘వారసుడు’ సినిమా క్లయిమాక్స్లో తండ్రీకొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు మా మనసులను హత్తుకున్నాయి అంటూ ప్రతి రోజూ నాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. మా నాన్న కూడా ‘వారసుడు’ చూసి భావోద్వేగానికి లోనై ఇన్నేళ్లలో తొలి సారి నన్ను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకుమించి నేను సాధించేది ఏముంటుంది?’’ అని డైరెక్టర్ వంశీ పైడిపల్లి అన్నారు. విజయ్, రష్మికా మందన్న జంటగా నటించిన తమిళ చిత్రం ‘వారీసు’. ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తమిళంలో విడుదలైంది. ఈ చిత్రాన్ని ‘వారసుడు’ పేరుతో తెలుగులో డబ్ చేసి, ఈ నెల 14న రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి పంచుకున్న విశేషాలు. ► ‘ఊపిరి’ని తెలుగు, తమిళ భాషల్లో తీశాం. ‘వారీసు’ని తమిళంలో తీసి, తెలుగులోకి డబ్ చేశాం. తమిళంలో నేను తీసిన తొలి సినిమా ‘వారీసు’ పెద్ద హిట్ కావడం హ్యాపీ. తెలుగులోనూ ఈ సినిమా త్వరలో ‘మాస్టర్’ (విజయ్ హీరోగా నటించారు) కలెక్షన్లను బీట్ చేయబోతోంది. ‘దిల్’ రాజుగారికి ఈ సినిమా డబ్బుతో పాటు గౌరవం తెచ్చి పెట్టింది. మౌత్ టాక్ వల్ల ఈ చిత్రానికి ఆదరణ పెరుగుతోంది. సినిమా చూసిన యువకులు తమ అవ్వ, తాతలు, ఇతర కుటుంబ సభ్యులకు ఈ చిత్రాన్ని చూడమని చెప్తున్నారు. హిందీలో కూడా మా సినిమాకి ఆదరణ పెరుగుతోంది. ► నేను ఓ లైన్ సిద్ధం చేసుకుని హీరోలకు వినిపిస్తాను.. వారు ఓకే అన్న తర్వాత వారి ఇమేజ్కి తగినట్లుగా సన్నివేశాలను రూపొందిస్తాను. ప్రతిసారీ మమ్మల్ని మేము నిరూపించుకోవాలి. అందుకే నా ప్రతి చిత్రాన్ని ఛాలెంజ్గా స్వీకరిస్తుంటాను. 2020లో మహేశ్బాబుగారితో ఓ సినిమా చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. పెద్ద స్టార్స్తో కమర్షియల్ సినిమాలు చేయడానికే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నా తర్వాతి ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. -
బాక్సాఫీస్ వద్ద స్టార్ వార్.. ఏ సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్లో కూడా సంక్రాంతి ఫైట్ బీభత్సంగానే జరిగింది. బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు స్టార్ హీరోలు నువ్వానేనా అన్న రీతిలో పోటీపడ్డారు. విజయ్ వారసుడు(వారిసు)గా అజిత్ తెగింపు(తునివు) చిత్రంతో సంక్రాంతి బరిలో దిగారు. వారం రోజుల్లోనే ఈ రెండు సినిమాలు రెండు వందల కోట్లు రాబట్టి బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. ఇప్పటివరకు వారసుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. అటు తునివు సుమారు రూ.250 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లోనూ ఈ రెండు సినిమాలు వసూళ్ల దుమ్ము దులుపుతున్నాయి. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అజిత్, విజయ్ సినిమాలు నేరుగా తలపడటంతో ఎవరు ఎక్కువ వసూళ్లు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. Triple ah received your love in 7 days nanba 🔥#MegaBlockbusterVarisu crosses 210Cr collection worldwide 😎#VarisuHits210Crs#Thalapathy @actorvijay sir @directorvamshi @SVC_official @MusicThaman @iamRashmika @7screenstudio @TSeries#Varisu #VarisuPongal pic.twitter.com/aVS6vGYhhY — Sri Venkateswara Creations (@SVC_official) January 18, 2023 #Thunivu 7 Days Box Office 👉Tamilnadu : ₹149.7 CR 👉Andhra & Nizam : ₹6 Cr 👉Kerala : ₹7.50 Cr 👉Karnataka : ₹12.63 Cr 👉Rest of India : ₹7.5 Cr 👉Overseas : ₹66 Cr Total Worldwide Gross : ₹ 249.33* CRS Note: Hindi version yet to release. — TN Theatres Association (@TNTheatres_) January 18, 2023 చదవండి: సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం -
‘వారసుడు డైలీ సీరియల్’.. ట్రోలర్స్పై వంశీ పైడిపల్లి ఫైర్
తమిళ స్టార్ హీరో విజయ్ మూవీ ‘వారసుడు’ డైలీ సీరియల్ అంటూ వస్తున్న విమర్శలపై దర్శకుడు వంశీ పైడిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించాడు. ఈ నెల 11వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో 14న రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఈ సినిమా డైలీ సీరియల్ను తలపిస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ పోస్టులపై వంశీ పైడిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. డైలీ సీరియల్స్ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నాయని.. కానీ సినిమా తీయడం సాధారణ విషయమేమీ కాదు.' అంటూ ఫైరయ్యారు వంశీ. వంశీ మాట్లాడుతూ..' ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టమైన పని. ఇదంతా టీమ్ వర్క్. ప్రేక్షకులను అలరించడానిక్ మేం పడే కష్టం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ప్రతి సినిమా వెనుక ఎన్నో త్యాగాలు ఉంటాయి. మనదేశంలో సూపర్స్టార్స్లో విజయ్ కూడా ఒకరు. ప్రతి సన్నివేశానికి రిహార్సల్స్ చేయాల్సి ఉంటుంది. మనం ఏం చేయగలమనేది మన చేతుల్లో ఉంటుంది. ఫలితం కాదు. ఆయనే నా సినిమాకు సమీక్షకుడు, విమర్శకుడు. ఆయన కోసం సినిమా చేశా. మరీ ఇంత నెగెటివ్గా ఉండకండి. సాఫ్ట్వేర్ జాబ్ వదిలి ఇండస్ట్రీకి వచ్చా. ఈ రోజు నేనేంటో నాకు తెలుసు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికే మూవీ చేశా.' అని అన్నారు. -
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వారసుడు.. ఎన్ని కోట్లంటే?
తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించాడు. ఈ నెల 11వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో 14న రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇటీవల చెన్నైలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల వసూళ్ల చేసినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు. అలాగే ఓవర్సీస్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్క్ను దాటగా.. ఆస్ట్రేలియాలో 500 కె డాలర్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో విజయ్ డ్యాన్స్, పాటలు, కామెడీ, యాక్షన్తో కలర్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరిస్తోంది. #Varisu has crossed the A$500K mark in Australia 🇦🇺 pic.twitter.com/AaNXF48oHh — Ramesh Bala (@rameshlaus) January 17, 2023 #Varisu crosses the Million mark in USA 🇺🇸 pic.twitter.com/XPEWGkbt2K — Ramesh Bala (@rameshlaus) January 17, 2023 #Varisu has joined the ₹ 150 Crs Gross Club at the WW Box office.. pic.twitter.com/1i95Nk9f4Z — Ramesh Bala (@rameshlaus) January 17, 2023 -
విజయ్ వారసుడు ఓటీటీ స్ట్రీమింగ్ ఇక్కడే! అంతకు ముందే రిలీజ్?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ వారసుడు(తమిళంలో వారీసు) సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్కు ముందే వివాదంగా మారిన ఈ మూవీ తమిళంలో జనవరి 11న, తెలుగులో జనవరి 14న థియేటర్లోకి వచ్చింది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి పూర్తి స్థాయిలో తెరకెక్కించిన ఈ తమిళ చిత్రానికి టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాత వ్యవహరించారు. తాజాగా ఈ మూవీ రూ. 100 కోట్ల క్లబ్లోకి చేరడం విశేషం. చదవండి: చిరంజీవి మెసేజ్లను అవాయిడ్ చేసిన స్టార్ యాంకర్! అసలేం జరిగిందంటే.. తెలుగులో వారసుడు టాక్ అంతంతగానే ఉన్నప్పటిక తమిళ ప్రేక్షకులను ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో వసూళ్ల పరంగా దేశవ్యాప్తంగా ఈ సినిమా దూకూడు చూపిస్తోంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఫలితంగా వారసుడు మంచి విజయం సాధించింది. థియేటర్లో సందడి చేస్తున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్పై ఆసక్తిని సంతరించుకుంది. తాజా బజ్ ప్రకారం.. వారసుడు(వారీసు) మూవీ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైం వీడియోస్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: తండ్రి ఎమోషనల్.. ఇది నాకు అతిపెద్ద విజయం: డైరెక్టర్ వంశీ పైడిపల్లి సాధారణంగా స్టార్ మీరో మూవీ థియేట్రికర్ రన్ అనంతరం 8 వారాలు అంటే రెండు నెలల తర్వాతే ఓటీటీకి వస్తుంది. ఇక విజయ్ వారసుడు మాత్రం అంతకు ముందే స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అంటే 4 నుంచి 6 వారాలకు వారసుడు మూవీ అమెజాన్లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీ, రిలీజ్పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కాగా ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటించింది. శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్లు ప్రధాన పాత్రలు పోషించగా.. ప్రకాశ్ రాజ్ ప్రతికథానాయకుడిగా కనిపించారు. -
Varasudu Collections: వారం కాకముందే సెంచరీ కొట్టిన విజయ్
దళపతి విజయ్ కథానాయకుడి నటించిన ద్విభాషా చిత్రం వారిసు. ఈ సినిమా వారసుడు పేరిట తెలుగులోనూ రిలీజైంది. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశాడు. దిల్ రాజు, శిరీష్, పరమ్, వి.పొట్లూరి, పెరల్ నిర్మించిన ఈ చిత్రం తమిళ్లో జనవరి 11న విడుదలవగా తెలుగులో 14న విడుదలైంది. కలెక్షన్లపరంగా రెండు చోట్లా దూసుకుపోతోందీ సినిమా. రిలీజై వారం రోజులు కూడా కాకముందే వంద కోట్ల క్లబ్లో చేరింది. అటు కేరళలో, ఇటు నార్త్లో హిందీలోనూ రిలీజవడంతో అక్కడ కూడా బాగానే వసూళ్లు రాబడుతోంది. ఆదివారంతో సంక్రాంతి పండగ హవా ముగియనుండటంతో వసూళ్ల మీద ఎఫెక్ట్ పడే అవకాశముంది. అటు అజిత్ తునివు, ఇటు చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు గట్టి పోటీనిచ్చినా వాటన్నింటినీ తట్టుకుని నిలబడి వారసుడు వంద కోట్లు రాబట్టడంతో సంతోషంలో మునిగి తేలుతున్నారు ఫ్యాన్స్. కాగా విజయ్కు వంద కోట్లు సాధించడం పెద్ద లెక్కేం కాదు. ఇప్పటికే అతడి తొమ్మిది సినిమాలు ఈ ఘనత సాధించగా తాజాగా వారిసు సెంచరీ కొట్టి ఆ జాబితాలోకెక్కింది. తునివు కూడా వంద కోట్ల మార్క్ దాటడం విశేషం. #Varisu TN Box Office FINALLY the film crossed ₹50 cr mark in the 5th day. Day 1 - ₹ 19.43 cr Day 2 - ₹ 8.75 cr Day 3 - ₹ 7.11 cr Day 4 - ₹ 7.24 cr Day 5 - ₹ 9.08 cr Total - ₹ 51.61 cr#Vijay — Manobala Vijayabalan (@ManobalaV) January 16, 2023 #Varisu has entered the ₹ 100 Cr Club at the #India Box office.. — Ramesh Bala (@rameshlaus) January 16, 2023 చదవండి: రష్మిక టాటూ వెనక స్టోరీ -
Varasudu Movie Review: వారసుడు మూవీ రివ్యూ
టైటిల్: వారసుడు నటీనటులు: విజయ్, రష్మిక మందన్నా, శరత్ కుమార్, ప్రకాశ్రాజ్, ప్రభు, శ్రీకాంత్, జయసుధ, సుమన్, శ్యామ్, యోగిబాబు తదితరులు నిర్మాణ సంస్థలు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్ నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ దర్శకత్వం: వంశీ పైడిపల్లి సంగీతం: తమన్ సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని ఎడిటర్: ప్రవీణ్ కేఎల్ విడుదల తేదీ: జనవరి 14, 2023 తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వారీసు. టాలీవుడ్లో 'వారసుడు'గా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జోడీగా నటించింది. తెలుగులో జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. తమిళ వర్షన్ జనవరి 11నే విడుదల కాగా.. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. శరత్కుమార్(రాజేంద్ర) ఓ పెద్ద బిజినెస్ మ్యాన్. అతని భార్య జయసుధ(సుధ). వీరికి ముగ్గురు కుమారులు. విజయ్(విజయ్), శ్రీకాంత్(జై), శ్యామ్(అజయ్). పెద్ద పెద్ద మైనింగ్ కాంట్రాక్టులు డీల్ చేస్తుంటారు. రాజేంద్రతో జయప్రకాశ్(ప్రకాశ్ రాజ్) బిజినెస్లో పోటీ పడుతుంటాడు. రాజేంద్రతో పాటు శ్రీకాంత్, శ్యామ్ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు. ముగ్గురు కుమారులు కావడంతో వారసుడిని ప్రకటించి బిజినెస్ను ఎవరికీ అప్పగించాలనే ఆలోచిస్తూ ఉంటాడు రాజేంద్ర. కానీ విజయ్కు తన తండ్రి వ్యాపారంలో కొనసాగడం ఇష్టం లేదని చెప్పడంతో ఇంటి నుంచి వెళ్లిపోమంటాడు రాజేంద్ర. ఆ తర్వాత సొంతంగా ఓ స్టార్టప్ కంపెనీ ప్రారంభిస్తాడు. మరోవైపు జయప్రకాశ్(ప్రకాశ్ రాజ్) రాజేంద్ర కాంట్రాక్టులు కొట్టేసేందుకు కుట్రలు చేస్తుంటాడు. కానీ అతని వల్ల కాకపోవడంతో శ్రీకాంత్(జై), శ్యామ్(అజయ్)ను పావులుగా వాడుకుని వారి కుటుంబాన్ని దెబ్బతీస్తాడు. ఊహించని సంఘటనలతో రాజేంద్ర కుటుంబం విడిపోతుంది. ఆ తర్వాత రాజేంద్రకు ఓ భయంకర నిజాన్ని డాక్టర్ ఆనంద్(ప్రభు) చెబుతాడు. అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇంటి నుంచి వెళ్లగొట్టిన విజయ్ తిరిగొచ్చాడా? అసలు రాజేంద్రకు డాక్టర్ చెప్పిన భయంకర నిజం ఏంటి? ఆ తర్వాత కుటుంబం అంతా కలిసిందా? జై, అజయ్ మళ్లీ కుటుంబంతో కలిశారా? రాజేంద్ర తన వారసుడిగా ముగ్గురిలో ఎవరినీ ప్రకటించారు? రాజేంద్ర బిజినెస్ను అలాగే కొనసాగించారా? చివరికి కుటుంబం, బిజినెస్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే అసలు కథ. కథ ఎలా ఉందంటే.. కథ విషయానికొస్తే.. రోటీన్ స్టోరీ అయినప్పటికీ తెరపై రిచ్ లుక్ కనిపించేలా చేశారు. ప్రకాశ్ రాజ్ ఎంట్రీతో కథ మొదలు కావడం, బిజినెస్ డీల్స్, కాంట్రాక్టులు అంతా రోటీన్గా సాగుతుంది. హీరో, హీరోయిన్ల మధ్య కామెడీ తప్ప.. రొమాంటిక్ సీన్స్ పెద్దగా కనిపించవు. విజయ్, కిచ్చా మామ(యోగిబాబు) మధ్య సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వులు తెప్పించడం ఖాయం. ఫస్టాప్లో కుటుంబంలో గొడవలు, బిజినెస్ కాంట్రాక్టలతో కథనం సాగుతుంది. కథలో జరగబోయే సన్నివేశాలు ప్రేక్షకులు ఊహకు అందేలా ఉన్నాయి. అయితే సీరియస్ సీన్లలోనూ కామెడీ పండించడం వంశీ తనదైన మార్క్ చూపారు. కథలో కొత్తదనం లేకపోవడం వల్ల ప్రేక్షకులకు అంతగా ఆసక్తి కలగకపోవచ్చు. కథ చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల ప్రేమ, అప్యాయతలను కొత్త కోణంలో చూపించారు డైరెక్టర్ వంశీ. సెకండాఫ్లో ఫ్యామిలీ ఎమోషన్స్పై ఎక్కువ దృష్టి పెట్టారు. ఒకవైపు బిజినెస్ కాపాడుకోవడం, అలాగే కుటుంబాన్ని ఒక్కటి చేయడం ఈ రెండు అంశాల ఆధారంగా కథను తీర్చిదిద్దారు. ఫ్యామిలీ సెంటిమెంట్తో పాటు విజయ్ యాక్షన్ ప్రేక్షకులకు అలరిస్తాయి. హీరోయిన్ రష్మిక పాత్రను కొంతమేరకే పరిమితం చేశారు. కుటుంబ సభ్యుల మధ్యే పోటీ, బిజినెస్లో పెత్తనం కోసం వారి మధ్య జరిగే పోరాటం చుట్టే స్టోరీ నడుస్తుంది. విజయ్ ఫైట్స్, పాటలు అభిమానులను అలరించడంలో సందేహం లేదు. సెకండాఫ్లో రంజితమే సాంగ్ గ్రాండ్గా తెరకెక్కించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఫ్యామిలీ ఎమోషన్స్, బిజినెస్ చుట్టే కథను నడిపించడం రోటీన్గా అనిపిస్తుంది. ఇలాంటి కథలు గతంలోనూ వచ్చినప్పటికీ కాస్త భిన్నంగా చూపించారు. కొన్ని చోట్ల ఫ్యామిలీ ఎమోషన్స్తో కంటతడి పెట్టించారు. ఓవరాల్గా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను తెరపై సరికొత్తగా ఆవిష్కరించారు వంశీ. ఎవరెలా చేశారంటే.. విజయ్ తనదైన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. సీరియస్ సీన్లలో కామెడీ పండించడం, ఫైట్ సీన్స్, డ్యాన్స్తో విజయ్ అదరగొట్టారు. ముఖ్యంగా ఫైట్ సీన్స్లో తనదైన మార్క్ చూపించారు. రష్మిక పాత్ర చిన్నదే అయినప్పటికీ తన గ్లామర్తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిజినెస్ మ్యాన్గా శరత్ కుమార్, అమ్మ పాత్రలో జయసుధ ఒదిగిపోయారు. శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, ప్రభు, యోగిబాబు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. తమన్ సంగీతం సినిమాకు అదనపు బలం. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాగుంది. ప్రవీణ్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. -
ఇన్నాళ్లకు మళ్లీ కన్నీళ్లు వచ్చాయి – ‘దిల్’ రాజు
‘‘వారిసు’ చిత్రంపై తమిళ ప్రేక్షకులు చూపిన స్పందనకి వంశీ పైడిపల్లి, తమన్ ఏడ్చారు. ‘బొమ్మరిల్లు’ సినిమా చూస్తున్నప్పుడు వచ్చిన ఒక ఫోన్ కాల్తో నేను కూడా ఏడ్చాను.. మళ్లీ ఇన్నాళ్లకు ‘వారిసు’ చూస్తున్నపుడు కన్నీళ్లు వచ్చాయి. మా నమ్మకం నిజం కావడంతో వచ్చిన ఆనందభాష్పాలు అవి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. దళపతి విజయ్, రష్మికా మందన్న జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘వారిసు’ (తమిళ్). ‘వారసుడు’ (తెలుగు). ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తమిళ్లో విడుదలైంది. తెలుగులో 14న ‘వారసుడు’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లడుతూ– ‘‘చెన్నైలో ‘వారిసు’ ఆడుతున్న థియేటర్కి వెళ్లాను.. క్లైమాక్స్ పూర్తయ్యాక వంశీని అభిమానంతో హత్తుకున్నాను. ప్రేక్షకులు నిలబడి క్లాప్స్ కొట్టడంతో మేం పడ్డ కష్టాలు మర్చిపోయాం’’ అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘ఒక మంచి కథని చెబితే ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో ‘వారిసు’ మరోసారి నిరూపించింది. సినిమా అయిపోయిన తర్వాత ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. అల్లు అరవింద్గారు ఫోన్చేసి ‘వెయ్యి కోట్లు పెట్టినా రాని అనుభూతి ఇది’ అని అభినందించారు’’ అన్నారు. ‘‘తమిళంలోలా తెలుగులోనూ ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుంది’’ అన్నారు నటి జయసుధ. -
'వారసుడు' మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
Varisu Movie: థియేటర్లో కాలర్ ఎగరేసిన దిల్ రాజు, ఏడ్చేసిన తమన్
-
థియేటర్లో కాలర్ ఎగరేసిన దిల్ రాజు, ఏడ్చేసిన తమన్
దళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరిట రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. కానీ తమిళంలో మాత్రం ఎలాంటి వాయిదా లేకుండా అనుకున్న సమయానికి అంటే నేడే(జనవరి 11న) రిలీజైంది. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకుందామని డైరెక్టర్ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్.. చెన్నైలోని ఓ థియేటర్కు వెళ్లి సినిమా చూశారు. అక్కడ అభిమానుల స్పందన చూసి ఎమోషనలైన థమన్ కంటతడి పెట్టుకున్నాడు. ఇక దిల్ రాజు అయితే కాలర్ ఎగరేసి మరీ సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు హీరోయిన్ త్రిష సైతం తన ఫ్రెండ్స్తో కలిసి సినిమా చూసినట్లు తెలుస్తుండగా రష్మిక కూడా వారిసు మూవీని ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇకపోతే వారీసు తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.12 కోట్ల మేర డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది. @MusicThaman Thaman Give His Soul For #Varisu ! 💯🥺❤️ His BGM & SONGs Is Another Level ! 🔥pic.twitter.com/BFI9deNjcp — SubashMV (@SubashMV5) January 11, 2023 చదవండి: కారు ప్రమాదం.. నటి బతకడం కష్టమన్న డాక్టర్స్ రామ్చరణ్ వీరసింహారెడ్డి చూస్తాడేమో: చిరంజీవి -
రష్మిక మందన్నాను ఇంట్లో ఏమని పిలుస్తారో తెలుసా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. విజయ్తో ఆమె నటించిన వారసుడు, అలాగే బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో నటించిన `మిషన్ మజ్ను`సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో క్షణం తీరికలేకుండా గడిపేస్తుంది రష్మిక. రీసెంట్గా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన ఈ భామ ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో మిమ్మల్ని ఇంట్లో ఏమని పిలుస్తారు అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. తనను మోనీ లేదా మోవా అని పిలుస్తారని చెప్పుకొచ్చింది రష్మిక. మోవా అంటే కూతురు అనే అర్థమట. ఇదిలా ఉంటే రష్మిక, అల్లు అర్జున్ కాంబినేషన్లో త్వరలోనే పుష్ప-2 షూటింగ్ ప్రారంభం కానుంది. -
అజిత్, విజయ్ చిత్రాలకు తమిళనాడు ప్రభుత్వం షాక్
పొంగల్కు విడుదలవుతున్న వారీసు, తుణివు చిత్రాలకు తమిళనాడు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఈ రెండు చిత్రాలు బుధవారం తెరపైకి రానున్నాయి. దీంతో థియేటర్ల యాజమాన్యం స్పెషల్ షోలకు అనుమతి కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. కాగా అజిత్ నటించిన తుణివు చిత్రం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఆటల ప్రదర్శనకు, విజయ్ చిత్రం వారీసు తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక ఆటల ప్రదర్శనలకు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ చిత్రాలకు ప్రభుత్వం 11, 12 తేదీల వరకే స్పెషల్ షోలకు అనుమతిని ఇచ్చింది. ఆ తరువాత పండుగ సందర్భంగా 13 నుంచి 16వ తేదీ వరకు ఎలాంటి ప్రత్యేక ఆటలకు అనుమతి లేదని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా ప్రజలకు ఇబ్బంది కలిగించేలా థియేటర్ల ముందు భారీ కటౌట్లును ఏర్పాటు చేయడం, పాలాభిõÙకాలు చేపట్టడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.7 లక్షలతో అజిత్ కటౌట్ తమ అభిమాన నటులను ఆరాధించడం సహజమే. కర్ణాటకకు చెందిన నటుడు అజిత్ అభిమాని ఒకరు భారీ ఎత్తున తుణివు చిత్రంలోని కటౌట్ను ఏర్పాటు చేశాడు. ఈ కటౌట్ కోసం అతను అక్షరాల రూ.7 లక్షలు వెచ్చించాడు. ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
విజయ్,రష్మిక మందన్నా 'వారసుడు' మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
విడుదల ఇంకా కొన్ని రోజులే.. వారసుడు స్టోరీ లీక్!
దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వారసుడు. తమిళంలో వారిసు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లో సందడి చేయనుంది. మొదట జనవరి 11న రావాల్సిన ఈ చిత్రాన్ని జనవరి 14కు వాయిదా వేసినట్లు తాజాగా దిల్ రాజున ప్రకటించాడు. ఇదిలా ఉంటే ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అనంతరం ఈ సినిమాపై పలువురు పాత కథ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కొత్త పాయింట్ ఏం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చదవండి: 'వారసుడు' వాయిదా వేస్తున్నాం.. నేనే వెనక్కి తగ్గాను : దిల్రాజు గతంలో వంశీ పైడిపల్లి తాను తీసిన బృందావనం చిత్రాన్నే అటూ ఇటూ మార్చి వారసుడు రూపొందించాడంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో వారసుడు మూవీ సంబంధించిన స్టోరీ లైన్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. పలు తమిళ్ వెబ్సైట్లు ఈ మూవీ కథ ఇదేనంటూ కథనాలు రాసుకొస్తున్నాయి. ఈ తాజా బజ్ ప్రకారం.. వంశీ పైడిపల్లి కొత్త పాయింట్తో వారసుడు తెరకెక్కించాడు అంటున్నారు. చదవండి: నేను అలా అనడం నచ్చలేదేమో: ఆ వివాదంపై రష్మిక స్పందన ‘వారసుడు మూవీ విజయ్ రాజేంద్రన్ అనే బడా వ్యాపారి చూట్టూ చూట్టూ తిరుగుతుందని సమాచారం. కాగా ఈ చిత్రంలో విజయ్ తల్లిదండ్రులు శరత్ కుమార్, జయప్రద నటిస్తుండగా.. శ్రీకాంత్, శ్యామ్లు అన్న పాత్రలు పోషించారు. ఇందులో ప్రకాశ్ రాజ్ విజయ్కి వ్యతిరేకంగా ఉన్న కంపెనీ ఓనర్గా కనిపిస్తాడని తెలుస్తోంది. -
'వారసుడు' వాయిదా వేస్తున్నాం.. నేనే వెనక్కి తగ్గాను : దిల్రాజు
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'వారీసు'. తెలుగులో 'వారసుడు' పేరుతో రిలీజ్ అవుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈనెల 11న ఈ సినిమా విడుదల చేయనున్న్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు బుకింగ్ యాప్స్లో ఈ సినిమా కనిపించకపోవడం సందిగ్ధత మొదలైంది. రిలీజ్కు రెండు రోజులే ఉన్నా ఇంకా మూవీ టీం క్లారిటీ ఇవ్వకపోవడంతో అసలు ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందా? లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా దీనిపై నిర్మాత దిల్రాజు స్పందించారు. తానే ఒక అడుగు వెనక్కి వేశానని, సినిమాను 11కి బదులుగా 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'చిరంజీవి, బాలయ్య సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలి. అందరు నిర్మాతలు బాగుండాలి. దీంతో నేనే ఒక అడుగు వెనక్కి తగ్గాను. అందరూ నామీద పడి ఏడుస్తున్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలుంటాయి. ఇండస్ట్రీ పెద్దలతో డిస్కస్ చేసిన తర్వాత సినిమాను రెండు రోజులు ఆలస్యంగా విడుదల వేయాలని నిర్ణయించాం' అంటూ వెల్లడించారు. కాగా తమిళంలో వారీసు రిలీజ్లో ఎలాంటి వాయిదా లేదు. ముందుగా అనుకున్న సమయానికే 11న అక్కడ విడుదల చేయనున్నారు. Dil Raju says that, he will make arrangements to bring Thalapathy @actorvijay to Hyderabad before the #Vaarasudu release on Jan-14. #Varisu pic.twitter.com/Jk8kekLyhs — T H M (@THM_Off) January 9, 2023 -
విజయ్ " వారసుడు మూవీ " గురించి శ్రీకాంత్ మాటల్లో
-
సంక్రాంతి బరినుంచి తప్పుకున్న వారీసు? నెట్టింట జోరుగా ప్రచారం
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజాచిత్రం వారీసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కాబోతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారు. రష్మిక మందన్నా విజయ్కు జోడీగా నటించింది.సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతున్న ఈ సినిమా ఈనెల 11న విడుదల కాబోతుంది. దిల్రాజు భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వారీసు సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ వార్తలపై స్పందించిన మూవీ టీం రిలీజ్ డేట్పై క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే వారీసు విడుదల అవుతుందని, పుకార్లను నమ్మవద్దంటూ పోస్టర్ను విడుదల చేశారు. Meet THE BOSS’s family in 3 days in theatres near you nanba 🤩#3DaysForVarisu#Thalapathy @actorvijay sir @directorvamshi @MusicThaman @iamRashmika @Lyricist_Vivek @7screenstudio @TSeries #Varisu #VarisuPongal pic.twitter.com/RbAsoqrpNS — Sri Venkateswara Creations (@SVC_official) January 8, 2023 -
'వారీసు' రిలీజ్కు ముందే తీవ్ర విషాదం.. ఆర్ట్ డైరెక్టర్ మృతి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'వారీసు'. దిల్రాజు నిర్మిస్తున్న ఈ సినిమాతో విజయ్ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వారీసు ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు కన్నుమూశారు. గుండెపోటుతో కేరళలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స తీసుకుంటూనే గతరాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా సీతారామం, ఎం.ఎస్ ధోనీ, గజిని, లక్ష్యం సహా ఎన్నో హిట్ సినిమాలకు ఆయన పనిచేశారు. సునీల్ బాబుకు భార్య, కూతురు ఆర్య సరస్వతి ఉన్నారు. అంత్యక్రియలు ఈరోజు(శుక్రవారం)జరిగే అవకాశం ఉంది. -
సంక్రాంతి సంబరం... బాక్సాఫీస్ సమరం
ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా సంక్రాంతి సమరానికి బాక్సాఫీస్ ముస్తాబవుతోంది. థియేటర్ అనే గ్రౌండ్లో ప్రేక్షకులే సాక్షిగా బాక్సాఫీస్ బరిలో కలెక్షన్స్ పందేనికి కత్తులు కట్టిన కోడి పుంజుల్లా రెడీ అయ్యారు నలుగురు స్టార్ హీరోలు. వీరితో పాటు యంగ్ హీరో కూడా వస్తున్నాడు. పండగ సందర్భంగా సినిమాలు రావడం సినీ ప్రేమికులకు సంబరం... బాక్సాఫీస్కి వసూళ్ల సమరం. ఇక.. ఈ సంక్రాంతి పండక్కి వస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సంక్రాంతి ఈ నెల 13న ఆరంభమవుతుంది. కానీ సినిమా సంక్రాంతి మాత్రం రెండు రోజులు ముందుగానే అంటే జనవరి 11న స్టార్ట్ అవుతుంది. తమిళ హీరోలు విజయ్ నటించిన ‘వారసుడు’ (తమిళంలో ‘వారిసు’), అజిత్ ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’) చిత్రాలు జనవరి 11నే విడుదల కానున్నాయి. విజయ్, రష్మికా మందన్నా జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వారసుడు’. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్లు నిర్మించారు. ఓ సంపన్న ఉమ్మడి కుటుంబంలో చోటు చేసుకునే వివిధ సంఘటనల సమాహారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక ‘నేర్కొండ పార్వై’ (హిందీ ‘పింక్’ తమిళ రీమేక్), ‘వలిమై’ చిత్రాల తర్వాత హీరో అజిత్, దర్శకుడు హెచ్. వినోద్, నిర్మాత బోనీ కపూర్ల కాంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రం ‘తెగింపు’ (తమిళంలో ‘తునివు’). ఈ యాక్షన్ ఫిల్మ్ కథాంశం బ్యాంకు రాబరీ నేపథ్యంలో ఉంటుంది. బ్యాంకును హైజాక్ చేసిన ఓ వ్యక్తి, ఆ బ్యాంకు కస్టమర్లను హోస్టేజ్గా చేసి తన లక్ష్యాలు నెరవేరేలా ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేస్తాడు. ‘తెగింపు’ ప్రధానాంశం ఇదే అని తెలుస్తోంది. కాగా జనవరి 12న ‘వీరసింహా రెడ్డి’గా వస్తున్నారు బాలకృష్ణ. ‘అఖండ’ వంటి హిట్ తర్వాత బాలకృష్ణ, ‘క్రాక్’ వంటి హిట్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన ఈ ‘వీరసింహారెడ్డి’లో శ్రుతీహాసన్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. మరోవైపు ‘వాల్తేరు వీరయ్య’గా జనవరి 13న వస్తున్నారు చిరంజీవి. ఆయన టైటిల్ రోల్లో నటించి, హీరో రవితేజ ఓ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు కొల్లి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకుడు. శ్రుతీహాసన్ నాయిక. శ్రీకాకుళంలో నివాసం ఉండే వాల్తేరు వీరయ్య (చిరంజీవి)కు, మరో ఏరియాలో ఉండే పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సాగర్ (రవితేజ)లకు మధ్య ఉన్న అనుబంధం, పగ అంశాలతో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని కూడా నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్లే నిర్మించారు. ఇక ప్రతి సంక్రాంతికి పెద్ద స్టార్స్ మధ్య చిన్న హీరోల సినిమాలూ రిలీజ్ అవుతాయి. ఈ సంక్రాంతికి ఈ జాబితాలో నిలిచిన మూవీ ‘కళ్యాణం కమనీయం’. సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఆళ్ల అనిల్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. శివ (సంతోష్), శ్రుతి (ప్రియా) ప్రేమ బంధం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. అయితే శివకు జాబ్ లేకపోవడం వారి మధ్య ఎలాంటి మనస్పర్థలకు దారి తీసింది అనేది చిత్రం ప్రధానాంశం. మరి.. ఈ సంక్రాంతి బరిలో ఏ సినిమాకు ప్రేక్షకులు ‘సంక్రాంతి హిట్’ ట్యాగ్ ఇస్తారో చూడాలి. -
దళపతి విజయ్పై శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘నా కెరీర్లో తొలి తమిళ చిత్రం ‘వారసుడు’. ఇందులో విజయ్కి బ్రదర్గా కీలకమైన పాత్ర చేశాను. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. సినిమా ఒక దృశ్యకావ్యంలా ఉంటుంది’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. దళపతి విజయ్, రష్మికా మందన్న జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వారసుడు’. తమిళంలో ‘వారిసు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా పతాకాలపై ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన శ్రీకాంత్ చెప్పిన విశేషాలు. ⇔ తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా చేసినప్పటికీ పక్కా తెలుగు మూవీలానే ఉంటుంది. జయసుధగారు, నేను, కిక్ శ్యామ్, శరత్ కుమార్, రష్మిక, సంగీత, ప్రభు.. ఇలా అందరూ తెలుగు సినిమాలు చేసిన వారే ఉండటంతో పూర్తి తెలుగు నేటివిటీ సినిమాలానే ఉంటుంది. వంశీ పైడిపల్లి సినిమాల్లో గ్రేట్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ కోవలోనే ఈ మూవీలో బ్రదర్స్ మధ్య జరిగే భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. విజయ్గారు ఎక్కువగా మాట్లాడరు. సెట్లో అడుగు పెడితే ప్యాకప్ చెప్పేవరకూ అక్కడే ఉంటారు. క్యార్వాన్ వాడరు.. సెల్ ఫోన్ కూడా దగ్గర పెట్టుకోరు. ఒక మంచి సినిమా, విజయ్లాంటి స్టార్ హీరోతో తమిళంలో అడుగుపెడుతుండటం హ్యాపీ. ⇔ ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా అయిపోయాయి. మన తెలుగు సినిమాలు ఇతర భాషల్లోనూ హిట్ సాధిస్తున్నాయి. సంక్రాంతి అనేది సినిమాల పండగ కూడా.. అన్ని సినిమాలనీ ప్రేక్షకులు ఆదరిస్తారు. ‘వారసుడు’ పండగ లాంటి సినిమా. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలన్నీ బాగా ఆడాలి.. అదే హ్యాపీ సంక్రాంతి. ‘దిల్’ రాజుగారి ప్రొడక్షన్లో చేయడం ఇదే తొలిసారి. ‘వారసుడు’కి తమన్ అద్భుతమైన మ్యూజిక్, రీ రికార్డింగ్ ఇచ్చాడు. ⇔ ‘అఖండ’ తర్వాత డిఫరెంట్గా ఉండాలని ‘వారసుడు’లోని పాత్ర చేశాను. అలాగే రామ్చరణ్– శంకర్గారి సినిమాలోనూ మంచి పాత్ర చేస్తున్నాను. కథ, క్యారెక్టర్ నచ్చితే వైవిధ్యమైన పాత్రలు కచ్చితంగా చేస్తాను. -
స్టేజ్పై మాట్లాడుతూ రష్మికకు దిష్టి తీసిన విజయ్, వీడియో వైరల్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం వారిసు(తెలుగులో వారసుడు). వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ మూవీ ఈ సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజగా చిత్రం బృందం ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. అయితే ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా రీసెంట్గా చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. చదవండి: ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ రివ్యూ, సెన్సార్ టాక్ ఎలా ఉందంటే! స్టేజ్ హీరో విజయ్, రష్మికకు దిష్టి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ చిత్రంలోని రంజితమే.. రంజితమే.. పాట గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్లో ఎక్కడ చూసిన ఈ సాంగ్కు సంబంధించిన రీల్స్, వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఇక ఇటీవల ఈ సూపర్ హిట్ సాంగ్కు లైవ్లో డ్యాన్స్ చేసి అదరగొట్టింది నటి రష్మిక మందన్నా. అభిమానులకు కోసం డాన్స్ చేయాలని కోరడంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్తో కలిసి ఆమె ఈ పాటకు కాలు కదిపింది. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన పునర్నవి ఇక రష్మిక డాన్స్ చూసి హీరో విజయ్తో పాటు అక్కడున్న ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. దీంతో విజయ్ స్టేజ్పై మాట్లాడుతూ.. రష్మికపై ప్రశంసలు కురిపించాడు. రష్మికను ఉద్దేశిస్తూ.. ఆమె మంచి నటి. రీల్, రియల్ లైఫ్లోనూ ఒకేలా ఉంటుంది. స్టార్ నటి అయిన ఒదిగి ఉంటుంది. ఇప్పుడు కూడా ఫ్యాన్స్ కోసం అందరి ముందు లైవ్లో డాన్స్ చేసి ఆకట్టుకుంది. ఆమెపై అందరి దృష్టి పడకుండా దిష్టి తీస్తున్నా’ అంటూ సరదాగా ఆయన తమిళంలో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా మూవీ టీం విడుదల చేసింది. ఈ వీడియోను చూసి రష్మిక ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. Rashmika Dance for #Ranjithame (HD) #Varisu • @actorvijay 🤩🔥#VarisuSecondSingle #VarisuAudioLaunch #VarisuUpdate pic.twitter.com/1OEHn02oSa — VMI IT WING HEAD-KUMBAKONAM YOUTH WING (@KUMVMIITWING) January 1, 2023 -
వారసుడు ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..
దళపతి విజయ్, నేషనల్ క్రష్ రష్మిక హీరోహీరోయిన్గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న చిత్రం వారిసు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే తమిళ్లో రంజితమే అనే పాట విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకోగా.. ఇక తెలుగులో కూడా ఈ పాటను విడుదల చేశారు. తమన్ సంగీతం అంధించిన ఈ పాట తెలుగు వెర్షన్ బుధవారం విడుదలైంది. ‘రంజితమే’అంటూ సాగే ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి, ఎం ఎం మానసి ఆలపించారు. తమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. -
టాలీవుడ్లో ‘అనువాదం’ పై వివాదం
అనువాద చిత్రాల వివాదం ముదిరేలా కనబడుతోంది. కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా నిర్మాణ వ్యయాన్ని తగ్గించే విషయమై, ఇతర సమస్యల గురించి చర్చలు జరపడానికి ఆ మధ్య తెలుగు సినిమాల షూటింగ్స్ను నిలిపివేసిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరిగిందనే టాక్ వినిపించింది. అయితే ‘వారిసు’ తమిళ సినిమా కాబట్టి షూటింగ్ ఆపలేదని ‘దిల్’ రాజు పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో ‘వారిసు’ తమిళ సినిమాయే అనే ముద్ర పడిపోయింది. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారిసు’. ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కాగా సంక్రాంతి సందర్భంగానే నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అలాగే అనిల్ సుంకర నిర్మించిన ‘ఏజెంట్’ సంక్రాంతి రిలీజ్కే ముస్తాబు అయ్యింది. వీటితో పాటు తమిళంలో అజిత్ ‘తునివు’ కూడా సంక్రాంతి రిలీజ్కే రెడీ అవుతోంది. దాంతో సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల థియేటర్ల సంఖ్య గురించిన అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి, దసరా పండగ సమయాల్లో తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత అనువాద చిత్రాలకు థియేటర్స్ కేటాయించాలన్నట్లుగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ నోట్ను రిలీజ్ చేసింది. ఈ విషయంపై కొందరు తమిళ దర్శక–నిర్మాతలు అసహనంగా ఉన్నారని టాక్. ఒకవేళ తెలుగులో అనువాద చిత్రాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేకపోతే తమిళంలోనూ తెలుగు చిత్రాలకు థియేటర్లు కేటాయించ కూడదన్నట్లుగా కోలీవుడ్లో చర్చలు జరుగుతున్నాయట. మరోవైపు సంక్రాంతి, దసరా సీజన్స్లో డబ్బింగ్ సినిమాల విడుదలను ఆపడం అనేది జరిగే పని కాదని ‘తోడేలు’ ఈవెంట్లో అల్లు అరవింద్ పేర్కొన్నారు. ‘‘డబ్బింగ్ సినిమాల రిలీజ్లను ఆపాలని మేం ఎక్కడా చెప్పలేదు. సంక్రాంతి, దసరా సీజన్స్లో తొలి ప్రాధాన్యత తెలుగు చిత్రాలకు ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ను కోరుతూ లేఖ రాశాం’’ అని నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. -
వారసుడు సినిమా వివాదంపై స్పందించిన అల్లు అరవింద్
-
డబ్బింగ్ సినిమాల విడుదల ఆపడం జరిగే పని కాదు: అల్లు అరవింద్
-
తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై స్పందించిన అల్లు అరవింద్
తెలుగులో దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు మూవీ విడుదల ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సంక్రాంతి విడుదలకు డైరెక్ట్ తెలుగు సినిమాలకే ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల తెలుగు నిర్మాతల మండలి లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే వారసుడు మూవీని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటిచింది. తమిళ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన వారసుడు మూవీ డబ్బింగ్ చిత్రం కావడంతో ఈ సినిమా సంక్రాంతి విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై తాజాగా తమిళ నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ముదురుతున్న వారసుడు మూవీ వివాదం, మండిపడుతున్న తమిళ్ దర్శక-నిర్మాతలు తెలుగు చిత్రాలు తమిళ్లో ఏ ఆటంకం లేకుండా విడుదల అవుతున్నాయని, కానీ తెలుగులో తమిళ చిత్రాలను ఆపడం ఏంటని తమిళ దర్శక-నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. అలా అయితే తాము కూడా తెలుగు చిత్రాలను ఇక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు ఈ విషయమై ఈ నెల 22 తమిళ నిర్మాతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. తమిళ నిర్మాతల అభ్యంతరంపై తాజాగా ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. డబ్బింగ్ సినిమాల విడుదల ఆపడం జరిగే పని కాదని అన్నారు. సినిమాకు ఎల్లలు లేవని, ఎల్లలు తీసేశామన్నారు. సౌత్ నార్త్ అనే భేదాలు లేవని, బాగున్న సినిమా ఎక్కడైన ఆడుతుందని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. -
తమిళనాడులో వారసుడు సినిమాపై వివాదం
-
ముదురుతున్న వారసుడు మూవీ వివాదం, మండిపడుతున్న తమిళ్ దర్శక-నిర్మాతలు
వారసుడు మూవీ వివాదం ముదురుతోంది. ఇటీవల తెలుగు నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం టాలీవుడ్-కోలీవుడ్ మధ్య లోకల్-నాన్లోకల్ వార్ రచ్చకు దారి తీసేల కనిపిస్తోంది. తెలుగులో వారసుడు, తమిళంలో వారిసుగా రానున్న ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి తెలుగు చిత్రాలకే ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలని, డబ్బింగ్ సినిమాలు విడుదల చేయొద్దని తెలుగు సినీ నిర్మాతల మండలి రీసెంట్గా లేఖ విడుదల చేసింది. ఇక తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖపై తమిళ సినీ దర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బేబీ బంప్ ఫొటోలు షేర్ షాకిచ్చిన హీరోయిన్, ఫొటోలు వైరల్ తమిళనాట తెలుగు సినిమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల అవుతున్నాయని, కానీ తెలుగులో తమిళ చిత్రాలను ఆపడం ఏంటని దర్శకులు ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు తాము కూడా తెలుగు చిత్రాలను అడ్డుకుంటామని వారు పేర్కొన్నారు. వారసుడు విషయానికి వస్తే దర్శక నిర్మాతలు ఇద్దరూ తెలుగు వారేనని, హీరో మాత్రమే తమిళ నటుడని డైరెక్టర్ సీమాన్ తెలిపారు. ఇంత జరుగుతున్న స్పందించకుండా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఏం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాగా ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. చదవండి: ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో.. -
వారసుడు: ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వారసుడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రంజితమే ప్రోమో రిలీజైంది. కేవలం తమిళ వర్షన్ ప్రోమోను మాత్రమే రిలీజ్ చేశారు. తమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. పూర్తి సాంగ్ నవంబర్ 5న విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా ఖుష్బూ, ప్రకాశ్ రాజ్, ప్రభు, యోగి బాబు, శ్రీకాంత్, శరత్ కుమార్, జయ సుధ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. చదవండి: ప్రభాస్కు ఈ సినిమా చూపించాలన్న -
Varisu Vs Thunivu: తొమ్మిదేళ్ల తరువాత పోటీలో విజయ్, అజిత్ చిత్రాలు
సినీ పరిశ్రమలో ఒక్కొక్క జనరేషన్లో ఇద్దరు ప్రముఖ హీరోల మధ్య పోటీతత్వం ఉంటోంది. ముఖ్యంగా తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ మధ్య, ఆ తరువాత కమలహాసన్, రజనీకాంత్, తాజాగా విజయ్, అజిత్ మధ్య ఈ పోటీ సాగుతోందని చెప్పవచ్చు. హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటే వారి అభిమానులు మధ్య మాత్రం హోరా హోరీ పోరు సాగుతుంటుంది. విజయ్, అజిత్ నటించిన చిత్రాలు ఒకేసారి విడుదలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2001 విజయ్ నటించిన ప్రెండ్స్, అజిత్ నటించిన దిన చిత్రాలు ఒకేసారి విడుదలయ్యాయి. అలాగే 2007లో విజయ్ నటించిన జిల్లా, అజిత్ నటించిన ఆల్వార్ చిత్రాలు పోటీ పడ్డాయి. ఇక 2014లో విజయ్ నటించిన పోకిరి, అజిత్ నటించిన వీరం చిత్రాలు బరిలోకి దిగాయి. ఆ తరువాత ఇప్పటివరకు వీరిద్దరూ నటించిన చిత్రాలు ఒకేసారి విడుదల కాలేదు. అలాంటిది తొమ్మిదేళ్ల తరువాత ఈ సంక్రాంతికి విజయ్ నటిస్తున్న వారీసు, అజిత్ నటిస్తున్న తుణివు చిత్రాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారీసు. నటి రష్మిక మందన నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీని తమిళనాడు విడుదల హక్కులను నిర్మాత లలిత్కుమార్ పొందారు. ఇక అజిత్ హీరోగా నటిస్తున్న హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. నటి మంజు వారియర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తమిళనాడు విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్జెయింట్ మూవీస్ సంస్థ పొందింది. దీంతో మరోసారి విజయ్, అజిత్ అభిమానుల మధ్య పోరు తప్పడం లేదు. వారి విషయాన్ని పక్కన పెడితే ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు ఒకేసారి విడుదలైతే వసూళ్లకు ముప్పు ఏర్పడుతుందని ఎగ్జిబిటర్లు, డి ్రస్టిబ్యూటర్లు భయపడుతున్నారు. -
దళపతి విజయ్ ‘వారసుడు’ మూవీ వర్కింగ్ స్టిల్స్ (ఫొటోలు)
-
నెట్టింట వైరల్ అవుతున్న ‘వారసుడు’ వర్కింగ్ స్టిల్స్
దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారిసు. ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో విడుదల కానుంది. చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన పది వర్కింగ్ స్టిల్స్ని ఒకేసారి విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'వారసుడు' స్టిల్స్ వైరల్ గా మారాయి. వారసుడులో విజయ్ కొత్త లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ తో పాటు రష్మిక, ఖుష్బూ కూడా కొత్త లుక్స్ లో కనిపించారు. అలాగే విజయ్, వెటరన్ హీరోయిన్ జయసుధ, దర్శకుడు వంశీ పైడిపల్లి షూటింగ్ లొకేషన్ వర్కింగ్ స్టిల్స్ కూడా ఆకట్టుకున్నాయి. 2023 సంక్రాంతికి వారసుడు విడుదల చేస్తున్నట్లు దీపావళి పండగ నాడు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో భారీ స్థాయిలో సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.పూర్తిస్థాయి ఎంటర్ టైనర్గా రూపొందించబడిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా, ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త ఇతర కీలక పాత్రల్లో నటించారు.