vijayareddy
-
కాంగ్రెస్లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి
సాక్షి, హైదరాబాద్: పీజేఆర్ కుమార్తె, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో గురువారం విజయారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'ఖైరతబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఘటనలు నన్ను బాధించాయి. షీ టీమ్లు పెట్టామని గొప్పగా చెప్పుకుంటున్నా.. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. పెన్షన్, రేషన్ కార్డుల కోసం పేదలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.రాష్ట్ర ప్రజల బాగోగులు పక్కన పెట్టారు. కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుంది. సోనియా, రాహుల్ నాయకత్వంలో పని చేయడానికే కాంగ్రెస్లోకి వచ్చాను అని విజయారెడ్డి అన్నారు. చదవండి: (సీఎం కేసీఆర్కు హైకోర్టు నోటీసులు.. ఎందుకో తెలుసా..?) -
దర్శక నిర్మాత విజయరెడ్డి ఇక లేరు
ప్రఖ్యాత సినీ దర్శక, నిర్మాత బి. విజయరెడ్డి (84) శుక్రవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై, కేకే నగర్లో కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్న ఆయన అనారోగ్యం కారణంగా ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. చెన్నై, కన్నమ్మాపేటలోని శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పుట్టి పెరిగిన విజయరెడ్డి 1955లో నటనపై ఆసక్తితో అప్పటి మద్రాస్కు చేరుకున్నారు. దర్శకుడు విఠలాచార్య దృష్టిలో పడ్డారు. విఠలాచార్య దర్శకత్వం వహించిన ‘మన తుంబిడ హెన్ను అరే’ చిత్రానికి సహాయ ఎడిటర్గా పనిచేశారు. ఆ తర్వాత పలు చిత్రాలకు పని చేసిన విజయరెడ్డి సినిమా రంగంలోని పలు శాఖల గురించి తెలుసుకోవడంతో పాటు ఆ తర్వాత సహాయ దర్శకుడిగా చేశారు. 1970లో ‘రంగా మహల్ రహస్య’ అనే కన్నడ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. కన్నడ కంఠీరవ రాజ్కుమార్, విష్ణువర్థ¯Œ వంటి ప్రముఖ నటులతో ఈయన అత్యధిక చిత్రాలను తెరకెక్కించారు. ముఖ్యంగా రాజ్కుమార్ కథానాయకుడిగా ‘మయురా, హుళ్లి హాళినా మేవు’ వంటి చారిత్రక కథా చిత్రాలతో పాటు ‘శ్రీనివాసకల్యాణం, భక్త ప్రహ్లాద’ వంటి పౌరాణిక చిత్రాలను తెరకెక్కించిన ఘనత విజయరెడ్డిది. ఆయన కన్నడలోనే 40 చిత్రాలకుపైగా దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్కపూర్, జితేంద్ర, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో చిత్రాలను చేశారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘శ్రీమతి’. ఆ తర్వాత ‘ఏకలవ్య, మా ఇంటి వెలుగు, చలాకీ రాణి కిలాడీ రాజా, మావూరి మొనగాళ్లు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయరెడ్డికి భార్య దమయంతి, కుమారులు త్రినాథ్ రెడ్డి, నాగిరెడ్డి, కుమార్తెలు నాగలక్ష్మి, శ్యామల రుషి ఉన్నారు. విజయరెడ్డి మృతికి దక్షిణ భారత వాణిజ్య మండలి అధ్యక్షులు కాట్రగడ్డ ప్రసాద్ తదితర చిత్రరంగ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. -
రెవెన్యూ చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య, తదనంతర పరిణామాలు కలకలం సృష్టించాయి. తెలుగు రాష్ట్రాల్లో పట్టపగలే ఓ అధికారిణిని సజీవ దహనం చేయడంతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎన్నడూ లేని విధంగా 8 రోజుల పాటు విధులు బహిష్కరించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఉద్యోగుల భద్రత, సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో గత బుధవారం నుంచి విధులకు హాజరవుతున్నారు. ఏ శాఖపైనా లేనన్ని ఆరోపణలు రావడం, రెవెన్యూ వ్యవస్థపై ముఖ్యమంత్రే అసంతృప్తి వ్యక్తం చేయడం, ఏసీబీకి చిక్కుతున్న అధికారుల్లోనూ ఈ శాఖకు చెందినవారే అధికంగా ఉండడం, రికార్డుల ప్రక్షాళన, ధరణి వెబ్సైట్ మొరాయింపు, పట్టాదార్ పాస్ పుస్తకాల జారీలో జాప్యం, ఎడతెగని పార్ట్– బీ భూముల వివాదం రెవెన్యూ సిబ్బందికి అపఖ్యాతిని తెచ్చిపెట్టాయి. పనిభారం తడిసిమోపెడు భూ పరిపాలతోపాటు ఇతర శాఖలకు సంబంధించిన పనుల్లోనూ రెవెన్యూ సిబ్బంది కీలకం. విద్యార్థుల కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల నుంచి ఓటరు జాబితా సవరణలు, ఆహార భద్రత, సంక్షేమ పథకాల అమలులో వీరిది పెద్దన్న పాత్ర. 26 శాఖలకు సంబంధించిన పనిభారం రెవెన్యూ ఉద్యోగులకు గుదిబండగా మారింది. ప్రతి పనిలో వీరే కీలకం కావడంతో భూపరిపాలన గాడి తప్పింది. దీంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొందరు వీఆర్వోల నుంచి తహసీల్దార్ల వరకు చేతివాటం ప్రదర్శించడం ఆ శాఖకు చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. హడావుడి ప్రక్షాళనతో... రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించాలనే హడావుడిలో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన ప్రస్తుత అగచాట్లకు కారణమైంది. తప్పులు సరిదిద్దేందుకు అవకాశం ఇవ్వకపోవడం, సాంకేతిక సమస్యలు, ధరణి వెబ్సైట్ సహకరించకపోవడం లాంటి కారణాలు రెవెన్యూ సిబ్బంది పనితీరును ప్రశ్నించేలా చేశాయి. లెక్కకు మిక్కిలి చట్టాలు, జీవోలతో గందరగోళం ఏర్పడింది. పార్ట్ బీ భూముల వ్యవహారం వీరికి తలనొప్పిగా మారింది. తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనతో రెవెన్యూ ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకమైంది. దీంతో ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయాలకు తొలిసారిగా పోలీస్ బందోబస్తు కల్పించింది. రెవెన్యూ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే సందర్శకుల రాకపోకలను నియంత్రించింది. 26 శాఖలకు సంబంధించిన పనిభారం రెవెన్యూ ఉద్యోగులకు గుదిబండగా మారింది. ప్రతి పనిలో వీరే కీలకం కావడంతో భూపరిపాలన గాడి తప్పింది. -
అటెండర్ చంద్రయ్య పరిస్థితి విషమం
సాక్షి, రంగారెడ్డి: అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ ఆఫీసు అటెండర్ చంద్రయ్య అరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో చంద్రయ్యకు గాయాలయ్యాయి. ప్రస్తుతం డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చంద్రయ్య చికిత్స పొందుతున్నాడు. తహసీల్దార్ ఆఫీసు సిబ్బంది, ప్రభుత్వ అధికారులు చంద్రయ్య పరిస్థితిని పట్టించుకోవడం లేదని కుటుంబసభ్యులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని అతని కుటుంబసభ్యులు హెచ్చరించారు. ఇప్పటికే మూడు లక్షల బిల్లు అయిందని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. డబ్బు చెల్లిస్తే చికిత్స చేస్తామంటూ ఆస్పత్రి సిబ్బంది పేర్కొంది. డబ్బులు లేకపోతే ఇప్పటి వరకు అయిన వైద్య ఖర్చులు చెల్లించాలంటూ ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లాలని కుటుంబసబ్యులకు డీఆర్డీఓఅపోలో ఆసుపత్రి వర్గాలు సూచించాయి.అతన్ని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రభుత్వాధికారులు సూచించారు. తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనమైన ఘటనలో.. విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన అటెండర్ చంద్రయ్యకు కూడా మంటలంటుకొని గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కాలిన గాయాలతో విజయారెడ్డి డ్రైవర్ గురునాథ్ మరణించిన విషయం తెలిసిందే. -
కలెక్టరేట్ ఎదుట రైతుల ఆత్మహత్య యత్నం
సాక్షి, నిజామాబాద్: తన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలేదనే కోపంతో అబ్దుల్లాపూర్మేట్ ఎమ్మార్వో విజయారెడ్డిని హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో పలు జిల్లాలోని రైతులు భూ సమస్యలను తీర్చాలంటూ కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ముందు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే....నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన అంకం గంగాధర్ అనే రైతు చెట్టెక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ సోమవారం కలెక్టరెట్ ముందు బెదిరింపులకు దిగాడు. దీంతో ఓ పోలీసు అధికారి చెట్టెక్కి తాడు లాగి రైతును కిందకు దించారు. కాగా అన్నదమ్ముల మధ్య జరుగుతున్న బోరు సమస్యను దర్పల్లి మండలం ఎమ్మార్వోకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు రైతు తెలిపాడు. ఇప్పటికైనా బోరు సమస్యను తక్షణమే పరిష్కారించాలని రైతు కోరాడు. బోధన్: ఆర్డీవో కార్యాలయంలో ఓ మహిళా రైతు ఆత్మహత్యా యత్నం చేసింది. తగ్గెళ్ళి గ్రామానికి చెందిన అబ్బవ్వ అనే మహిళా రైతు తన డిజిటల్ పట్టా పాస్బుక్ కోసం ఏడాదిగా బోధన్ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. అయినా వారు పట్టించుకోవడం లేదంటూ ఇవాళ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు ఆమెను అడ్డుకుని విచారించగా తన భూమిని ఇతరుల పేరు మీదకు మార్చారని ఆవేదన వ్యక్తం చేసింది. జనగామ జిల్లా: అలాగే జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం గమ్మడవెల్లి గ్రామానికి చెందిన చెంగిర్ల వెంకటేష్ అనే రైతు ఎకరం భూమిని తన పేరు మీదకు పట్టా చేయడం లేదంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు అతనిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రైతును స్టేషన్కు తరలించారు. ఈ మూడు సంఘటనలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. -
భూకాష్టం..
-
సురేష్ మృతి.. స్పందించిన తండ్రి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్ట్మార్టం పూర్తి చేసిన ఉస్మానియా వైద్యులు సురేష్ మృత దేహాన్ని ఆయన స్వస్థలానికి తరలించారు. ఈ సందర్భంగా నిందితుడు సురేష్ మృతిపై ఆయన తండ్రి కృష్ణ స్పందించారు. తన కొడుకు తహసీల్దార్ కార్యాలయానికి ఎప్పుడూ వెళ్ళలేదని, తహశీల్దార్ను ఎందుకు హత్య చేశాడో తమకు తెలీదని అన్నారు. తమకు చెందిన తొమ్మిది గుంటల భూమిని ఏడాది క్రితం మల్రెడ్డి రంగారెడ్డికి అమ్మినట్లు ఆయన తెలిపారు. మొత్తం ఏడు ఎకరాలు భూమి తమ అన్నదమ్ములకు చెందినది ఉందని, అయితే భూ సమస్య నిమిత్తం తానే తహశీల్దార్ ఆఫీసు, కోర్టు చుట్టూ తిరుగుతున్నట్లు కృష్ణ తెలిపారు. తమ కుమారుడు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఈరోజు రాత్రి అంత్యక్రియలను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కాగా విజయారెడ్డిపై దాడి సమయంలో తీవ్ర గాయాలపాలైన సురేశ్ ఉస్మానియాలో చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈసీజీలో పల్స్ రేటు ఫ్లాట్గా రావడంతో మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు వెంటిలేటర్ తొలగించినట్లు పేర్కొన్నారు. కాగా వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎమ్మార్వోను ఎంతగా బతిమిలాడినా ఆమె తనకు పట్టా ఇవ్వలేదని సురేశ్ పేర్కొన్నాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఆమె కార్యాలయానికి వెళ్లి మరోసారి విఙ్ఞప్తి చేశానని.. అయినప్పటికీ ఆమె స్పందించలేదని తెలిపాడు. ఈ క్రమంలో మరోసారి తిరిగి పెట్రోల్ డబ్బాతో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి.. మొదట తనపై కిరోసిన్ పోసుకుని.. తర్వాత ఆమెపై పోసినట్లు వెల్లడించాడు. ఇక ఈ ఘటనలో విజయారెడ్డిని రక్షించేందుకు వెళ్లిన ఆమె డ్రైవర్ కామళ్ల గురునాథం కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. -
తహసీల్దార్ హత్యపై రాజకీయ దుమారం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంపై జిల్లాలో రాజకీయ రగడ మొదలైంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత చల్లబడిన రాజకీయం.. విజయారెడ్డి హత్యోదంతంతో క్రమంగా వేడెక్కుతోంది. తహసీల్దార్ హత్యకు నువ్వంటే.. నువ్వే కారణమని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఒకరిపై ఒకరు మీడియా వేదికగా ఆరోపించుకుంటున్నారు. ఆది నుంచి వీరు రాజకీయ ప్రత్యర్థులు. ఒకరంటే ఒకరికి పడని వీరిద్దరూ మాటల తూటాలు పేల్చుతూ సవాల్.. ప్రతి సవాల్ విసురుకుంటున్నారు. సోమవారం రైతు కూర సురేష్ తహసీల్దార్ విజయారెడ్డిపై కార్యాలయంలోనే పెట్రోల్ పోసి నిప్పటించడంతో సజీవదహనమైన చేసిన విషయం తెలిసిందే. ఈ అమానుషానికి ప్రధాన కారణమైన భూముల వ్యవహారంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే హస్తం ఉందని మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపణల బాంబ్ పేల్చడంతో వివాదం రాజుకుంది. భూముల నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ఆయన... ల్యాండ్ మాఫియాకు ఎమ్మెల్యే నాయకత్వం వహిస్తున్నారని తీవ్రపదజాలంతో విరుచుకుపడటం సర్వత్రా చర్చనీయాంశమయింది. రూ.వేల కోట్లు ఎలా వచ్చాయ్? భూ మాఫియా అంటేనే మల్రెడ్డి రంగారెడ్డి. గత 20 ఏళ్లుగా ఆయనకు ఆస్తులు, భూములు ఎలా వచ్చాయో విచారణ జరిపితే తెలుస్తుంది. వందశాతం భూకబ్జా దారుడు.. ల్యాండ్ గ్రాబర్.. విచారణ జరిపిస్తే మాఫియా ఎవరో బయటపడుతుంది. తహసీల్దార్ మీద ఎవరు ఒత్తిడి తెచ్చారో తేలాలి. విజయారెడ్డి హత్య కేసులో కావాలనే నాపై బురదజల్లుతున్నారు. నేను సాయం చేసే మనిషినే..అన్యాయం చేసే వాడినికాదు. రెండెకరాల మనిషి.. రూ.వేల కోట్లు ఎలా సంపాదించారో అందరికీ తెలుసు. మా ఆస్తులన్నీ మా తాతలు, తండ్రుల కాలం నాటివే. అబ్దుల్లాపూర్మెట్ చుట్టుపక్కల ఉన్న 412 ఎకరాల వివాదాస్పద భూమిపై విచారణ జరిపి తీరాలి. వాస్తవాలేంటో తేలుతాయి. అంబర్పేట ఓఆర్ఆర్ దగ్గర సర్వే నంబర్లు 230 – 233లో ఉన్న 16 ఎకరాల భూమిని మల్రెడ్డి రంగారెడ్డి బంధువులే కబ్జా చేశారు. మెట్రోసిటీ పేరుతో 60 ఎకరాలను కొల్లగొట్టారు. నేను రూ.30 లక్షలు ఎవరి దగ్గరా వసూలు చేయలేదు. తీసుకున్నట్లు ఆయన రుజువు చేయాలి. మూడుసార్లు ఓడిపోయిన వ్యక్తి నాపై ఆరోపణలు చేస్తే స్పందించాలా అనుకున్నా. కానీ శవ రాజకీయాలు చేస్తుంటే తట్టుకోలేక మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. – మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే 40 ఎకరాలు ఎవరబ్బ సొమ్ము? ల్యాండ్ మాఫియాకు నాయకత్వం వహిస్తున్న నాయకుడు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. నయీంతో దోస్తీ చేసిన వ్యక్తి ఆయన. నాకున్న ఆస్తుల వివరాలను నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఆ వివాదాస్పద భూముల్లో నా బంధువులు అక్రమంగా కొనుగోలు చేస్తే 24 గంటల్లోగా స్వాధీనం చేసుకుని పేదలకు పంచండి. అధికారంలో మీరే ఉన్నారు. సీఎంకు కూడా చెప్పు. నేను పది మందికి మంచి చెప్పేవాడిని. నేను ఎవరితోనూ చెప్పించుకోను. నువ్వు చెబుతున్నట్లుగానే.. ఎప్పుడో మావాళ్లు భూములు కొని ఉంటే ఇన్ని రోజులు ఏం చేశావ్? పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు అడగలేదు? రూ.400 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని ఇబ్రహీంపట్నంలో కాజేశావ్. అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఓఆర్సీ ఇప్పించావ్. దాని పక్కనే ప్రభుత్వ సంస్థలకు భూమిని గతంలో ఇచ్చారు. పోలీస్స్టేషన్, మార్కెట్ కమిటీ, ఆర్టీసీ డిపోలకు దాదాపు 30 ఎకరాలు కేటాయించారు. ఇదిపోగా 40 ఎకరాలు ఎవరబ్బ సొమ్మని బినామీల పేరిట తెచ్చుకున్నావ్? – మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
విజయారెడ్డి హత్య: నిందితుడు సురేశ్ మృతి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి చెందాడు. విజయారెడ్డిపై దాడి సమయంలో తీవ్ర గాయాలపాలైన సురేశ్ ఉస్మానియాలో చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈసీజీలో పల్స్ రేటు ఫ్లాట్గా రావడంతో మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు వెంటిలేటర్ తొలగించినట్లు పేర్కొన్నారు. కాగా అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై రైతు సురేశ్ సోమవారం పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం విదితమే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ విజయారెడ్డి తన కార్యాలయంలోనే మృతి చెందారు. ఇక ఆమెతో పాటు నిందితుడు సురేశ్కు కూడా నిప్పంటుకోవడంతో 65 శాతం గాయాల పాలైన అతడిని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించగా మృతి చెందాడు. కాగా వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎమ్మార్వోను ఎంతగా బతిమిలాడినా ఆమె తనకు పట్టా ఇవ్వలేదని సురేశ్ పేర్కొన్నాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఆమె కార్యాలయానికి వెళ్లి మరోసారి విఙ్ఞప్తి చేశానని.. అయినప్పటికీ ఆమె స్పందించలేదని తెలిపాడు. ఈ క్రమంలో మరోసారి తిరిగి పెట్రోల్ డబ్బాతో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి.. మొదట తనపై కిరోసిన్ పోసుకుని.. తర్వాత ఆమెపై పోసినట్లు వెల్లడించాడు. ఇక ఈ ఘటనలో విజయారెడ్డిని రక్షించేందుకు వెళ్లిన ఆమె డ్రైవర్ కామళ్ల గురునాథం కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా విజయారెడ్డి హత్యకేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నిందితుడు సురేశ్ కాల్డేటా, విజయారెడ్డి కాల్స్ను పరిశీలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సురేశ్ మాట్లాడినట్లు తేలడంతో.. ఈ కేసులో మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. (చదవండి: అదే ఆమె హత్యకు కారణమైంది..) -
పక్కా ప్లానింగ్ ప్రకారమేనా..?
సాక్షి, హైదరాబాద్: పక్కా పథకం ప్రకారమే అబ్దుల్లాపూర్మెట్ తాహసీల్దార్ విజయారెడ్డి హత్య జరిగిందా? హత్యా సమయంలో ఎమ్మార్వో ఆఫీసు బయట కారులో ఉన్నది ఎవరు? ఘటన తర్వాత నిందితుడు సురేష్ వారితో ఏం మాట్లాడాడు? అసలు హత్యకు ముందు విజయారెడ్డి గదిలో ఏం జరిగింది? సురేష్కు, విజయారెడ్డికి మధ్య వాగ్వాదానికి కారణం ఏంటి? సురేష్ ఆమెపై పెట్రోల్ పోస్తుండగా... ఆ వాసన బయటకు రాలేదా? ఆ సమయంలో అటెండర్తోపాటు అక్కడ ఎవరూ ఎందుకు లేరు? విజయారెడ్డి సజీవదహనం కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు సురేష్ పక్కా ప్రణాళికతోనే తహసీల్దార్ విజయారెడ్డిని హత్య చేసినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. సంఘటనాస్థలం పరిసరాల్లో లభించిన సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. హత్యకు ముందు, ఆ తర్వాత పరిణామాలు చూస్తే.. ఇది పక్కా ప్రణాళికగానే కనిపిస్తోందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత సురేష్ మంటలతో బయటకు వచ్చి.. దగ్గరలోని వైన్ షాపు ముందు కారులో ఉన్నవారితో మాట్లాడినట్టు సమాచారం. వారితో మాట్లాడిన తర్వాతే అతను పోలీస్ స్టేషన్కు పరుగులు తీశాడని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు చెప్తున్నారు. మరోవైపు అబ్థుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డికి నిప్పటించి హత్య చేసిన నిందితుడు సురేష్ పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ రఫీ వెల్లడించారు. సురేష్కు 65 శాతం గాయాలయ్యాయని, ఆయన ప్రాణానికి గ్యారెంటీ ఇవ్వలేమని రఫీ తెలిపారు. -
ఆ భూమి విలువ రూ. 100 కోట్లు: మంచిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్పందించారు. నిందితుడు టీఆర్ఎస్ కార్యకర్త అని, ఎమ్మెల్యే అనుచరులే హత్య చేయించారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తన మీద ఓడిపోయిన మల్రెడ్డి ఓటమి తట్టుకోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భూ కబ్జాదారులు అంటూ ప్రచారం చేస్తున్న వారే అసలు కబ్జాదారులని విమర్శించారు. విజయారెడ్డి మరణం దురదృష్టకరమని, ఆమె హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. విజయారెడ్డి మరణాన్ని రాజకీయం చేస్తున్నారని, ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. నిందితుడు సురేశ్ భూములు కొనుగోలు చేసింది మల్రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి కుటుంబ సభ్యులేనని, మొత్తం 412 ఎకరాలపై పూర్తి దర్యాప్తు చేయాలని కోరారు. పాస్ పుస్తకాలు లేకుండా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 90 నుంచి 101 సర్వేలో మొత్తం భూమిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ను సైతం ఈ భూములపై దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఆ భూమి విలువ రూ. 100 కోట్లు నాలుగు సర్వేల్లో ఉన్న భూమి విలువ 100 కోట్లు ఉంటుందని మంచిరెడ్డి అన్నారు. 1980లో ప్లాట్లు అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 16 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నది మల్ రెడ్డి రంగారెడ్డి కుటుంబ సభ్యులేనని ఆరోపించారు. తాను 30 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంతేగాక న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడు సురేష్ గత ఎన్నికల్లో కాంగ్రెస్లో ఉన్నాడని, మల్ రెడ్డి రంగారెడ్డి సోదరులతో పాటు ఇంకా అనేక మంది ఇందులో భాగమై ఉన్నారని ఆరోపించారు. -
విషమంగా సురేశ్ ఆరోగ్యం..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తునకై రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వనస్థలిపురం ఏసీపీ జయరాంను విచారణ అధికారిగా నియమించారు. అదే విధంగా విజయారెడ్డిని కాపాడబోయి చికిత్స పొందుతూ ఆమె డ్రైవర్ గురునాథం మృతి చెందిన నేపథ్యంలో ఈ కేసులోని సెక్షన్లలో మార్పులు చేశారు. గురునాథం మృతి తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. అదే విధంగా ఘటనా స్థలంలో నిందితుడు సురేశ్తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అబ్దుల్లాపూర్మెట్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు... తహశీల్దార్ హత్య తెర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. కాగా విజయారెడ్డిని సజీవ దహనం చేసిన రైతు సురేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతడు ప్రస్తుతం అబ్దుల్లాపూర్మెట్ పోలీసుల సంరక్షణలో ఉస్మానియా ఆస్పత్రిలోని బర్నింగ్ వార్డులో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సురేశ్ ఛాతీ, పొట్ట, ముఖం, కాళ్ళు చేతులకు తీవ్ర గాయాలు శరీరంలోని నీరు మొత్తం పోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం న్యూరో బర్న్ షాక్లో ఉన్న సురేశ్ మరో 24 గంటలు దాటితే స్కిన్ బర్న్ సెప్టిక్లోకి వెళ్లే ప్రమాదం ఉందని.. ప్రస్తుతానికి అతడికి ఫ్లూయిడ్స్ అందిస్తూ చికిత్స చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో సురేశ్కు వైద్య పరీక్షలు నిర్వహించిన ఉస్మానియా వైద్యులు 72 గంటలు గడిస్తే గానీ అతడి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం లేదన్నారు. హత్యకు కారణం అదేనా...? మరోవైపు ఇప్పటికే నిందితుడి నుంచి మెజిస్ట్రేట్ డీడీ డిక్లరేషన్ నివేదిక తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లనున్నారు. అదే విధంగా సురేశ్ కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణలో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హయత్నగర్ , అబ్దుల్లాపూర్మెట్కు చెందిన స్నేహితులతో సురేశ్ మాట్లాడినట్లు గుర్తించామన్నారు. అలాగే హత్యకు ముందు కొద్ది నిమిషాల క్రితం సురేశ్ తన పెదనాన్న దుర్గయ్యతో మాట్లాడినట్లు తెలిసిందన్నారు. అంతేకాకుండా వేరే వ్యక్తులతో మాట్లాడిన కాల్స్ను సురేశ్ రికార్డ్ చేసినట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా సురేష్ కుటుంబానికి చెందిన 9 ఎకరాల భూమి వివాదమే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికి సురేశ్ తండ్రి కృష్ణ, పెద్దనాన్న దుర్గయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా గతంలో కూడా ఈ భూ వివాదంపై గ్రామ సభల్లో తహశీల్దార్, రెవెన్యూ అధికారులతో సురేశ్ గొడవలకు దిగినట్లు సమాచారం. -
విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు
దిల్సుఖ్నగర్/నాగోలు/మన్సూరాబాద్: తహసీల్దార్ విజయారెడ్డి అంతిమయాత్ర శోకసంద్రమైంది. మంగళవారం ఆర్కేపురం వాసవి కాలనీ లక్ష్మీ అపార్ట్మెంట్ నుంచి నాగోల్లోని శ్మశాన వాటిక వరకు ఐదు గంటలపాటు సాగిన అంతిమయాత్రలో దారి పొడవునా కన్నీటి నిరసనలు కనబడ్డాయి. పోలీసుల బందోబస్తు మధ్య అంతిమయాత్రలో భారీ సంఖ్యలో బంధువులు, రెవెన్యూ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు హాజరై విజయారెడ్డికి నివాళులర్పించారు. విజయారెడ్డి కుమారుడు భువనసాయి, కుమార్తె చైత్ర ఉన్నా చిన్నవాళ్లు కావడంతో భర్త సుభా‹Ùరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ దగ్గరుండి అంత్యక్రియలు ముగిసే వరకు పర్యవేక్షించారు. విజయారెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నాగోలు శ్మశాన వాటికలో నిర్వహించారు. రాస్తారోకో... స్వల్ప ఉద్రిక్తత... అల్కాపురి చౌరస్తాలో రెవెన్యూ ఉద్యోగులు మధ్యాహ్నం 1.30 నుంచి 2.00 గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు. విజయారెడ్డి మృతదేహంతో ఒక్కసారిగా రెవెన్యూ ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చి రాస్తారోకో నిర్వహించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కమిషనర్ మహేశ్ భగవత్, జాయింట్ సీపీ సురేందర్బాబు, ఇతర పోలీస్ అధికారులు రెవెన్యూ ఉద్యోగులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. విజయారెడ్డికి గౌరవ వందనంగా తుపాకులను గాలిలోకి కాలుస్తున్న చేస్తున్న పోలీసులు ఉదయం ఏడు గంటల నుంచే... రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రెవెన్యూ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు వివిధ రాజకీయ పారీ్టల నేతలు మంగళవారం ఉదయం 7 గంటలకే విజయారెడ్డి నివాసానికి చేరుకొని అమె మృతదేహానికి నివాళులర్పించారు. ఎంపీ రేవంత్రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి, దేవిరెడ్డి సు«దీర్రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయారెడ్డి అంతిమ యాత్రలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, జిట్టా బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలి: రేవంత్ విజయారెడ్డి సజీవదహనం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. మేజి్రస్టేట్ అధికారాలున్న అధికారిపై దాడి చేయడం దారుణమని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే రోజులు వచ్చాయని మండిపడ్డారు. రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి... విజయారెడ్డి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఉద్యోగులకు భద్రత కలి్పంచాలని కోరారు. విజయారెడ్డి హత్య వెనుక రాజకీయ కుట్ర ఉందని, దీన్ని తేల్చాల్సిన అవసరముందని అన్నారు. అండగా ఉంటాం: మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి విజయారెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇది ఉన్మాదంతో ఒక వ్యక్తి చేసిన పని. ఇలాంటి ఘటన ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. భవిష్యత్లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఉన్నచోట్ల ప్రత్యేక చర్యలు చేపడతాం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: లచ్చిరెడ్డి విజయారెడ్డి హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ తహసీల్దార్ల వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. 3 రోజులు అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద నిరాహార దీక్షలు కొనసాగుతాయన్నారు. త్వరలోనే పూర్తి కార్యాచరణ విడుదల చేస్తామని అన్నారు. విజయారెడ్డి కుటుంబానికి అండగా ఉందాం : రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి అమానుష హత్యను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఖండించారు. మృతురాలి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి ఘటన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందికి భద్రత కలి్పంచేలా వెంటనే చర్యలు చేపట్టాలని సోమేశ్కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జిల్లాల కలెక్టర్లకు సందేశం పంపారు. కాగా,తహసీల్దారు సజీవ దహనంపై తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం (టీఎస్ఐఏఎస్) ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రభుత్వం విజయారెడ్డి కుటుంబానికి మద్దతుగా నిలవాలని కోరింది. ప్రజాసేవలో అధికారులు ధైర్యంగా పనిచేయాలంటే నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించింది. అఖిలపక్షం నిర్వహించాలి: చాడ సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన నేపథ్యంలోనైనా వెంటనే రెవెన్యూ నిపుణులు, అఖిలపక్ష పార్టీలతో భేటీ ఏర్పాటు చేసి రెవెన్యూ చట్టాలు, భూరికార్డుల్లో మార్పులకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జాప్యం జరిగే కొద్దీ ఉద్యోగులు, ప్రజల మధ్య అంతరాలు పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని, ఇది సమాజానికి మంచిదికాదని మంగళవారం సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. నేడు నల్లబ్యాడ్జీలతో నిరసనలు సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఖండిస్తూ, రెవెన్యూ ఉద్యోగులకు సంఘీభావంగా బుధవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్టు అటవీశాఖలోని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. మంగళవారం అరణ్యభవన్లో జరిగిన సమావేశంలో స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్, మినిస్టీరియల్ స్టాఫ్, డ్రైవర్లు, క్లాస్–4 ఉద్యోగుల సంఘాలు తహసీల్దార్ విజయారెడ్డి మృతికి సంతాపం తెలిపాయి. విధుల బహిష్కరణ సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా మంగళవారం రెవెన్యూ, ఇతర ఉద్యోగ సంఘాలు విధులు బహిష్కరించాయి. విధి నిర్వహణలో అసువులుబాసిన ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు హైదరాబాద్కు తరలివచ్చారు. ఒక్కడి పనేనా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తహసీల్దార్పై పథకం ప్రకారం పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన నిందితుడు కూర సురేశ్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? హత్యకు కుట్రను అతను ఎవరితోనైనా పంచుకున్నాడా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సురేశ్ మొబైల్ కాల్డేటాను విశ్లేషిస్తున్నారు. హత్యకు ముందు సురేశ్ తన పెదనాన్న దుర్గయ్యతోపాటు పలువురు బంధువులు, స్నేహితులతో మాట్లాడినట్లు గుర్తించారు. మరోవైపు ఈ వ్యవహారంలో సురేశ్ పెదనాన్న దుర్గయ్య పాత్రపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సురేశ్కు ఎలాంటి మానసిక రుగ్మతల్లేవని గ్రామస్తులంతా చెబుతుంటే దుర్గయ్య, కుటుంబ సభ్యులు మాత్రం అతనికి మతిస్థిమితం లేదని, రియల్టర్ అని, వివాదంతో సంబంధమే లేదని పొంతనలేని సమాధానాలు చెప్పడం వెనుక దురుద్దేశం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సురేశ్ కుటుంబానికి 1998లోనే ఆర్.ఓ.ఆర్ కింద పాసు పుస్తకాలు మంజూరయ్యాయని స్థానికులు చెబుతుండటంతో ఈ వ్యవహారంతో సురేశ్కు సంబంధం లేదని కుటుంబ సభ్యులు చెప్పడంపై సందేహపడుతున్నారు. సురేశ్ వెనక బంధువులు ఎవరైనా ఉన్నారా? అనే విషయంపై కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. -
తహసీల్దార్ కారు డ్రైవర్ మృతి
పెద్ద అంబర్పేట: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై సురేష్ పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత ఆమెను కాపాడే యత్నంలో మంటలంటుకొని తీవ్రంగా గాయపడిన ఆమె కారు డ్రైవర్ గురునాథం (27) చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయారెడ్డిపై నిందితుడు సురేష్ పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఘట నా స్థలంలోనే కన్నుమూసిన విషయం తెలిసిందే. తహసీల్దార్ను కాపాడే యత్నంలో ఆమె కారు డ్రైవర్ గురునాథానికి మంటలంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను డీఆర్డీఎల్లోని అపోలో ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెం దినట్లు పోలీసులు తెలిపారు. గురునాథం స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామం. విజయారెడ్డి వద్ద నాలుగేళ్లుగా కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురునాథంకు భార్య, ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతడి భార్య ఎనిమిది నెలల గర్భిణి. గురునాథం మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు సురేష్ అరోగ్య పరిస్థితి విషమం తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన నిందితుడు సురేష్కు ఉస్మానియా ఆస్పత్రిలోని ప్లాస్టీక్ సర్జరీ విభాగంలో పోలీసుల సంరక్షణలో చికిత్స కొనసాగుతోంది. కాగా 65 శాతం కాలడంతో సురేష్ పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు చూడడానికి బంధువులుగానీ, స్నేహితులుగానీ ఎవ్వరూ రాలేదని ఆçస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్స పొందుతున్న మరో ఇద్దరు... తహసీల్దార్కు నిప్పంటించిన ఘటనలో గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలోనే అటెండర్గా విధులు నిర్వహిస్తున్న చంద్రయ్యకు కూడా గాయపడటంతో డీఆర్డీఎల్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి శరీరం 50 శాతం మేర కాలినట్లు పోలీసులు తెలిపారు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం. అదేవిధంగా తన భూ సమస్య పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన కవాడిపల్లికి చెందిన బొడిగె నారాయణగౌడ్కు కూడా గాయాలైన విషయం తెలిసిందే. అయితే ఆయనను హయత్నగర్లోని టైటాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. ఉద్యోగం కల్పించండి: సౌందర్య విధి నిర్వహణలో భాగంగా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్ధార్ విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన డ్రైవర్ గురునాథం భార్య సౌందర్య తనకు ఉద్యోగం కల్పించాలని కోరారు. తన, పిల్లల భవిష్యత్ కోసం ఉద్యోగం కల్పించి, దళితులకు కేటాయించిన 3 ఎకరాల భూమి కేటాయించాలని కోరారు. -
విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు..
-
సజీవదహనం: తాపీగా నడుచుకుంటూ వెళ్లిన సురేష్
-
సజీవదహనం: తాపీగా నడుచుకుంటూ వెళ్లిన సురేష్
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు. కేసు దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్ ఘటనాస్థలంలో శాంపిల్స్ను సేకరించింది. దీంతోపాటు తహసీల్దార్ ఆఫీస్ పక్కనే ఉన్న హాస్టల్లోని సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులు సేకరించారు. నిందితుడు సురేష్ కాలిన గాయాలతో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను ఈ సీసీటీవీ కెమెరా నమోదుచేసింది. తహసీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన అనంతరం కాలిన గాయాలతో నిందితుడు సురేష్ తాపీగా నడుచుకుంటూ వెళుతున్నట్టు ఈ దృశ్యాలలో కనిపిస్తోంది. ఇప్పటికే సేకరించిన శాంపిల్స్, వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్కు పోలీసులు పంపించారు. తహసీల్దార్ చంపేందుకు సురేష్ కిరోసిన్లో పెట్రోల్ కలిపి తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే విజయారెడ్దిని కూర సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి.. పట్టపగలే అమానుషంగా సజీవం దహనం చేసిన సంగతి తెలిసిందే. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో ఆ వ్యక్తి ఈ దుర్మార్గానికి ఒడిగడ్డాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కా పథకంతో కార్యాలయంలోని తహసీల్దార్ గదిలోకి పెట్రోల్ డబ్బాతో చొరబడ్డ కూర సురేశ్... రెప్పపాటులోనే విజయారెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. అంతే.. అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్య తీవ్రంగా గాయపడ్డారు. కంచన్బాగ్లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో గురునాథ్ మంగళవారం ప్రాణాలు విడిచాడు. -
పూర్తయిన తహశీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు
-
విజయారెడ్డికి కన్నీటి వీడ్కోలు..
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి అంత్యక్రియలు నాగోల్ శ్మశాన వాటికలో పూర్తయాయి. విజయారెడ్డి అంతిమయాత్రలో రెవెన్యూశాఖ ఉద్యోగులు, స్థానికులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పెద్దసంఖ్యలో ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం నాగోల్ శ్మశాన వాటికలో విజయారెడ్డి భౌతికకాయానికి భర్త సుభాష్రెడ్డి దహన సంస్కారాలు నిర్వహించి.. అంత్యక్రియలు పూర్తి చేశారు. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే విజయారెడ్దిని కూర సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి.. పట్టపగలే అమానుషంగా సజీవం దహనం చేసిన సంగతి తెలిసిందే. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో ఆ వ్యక్తి ఈ దుర్మార్గానికి ఒడిగడ్డాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కా పథకంతో కార్యాలయంలోని తహసీల్దార్ గదిలోకి పెట్రోల్ డబ్బాతో చొరబడ్డ కూర సురేశ్... రెప్పపాటులోనే విజయారెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. అంతే.. అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్య తీవ్రంగా గాయపడ్డారు. కంచన్బాగ్లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో గురునాథ్ మంగళవారం ప్రాణాలు విడిచాడు. విజయారెడ్డికి భర్త సుభాష్తోపాటు ఇద్దరు చిన్నపిల్లలు.. అమ్మాయి(10), అబ్బాయి(5) ఉన్నారు. తల్లి మరణంతో పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. -
మరో ఇద్దరు కూడా వచ్చారు: ప్రత్యక్ష సాక్షి
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి, రైతు నారాయణ ప్రస్తుతం హయత్నగర్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివాదాస్పద భూమి పట్టా విషయమై సురేశ్ అనే రైతు విజయారెడ్డిని ఆమె కార్యాలయంలో సజీవదహనం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో అక్కడే ఉన్న నారాయణ అనే రైతుకు కూడా తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆయన తన ఇద్దరు కుమారులతో ఘటనకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ‘ నేను ఎమ్మార్వోతో మాట్లాడుతుండగానే ముగ్గురు వ్యక్తులు గదిలోకి వచ్చారు. దీంతో నన్ను కాసేపు బయట ఉండమని ఎమ్మార్వో చెప్పడంతో నేను గది ముందే వేచి చూస్తున్నాను. కొద్ది సేపటికే ఎమ్మార్వో విజయ మంటలతో బయటకు పరుగులు పెట్టారు. తలుపు దగ్గరే ఉన్న నాకు తీవ్ర గాయాలయ్యాయి అని నారాయణ పేర్కొన్నాడు. కాగా విజయారెడ్డి హత్యకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి నారాయణ నుంచి మెజిస్ట్రేట్ వాంగ్మూలం సేకరించారు. ఈ నేపథ్యంలో నారాయణ చెబుతున్న ప్రకారం సురేశ్తో పాటు మరో ఇద్దరు కూడా కార్యాలయానికి వచ్చారన్న విషయం స్పష్టమైంది. పోలీసులు ఈ కోణంలో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా నాగోల్లోని శ్మశాన వాటికలో విజయారెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. -
మొన్న ఆర్టీసీ, నిన్న రెవెన్యూ.. రేపు..?: రేవంత్
సాక్షి, హైదరాబాద్ : పట్టపగలే ప్రభుత్వ కార్యాలయంలో తహశీల్దార్ విజయారెడ్డి హత్య జరగడం దారుణమని మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే రోజులు వచ్చాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగానే విజయారెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు దూరం ప్రభుత్వమే పెంచిందని ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. ఘటనపై ఉద్యోగులు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ వారికి పూర్తి మద్దతు ప్రకటిస్తుందని హామీ ఇచ్చారు. ‘మేజిస్ట్రేట్ అధికారాలు ఉన్న అధికారిణిపై దాడి దారుణం. దాదాపు ఐదు వందల ఎకరాల భూ వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగింది. ఇంతటి ఘోరమై ఘటన జరిగితే న్యాయం చేస్తామని ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దగ్గరే ఉంది. హత్య జరిగి 24 గంటలు గడుస్తున్నా సీఎం నివాళులు అర్పించేందుకు రాలేదు. రెవెన్యూ అధికారులను ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మంత్రి కేటీఆర్ రెవెన్యూ అధికారులపై దాడి చేయాలని పిలుపునివ్వడం ఇలాంటి ఘటనలకు ఉసిగొల్పుతుంది. ఘటనపై సీబీఐ విచారణ జరపాలి’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారిక లాంఛానలతో జరపాలి! ‘భూ వివాదంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి. మొన్న ఆర్టీసీ, నిన్న రెవెన్యూ.. రేపు మరో శాఖకు ఇలాంటి చేదు అనుభవాలు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులందరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. జ్యూడిషియల్ అధికారి విధి నిర్వహణలో మరణిస్తే అధికారిక లాంఛనాలతో జరపాలని ప్రభుత్వం ప్రకటించలేదు. విజయారెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కనీసం పలకరించకపోవడం బాధాకరం. బాధిత కుటుంబాన్ని సీఎం పరామర్శించాలి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలి’ అని రేవంత్రెడ్డి ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో సమస్యలు పరిష్కరించింది: కోమటిరెడ్డి విజయారెడ్డిపై దాడి మానవత్వాన్ని మంటగలిపే విధంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తహశీల్దార్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటన తనను వేదనకు గురిచేసిందన్నారు. ‘విజయారెడ్డి ఎన్నో సమస్యలను పరిష్కరించింది. ఆమె హత్య చూసి సమాజం బాధ పడుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా. రెవెన్యూశాఖ సమస్యలను ఒకేసారి పరిష్కారం చేయలేము. అధికారుల పై విపరీతమైన ఒత్తిడి ఉంది’ అని పేర్కొన్నారు. -
విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి..
-
రాజకీయ నేతతో రైతు సంభాషణ
-
గురునాథం మృతి.. అయ్యో పాపం భార్యాబిడ్డలు
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ చెరుకూరి విజయారెడ్డి దారుణ హత్య నేపథ్యంలో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్ కామళ్ల గురునాథం మంగళవారం మృతి చెందాడు. సోమవారం రైతు దాడిలో అగ్నికి ఆహుతైన విజయారెడ్డిని రక్షించేందుకు గురునాథం తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలో అతడికి కూడా నిప్పు అంటుకోవడంతో దాదాపు 85 శాతం శరీరం కాలిపోయింది. దీంతో గురునాథాన్ని అపోలో డీఆర్డీఎల్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఉదయం 11 గంటలకు మరణించాడు. కాగా విజయారెడ్డి డ్రైవర్ గురునాథం స్వస్థలం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామం. అతడికి భార్య, ఏడాదిన్నర కొడుకు ఉన్నారు. ప్రస్తుతం గురునాథం భార్య ఏడు నెలల గర్భిణి. ఇక గురునాథం మరణవార్త తెలిసిన నేపథ్యంలో ఆయన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయ్యో పాపం అంటూ పలువురు అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహమైన విషయం విదితమే. రైతు సురేశ్ పెట్రోల్తో చేసిన దాడిలో తొలుత మరణించింది ఎవరో అర్థంకాక సిబ్బంది అయోమయానికి గురయ్యారు. తహశీల్దార్ గది వెనుక కిటికీలోంచి చూస్తే ఆమె కనిపించకపోయే సరికి భయంతో అని కేకలు పెట్టారు. ఈ క్రమంలో మరొక వ్యక్తి వచ్చి విజయారెడ్డి చేతికి ఉన్న వాచీని చూసి ఆమెను తహశీల్దార్గా గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇక విజయారెడ్డిని కాపాడేందుకు ఆమె కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్య ముందుకురాగా వారు సైతం మంటల్లో కాలిపోయారు. దీంతో వారిని కంచన్బాగ్లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గురునాథ్ మంగళవారం మరణించగా.. చంద్రయ్య 50 శాతం కాలిన గాయాలకు చికిత్స పొందుతున్నాడు. -
నిందితులను కఠినంగా శిక్షించాలి
-
అందుకే విజయారెడ్డిని హత్య చేశాను: సురేశ్
సాక్షి, రంగారెడ్డి : వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్ తెలిపాడు. అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ చెరుకూరి విజయారెడ్డిని ఆమె కార్యాలయంలోనే సురేశ్ అగ్నికి ఆహుతి చేసిన విషయం విదితమే. సోమవారం జరిగిన ఈ ఘటనలో 60 శాతం గాయాలపాలైన సురేశ్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో వైద్యుల సమక్షంలో పోలీసులు అతడి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వోను ఎన్నో రోజులుగా... ఎంతగా బతిమిలాడినా ఆమె తనకు పట్టా ఇవ్వలేదని సురేశ్ పేర్కొన్నాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం ఆమె కార్యాలయానికి వెళ్లి మరోసారి విఙ్ఞప్తి చేశానని.. అయినప్పటికీ ఆమె స్పందించలేదని తెలిపాడు. ఈ క్రమంలో మరోసారి తిరిగి పెట్రోల్ డబ్బాతో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లానని... మొదట తనపై కిరోసిన్ పోసుకుని.. తర్వాత ఆమెపై పోసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో తనకు నిప్పంటించుకుని విజయారెడ్డిని కూడా తగులబెట్టానని పేర్కొన్నాడు. కాగా విజయారెడ్డి దారుణ హత్యపై తీవ్రంగా స్పందించిన రెవెన్యూ ఉద్యోగులు మృతదేహానికి నివాళులు అర్పించేందుకు భారీ ఎత్తున ఆమె నివాసానికి చేరుకుంటున్నారు. హత్య వెనుక ఉన్న మాఫియా ఆగడాలను బయటపెట్టి... వారిని కఠినంగా శిక్షించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి : మహిళా తహసీల్దార్ సజీవ దహనం) ఆ భూమి విలువ రూ. 40 కోట్లు బాచారంలోని దాదాపు 412 ఎకరాల భూమి గత 70 ఏళ్లుగా వివాదాల్లో కూరుకుపోయింది. మహారాష్ట్రకు చెందిన రాజా ఆనందరావు పేరిట ఉన్న ఈ భూమిలో 130 ఎకరాల భూమిని... రాష్ట్ర ప్రభుత్వం భూప్రక్షాళన అనంతరం అతడు తమకు విక్రయించాడని సయ్యద్ యాసిన్ వారసులు తెరపైకి వచ్చారు. కాగా వివాదంలో ఉన్న ఆ భూమిని పలు కుటుంబాలు ఇప్పటికే సాగు చేసుకుంటున్నాయి. ఇందులో నిందితుడు సురేష్ కుటుంబం కూడా ఉంది. ఈ క్రమంలో తమకు చెందిన భూమిని వేరొకరికి బదిలీ చేశారంటూ రైతు కుటుంబాలు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కాగా ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ భూమి ఉండటంతో కబ్జాదారులు దీనిని చేజిక్కించుకునేందుకు పథకం పన్నినట్లు తెలుస్తోంది. ఈ భూకబ్జాలో పలువురు రాజకీయ నేతల హస్తం కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నిందితుడు సురేష్ తనదిగా పేర్కొంటున్న భూమి మార్కెట్ విలువ సుమారు 40 కోట్ల రూపాయలని సమాచారం. -
పెట్రోల్ పోసి.. నిప్పంటించి..
-
మహిళా తహసీల్దార్ సజీవ దహనం
సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్మెట్: రాష్ట్ర రాజధాని శివారులో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి ఆమె కార్యాలయం లోనే సోమవారం హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎలా జరిగిందంటే.. సమయం.. మధ్యాహ్నం 1:45 గంటలు. ప్రదేశం.. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయం. ఉన్నట్టుండి హాహాకారాలు.. ఆ వెంటనే భారీ పేలుడు.. దరఖాస్తుదారులు, సిబ్బంది ఉరుకులు పరుగులతో అంతటా ఉది్వగ్న వాతావరణం. ఏం జరిగిందో తెలిసేలోపే ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. తన భూ వివాదాన్ని మహిళా తహసీల్దార్ పరిష్కరించలేదన్న ఆక్రోశంతో ఓ రైతు హంతకుడిగా మారాడు. ఆమెను అంతం చేసేందుకు పక్కా పథకంతో కార్యాలయంలోని తహసీల్దార్ గదిలోకి పెట్రోల్ డబ్బాతో చొరబ డ్డాడు. రెప్పపాటులో మహిళా తహసీల్దార ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. అంతే.. అందరూ చూస్తుండగానే తహసీల్దార్ విజయారెడ్డి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. అయితే ఈ ఘటనలో మరణించింది ఎవరో అర్థంకాక సిబ్బంది తొలుత అయోమయానికి గురయ్యారు. ఆమె గది వెనుక కిటికీలోంచి చూస్తే ఆమె కనిపించకపోయే సరికి మేడం, మేడం అని కేకలు పెట్టారు. మరొక వ్యక్తి వచ్చి విజయారెడ్డి చేతికి ఉన్న వాచీని చూసి ఆమెను తహసీల్దార్గా గుర్తించారు. వెంటనే తహసీల్దార్ సజీవదహనంపై పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటల్లో తీవ్రంగా గాయ పడిన కారు డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్యను కంచన్బాగ్లోని డీఆర్డీఎల్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గురునాథ్ 84%, చంద్రయ్య 40– 50% కాలిన గాయాలకు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ నిందితుడు సురేశ్ను తొలుత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన పోలీసులు అతని పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తహసీల్దార్ విజయారెడ్డి మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంలో విజయారెడ్డి మృతదేహం. విలపిస్తున్న బంధువులు. బదిలీ అయ్యుంటే ప్రాణాలు దక్కేవి! తహసీల్దార్ విజయారెడ్డి అబ్దుల్లాపూర్మెట్ లో 2016 అక్టోబర్ నుంచి పనిచేస్తున్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో కొత్త మండలంగా ఏర్పాటైన అబ్దుల్లాపూర్మెట్ లో ఆమెకు పోస్టింగ్ లభించింది. మూడేళ్లకు పైగా ఇక్కడ పని చేసిన తనను బదిలీ చేయాలని లోక్సభ ఎన్నికలు ముగియగానే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బదిలీపై సర్కారు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. 10రోజుల కిందట విజయారెడ్డి దంపతులు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సైతం కలిశారు. తనను బదిలీ చేయాలని విజయారెడ్డి మంత్రికి విన్నవించారు. ఇంతలోనే ఆమె దారుణ హత్యకు గురవడంతో అందరూ హతాశులయ్యారు. బదిలీ జరిగి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. భర్త, పిల్లలతో విజయారెడ్డి ఫైల్ ఫొటో భారీ పేలుడు శబ్దం వినిపించింది మధ్యాహ్నం 1.45కు మేడం వద్దకు ఫైలుతో వెళ్లా. సరిగ్గా 5 నిమిషాల్లో ఏదో పెద్ద పేలిన శబ్దం వినిపించింది. వెంటనే మేడం చాంబర్వైపు పరిగెత్తాం. అక్కడ అరుపులు, కేకలు దట్టమైన పొగతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తొలుత ఆత్మహత్యాయత్నం చేసుకున్నారనుకున్నాం. మేడం.. మేడం అని అరిస్తే మా పిలుపులకు స్పందించి మేడం చేయి లేపడంతో అప్పుడు అర్థమైంది.– సునీత, సీనియర్ అసిస్టెంట్ పేలుడు ధాటికి పగిలిన అద్దాలు మధ్యాహ్నం 1.50 గం.కు దరఖాస్తుదారులు వచ్చారు. అప్పుడే వచ్చిన మేడం కొందరితో మాట్లాడారు. మాకు కొన్ని పనులు కూడా చెప్పారు. మేం వాటిని చూసేందుకు మా చాంబర్లలోకి వెళ్లగానే భారీ పేలుడుతో అద్దాలు పగిలిపోయాయి. మేం పరిగెత్తుకుం టూ వచ్చేసరికి మంటల్లో కాలుతున్న మేడం కనిపించారు. వెంటనే కార్పెట్లు తెచ్చి మంటలను ఆర్పాం. కానీ మేడంను కాపాడుకోలేకపోయాం. – మహేశ్ ఆర్.ఐ. కాలిన గాయాలతో సురేశ్ (ఇన్సెట్లో సురేశ్ ఫైల్) ఎవరీ సురేశ్.. ఎందుకీ దారుణానికి ఒడిగట్టాడు? రైతు సురేశ్ అబ్దుల్లాపూర్మెట్ బాచారం గ్రామస్తుడు. ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 73 నుంచి 101 వరకు విస్తరించిన దాదాపు 412 ఎకరాలను సురేశ్ కుటంబం సహా గౌరెల్లికి చెందిన 53 మంది 50 ఏళ్లుగా సాగుచేస్తున్నారు. వాస్తవానికి ఈ భూమి వారి సొంతం కాదు. ఇందులో 280 ఎకరాలు రాజా ఆనంద్కు చెందినది. ఆయన 1980 తరువాత మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో వారంతా సాదా బైనామా కింద రాజా ఆనంద్ నుంచి కొనుగోలు చేశామని చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించి 1980 నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయని సమాచారం. అయితే వారికి 1998లో 1–బీ కింద రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) ఇచ్చారు. పట్టా పాసుపుస్తకాలు కూడా మంజూరయ్యాయని చెబుతున్నారు. కానీ 2004లో ఈ భూమిపై తమకు హక్కులు ఉన్నాయంటూ అదే గ్రామానికి చెందిన షఫీక్, హబీబ్ సహా మరికొందరు కోర్టులో కేసు వేయగా దీనిపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో వివాదాస్పద 130 ఎకరాలను ఇటీవల తహసీల్దార్ విజయారెడ్డి వేరే వాళ్ల పేరిట పట్టా పాసుపుస్తకాలు జారీ చేశారని సురేశ్ బంధువులు ఆరోపిస్తున్నారు. 130 ఎకరాల్లో తన తాత నుంచి వారసత్వంగా రావాల్సిన 2 ఎకరాల భూమి కూడా ఉందని, దీనిపై సురేశ్ ఏడాదిగా అభ్యంతరం చెబుతున్నాడని పేర్కొన్నారు. దీనిపై ఏడాదిగా తహసీల్దార్ విజయారెడ్డి కార్యాలయం చుట్టూ అతను తిరుగుతున్నాడని గ్రామస్తులు తెలిపారు. తనకు భూమి దక్కనీయకుండా చేసిందని కక్ష పెంచుకున్న సురేశ్ ప్రతీకారంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అంటున్నారు. మా వాడు అమాయకుడు నా కొడుకు అమాయకుడు. ఇలా ఎందుకు చేశాడో తెలియట్లేదు. ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదు. కొంతకాలం వ్యవసాయం చేశాడు, ఇప్పుడు ఆటో, రియల్ ఎస్టేట్తోపాటు పొలం చూసుకుంటున్నాడు. వాడికి ఇద్దరు పిల్లలు మనస్వి (7), శ్రీచరణ్ (5) ఉన్నారు. వాడికేమైనా అయితే నా గతి, నా మనవల గతి ఏంగాను? – కూర పద్మ, సురేశ్ తల్లి మతిస్థిమితం సరిగా లేదు.. చిన్నప్పటి నుంచి సురేశ్ ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదు. కొంతకాలంగా అతని మానసిక పరిస్థితి బాలేదు. ఈ వివాదంపై సురేశ్ తండ్రి ఇప్పటికే పోరాడుతున్నాడు. సంబంధం లేని విషయంలో సురేశ్ తలదూర్చాడు. – కూర దుర్గయ్య, సురేశ్ పెదనాన్న -
కిడ్స్ వరల్డ్.. పిల్లల ప్రపంచం
అదో పిల్లల ప్రపంచం. వారి సృజనాత్మకతను పెంచే విధంగా ఉంటుంది అక్కడి వాతావరణం. బోల్డన్ని ఆటవస్తువులుంటారుు. అవన్నీ పరిశీలించు... ప్రశ్నించు... తెలుసుకో... అని ప్రేరేపిస్తుంటారుు. అదే.. నగర బాలల సరికొత్త నేస్తం.. పిల్లల వుూ్యజియుం.. కిడిహో.. పదేళ్లకు పైగా అమెరికాలోనే గడిపిన నిరంజన్ వాసిరెడ్డి కొన్నాళ్ల కిందట హైదరాబాద్ వచ్చేశారు. ఆయున అమెరికాలో ఉన్నప్పుడు తరచూ తమ పిల్లలతో బయటికి వెళ్లేవారు. కానీ ఇక్కడికి వచ్చాక పిల్లలకు టీవీనే ప్రపంచం అయిపోయింది. దాంతో పిల్లల భవిష్యత్తు గురించి ఆయునలో ఆందోళన మొదలైంది. బయటికి తీసుకువెళ్దామంటే పిల్లలకు ప్రత్యేకమైన పార్కులు గాని చెప్పుకోదగ్గ ఆటస్థలాలు గాని లేవు. ఈ అంతర్మథనం నుంచి వచ్చిన ఆలోచనే.. కిడిహో. వినోదంతోపాటు విజ్ఞానం కిడిహోలో ఉన్న ఆటవస్తువులు కేవలం వినోదాన్ని పంచడానికే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. అవి పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంచడమే కాకుండా నలుగురితో కలసి పోయేందుకు తోడ్పడతాయి. వీటితో ఇలానే ఆడుకోవాలి అనే రూల్ లేదు. ఇక్కడ అడుగు పెట్టగానే ముందుగా పాత టైర్లు వేర్వేరు రంగుల్లో దర్శనమిస్తాయి. కొంతమంది చిన్నారులు వాటిని చేత్తో కొట్టి ముందుకు నడుస్తారు. కొందరు ఒకే రంగులోని వాటన్నింటిని ఒకచోట చేరుస్తారు. మరొకరు వాటిని ఎత్తుకోసం ఉపయోగిస్తారు. సో మొత్తంగా ఎవరికి నచ్చిన విధంగా వారు ఇక్కడ ఆడుకోవచ్చు. క్రియేట్ చేయొచ్చు. తెలుసుకోవచ్చు. అంతేకాదు.. షాపింగ్ ఎలా చేయాలి, డబ్బులెలా చెల్లించాలి, వంట ఎలా చేస్తారు. బిల్డింగ్లు ఎలా కడతారు ఇలా నిత్యం మనకు అవసరమయ్యే ప్రతి అంశంపైనా ఇక్కడి వస్తువులు అవగాహన కల్పిస్తాయి. నియువు నిబంధనలు నిల్ పిల్లల ఆలోచనలకు పరిధులు లేనట్లే. కిడిహోలో నియమ నిబంధనలు ఉండవు. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. పిల్లలు తమ సృజనకు పదును పెడుతుంటే తల్లిదండ్రులు దగ్గరే ఉండి చూడొచ్చు. అయితే ఫ్రీగా వస్తే దేనికీ విలువ ఉండ దు కాబట్టి ఫీజు నిర్ణయించారు కిడిహో వ్యవస్థాపకులు నిరంజన్రెడ్డి. ఫీజు పిల్లలకు రూ. 300, తల్లిదండ్రులకు రూ. 200. చదువుల్లో తేడా అమెరికా చదువులకూ మనకూ చాలా తేడా ఉంది. కారణం సృజన. మన దగ్గర నూటికి వంద మార్కులు వస్తాయి. కానీ పిల్లలు ఏదైనా వినూత్నంగా చేస్తారా అంటే చాలా వరకూ అరుదనే చెప్పాలి. అందుకే పిల్లల్లో సృజనని పెంపొందించాలి. ఇక్కడ మేం చేసేది అదే. పనికిరాని వుస్తువులకు చిన్న చిన్న మార్పులు చేసి తిరిగి వాటిని ఎలా ఉపయోగించవచ్చో చూపిస్తాం. పాత బకెట్లను కూర్చీలుగా మార్చటం, కార్డుబోర్డుతో చెప్పుల స్టాండ్... ఇలా ఏదైనా చేయగలం అనే ఆలోచన పిల్లల్లో వచ్చేలా చేయడమే మా లక్ష్యం. కొత్త విషయాలు నేర్చుకోవడం, వినూత్నంగా ఆలోచించడం అలవరచుకుంటారు. - నిరంజన్ వాసిరెడ్డి, కిడిహో వ్యవస్థాపకుడు - విజయారెడ్డి -
స్టిక్ ఫ్రేమ్స్
ఎవరి ఇంటికి వెళ్లినా.. ఎదురుగా కనిపించేది ఫొటో ఫ్రేమే. దేవుడిదో.. తాతయ్యదో.. బామ్మదో.. ఎవరెవరి ఫొటోలో గోడకు వేలాడుతూ పలకరిస్తాయి. ఓసారి ఇల్లంతా కలయ తిరిగితే లామినేటెడ్ ఫ్రేమ్ రూపంలో చిలిపి చిన్నారుల చిత్రాలు హాయ్ అంటాయి. జమానా బదల్ గయా.. అన్నింటా కొత్తందాలకు చోటిస్తున్న ఈ తరం.. ఫొటోలను కూడా వెరైటీగా పదిలపరుచుకోవాలని ఫిక్సవుతోంది. ఇలాంటి వారిని స్టిక్ ఫ్రేమ్స్ కట్టిపడేస్తున్నాయి. జ్ఞాపకాలను పది కాలాలు ఉంచేది ఫొటో. అందుకే తీపి గుర్తుల ప్రతిబింబాన్ని ఆల్బమ్లో దాచుకుంటాం. వుది దోచిన వుధుర క్షణాలను ఫ్రేమ్లలో బంధించి గోడలపై అలంకరించుకుంటాం. ఒక్కసారి ఫ్రేమ్ ఫిక్సరుుతే.. ఏళ్లకేళ్లు అలాగే ఉంటారుు. కొత్త ట్రెండ్స్ ఎన్ని వచ్చినా.. పాత ఫ్రేమ్ను అలాగే గోడకు వేలాడుతూనే ఉంటుంది. ఇప్పుడా చింత లేదు. మీ అందమైన ఫొటోలకు పొందికైన రూపాన్నిస్తుంది ఫ్రేమ్ స్టిక్కర్స్. డిఫరెంట్ స్టిక్కర్స్లో ఫొటోలను నగరవాసులు సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. చెట్టు కొమ్మలకు రెమ్మలుగా ఫ్రేమ్స్ స్టిక్ చేసి ఫ్యామిలీ మెమరీస్ను ఇంపుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఉడెన్, ఐరన్, ప్లాస్టిక్, గ్లాస్ ఫొటో ఫ్రేమ్లతో పోల్చుకుంటే వీటి ఖరీదు తక్కువే. అతికిస్తే సరి : వేరు వేరు సైజుల్లో ఉండే ఈ స్టిక్కర్ ఫ్రేమ్ల మధ్యలో ఖాళీ ఉండి, వెనుక భాగమంతా జిగురు ఉంటుంది. కావాల్సిన ఫొటోను ఈ స్టిక్కర్ల వెనుక వైపు మధ్యలో పెట్టి నొక్కితేఅది స్టిక్కర్కి అతుక్కుపోతుంది. ఆ తరువాత ఈ ఫ్రేమ్ని నచ్చిన చోట గోడకు అతికిస్తే సరి. డిఫరెంట్ కలర్స్, థీమ్స్తో అందుబాటులో ఉన్న స్టిక్కర్ ఫ్రేమ్స్ సిటీ వాసులకు బాగా కనెక్ట్ అవుతున్నారుు. పైగా, ఈ ఫ్రేమ్లను ఎన్ని సార్లరుునా తీసి కావల్సిన చోట మళ్లీ అతికించుకోవచ్చు. మేకులతో గోడలు పాడవుతాయునే దిగులూ ఉండదు. ఈ ఫొటో ఫ్రేమ్స్ ఫర్నిషింగ్, వాల్ డెకార్ స్టోర్స్లో, ఫ్యాబ్ ఫర్నిష్ ఆన్లైన్ స్టోర్లలో లభిస్తున్నారుు. - విజయారెడ్డి -
సునీత హత్య కేసులో విజయారెడ్డి అరెస్ట్
హైదరాబాద్ : అంబర్పేట బాపూనగర్కు చెందిన సునీత దారుణ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. అంబర్పేట ఇన్స్పెక్టర్ పి.వెంకటరమణ కథనం ప్రకారం... బాపూనగర్లో ఉంటున్న కొట్లూరి కృష్ణ, రామంతాపూర్ ప్రశాంతనగర్, సరస్వతి బ్లాక్లో ఉంటున్న కల్లు విజయారెడ్డి కలిసి కొన్నేళ్ల క్రితం ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏర్పాటు చేశారు. బీబీనగర్, కొండమడుగులో కూడా వీకే డ్రగ్స్ పేరిట కంపెనీ స్థాపించారు. ఈ కంపెనీలకు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ఫైనాన్స్ కంపెనీలో రూ. కోటి, బ్యాంకులో రూ. 3 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ తర్వాత కృష్ణ, విజయారెడ్డిల మధ్య విభేదాలు తలెత్తాయి. వీటిని మధ్యవర్తులు, లా బోర్డు ద్వారా పరిష్కరించుకున్నప్పటికీ కృష్ణపై విజయారెడ్డి కక్ష పెంచుకుంది. తనకు పరిచయమైన పార్ట్టైమ్ పోలీసు రైటర్ జగన్నాథనాయుడుతో కలిసి కృష్ణ కూతురు శ్రావణిని చంపాలనుకుంది. అయితే వీలు కాకపోవడంతో గతనెల 16న కృష్ణ భార్య సునీతను జగన్నాథనాయుడు కారులో తాను ఉంటున్న అత్తాపూర్కు తీసుకెళ్లి చీరకొంగును మెడకు చుట్టి హత్య చేశాడు. అనంతరం సునీత మృతదేమాన్ని ముక్కలు ముక్కలుగా కోసి.. గోనె సంచుల్లో పెట్టి మూసీలో పడేసిన విషయం విదితమే. అయితే కృష్ణ గతనెల 18న తన భార్య కనిపించడం లేదని అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు జగన్నాథనాయుడు హత్య చేసినట్లు తెలిసింది. దీనికి ప్రధాన సూత్రధారి విజయారెడ్డి అని కూడా గుర్తించారు. దీంతో పోలీసులు నిన్న జగన్నాథనాయుడు, విజయారెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. (Woman hacked to death case two accused arrested) -
నాన్నా... అమ్మను చూపించవా?
* హత్య విషయం తెలిసి తల్లడిల్లిన సునీత కుమార్తె *మృతదేహమైనా చూపమంటూ తండ్రికి వేడుకోలు *ఇంకా దొరకని హతురాలి తల, కొన్ని శరీరభాగాలు సాక్షి, హైదరాబాద్: ‘నాన్నా... అమ్మని ఒక్కసారి చూపించు’... అంటూ తన తల్లి హత్యకు గురైందని తెలిసిన క్షణం నుంచి సునీత పదేళ్ల కుమార్తె గుండెపగలిలేలా రోదిస్తూనే ఉంది. ఇంకా తల లభించని, గుర్తించడానికీ వీలులేని, భయంకర స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఆ చిన్నారికి చూపించలేక అప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న కృష్ణ పంటి బిగువనే తన బాధను దిగమింగుకుంటున్నారు. ఇది కుటుంబీకులు, బంధువులనే కాదు పరిచయస్తులు కాని వారినీ కూడా కంటతడి పెట్టించింది. మరోపక్క వరుసగా రెండో రోజూ మూసీ నదిలో సునీత మృతదేహం కోసం గాలింపు కొనసాగింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్ని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లైన 21 ఏళ్లకు పుట్టిన శ్రావణి... అంబర్పేట్కు చెందిన కృష్ణ, సునీతలకు ఇద్దరు సంతానం. వివాహమైన 22 ఏళ్లకు (కుమారుడు పుట్టిన 11 ఏళ్లకు) జన్మించిన కుమార్తె శ్రావణి (10) అంటే వీరికి ప్రాణం. తండ్రి వ్యాపార, ఉద్యోగాల నిమిత్తం వివిధ చోట్లకు తిరుగుతూ ఉండటంతో శ్రావణికి తల్లితోనే అనుబంధం ఎక్కువ. గతనెల 16న సునీత అదృశ్యమైనప్పటి నుంచి కంటిమీద కునుకు లేకుండానే గడిపింది. ఎప్పటికైనా తనను అమితంగా ఇష్టపడే తల్లి తిరిగి వస్తుందనే ఆశతో ఉంది. సునీత హత్య విషయం బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చినా... గురువారం వరకు కుమారుడు, కుమార్తె శ్రావణికి తెలియకుండా గోప్యంగా ఉంచారు. అయితే బంధువులు రాకతో పాటు పరిస్థితుల్ని గమనించిన శ్రావణి కాస్త అనుమానం వ్యక్తం చేయడంతో తప్పనిసరై కృష్ణ విషయాన్ని బయటపెట్టారు. ఆ క్షణం నుంచి తల్లడిల్లిపోతున్న చిన్నారి ‘మమ్మీని ఒక్కసారి చూపించు డాడీ’ అంటూ విలపిస్తూనే ఉంది. అయితే ఓ పక్క ముక్కలైన మృతదేహం, మరోపక్క హత్య జరిగి 20 రోజులు దాటడంతో కుళ్లిన స్థితిలో ఉన్న అవయవాలు... ఈ రెంటికీ మించి 36 గంటలుగా గాలిస్తున్నా ఇంకా దొరకని తల. ఈ స్థితిలో తల్లి మృతదేహాన్ని చూస్తే శ్రావణి అనుభవించే క్షోభను ఊహిస్తున్న కృష్ణ కుమార్తెను మార్చురీ దగ్గరకు తీసుకువచ్చే సాహసం చేయలేకపోతున్నారు. మూసీలో మాంసం ముద్దలు ఏరుతూ... సునీత మృతదేహాన్ని జగన్నాథనాయుడు ముక్కలుగా చేసి మూసీలో పడేసిన విషయం గుర్తించిన పోలీసులు బుధవారం ఉదయం నుంచి అత్తాపూర్లోని మూసీలో కుటుంబీకుల సాయంతో గాలిస్తున్నారు. బుధవారం దొరికిన కొన్ని ముక్కలు మినహా ఎలాంటి ఫలితం కనిపించలేదు. కనీసం హతురాలి తలనైనా వెతికి తీయాలనే ఉద్దేశంతో గురువారం ఉదయం నుంచి గాలింపు చేపట్టారు. మధ్యాహ్నం మూడు సంచుల్లో కొన్ని మాంసం ముద్దలు కనిపించడంతో వాటిని వెంటనే ఉస్మానియా మార్చురీకి తరలించారు. పరిశీలించిన ఫోరెన్సిక్ వైద్యులు అవి హలీంకు సంబంధించినవని చెప్పడంతో మళ్లీ గాలింపు మొదలెట్టారు. గురువారం చీకటి పడటంతో తాత్కాలికంగా ఆపేసి తిరిగి శుక్రవారం ప్రారంభించాలని నిర్ణయించారు. కర్కశుల అసలు టార్గెట్ చిన్నారే... సునీత హత్య కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో ఏర్పాడిన విభేదాలు, స్పర్థల నేపథ్యంలో కృష్ణపై ఉన్న కక్షతో మాజీ వ్యాపార భాగస్వామి, జగన్నాథనాయుడు అతడిని మానసికంగా కుంగదీసి, కోలుకోలేని దెబ్బతీయాలని భావించారు. దీనికోసం ఆ కుటుంబం అల్లారుముద్దుగా చూసుకునే శ్రావణిని టార్గెట్గా చేసుకున్నారు. జూన్ 15 వరకు చిన్నారిని అపహరించి, హతమార్చాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆఖరి నిమిషంలో సునీతను టార్గెట్గా చేసుకుని జూన్ 16న పథకాన్ని అమలు చేశారు. సునీతను అత్తాపూర్లోని జగన్నాథనాయుడికి చెందిన కార్యాలయానికి తీసుకువెళ్లి ఆమె చీరతోనే ఉరిబిగించి చంపేశారు. ఆపై విషయాన్ని మాజీ వ్యాపార భాగస్వామికి తెలిపి, అక్కడకు రప్పించి చూపించారు. తర్వాత ఐదు గన్నీ బ్యాగ్స్లు కొనితెచ్చారు. మృతదేహాన్ని ముక్కలు చేసి.. బ్యాగుల్లో పెట్టి మూసీలో పడేశారని వెలుగులోకి వచ్చింది. -
‘సెటిల్’ చేసుకొని విడిపోయినా ఆమె పగ చల్లారలేదు
*వివాహిత దారుణ హత్య *భర్త వ్యాపార భాగస్వామే సూత్రధారి *నిందితులలో పోలీసు కాంట్రాక్ట్ ఉద్యోగి *అంబర్పేట్ పోలీసుల తీరుపై విమర్శలు సాక్షి, హైదరాబాద్: వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదం భాగస్వాముల మధ్య స్పర్థలకు దారి తీసింది. ఫలితంగా ఇద్దరూ ‘సెటిల్’ చేసుకొని విడిపోయారు. అయినా అతనిపై ఆమెకు ద్వేషం తగ్గలేదు. పగ చల్లారలేదు.దీంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలసిపోయింది. ఒక ఠాణా అధికారుల నిర్లక్ష్యం కుట్రకు దారి తీయగా... మరో పోలీస్ స్టేషన్ అధికారుల అలసత్వం పదేళ్ల బిడ్డకు కన్నతల్లిని దూరం చేసింది. ఇవీ బుధవారం అత్తాపూర్లోని పిల్లర్ నెం.113 వద్ద మూసీ నదిలో ముక్కలుగా లభించిన సునీత హత్య వెనుక ఉన్న కఠోర వాస్తవాలు. మహిళల రక్షణకు పెద్దపీట వేస్తున్నామని, వారికి ఎదురయ్యే సమస్యలపై తక్షణం స్పందిస్తామని చెప్పుకుంటున్న పోలీసు ఉన్నతాధికారులు సునీత కేసులో సిబ్బంది చూపిన నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది. అసలేమైందంటే... అంబర్పేట్ ప్రాంతానికి చెందిన కృష్ణ, అదే ప్రాం తంలో నివసించే ఓ మహిళ, మరికొందరు కలిసి కొన్నేళ్ల క్రితం సనత్నగర్ ప్రాంతంలో ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీని స్థాపించారు. ఇందులో కృష్ణ భార్య సునీత (44)తో పాటు మరికొందరూ డెరైక్టర్లుగా ఉన్నారు. సంస్థకు సంబంధించిన వివాదాలపై కంపెనీ లా బోర్డ్తో పాటు ఇతర చోట్లా భాగస్వాములపై కృష్ణ వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీంతో కక్షకట్టిన భాగస్వామ్య మహిళ తనకు మాజీ హోం మంత్రి సహా మరికొందరితో దగ్గరి బంధుత్వం ఉందని బెదిరించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 10న లావాదేవీలు సెటిల్ చేసుకున్న కృష్ణ కంపెనీ నుంచి పూర్తిగా తప్పుకున్నారు. అయినప్పటికీ తనపై వ్యాజ్యాలు దాఖలు చేశాడని ఆ మహిళ కృష్ణపై కక్ష పెంచుకుంది. తనకు పరిచయస్తుడైన జగన్నాథనాయుడిని రంగంలోకి దింపింది. ఆయన వివిధ ఠాణాల్లో పార్ట్టైమ్ రైటర్గా విధులు నిర్వర్తిస్తుంటాడు. అతడి సహకారంతో కృష్ణ మాజీ భాగస్వామి ఈ ఏడాది మార్చి 14న సనత్నగర్ ఠాణాకు చెందిన ఓ ఎస్సైతో పాటు మరికొందరు కానిస్టేబుళ్లనూ రంగంలోకి దింపింది. ఆ రోజు కృష్ణ ఇంటికి వెళ్లిన బృందం మూసాపేట్లో జరిగిన అనిల్ అనే వ్యక్తి హత్య కేసులో అనుమానితుడిగా ఆరోపిస్తూ సనత్నగర్ ఠాణాకు తీసుకువచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జగన్నాథనాయుడు కల్పించుకుంటూ మాజీ భాగస్వామి అయిన మహిళతో ఎందుకు స్పర్థలు పెంచుకున్నావంటూ కృష్ణను బెదిరించాడు. కొన్ని తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో కృష్ణను వదిలేశారు. దారుణంగా చంపేసి, ముక్కలుగా నరికేసి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కృష్ణ ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. ఇంతలో బీహార్లోని పాట్నాలో ఉద్యోగం రావడంతో కుటుంబాన్ని ఇక్కడే వదిలి, అక్కడికి వెళ్లిపోయారు. అదే సమయంలో జగన్నాథనాయుడు సహా మరికొందరు కృష్ణపై కక్ష తీర్చుకునేందుకు ఆయన భార్యకు హాని చేయాలని పథకం వేశారు. ఇదిలా ఉండగా... ఈ ఏడాది మార్చి 10న సైబరాబాద్ పోలీసులు ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడితో పాటు అతడి సెల్ఫోన్నూ సనత్నగర్ ఠాణాలో అప్పగించారు. రైటర్గా పని చేస్తున్న జగన్నాథనాయుడుఆ సెల్ఫోన్లోని సిమ్ను చేజిక్కించుకుని దాని ద్వారానే తన కుట్రను అమలు చేశాడు. సనత్నగర్ ఠాణా అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని సిమ్కార్డును దొరకబుచ్చుకున్నాడు. దాని ద్వారా ఏప్రిల్ 23 నుంచి సునీతతో సంప్రదింపులు జరుపుతూ ఆమెకు ఉచ్చు బిగించారు. గత నెల 16న మాయమాటలు చెప్పి ఇంటి నుంచి బయటకు రప్పించిన జగన్నాథనాయుడు బృందం ఆమెను కిడ్నాప్ చేశారు. తాను దూరంగా వెళ్లిపోతున్నానంటూ ఆమె సెల్ఫోన్ నుంచి భర్తతో పాటు మరికొందరికి ఎస్సెమ్మెస్లు పెట్టి ఫోన్ను అంబర్పేట్లోనే పడేశాడు. నేరుగా అత్తాపూర్లోని పిల్లర్ నెం.113 వద్దకు తీసుకువెళ్లి దారుణంగా హత్య చేసి ముక్కలుగా నరికేశారు. మృతదేహం ఎవరికీ దొరకకూడదనే ఉద్దేశంతో గోనె సంచుల్లో పెట్టి మూసీ నదిలో పడేశారు. తన భార్య సెల్ నుంచి వచ్చిన ఎస్సెమ్మెస్ చూసి కంగారుపడిన కృష్ణ అంబర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. బాధ్యత మరిచి హేళన చేసిన ఖాకీలు... ఓ పక్క తన భార్య కనిపించ డం లేదని ఆందోళనలో ఉన్న కృష్ణకు అంబర్పేట్ పోలీసుల నుంచి సహకారం లభించకపోగా, సూటిపోటి మాటలు, హేళనలు ఎదురయ్యాయి. పరిస్థితిని గమనించిన కృష్ణ అతి కష్టం మీద సనత్నగర్ ఠాణా నుంచి గల్లంతైన సిమ్కార్డు ద్వారానే తన భార్యతో దుండగులు సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అంబర్పేట్ పోలీసులకు తెలిపి, ఓ ఎస్సైతో కలిసి సనత్నగర్ ఠాణాకు వెళ్లి దీన్ని నిర్ధారించుకున్నారు. అయినా సరైన స్పందన లేకపోయింది. సనత్నగర్ ఠాణా సైబరాబాద్ పరిధిలోకి వస్తుందని తెలుసుకున్న ఆయన శుక్రవారం పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. కేసును మానవతా దృక్పథంతో పరిశీలించిన ఆయన పరిధుల విషయం పక్కనపెట్టి తక్షణం స్పందించారు. తమ సిబ్బందినే రంగంలోకి దింపి వివిధ కోణాల్లో దర్యాప్తు చేయించారు. ఈలోగా అంబర్పేట్ అధికారులూ కదిలారు. జగన్నాథనాయుడిని అనుమానించి బుధవారం అదుపులోకి తీసుకుని విచారించగా... నేరం అంగీకరించాడు. అత్తాపూర్ బ్రిడ్జి వద్దకు వచ్చిన అధికారులు మృతదేహం కోసం సాయంత్రం వరకు గాలించినా దొరకలేదు. చివరకు జగన్నాథనాయుడిని సంఘటనా స్థలానికి తీసుకువచ్చి వెతకగా... సునీత తల, మరికొన్ని భాగాల మినహా మృతదేహం దొరికింది. మృతదేహంలోని మిగిలిన ముక్కల కోసం గాలిస్తున్న పోలీసులు ఈ హత్యతో సంబంధం ఉన్న ఇతర నిందితుల కోసం వేట మొదలుపెట్టారు.అంతవరకూ బాగానే ఉంది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారోనని అందరూ చర్చించుకుంటున్నారు.