vivek ramaswamy
-
Vivek Ramaswamy: పాదరక్షలు లేకుండా ఇంటర్వ్యూ.. ట్రోలింగ్ బారిన వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇటీవల చెప్పులు లేకుండా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీటిని చూసిన కొందరు రామస్వామిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆయనను అమెరికన్ వ్యతిరేకి అని, మొరటువాడని వ్యాఖ్యానిస్తున్నారు. కొందరైతే వివేక్ రామస్వామికి మద్దతు పలుకుతున్నారు. గత ఏడాది వివేక్ రామస్వామి ఒక లైవ్ స్ట్రీమింగ్ రికార్డింగ్(Live streaming recording) సమయంలో చెప్పులు లేకుండా ఇంటర్యూలో పాల్గొన్నారు. ఈ రికార్డింగ్ వివేక్ రామస్వామి ఇంట్లో జరిగింది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతోంది. కొందరు ‘వివేక్ రామస్వామి ఎప్పటికీ ఒహియో గవర్నర్ కాలేరు’ అని వ్యాఖ్యానించగా, మరికొందరు ‘అమెరికాలో ఇది ఆమోదయోగ్యం కాదని’ అన్నారు. మరికొందరు ‘ఇంటర్వ్యూ సమయంలో వివేక్ కనీసం సాక్స్ అయినా ధరించి ఉండాల్సిందని’ పేర్కొన్నారు. మరొక యూజర్ ‘వివేక్ రామస్వామి విద్యాభివృద్ధిపై ఉపన్యాసాలు ఇస్తారని, అయితే ఇంటర్వ్యూలో చెప్పులు లేకుండా కనిపించారని, ఇది చాలా అసభ్యకరమైనదని’ వ్యాఖ్యానించారు.వివేక్ రామస్వామికి సోషల్ మీడియాలో మద్దతు పలికినవారు కూడా ఉన్నారు. భారతదేశంతో పాటు దక్షిణ, తూర్పు ఆసియాలో ఇంట్లో పాదరక్షలు(Footwear) తొలగించడం సర్వసాధారణమని కొందరు కామెంట్ బాక్స్లో రాశారు. దాదాపు భారతీయులంతా తమ ఇళ్లలో చెప్పులు లేకుండా ఉంటారని ఒక యూజర్ పేర్కొన్నారు. ఇందులో తప్పేమీ లేదని, ఇది అక్కడి సంస్కృతిలో భాగమని పేర్కొన్నవారు కూడా ఉన్నారు. అయితే వివేక్ రామస్వామి ఈ చర్చకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.ఇది కూడా చదవండి: చెఫ్ అవతారంలో సోనూసూద్.. దోశ రేటు రెట్టింపు చేసి.. -
గవర్నర్ రేసు..వివేక్ రామస్వామికి ట్రంప్ మద్దతు
వాషింగ్టన్:భారత సంతతికి చెందిన బయోటెక్ బిలియనీర్ వివేక్రామస్వామిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయనను ఒహియో గవర్నర్ అభ్యర్థిగా బలపరుస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో వివేక్ను కొనియాడుతూ పోస్టు చేశారు. ‘గొప్ప రాష్ట్రమైన ఒహియో గవర్నర్ పదవికి వివేక్ రామస్వామి పోటీలో ఉన్నారు. నాకు వివేక్ బాగా తెలుసు. అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అధ్యక్ష అభ్యర్థిగా నాతో పోటీ పడ్డాడు. అమెరికాను ప్రేమించే వ్యక్తి వివేక్. అతడు ఒహియోకు గొప్ప గవర్నర్ అవుతాడు. వివేక్కు నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా’అని ట్రంప్ తన ట్వీట్లో పేర్కొన్నారు. VIVEK RAMASWAMY is running for Governor of the Great State of Ohio. I know him well, competed against him, and he is something SPECIAL. He’s Young, Strong, and Smart! Vivek is also a very good person, who truly loves our Country. He will be a GREAT Governor of Ohio, will never…— Donald J. Trump Posts From His Truth Social (@TrumpDailyPosts) February 25, 2025వచ్చే ఏడాది జరగనున్న ఒహియో గవర్నర్ ఎన్నికల కోసం వివేక్ రామస్వామి సోమవారం సిన్సినాటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిలియనీర్ ఇలాన్ మస్క్ కూడా వివేక్కు మద్దతు ప్రకటించి గుడ్లక్ చెప్పడం విశేషం. అయితే వివేక్ ఒహియో గవర్నర్గా రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయాలంటే ముందు పార్టీ ప్రైమీరీల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ప్రైమరీల్లో వివేక్తో ఇద్దరు రిపబ్లికన్ నేతలు పోటీ పడుతున్నారు. Thank you Elon. Let’s roll! https://t.co/2QDheoUSVj— Vivek Ramaswamy (@VivekGRamaswamy) February 25, 2025 -
మస్క్తో విభేదాలు..? వివేక్ రామస్వామి క్లారిటీ
వాషింగ్టన్:టెస్లా అధినేత ఇలాన్ మస్క్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని భారతీయ సంతతికి చెందిన అమెరికా వ్యాపారవేత్త వివేక్రామస్వామి క్లారిటీ ఇచ్చారు. ట్రంప్ ప్రమాణస్వీకారం రోజే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీఓజీఈ) బాధ్యతల నుంచి తప్పుకోవడంపై రామస్వామి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తాజాగా స్పందించారు. మస్క్కు సాంకేతికతను ఎక్కువగా నమ్ముతాడని తాను రాజ్యాంగం మీద ఆధారపడి నడిచే శాసనవ్యవస్థను ఎక్కువగా నమ్ముతానని చెప్పారు. ఇంతేతప్ప ఇద్దరి మధ్య విభేదాలు ఏమీ లేవన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకే డీఓజీఈ బాధ్యత నుంచి తప్పుకున్నారా అన్న ప్రశ్నకు లేదని వివేక్ సమాధానమిచ్చారు. అయితే 2026లో జరగనున్న ఒహియో గవర్నర్ ఎన్నికల్లో వివేక్ రామస్వామి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే ఒక ప్రకటన చేస్తానని వివేక్ చెప్పారు. డీఓజీఈ బాధ్యతలను రామస్వామి,మస్క్లకు సంయుక్తంగా ట్రంప్ ఇటీవలే అప్పగించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను రామస్వామి ప్రశంసించారు.కాగా, వివేక్ రామస్వామి అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికవడం కోసం రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్తో తలపడ్డ విషయం తెలిసిందే.ఆ తర్వాత రామస్వామి ప్రైమరీల నుంచి తప్పుకుని ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతిచ్చారు. -
ట్రంప్ ఇచ్చిన బాధ్యతల నుంచి వైదొలగిన వివేక్ రామస్వామి.. కారణం?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణం వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి భారత అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) తప్పుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విషయాన్ని వెల్లడించారు. ఇందుకు కారణం మాత్రం వెల్లడించలేదు.భారత సంతతి వివేక్ రామస్వామి కీలక ప్రకటన చేశారు. ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్టు తెలిపారు. అయితే, ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ఎలాన్ మస్క్తోపాటు వివేక్ రామస్వామిని ఈ బాధ్యతల్లో నియమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఒహైయో గవర్నర్గా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వివేక్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్బంగా వివేక్ రామస్వామి.. డోజ్ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. ప్రభుత్వాన్ని క్రమబద్ధీకరించడంలో ఎలాన్ మస్క్ బృందం విజయం సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఒహియోలో నా భవిష్యత్ ప్రణాళికల గురించి త్వరలో నేను మరిన్ని చెప్పాలి. ముఖ్యంగా, అధ్యక్షుడు ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన నిర్ణయం ఆసక్తికరంగా మారింది.It was my honor to help support the creation of DOGE. I’m confident that Elon & team will succeed in streamlining government. I’ll have more to say very soon about my future plans in Ohio. Most importantly, we’re all-in to help President Trump make America great again! 🇺🇸 https://t.co/f1YFZm8X13— Vivek Ramaswamy (@VivekGRamaswamy) January 20, 2025ఇదిలా ఉండగా.. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలిరోజే దాదాపు 100కుపైగా కార్యనిర్వాహక ఆదేశాల (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల)పై సంతకాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి చేతిలో అత్యంత శక్తిమంతమైన సాధనంగా పేర్కొనే ఈ ఆదేశాల ప్రాధాన్యం, వాటి అమలు గురించిన అంశాలను పరిశీలిస్తే.. అమెరికా చట్టసభ ఆమోదం లేకుండా సమాఖ్య ప్రభుత్వానికి అధ్యక్షుడు జారీ చేసే లిఖితపూర్వక ఆదేశాలనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు. ప్రభుత్వ విధానాలకు సంబంధించి అధ్యక్షుడు తీసుకునే కీలక నిర్ణయాలు ఇందులో ఉంటాయి.కేంద్ర సంస్థలకు ఆదేశాలు ఇవ్వడం లేదా నివేదికలను కోరడం వంటివి ఉండవచ్చు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఈ ఆదేశాలు జారీచేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఆ దేశాలకు చట్టబద్ధత ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను తిరస్కరించేందుకు చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం కాంగ్రెస్కు ఉన్నప్పటికీ.. దానిపై వీటో అధికారం మాత్రం అధ్యక్షుడిదే. అందుకే కాంగ్రెస్ ఆమోదించలేని అంశాలను తమ అజెండాలో అధ్యక్షుడు పెట్టుకుంటారు. చట్టసభ ఆమోదం లేకుండా జారీచేసే అధికారం అధ్యక్షుడికి ఉన్నా.. వీటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆదేశాలను వ్యతిరేకించ లేనప్పటికీ.. ఆ నిర్ణయాలకు అవసరమైన నిధులు ఇవ్వకుండా అడ్డుకోవడం లేదా ఇతర అడ్డంకులు సృష్టించడం ద్వారా వీటి అమలుకు ‘కాంగ్రెస్’ ఆటంకం కలిగించే వీలుంది. మునుపటి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయడానికి ఈ ఎగ్జిక్యూటివ్ను కొత్త అధ్యక్షుడు ఉపయోగించే అవకాశం ఉంది. -
స్మార్ట్ పీపుల్ కావాలి
వాషింగ్టన్: స్థానిక అమెరికన్లకే అధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న రిపబ్లికన్ల ఎన్నికల హామీకి విరుద్ధంగా విదేశీయులకు హెచ్–1బీ వీసాల జారీని ప్రపంచ కుబేరుడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ సహ సారథి వివేక్ రామస్వామి సమర్థిస్తున్న వేళ కాబోయే అమెరికా అధ్యక్షుడు మరోసారి హెచ్–1బీ వీసాలను సమర్థించారు. అమెరికాకు ఎల్లప్పుడూ కేవలం సమర్థవంతులైన వ్యక్తులే అవసరమని ట్రంప్ నొక్కి చెప్పారు. ‘‘ అమెరికాకు ఎల్లప్పుడూ సమర్థవంతులైన వ్యక్తులే కావాలని నేను ఆశిస్తా. స్మార్ట్ జనం మాత్రమే అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలి. గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో ఉద్యోగ కల్పన జరగ బోతోంది. దేశానికి నైపుణ్యవంతమైన కార్మికుల అవసరం చాలా ఉంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బుధవారం అమెరికాలోని మార్–ఏ–లాగో రిసార్ట్లో ట్రంప్ను స్థానిక మీడియా పలకరించింది. ‘‘హెచ్–1బీ వీసాలపై నా అభిప్రాయం ఎన్నటికీ మారదు. నిఫుణులే అమెరికాకు కావాలి’’ అని స్పష్టంచేశారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీకి సంయుక్త సారథులుగా నియమితులైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి హెచ్–1బీ వీసాల జారీని సమర్థిస్తూ వ్యాఖ్యానించడం, వారికి ఇప్పటికే ట్రంప్ మద్దతు పలకడం తెల్సిందే. అయితే అమెరికన్లకే తొలి ప్రాధాన్యం అంటూ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన ట్రంప్ ఇప్పుడు మాట మార్చారని అమెరికన్ మీడియా చేస్తున్న వాదనలను ట్రంప్ తోసిపుచ్చారు. మొదట్నుంచీ తాను హెచ్–1బీకి అనుకూలమేనని పునరుద్ఘాటించారు. కేవలం అత్యంత నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకే ఉపాధి కల్పిస్తూ స్థానిక సాధారణ, తక్కువ నైపుణ్యమున్న అమెరికన్లకు సరైన ఉద్యోగాలు దక్కకపోతే ఆగ్రహావేశాలు భవిష్యత్తులో పెరిగే ప్రమాదముందని రాజకీయ పండితుడు క్రేగ్ ఆగ్రనోఫ్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ఐటీ రంగంలో ముఖ్యమైన ఉద్యోగాలన్నీ హెచ్–1బీ వీసాదారులకే తన్నుకు పోతే స్థానిక ఐటీ ఉద్యోగార్థుల పరిస్థితి ఏంటి?’ అనే ప్రశ్నకు ఇంతకాలం ఏ నేతా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని క్రేగ్ వ్యాఖ్యానించారు. స్థానిక అమెరికన్లతో పోలిస్తే తక్కువ వేతనాలకే ఎక్కువ నైపుణ్యాలున్న విదేశీయులు లభిస్తుండటంతో అమెరికన్ కంపెనీలు హెచ్–1బీ వీసా విధానం ద్వారా విదేశీయులకే అధిక ప్రాధాన్యతనిచ్చి అమెరికాకు రప్పిస్తుండటం తెల్సిందే. -
హెచ్1బీ వీసా రగడలో అనూహ్య పరిణామాలు!
హెచ్–1బీ వీసాలపై రగడలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటికి అనుకూలంగా మాట్లాడడం.. ఆయన మద్దతుదారుల్ని షాక్కు గురి చేసింది. అదే సమయంలో.. టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్(Elon Musk) కాస్త మెత్తబడ్డారు. హెచ్–1బీ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని ప్రకటించిన ఆయన.. ఇప్పుడు స్వరం మార్చారు. ఈ పాలసీలో భారీ సంస్కరణలు అవసరం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసుకొనేందుకు అవకాశం కల్పించేవే హెచ్–1బీ(H1B) వీసాలు. అయితే.. ఈ వీసా వ్యవస్థ సజావుగా నడవడం లేదని.. దానికి భారీ సంస్కరణలు అవసరమని తాజాగా ఇలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్లో ఓ వ్యక్తి చేసిన పోస్టుకు ఆయన బదులిచ్చారు.Easily fixed by raising the minimum salary significantly and adding a yearly cost for maintaining the H1B, making it materially more expensive to hire from overseas than domestically. I’ve been very clear that the program is broken and needs major reform.— Elon Musk (@elonmusk) December 29, 2024హెచ్–1బీ వీసా మీద సౌతాఫ్రికా నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు ఇలాన్ మస్క్. అయితే ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)కు సంయుక్త సారథులుగా ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ని నియమించారు. అయితే.. అమెరికా ఫస్ట్ అమలుకు ట్రంప్ ఏరికోరి నియమించిన ఈ ఇద్దరే బీ1 వీసా విధానానికి మద్దతు ప్రకటించడం.. ట్రంప్ మద్దతుదారులకు ఏమాత్రం సహించడం లేదు. దీనికి తోడు.. 👉తాజాగా.. వైట్హౌస్ ఏఐ సీనియర్ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్ వెంచర్క్యాలిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్ను ట్రంప్ ఇటీవల నియమించారు. అయితే నిపుణులైన వలసదార్ల కోసం గ్రీన్కార్డులపై పరిమితి తొలగించాలని కృష్ణన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని రిపబ్లికన్ నేతలు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై రగడ మొదలైంది.👉మరోవైపు నెట్టింట జోరుగా చర్చ నడిచింది. అయితే హెచ్–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకోవాలని వాటి వ్యతిరేకులకు ఇలాన్ మస్క్ సూచిస్తూ వస్తున్నారు. ‘‘నాతోపాటు ఎంతోమంది అమెరికాకు రావడానికి, స్పేస్ఎక్స్, టెస్టా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికొచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకున్నాం. హెచ్–1బీ వీసాలతోనే అమెరికా బలమైన దేశంగా మారింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖుపు చర్య. దాన్ని నేను ఖండిస్తున్నా.👉ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నా’’అని మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. కౌంటర్గా కొందరు వ్యతిరేక పోస్టులు పెట్టారు. ఒకానొక టైంలో సహనం నటించిన మస్క్.. బూతు పదజాలం ప్రయోగించిన సందేశం ఉంచారు.👉ఇక.. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే.. విదేశాల నుంచి వలసలు తగ్గిస్తానని.. అమెరికాను మరోమారు గొప్ప దేశంగా తయారు చేస్తానని(Make America Great Again) తన ప్రచారంలో ట్రంప్ ప్రకటించారు. విదేశీయులకు వీసాలు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నట్లు అప్పుడు సంకేతాలిచ్చారు. కానీ, ఇప్పుడు ఆయన తన అభిప్రాయం మార్చుకున్నారు. ‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించడం ఇటు డెమోక్రాట్లలో.. అటు రిపబ్లికన్లలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. -
Laura Loomer: భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు
లారా లూమర్.. సోషల్ మీడియాలో ఈవిడ చేస్తున్న క్యాంపెయిన్ గురించి తెలిస్తే సగటు భారతీయుడికి రక్తం మరిగిపోవడం ఖాయం. అమెరికా ఉద్యోగాల్లో సొంత మేధోసంపత్తికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్న ఈ అతి మితవాద ఇన్ఫ్లుయెన్సర్.. భారతీయులపై మాత్రం తీవ్ర అక్కసు వెల్లగక్కుతోంది. ఈ క్రమంలో చీప్ లేబర్ అంటూ భారతీయులను, ఇక్కడి పరిస్థితులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేసింది.కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్ను కృత్రిమ మేధ (ఏఐ) రంగ సలహాదారుగా నియమించారు. అయితే ఈ నియామకాన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారతీయులను ఉద్దేశించి లారా లూమర్ వివాదాస్పద పోస్టులు చేశారు. అమెరికా ఫస్ట్ నినాదానికి శ్రీరామ్ కృష్ణన్ ద్రోహం చేస్తున్నాడని, గ్రీన్కార్డుల విషయంలో అతని వైఖరి భారత్లాంటి దేశాలకు మేలు చేసేలా ఉంటుందని.. తద్వారా అమెరికాలోని STEM(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) గ్రాడ్యుయేట్స్కు గడ్డు పరిస్థితులు తప్పవని చెబుతోందామె. అదే టైంలో..హెచ్1బీ వీసాల విషయంలోభారతీయులపై వివక్షాపూరితంగా ఆమె చేసిన పోస్టులు దుమారం రేపుతున్నాయి. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి, ఉషా వాన్స్లాంటి వాళ్లు అమెరికా ఫస్ట్ నినాదానికి కట్టుబడి ఉండాలని ఆమె కోరుతున్నారు. ‘‘నేను ఓటేసింది అమెరికాను మరోసారి గొప్పగా తయారు చేస్తారని. అందుకోసం హెచ్1బీ వీసాలను తగ్గిస్తారని.అంతేగానీ పెంచుకుంటూ పోతారని కాదు. భారత్లో అంత మేధోసంపత్తి ఉంటే అక్కడే ఉండిపోవచ్చు కదా.అమెరికాకు వలస రావడం దేనికి?. అంత హైస్కిల్ సొసైటీ అయితే.. ఇలా చెత్తకుప్పలా ఎందుకు తగలడుతుంది?( తాను పోస్ట్ చేసిన ఓ ఫొటోను ఉద్దేశిస్తూ..)..@VivekGRamaswamy knows that the Great Replacement is real. So does @JDVance. It’s not racist against Indians to want the original MAGA policies I voted for. I voted for a reduction in H1B visas. Not an extension. And I would happily say it to their face because there’s nothing… https://t.co/vO2e33USE1 pic.twitter.com/EH4hpJxiNH— Laura Loomer (@LauraLoomer) December 24, 2024మీకు భారతీయుల్లాంటి చీప్ లేబర్ కావాలనే కదా వీసా పాలసీలను మార్చేయాలనుకుంటున్నారు. ఆ విషయం మీరు ఒప్పుకుంటే.. నేనూ రేసిస్ట్ అనే విషయాన్ని అంగీకరిస్తా. మీలాంటి ఆక్రమణదారులు నిజమైన ట్రంప్ అనుచరుల నోళ్లు మూయించాలనుకుంటారు. కానీ, ఏం జరిగినా నేను ప్రశ్నించడం ఆపను. అసలు మీకు అమెరికాను మరోసారి గొప్పగా నిలబెట్టాలనే(Make America Great Again) ఉద్దేశమూ లేదు. ఈ విషయంలో నన్ను ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు’’ అని తీవ్ర స్థాయిలో సందేశాలు ఉంచారు. ఇంతకు ముందు.. భారత సంతతికి చెందిన కమలా హారిస్ పోటీ చేసినప్పుడు కూడా లారా లూమర్ ఈ తరహాలోనే జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ను లక్ష్యంగా చేసుకుని..టెక్ బిలియనీర్లు మార్ ఏ లాగో(ట్రంప్ నివాసం)లో ఎక్కువసేపు గడుపుతూ.. తమ చెక్ బుక్లను విసిరేస్తున్నారు. అలాంటివాళ్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీలను తిరగరాయాలనుకుంటున్నారు. తద్వారా.. భారత్, చైనా లాంటి దేశాల నుంచి అపరిమితంగా బానిస కూలీలు రప్పించుకోవచ్చనేది వాళ్ల ఆలోచన అయి ఉండొచ్చు అంటూ ఆ పోస్టులోనే ఆమె ప్రస్తావించారు.Quite the change of tune. Wonder if he got “the call”. pic.twitter.com/o1Gp8dNYyo— Laura Loomer (@LauraLoomer) December 28, 2024కాంట్రవర్సీలకు జేజేమ్మ!31ఏళ్ల వయసున్న లారా ఎలిజబెత్ లూమర్.. పోలిటికల్ యాక్టివిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, జర్నలిస్ట్ కూడా. మొదటి నుంచి ఈమె శైలి వివాదాస్పదమే. గతంలో అక్కడి ప్రత్యక్ష ఎన్నికల్లో పలుమార్లు పోటీ చేసి ఓడారామె. ఆపై కొన్ని క్యాంపెయిన్లను ముందుండి నడిపించారు. తాను ఇస్లాం వ్యతిరేకినంటూ బహిరంగంగా ప్రకటించి.. ఆ మతంపై చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలూ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు.. తన ద్వేషపూరితమైన పోస్టుల కారణంగా సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ఫామ్లు, పేమెంట్స్ యాప్స్, ఆఖరికి ఫుడ్ డెలివరీ యాప్లు కూడా ఆమెపై కొంతకాలం నిషేధం విధించాయి.కిందటి ఏడాది ఏప్రిల్లో ఆమెను ఎన్నికల ప్రచారకర్తగా నియమించుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. అయితే.. రిపబ్లికన్లు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. అధ్యక్ష రేసు బైడెన్ తప్పుకున్న తర్వాత అదే రిపబ్లికన్లు ట్రంప్ను ప్రొత్సహించి లూమర్ను ప్రచారకర్తగా నియమించారు. ఆ టైంలో ట్రంప్తో ఆమెకు అఫైర్ ఉన్నట్లు కథనాలు రాగా.. ఆమె వాటిని ఖండించారు. ఒకరకంగా చూసుకుంటే.. మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో ఈమెకు కూడా కొంత క్రెడిట్ ఇవ్వొచ్చు. అలాంటి లూమర్ ఇప్పుడు.. ట్రంప్ పాలనలో కీలకంగా మారబోతున్న ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలను తీవ్రంగా విమర్శిస్తోంది. మస్క్ సొంత ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగానే ఆమె తీవ్ర పదజాలంతో సందేశాలు పోస్ట్ చేస్తుండడం గమనార్హం. ‘‘ఎలాన్ మస్క్కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషీయెన్సీ(DOGE) బాధ్యతలు అప్పగించడం సుద్ధ దండగ. అతనొక స్వార్థపరుడు. మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్(MAGA) పేరుతో ఇమ్మిగ్రేషన్ పాలసీలలో తలదూర్చాలనుకుంటున్నాడు. తద్వారా అమెరికన్ వర్కర్లకు హాని చేయాలనుకుంటున్నాడు. వివేక్ రామస్వామి చేస్తున్న క్యాంపెయిన్ ఎందుకూ పనికి రానిది. రిపబ్లికన్లు అతిత్వరలో వీళ్లను తరిమికొట్టడం ఖాయం. మస్క్, రామస్వామిలు ట్రంప్కు దూరం అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు’’ అని విమర్శించిందామె. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ ఆమెపై వెటకారంగా ఓ పోస్ట్ చేసి వదిలేశాడు..@VivekGRamaswamyThe technocratic state is more dangerous than the administrative state.Your silence on the censorship of those who wanted to put a limit on the power of big tech is deafening.DOGE can’t be allowed to be utilized as a vanity project to enrich Silicon Valley. https://t.co/81EYNTLkqx— Laura Loomer (@LauraLoomer) December 27, 2024అయితే.. మస్క్ తేలికగా తీసుకుంటున్నా లూమర్ మాత్రం తన విమర్శల దాడిని ఆపడం లేదు. మస్క్ పచ్చి స్వార్థపరుడని, చైనా చేతిలో పావు అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. మార్ ఏ లాగో(ట్రంప్ నివాసం)లో మస్క్ ఎక్కువసేపు గడుపుతున్నాడని.. తనకు లాభం వచ్చే పనులు ట్రంప్తో చేయించుకునేందుకు ప్లాన్లు వేసుకుంటున్నాడని, తన స్నేహితుడు జీ జిన్పింగ్(చైనా అధ్యక్షుడు) కోసమే ఆరాటపడుతున్నాడంటూ తిట్టిపోసింది.ఎగిరిపోయిన బ్లూ టిక్.. మరో చర్చతప్పుడు సమాచారం, విద్వేషపూరిత సందేశాలు పోస్ట్ చేస్తోందన్న కారణాలతో.. గతంలో లారా లూమర్(Laura Loomer) ట్విటర్ అకౌంట్పైనా నిషేధం విధించారు. అయితే ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలుచేసిన కొన్నాళ్లకే..ఫ్రీ స్పీచ్ పేరిట చాలా మంది అకౌంట్లు పునరుద్ధరణ అయ్యాయి. అందులో ట్రంప్ అకౌంట్ కూడా ఉందన్నది తెలిసిందే. I mean right after @elonmusk called me a troll today, my account verification was taken away, my subscriptions were deactivated and I was banned from being able to buy premium even though I was already paying for premium.Clearly retaliation. https://t.co/fVskKH9Trg— Laura Loomer (@LauraLoomer) December 27, 2024అయితే తాజాగా లారా ఎలిజబెత్ లూమర్ హెచ్1బీ వీసాల వ్యవహారంతో ఎలాన్ మస్క్నే టార్గెట్ చేయడంపై.. ఆమెపై ఎక్స్(పూర్వపు ట్విటర్) చర్యలకు ఉపక్రమించింది. ఆమె అకౌంట్ నుంచి బ్లూ టిక్ ఎగిరిపోవడంతో పాటు ఓ వార్నింగ్ కూడా ఇచ్చింది.ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె మరో పోస్ట్ చేశారు. ట్విటర్(ఇప్పుడు ఎక్స్) కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటినుంచి వాక్ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతోన్న మస్క్.. ఇప్పుడు తోక ముడిచారా? అని ఆమె ప్రశ్నించారు. -
అమెరికన్లు పిల్లల్ని తప్పుడు మార్గంలో పెంచుతున్నారు: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: భారత్ వంటి దేశాల నుంచి నిపుణులైన సిబ్బందిని నియమించుకోవడాన్ని పూర్తిగా ఆపేయాలంటూ మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) వేదిక మళ్లీ డిమాండ్ చేస్తున్న వేళ.. భారతీయ అమెరికన్ వ్యాపార వేత్త, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. అమెరికా అధ్యక్షుడిగా మరికొద్ది రోజుల్లో పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ భారతీయ అమెరికన్ వెంచర్ కేపిటలిస్ట్ శ్రీరాం కృష్ణన్ను కృత్రిమ మేథ సీనియర్ విధాన సలహాదారుగా ఇటీవల నియమించడం తెలిసిందే. ఈ నియామకంపై మాగా వేదిక విమర్శలు గుప్పిస్తోంది. ఇలాంటి చర్యలు అమెరికా ఫస్ట్ లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తాయని అంటోంది. ఇమిగ్రేషన్ విధానాల వల్లే అమెరికన్లకు అవకాశాల్లేకుండా పోతున్నాయని మరి కొందరు వాదిస్తున్నారు. అయితే, వివేక్ రామస్వామి మరో కోణంలో చేస్తున్న వాదించారు. అసలు సమస్య ఇమిగ్రేషన్ విధానాల్లో లేదని, అమెరికా సంస్కృతిలో పిల్లల పెంపకంలో లోపమే కారణమంటూ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. అమెరికన్ యువతలో సహజంగానే నైపుణ్యం ఉందని, అయితే దానిని పెంపొందించడంలో వ్యవస్థాగతంగా విఫలమైందన్నారు. గణిత మేధావులు, ఉన్నత విద్యావంతులను వదిలేసి అలంకార పదవుల్లో ఉన్న వారిని పొగుడుతుండటమనే సంస్కృతే ఇందుకు కారణమన్నారు. అదే సమయంలో, వలసదారుల కుటుంబాలు తమ పిల్లలను విద్యారంగంలో నిష్ణాతులుగా మార్చి, క్రమశిక్షణతో పెంచుతున్నాయని తెలిపారు. సామాజిక కార్యక్రమాలు, టీవీ వీక్షణం వంటివాటిపైనా ఆంక్షలు పెడుతుంటాయన్నారు. ఫలితంగా ఈ కుటుంబాల నుంచి నాయకులు తయారవడం మామూలేనన్నారు. ఈ వ్యాఖ్యలపై మాగా వేదిక భగ్గుమంది. వలసదారులకు, హెచ్–1బీ వీసాదారులకు అనుకూలంగా మాట్లాడుతున్నారంటూ వివేక్ రామస్వామిపై ఎదురుదాడికి దిగింది. -
పాక్ హోటల్కు రూ.1,860 కోట్ల చెల్లింపు.. అమెరికా ప్రభుత్వంపై వివేక్ ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికాలో పాకిస్థాన్ ప్రభుత్వ ఆధీనంలో ఓ 19 అంతస్తుల హోటల్ ఉంది. ఆ హోటల్కు అమెరికా ప్రభుత్వం అద్దె రూపంలో ఏకంగా 220 మిలియన్ డాలర్లు చెల్లిస్తుంది. ఈ చెల్లింపులపై రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వలస దారులు మన దేశంలో విడిది చేసేందుకు.. మనమే వాళ్లకి వసతి కల్పిస్తున్నాం. అందుకు డబ్బులు కూడా మనమే చెల్లిస్తున్నాం. ఇది ఆమోద యోగ్యం కాదని అన్నారు.ప్రస్తుతం, న్యూయార్క్ నగరం మాన్హాటన్లో పాక్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రూజ్వెల్ట్ హోటల్ గురించి రచయిత జాన్ లెఫెవ్రే ఎక్స్ వేదికగా ప్రస్తావించారు.A taxpayer-funded hotel for illegal migrants is owned by the Pakistani government which means NYC taxpayers are effectively paying a foreign government to house illegals in our own country. This is nuts. https://t.co/Oy4Z9qoX45— Vivek Ramaswamy (@VivekGRamaswamy) December 1, 2024 ఆ పోస్ట్లో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఆధీనంలో ఉన్న రూజ్వెల్ట్ హోటల్కు న్యూయార్క్ నగర పాలక సంస్థ అద్దె రూపంలో పాకిస్థాన్ ప్రభుత్వానికి 220 మిలియన్లు (రూ.1860.40 కోట్లు) చెల్లిస్తోంది. ఉదాహరణకు.. న్యూయార్క్కు వలసదారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. పాకిస్థాన్ పౌరులు న్యూయార్క్కు వస్తుంటారు. వచ్చిన వాళ్లు వీసా,జాబ్ రకరకలా సమస్యల వల్ల అక్కడే ఉండాల్సి ఉంది..ఇమ్మిగ్రేషన్ సమస్య ఉంటే అమెరికా వదిలి వారి సొంత దేశం పాకిస్థాన్కు వెళ్లేందుకు వీలు లేదు.మరి అలాంటి వారు ఎక్కడ ఉంటారు.ఈ సమస్యకు పరిష్కార మార్గంగా మాన్హాటన్లో పాకిస్థాన్ ప్రభుత్వ ఎయిలైన్స్కు చెందిన రూజ్వెల్ట్ హోటల్ను అమెరికా ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. ఇమ్మిగ్రేషన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్ పౌరులకు ఆ హోటల్లో వసతి కల్పిస్తుంది. హోటల్ను అద్దెకు తీసుకున్నందుకు రూ.1860.40 కోట్లు చెల్లిస్తుంది.ఈ అంశంపై వివేక్ రామస్వామి స్పందిస్తూ.. ‘మన దేశ ట్యాక్స్ పేయర్లు అక్రమ వలస దారులు బస చేసేందుకు హోటల్ను ఏర్పాటు చేశారు. ఆ హోటల్కూ అద్దె చెల్లించడం విడ్డూరంగా ఉంది’ అని పేర్కొన్నారు.అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్ రూస్వెల్ట్ పేరుతో ఉన్న ఈ 19 అంతస్తుల భవనంలో మొత్తం 1200 గదులున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారానికి కేంద్రంగా మారుతోందని రచయిత జాన్ లెఫెవ్రే ఆందోళన వ్యక్తం చేశారు. -
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల మెడపై వేలాడుతున్న ‘లే ఆఫ్’ కత్తి!
వాషింగ్టన్ : డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) సంయుక్త సారథులు బిలియనీర్ ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి అమెరికాలోని 20 లక్షల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇకపై వారానికి ఐదురోజులు ఆఫీస్కు రావాల్సిందేనని హెచ్చరికలు జారీ చేయనున్నారు. కాదు కూడదు అంటే అంటే వారిని తొలగించే దిశగా అడుగులు వేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెలుగులోకి వచ్చింది.అమెరికా ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చుల్ని తగ్గించాలని ట్రంప్ ఆదేశాలతో మస్క్, వివేక్ రామస్వామిలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని రద్దు చేయనున్నారు. వారానికి ఐదురోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేసేలా ఆదేశించనున్నారు.ఒకవేళ ఆఫీస్ నుంచి పనిచేయడాన్ని వ్యతిరేకించే ప్రభుత్వ ఉద్యోగులకు.. కోవిడ్-19 సమయంలో అమెరిన్ ట్యాక్స్ పేయర్స్ చెల్లించిన ప్రత్యేక చెల్లింపుల్ని నిలిపివేయనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.ఇటీవల,వివేక్ రామస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న భారీ దుబారా ఖర్చుల్ని తగ్గించే పనిలో ఉన్నాం. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులతో బలవంతంగా రాజీనామా చేయించి వారి సంఖ్యను భారీగా తగ్గిస్తాం. దుబారా ఖర్చుల్ని తగ్గిస్తాం. తాము సైతం డోజ్లో ఫెడరల్ అధికారులు,ఉద్యోగులులా కాకుండా వాలంటీర్లుగా పనిచేస్తామని తెలిపారు. మీకు మస్క్ గురించి తెలుసో,లేదో.. ఆయన ఉలి తీసుకురాలేదు. రంపం తెచ్చారు. మేం దాన్ని బ్యూరోక్రసీపై వాడాలనుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ హైలెట్ చేసింది.కాగా,అమెరికాలోని ప్రముఖ ఎన్జీవో సంస్థ పార్ట్నర్షిప్ ఫర్ పబ్లిక్ సర్వీస్ నివేదిక ప్రకారం.. అమెరికాలో మొత్తం 20లక్షలమంది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులున్నారు. 400పైగా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం మంది అమెరికా రాజధాని వాషింగ్టన్లో పనిచేస్తున్నారు. -
ఉద్యోగాలపై బాంబు పేల్చిన వివేక్ రామస్వామి.. భారీగా కోతలు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం అందుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్కు కీలక బాధ్యతలను అప్పగించారు. ఇక, బాధ్యతల్లో చేరకముందే వివేక్ రామస్వామి పెద్ద బాంబ్ పేల్చారు. ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని హింట్ ఇచ్చారు.ఇటీవల ఫ్లోరిడాలోని ట్రంప్ ఎస్టేట్ మారలాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో వివేక్ రామస్వామి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘లక్షల మంది ఫెడరల్ బ్యూరోక్రాట్లను బ్యూరోక్రసీ నుంచి సామూహికంగా తొలగించే స్థాయిలో నేను, ఎలాన్మస్క్ ఉన్నాం. అలా ఈ దేశాన్ని మేం కాపాడాలనుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఇక, ముందు నుంచి డొనాల్డ్ ట్రంప్.. అమెరికా ఫస్ట్ అనే నినాదం చేస్తున్న విషయం తెలిసిందే. Vivek Ramaswamy on a mission.#MAGA pic.twitter.com/wYivstPqDV— TheTrumpestFuture (@trumpestfuture) November 16, 2024 -
వివేక్ రామస్వామి 21 ఏళ్ల నాటి వీడియో వైరల్
వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) బాధ్యతల్ని అప్పగించారు. ఈ తరుణంలో నాడు విద్యార్థిగా ఉన్న వివేక్ రామస్వామి బ్యూరోక్రసీని వ్యతిరేకిస్తూ ప్రసంగించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.2003లో 18 ఏళ్ల రామస్వామి ఒహాయోలోని సెయింట్ జేవియర్ స్కూల్లో తన జర్నీని ఉద్దేశించి మాట్లాడారు. ఆ ప్రసంగం ఇప్పుడు వైరల్ కావడంపై వివేక్ స్పందించారు. విద్యార్థిగా ఉన్న తాను బ్యూరోక్రసీని వ్యతిరేకించాను అని నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశారు. ప్రస్తుతం తాను అనుసరిస్తోన్న భావజాలం ఆనాటి నుంచే ఉందనే ఉద్దేశంలో రాసుకొచ్చారు.కాగా, ఒహియోలోని సిన్సినాటిలో పుట్టి పెరిగిన రామస్వామి జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు. అతని హైస్కూల్ వాలెడిక్టోరియన్. హార్వర్డ్ నుంచి బయోలజీలో గ్రాడ్యుయేషన్ యేల్ లా స్కూల్లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. Vivek Ramaswamy, 18 years old. his High School Graduation Speech of 2003. pic.twitter.com/sG4kGLbqtL— Brian Roemmele (@BrianRoemmele) November 13, 2024 -
ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనకో శాఖ..సారథులుగా మస్క్, వివేక్
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత మూలాలున్న రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. యంత్రాంగంలో సమూల ప్రక్షాళన కోసం వారి సారథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) ఏర్పాటును ప్రకటించారు. ‘‘ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళన, మితిమీరిన నిబంధనలకు కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్ వ్యవస్థీకరణ తదితరాలను ఈ శాఖ పర్యవేక్షించనుంది. ఇందుకు ‘ది గ్రేట్’ మస్క్, ‘అమెరికా దేశభక్తుడు’ వివేక్ నాయకత్వం వహిస్తారు. తమ అమూల్య సలహాలతో సేవ్ అమెరికా ఉద్యమానికి మార్గదర్శనం చేస్తారు’’ అని పేర్కొన్నారు. అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు 250 ఏళ్లు నిండే 2026 జూలై 4వ తేదీకల్లా ప్రక్షాళన ప్రక్రియను పూర్తి చేయాలని మస్క్, వివేక్లకు డెడ్లైన్ విధించారు. ‘డోజ్’ను ఈ కాలపు మన్హాటన్ ప్రాజెక్టుగా ట్రంప్ అభివరి్ణంచారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అణుబాంబుల నిర్మాణానికి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘మన్హాటన్’. డోజ్ పనితీరుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఫెడరల్ అడ్వైజరీ కమిటీ చట్టం పరిధిలోకి రావచ్చంటున్నారు. ప్రభుత్వోద్యోగులు ఆస్తులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాల్సి ఉంటుంది. అయితే మస్క్, రామస్వామి ప్రభుత్వంలో చేరకుండా బయటి నుంచే పనిచేస్తారని ట్రంప్ చెప్పడంతో ఆ నిబంధన వారికి వర్తించే అవకాశం లేదు. గతంలోనూ అమెరికా అధ్యక్షులు ఇలా ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశారు. రిపబ్లికన్ పార్టీకే చెందిన రొనాల్డ్ రీగన్ 1981–1989 మధ్య ‘గ్రేస్ కమిషన్’ను స్థాపించారు. ఇక ప్రకంపనలే: మస్క్ డోజ్ ఏర్పాటును మస్క్ స్వాగతించారు. ఇది ప్రభుత్వ వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు. ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావచ్చన్నారు. పారదర్శకత కోసం డోజ్ చర్యలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ప్రజా ధనం వృ«థాను అరికట్టేందుకు లీడర్ బోర్డ్ ఏర్పాటవుతుందని తెలిపారు. ట్రంప్ టీమ్లో తొలి భారత అమెరికన్ ట్రంప్ 2.0 టీమ్లో చోటు సంపాదించిన తొలి భారత అమెరికన్గా 39 ఏళ్ల వివేక్ నిలిచారు. డోజ్ ఏర్పాటుపై ఆయన హర్షం వెలిబుచ్చారు. ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనలో సున్నితంగా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. కాలం చెల్లిన పలు ఫెడరల్ ఏజెన్సీలను తొలగించాలంటూ ప్రచార పర్వంలో రిపబ్లికన్లు తరచూ ఉపయోగించిన నినాదం ‘షట్ ఇట్ డౌన్’ను ఈ సందర్భంగా రీ పోస్ట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు వివేక్ పూర్తిస్థాయిలో మద్దతివ్వడం తెలిసిందే. ట్రంప్ విజయానంతరం పలు టీవీ షోల్లో మాట్లాడుతూ ఆయన్ను ఆకాశానికెత్తారు. వివేక్ 1985 ఆగస్టు 9న ఒహాయోలోని సిన్సినాటిలో జని్మంచారు. ఆయన తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన కేరళ బ్రాహ్మణులు. ఆయన ఒహాయోలోని రోమన్ కాథలిక్ స్కూల్లో చదివారు. హార్వర్డ్ నుంచి జీవశాస్త్రంలో పట్టా పొందారు. యేల్ లా స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యారు. హెడ్జ్ ఫండ్ ఇన్వెస్టర్గా చేశారు. యేల్లో డిగ్రీ పూర్తవకముందే మిలియన్ల కొద్దీ సంపాదించానని చెప్పుకుంటారు. 2014లో ఓ బయోటెక్ కంపెనీని స్థాపించారు. 2023 నాటికే వివేక్ సంపద ఏకంగా 63 కోట్ల డాలర్లని ఫోర్బ్స్ అంచనా వేసింది. 18 ఏళ్లకే అద్భుత ప్రసంగం హైసూ్కల్ విద్యారి్థగా సెయింట్ 18 ఏళ్ల వయసులో జేవియర్ స్కూల్లో వివేక్ చేసిన ప్రసంగ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ప్రసంగం పొడవునా ఆయన కనబరిచిన ఆత్మవిశ్వాసం, భవిష్యత్తును గురించి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Congratulations to @elonmusk and @VivekGRamaswamy on this historic achievement! $DOGE #DonaldJTrump #ElonMusk #MAGA #TrumpVance2024 #VivekRamaswamy pic.twitter.com/6b98v4hyyO— Brock W. Mitchell (@BrockWMitchell) November 13, 2024 -
వివేక్ రామస్వామికి ట్రంప్ మొండి చెయ్యి?
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. వచ్చే ఏడాది (2025) జనవరిలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈలోపు తన పాలకవర్గం కూర్పుపై ట్రంప్ సమాలోచనలు చేస్తున్నారు. కీలకమైన విదేశాంగ శాఖ కార్యదర్శి పదవికి తనకు సన్నిహితుడైన మార్కో రూబియో పేరును ఆయన పరిశీలిస్తున్నట్లు కథనాలు వెల్లడవుతున్నాయి. అయితే.. ఇండో అమెరికన్ అయిన వివేక్ రామస్వామికి విదేశాంగ శాఖ కార్యదర్శి పదవిని ఇవ్వొచ్చనే గతంలో చర్చ నడిచింది. ఇప్పుడు మార్కో పేరు తెరపైకి వచ్చిన క్రమంలో.. వివేక్ రామస్వామికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు? అనే చర్చ మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం.. రిపబ్లిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం వివేక్ రామస్వామి పోటీకి నిలబడ్డారు. ఆదరణ అంతంత మాత్రంగానే రాడంతో పోటీ నుంచి వైదొలిగి.. ట్రంప్కు బహిరంగ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. వివేక్ రామస్వామికి కేబినెట్లో కీలక పదవి ఖాయమనే చర్చ నడిచింది. మరోవైపు.. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మార్కో రూబియో కీలకంగా వ్యవహించారు. రూబియో 2010 నుంచి సెనేట్లో పనిచేశారు. ఇక ఇండో అమెరికన్ అయిన నిక్కీ హేలీకి తన పాలకవర్గంలో చోటు ఇవ్వనంటూ ట్రంప్ బహిరంగంగానే ప్రకటించడం గమనార్హం. దీంతో వివేక్ రామస్వామి కూడా అలాంటి పరిస్థితే ఎదురు కావొచ్చనే విశ్లేషణలు నడుస్తున్నాయి. ఎవరీ మార్కో రూబియో రూబియో 2011 నుంచి సెనేటర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్పై సెనేట్ సెలెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున జేడీ వాన్స్ను ట్రంప్ రన్నింగ్మేట్గా ప్రకటించకముందే రూబియో ఆ రేసులో ఉన్నారు.చదవండి: వలసల నియంత్రణాధికారిగా టామ్ హొమన్ -
కమలా హారీస్ ఓ కీలుబొమ్మ: వివేక్ రామస్వామి
చికాగో: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ను టార్గెట్ చేస్తూ రిపబ్లిక్ పార్టీ నేత వివేక్ రామస్వామి తీవ్ర విమర్శలు చేశారు. కమలా హారీస్ కీలుబొమ్మ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో అమెరికా ప్రజలు వాస్తవాలను గ్రహించాలని కోరారు.కాగా, వివేక్ రామస్వామి తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘కమలా హారీస్ ఓ కీలుబొమ్మ. చక్రంలో ఇరుక్కున్న ఓ పిల్లి వంటి వ్యక్తి ఆమె. ఇక్కడ వాస్తవం ఏమిటంటే.. అమెరికా విధానాలకు ఆమె ఎంతో దూరంగా ఉన్నారు. ఆమెకు ప్రజాదరణ చాలా తక్కువ. అది మాకు ఎంతో కలిసి వస్తుంది. ఎన్నికల్లో మేము తప్పకుండా విజయం సాధిస్తాం. ఆమె ఆర్థిక విధానాలు విఫలయమ్యాయి. మేము పాలసీలో గెలుస్తాము. ఈ దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించే పది మిలియన్ల మందికి సరిహద్దును తెరిచి ఉంచడం అమెరిక్లను ఎంతో అభ్యంతరకరం. దేశ సరిహద్దుల విషయంలో భద్రతకు మేము కట్టుబడి ఉన్నాము. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా సరైన ఎంపిక అని నేను భావిస్తున్నాను. ట్రంప్ విజయం సాధించేందుకు మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం . సెనేట్ మరియు హౌస్పై కూడా మాకు నియంత్రణ ఉంటేనే మేము ఆ ఎజెండాను అమలు చేస్తాము’ అంటూ చెప్పుకొచ్చారు. -
‘వాన్స్’ ఉత్తమ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి: వివేక్రామస్వామి
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ వైస్ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ ఎంపికపై భారత సంతతి బిలియనీర్ వివేక్రామస్వామి స్పందించారు. ‘నా స్నేహితుడు వాన్స్ను చూసి నేను గర్వపడుతున్నా. అతను నా ఫ్రెండే కాదు. క్లాస్మేట్. లాస్కూల్లో చదవుకునేపుడు మేమిద్దరం చాలా ఎంజాయ్ చేశాం. వాన్స్ ఉత్తమ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. అతడి గెలుపు కోసం, దేశం బాగు కోసం నేను ఎదురు చూస్తున్నా’అని వివేక్రామస్వామి ఎక్స్లో పోస్ట్ చేశారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వివేక్రామస్వామి ప్రైమరీల దశలోనే తప్పుకుని ట్రంప్కు మద్దతు ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ల తరపున ట్రంప్ పోటీ పడుతున్నారు. ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒహియో సెనేటర్ జేడీ వాన్స్ను తాజాగా ఎంపిక చేసుకున్నారు. -
ట్రంప్పై కాల్పులు.. వివేక్రామస్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన హత్యాయత్నం ఘటనపై భారత సంతతికి చెందిన బిలియనీర్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడ్డ నేత వివేక్ రామస్వామి ఎక్స్(ట్విటర్)లో తీవ్రంగా స్పందించారు. ట్రంప్పై కాల్పులు జరగడం తనను షాక్కు గురిచేసిందన్నారు.అధ్యక్ష ఎన్నికల పోటీలో లేకుండా చేయడం కోసమే ట్రంప్ను చంపాలని చూశారని ఆరోపించారు. ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందన కూడా సరిగాలేదని వివేక్రామస్వామి విమర్శించారు.‘అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎలాంటివాడన్నది ఈ ఘటనతో తెలిసింది. ఈ ఘటనలో జరిగిన మంచి ఇదొక్కటే. బుల్లెట్ తాకినా,రక్తం కారుతున్నా..ట్రంప్ ప్రజల కోసమే నిలబడ్డాడు.నాయకత్వం వహించేందుకు సిద్ధమని స్పష్టం చేశాడు’అని రామస్వామి ట్రంప్ను కొనియాడారు. ఓటర్లు ఎవరికి ఓటేద్దామనుకుంటున్నప్పటికీ ట్రంప్పై జరిగిన హత్యాయత్నాన్ని మాత్రం ఖండించాల్సిందేనని పిలుపునిచ్చారు.కాగా,శనివారం(జులై 13) పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ ఎడమచెవికి బుల్లెట్ గాయాలయ్యాయి.ఈ ర్యాలీకి హాజరైన ట్రంప్ మద్దతుదారుడు ఒకరు కాల్పుల్లో మృతిచెందాడు. -
USA: నర్సింగ్ విద్యార్థిని హత్య.. అమెరికాలో రాజకీయ దుమారం
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. మెక్సికోతో సరిహద్దు వివాదం అంతకంతకూ రాజుకుంటోంది. దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వ్యక్తి చేతిలో లేకెన్ రిలే(22) అనే నర్సింగ్ విద్యార్థిని ఇటీవల హత్యకు గురైంది. దీనిపై రిపబ్లికన్ పార్టీ అధ్యక్షఅభ్యర్థిత్వ రేసులో ముందున్న దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల టెక్సాస్లోని సరిహద్దుకు వెళ్లిన ఆయన అక్కడ చేసిన ప్రసంగంలో అధ్యక్షుడు బైడెన్పై విమర్శలు గుప్పించారు. దేశంలోకి అక్రమ వలసదారుల ప్రవేశం ఎక్కువవడానికి బైడెన్ చేతగానితనమే కారణమని మండిపడ్డారు. రిలే తల్లిదండ్రులతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. రిలేను తాను ఎన్నటికి మరచిపోలేనని, ఆమె హత్య అంశాన్ని అధ్యక్షుడు బైడెన్ అసలే పట్టించుకోలేదన్నారు. ఇదే విషయమై రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్న మరో నేత వివేక్రామస్వామి కూడా ఘాటుగా స్పందించారు. బైడెన్ జార్జ్ ఫ్లాయిడ్ పోలీసింగ్ యాక్ట్ బిల్లు పాస్ చేయడానికి బుదలు లేకెన్ రిలే సెక్యూర్ ద బోర్డర్ బిల్లు పాస్ చేయాల్సిందని, దీని ద్వారా అక్రమ వలసదారులను వెనక్కి పంపి పోలీసులకు భారాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. కాగా, లేకెన్ రిలే మార్నింగ్ వాక్కు వెళ్లినపుడు దుండగుడు ఆమెపై దాడి చేసి కిడ్నాప్ చేసి తీవ్రంగా గాయపరిచి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అమెరికాలో ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా పార్టీల అధ్యక్షఅభ్యర్థులను నిర్ణయించే ప్రైమరీ ఎలక్షన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇదీ చదవండి.. మళ్లీ నాలుక మడతబెట్టిన బైడెన్ -
అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు వివేక్ రామస్వామి ప్రకటన
-
అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
వాషింగ్టన్: భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయోవా రిపబ్లికన్ కాకస్ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించగా.. ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కారణంగా బరి నుంచి తప్పుకోవాలని రామస్వామి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్కు వివేక్ మద్దతు ఇవ్వనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విజయాన్ని అందుకున్నారు. ప్రైమరీలో కీలకమైన అయోవా కాకసస్ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో ఇది మొదటిది. ఇందులో ట్రంప్ అత్యధిక మెజార్టీ సాధించారు. రెండో స్థానంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ మధ్య పోటీ నెలకొంది. ఇక, కేవలం 7.7 శాతం ఓటింగ్తో నాలుగో స్థానంలో నిలిచిన వివేక్ రామస్వామి ప్రైమరీ తొలి పోరులో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. వివేక్ రామస్వామి ఒహాయోలో ఆగస్టు 9, 1985లో జన్మించారు. కేరళకు చెందిన ఆయన తల్లిదండ్రులు ఆమెరికా(America)కు వలస వచ్చారు. ఆయన సోషల్ మీడియాలో తనను తాను క్యాపిటలిస్ట్, సిటిజెన్గా అభివర్ణించుకుంటారు. హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. గత ఏడాది ఆయన స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ను స్థాపించారు. దీనికి ముందు ఆయనకు ఔషధరంగంలో గొప్ప పేరు ఉంది. రొవాంట్ సైన్సెస్ను ఏర్పాటు చేశారు. 2016లో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఆయన పోటీ ప్రకటన తర్వాత వార్తల్లో నిలుస్తూ వచ్చారు. అమెరికా ఆదర్శాలను తిరిగి పునరుద్ధరించేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ సమయంలో ప్రకటించారాయన. ఇది రాజకీయ ప్రచారం మాత్రమే కాదని.. తర్వాతి తరం అమెరికన్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమం అని చెప్పుకున్నారాయన. అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ ట్రంప్ తరహాలో ప్రచారం చేస్తూ వచ్చారాయన. అలాగే.. చైనా నుంచి ఎదురవుతోన్న ముప్పును ఎదుర్కోవడంతో పాటు ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాను అంటూ ప్రకటన చేశారాయన. ఆ తర్వాత ప్రచారంలో వైవిధ్యతను కనబరుస్తూ వచ్చినప్పటికీ.. ప్రచార చివరిరోజుల్లో ట్రంప్, రామస్వామిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చివరకు..అయోవా కాకసస్ ఎన్నికల్లో చేదు ఫలితం అందుకుని అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వివేక్ రామస్వామి తప్పుకున్నారు. ఇదీ చదవండి: అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్.. భారీ ఊరట -
USA presidential election 2024: రామస్వామిపై డొనాల్డ్ ట్రంప్ విసుర్లు
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకు పడ్డారు. ఆయన మోసపూరిత ప్రచార జిమ్మికులకు పాల్పడుతున్నారన్నారు. వివేక్ అనుచరులు ‘సేవ్ ట్రంప్, ఓట్ వివేక్’ అన్న షర్టులు ధరించడం, అవి వైరలవడం ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. తనకు మద్దతిస్తున్నట్లు కనిపిస్తూనే మోసపూరిత ప్రచార ట్రిక్కులు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. వివేక్ మాయలో పడకుండా తనకే ఓటేయాలన్నారు. వివేక్పై ట్రంప్ నేరుగా విమర్శలు చేయడం ఇదే తొలిసారి. -
US Elections: గన్ కల్చర్కు మానసిక రుగ్మతలే కారణం: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: అమెరికాలో గన్ కంట్రోల్ పాలసీపై అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల ఘటనలు జరిగిన వెంటనే గన్ కంట్రోల్ పాలసీపై మాట్లాడటం సాధారణమైపోయిందని, అసలు ఈ సమస్యకు మాలకారణమైన మానసిక రుగ్మతలకు పరిష్కారం వెతకాలని వివేక్ రామస్వామి సూచించారు. అయోవాలో తాజాగా దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందడంతో అమెరికాలో రాజకీయ పార్టీలు గన్ కంట్రోల్ పాలసీపై చర్చ ప్రారంభించాయి. దీనిపై అయోవాలోనే ఓటర్లతో సమావేశమైన సందర్భంగా గురువారం వివేక్ రామస్వామి స్పందించారు. ‘సంఘటన జరిగిన వెంటనే ఆత్రుతతో చట్టం పాస్ చేస్తే సమస్య పరిష్కారం కాదు. గన్ కంట్రోల్ పాలసీ తీసుకురావడం ఒక స్టుపిడ్ చర్య. గన్ కల్చర్ అనేది అమెరికా సంస్కృతిలో భాగమైంది. మూలాల్లోకి వెళ్లకుండా సమస్యను పరిష్కరించడానికి మనమేం దేవుళ్లం కాదు’ అని వివేక్ అన్నారు. కాగా,కాల్పులు ఘటన కారణంగా అయోవాలో తన ప్రచారాన్ని వివేక్ రద్దు చేసుకున్నారు.కేవలం ప్రార్థనలతో సరిపెట్టారు. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తుది పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రైమరీ బ్యాలెట్లు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఇదీచదవండి.. కొరియా దేశాల మధ్య ఉద్రిక్తత -
US Elections: వివేక్ రామస్వామి కీలక నిర్ణయం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ వచ్చే నెల ప్రారంభం కానుంది. జనవరిలో అయోవా (iowa) రాష్ట్రంలో తొలి బ్యాలెట్ జరగనుంది. అయితే అయోవా ఓటింగ్కు మరికొద్ది రోజులే మిగిలి ఉండగా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఎన్నికల ప్రచారంలో ఇక నుంచి టీవీ చానళ్లకు ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించాం. అలాగని మొత్తం ప్రకటనల బడ్జెట్ను తగ్గించ లేదు. సంప్రదాయ టీవీ కాకుండా వేరే మార్గాల్లో ఓటర్లను రీచ్ అవుతాం. టీవీ ప్రకటనలపై ఖర్చు పెడితే పెద్దగా ఉపయోగం ఉండటం లేదు’ అని వివేక్ రామస్వామి క్యాంపెయిన్ మేనేజర్ ట్రిసియా మెక్ లాలిన్ తెలిపారు. అయితే తాను ఇప్పటికే క్యాంపెయినింగ్ కోసం 20 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు రామస్వామి స్వయంగా మీడియాకు తెలిపారు. ఇంత ఖర్చు చేసినప్పటికీ అయోవాలో రామస్వామివైపు రిపబ్లికన్లు పెద్దగా మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. అయోవాలో 10 శాతం రిపబ్లికన్ల ఓట్లు కూడా రామస్వామికి వచ్చే పరిస్థితులు లేవని సమాచారం. ఇక దేశవ్యాప్తంగా కూడా రామస్వామి గ్రాఫ్ రోజురోజుకు పడిపోతున్నట్లు తెలుస్తోంది. కాగా, రిపబ్లికన్ల తరపున ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్న వారిలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హాట్ ఫేవరెట్గా దూసుకెళుతుండడం విశేషం. ఇదీచదవండి..భారత్లో ఉన్న పౌరులకు ఇజ్రాయెల్ అడ్వైజరీ -
Vivek Ramaswamy: ‘నేను హిందువు.. నా గుర్తింపు తప్పుగా చెప్పను’
హిందూ మత విశ్వాసంపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎన్ఎన్ టౌన్హాల్లో నిర్వమించిన ఓ కార్యక్రమంలో ఒక ఓటరు తన మతం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ‘మీరు మా అధ్యక్షుడు కాదు, ఎందుకంటే మీరు మా పూర్వికులకు సంబంధించిన మతానికి చెందినవారు కాదని అంటే?’ ఏం చెబుతారని ప్రశ్నించారు. దీనికి ఆయన.. ‘నేను హిందువును. నా గుర్తింపును తప్పుగా చెప్పుకోను. హిందూ మతం, క్రైస్తవం రెండూ కూడా ఒకే రకమైన విలువలను బోధిస్తాయి’ అని తెలిపారు. ‘హిందూ మతం నమ్మకాల ప్రకారం ఈ భూమ్మీదికి ప్రతి మనిషి ఓ కారణంతో వస్తారు. ఆ కారణాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనలోనే ఉంటాడు. మనతో ఆయన మంచి పనులు చేయిస్తారు. మనమంతా కూడా ఆయన దృష్టిలో సమానం’ అని వివేక్ రామస్వామి తెలిపారు. A voter tonight in Iowa asked about my Hindu faith. I answered honestly. pic.twitter.com/hkUrZkbhUx — Vivek Ramaswamy (@VivekGRamaswamy) December 14, 2023 దేశంలో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చెందించే అధ్యక్షుడను తాను కాదని, కానీ అమెరికా దేశానికి సంబంధించి విలువల కోసం ఎల్లప్పుడూ నిలబడతానని తెలిపారు. 38 ఏళ్ల వివేక్ రామస్వామి.. నైరుతి ఒహియోకు చెందినవారు. అతని తల్లి గెరియాట్రిక్ సైకియాట్రిస్ట్. తండ్రి జనరల్ ఎలక్ట్రిక్లో ఇంజనీరు. అయితే ఆయన తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024లో జరగనున్నాయి. చదవండి: అమెరికాలో ఘనంగా హాలిడే పార్టీ.. పాల్గొన్న400 మంది సీఈవోలు -
US Presidential Elections 2024: ఫాసిస్ట్, అవినీతి అనకొండ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడడానికి భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పారీ్టలో తన ప్రత్యర్థి అయిన భారతీయ–అమెరికన్ నిక్కీ హేలీపై పైచేయి సాధించాలని చూస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యరి్థత్వం కోసం వివేక్ రామస్వామి, నిక్కీ హేలీతోపాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటీస్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ పోటీ పడుతున్నారు. నలుగురు ఆశావహుల మధ్య నాలుగో విడత చర్చా కార్యక్రమం యూనివర్సిటీ ఆఫ్ అలబామాలో హాట్హాట్గా జరిగింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కాలేదు. చర్చలో పాల్గొన్న నలుగురు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వివేక్ రామస్వామి దాదాపు అరగంటపాటు మాట్లాడారు. ప్రధానంగా నిక్కీ హేలీపై విరుచుకుపడ్డారు. ఆమె ఫాస్టిప్, అవినీతి అనకొండ అని ధ్వజమెత్తారు. ఆరోపణలపై మీడియాకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రీడ్ హాఫ్మాన్ అనే ధనవంతుడి నుంచి నిక్కీ, ఆమె కుటుంబ సభ్యులు 2.5 లక్షల డాలర్లు దండుకున్నారని ఆరోపించారు. అయితే, వివేక్ రామస్వామి చేసిన ఆరోపణలపై నిక్కీ హేలీ పెద్దగా స్పందించలేదు. చర్చా కార్యక్రమంలో మౌనంగా ఉండిపోయారు. ఆమెకు క్రిస్ క్రిస్టీ మద్దతుగా నిలిచారు. వివేక్ రామస్వామి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్పై ఎవరు పోటీకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. -
మాజీ ఎంపీ వివేక్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు
-
మంచిర్యాలలోని వివేక్ ఇంటి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
-
లవ్ స్టోరీ చెప్పిన భార్య: తొలి బిడ్డను కోల్పోయాం.. వివేక్రామస్వామి భావోద్వేగం
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన, పారిశ్రామికవేత్త,భారతీయ సంతతికి చెందిన వివేక్ గణపతి రామస్వామి తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. ఈక్రమంలో అయోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో భార్య అపూర్వ, కుమారుడితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తి త జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలను వివేక్ను ట్విటర్లో షేర్ చేశారు. తన భార్యకు గర్భం దాల్చి మూడున్నర నెలలకే గర్భస్రావం జరిగిందని ఇది తమకు చాలా బాధకరమైన క్షణమని పేర్కొన్నారు. ముఖ్యంగా తొలి బిడ్డను కోల్పోవడతో రెండోసారి కూడా ఆ భయం వెంటాడిందన్నారు. కానీ ఆ భగవంతుడిమీద విశ్వాసంతోనే ధైర్యాన్ని తెచ్చు కున్నామని, అలా కార్తీక్ , అర్జున్ వచ్చారని తమ జీవితాల్లోరావడంతో సంతోషం నిండిందంటూ అయోవాలోని ఫ్యామిలీ లీడర్ థాంక్స్ గివింగ్ ఫ్యామిలీ ఫోరమ్లో రామస్వామి తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. I haven’t spoken publicly about the loss of Apoorva and my first child—it’s difficult for us to talk about it. Apoorva and I draw strength from our faith in God and are so blessed to be the parents to our two sons Karthik and Arjun. pic.twitter.com/x2qzWqrxS5 — Vivek Ramaswamy (@VivekGRamaswamy) November 17, 2023 తన విశ్వాసమే తన స్వేచ్ఛ ను ఇచ్చిందనీ అదే ఈ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నడిపించిందని చెప్పుకొచ్చాడు. దేవుడు ఒక్కడే అని తాను విశ్వసిస్తానన్నారు. అలాగే తల్లితండ్రుల పెంపకం, వారి పట్ల గౌరవం వివాహం, ఇతర సాంప్రదాయ విలువల్ని వారి నుంచి నేర్చుకున్నానన్నారు. హిందూ విశ్వాసం, సిద్ధాంతాలు, క్రైస్తవ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు నేర్చుకున్న క్రైస్తవ విలువల మధ్య సారూప్యాన్ని ప్రస్తావించారు. ఇవి మతపరమైన సరిహద్దులను అధిగమించి ఉన్నతమైన దైవిక శక్తికి చెందినవని పేర్కొన్నారు. అటు రామస్వామి భార్య అపూర్వ కూడా తమ ప్రేమ ఎలా మొదలైందీ పంచుకున్నారు. తొలుత ఒక కాలేజీ పార్టీలో కలుసుకున్నామని తెలిపారు. మెడ్ స్కూల్లో ఉండగా, వివేక్ అక్కడ న్యాయ విద్యార్థిగా ఉన్నారు. అక్కడ వివేక్ను చూశాను...చాలా ఆసక్తికరమైన వ్యక్తిగా అనిపించాడు. వెంటనే వెళ్లి వివేక్ను పరిచయం చేసుకున్నానని కానీ అపుడు వివేక్ పెద్ద ఆసక్తి చూపించలేదన్నారు. కానీ అప్పటినుంచి తరచు కలుసుకుంటూ, తాము పరస్పరం ఎంత దగ్గరి వారిమో గుర్తించాం. అప్పటినుంచీ కలిసే ఉన్నామని తెలిపారు. కాగా వివేక్ రామస్వామి తండ్రి వీజీ రామస్వామి జనరల్ ఎలక్ట్రిక్లో ఇంజినీర్గా పనిచేశారు. తల్లి గీతా రామస్వామి వృద్ధులకు సంబంధించిన జీరియాట్రిక్ సైకియాట్రిస్టు. భార్య అపూర్వ సర్జన్. యేల్ విశ్వవిద్యాలయంలో పరిచయం వీరి పెళ్లికి దారితీసింది. 2015లో అపూర్వ తివారీని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు అబ్బాయిలు. 2023 ఆగస్టు నాటి ఫోర్బ్స్ నివేదిక ప్రకారం వివేక్ రామస్వామి సంపద విలువ 95 కోట్ల అమెరికన్ డాలర్లకు పైమాటే. అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024 మంగళవారం జరగనున్నాయి. Voters in Iowa want to know the story how Apoorva and I met. Here’s how. 😉 📍 Osceola, IA pic.twitter.com/N7duPToNlO — Vivek Ramaswamy (@VivekGRamaswamy) November 19, 2023 -
హిందూ మత విశ్వాసమే స్ఫూర్తి: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: హిందూ మత విశ్వాసం తనకు అన్ని విషయాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచి్చందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చెప్పారు. అధ్యక్ష రేసులో నిలిచేందుకు కూడా ఆ విశ్వాసమే తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడన్నది హిందూ మత మౌలిక విశ్వాసమని 38 ఏళ్ల వివేక్ చెప్పారు. -
వివేక్ రామస్వామి సర్ఫింగ్ వీడియో వైరల్: నీళ్లలోకి తోసేసి మరీ..!
అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచారు. 3వ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి సర్ఫ్ చేయడం నేర్చుకుంటున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. డిబేట్ తర్వాత మియామీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాజ్ సాయర్ రామస్వామి సర్ఫింగ్కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. "కాబోయే ప్రెసిడెంట్కి సర్ఫ్ చేయడంఎలాగో నేర్పిస్తున్నా’’ అనే క్యాప్షన్తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. మాట్లాడుతూనే ఉన్నట్టుండి వివేక్ను నీళ్లలోకి తోసివేయడం, అలాగే గతంలో ఎప్పుడు సర్ఫింగ్ చేయని రామస్వామి, బోర్డు మీద బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించి రెండుసార్లు నీటిలో పడిపోవండి లాంటి దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తానికి నేర్పుగా నేర్చుకుని నీటి అలల్ని ఎదుర్కొని ఈజీగా సర్ఫింగ్ చేశారు. అంతేకాదు నాట్నుంచి పక్కకు తప్పుకొని మరీ సూట్తోనే సర్ఫింగ్ చేయాలన్న సాయల్ సవాల్ను కూడా స్వీకరించిన రామస్వామి అలవోకగా వేక్ సర్ఫింగ్లో విజయం సాధించడం విశేషం. ఇప్పటికే 7 లక్షల 50 వేల మందికిపైగా వీక్షించారు.దీంతో నెక్ట్స్ ప్రెసిడెంట్ అని కొందరు, మేన్ ఆఫ్ యంగ్ పీపుల్ మరికొందరు కమెంట్ చేయగా, ఇంకొందరు నెగిటివ్ కమెంట్స్ కూడా చేశారు. కాగా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి వ్యక్తిగత దూషణకు దిగారు. విదేశాంగ విధానంపై చర్చలో భాగంగా వేదికపై ఉన్న ఏకైక మహిళా అభ్యర్థి నిక్కీపై విరుచుకుపడ్డారు వివేక్. ఇద్దరు భారతీయ సంతతి లీడర్ల మధ్య వైరం చర్చకు దారి తీసింది. 2024 నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి View this post on Instagram A post shared by Kaz (@kazsawyer) -
బిలియనీర్ వివేక్ రామస్వామి ఇంట్లో ‘నానీ’ జాబ్: జీతం తెలిస్తే షాకవుతారు
Vivek Ramaswamy wants to hire nanny అమెరికా అధ్యక్ష పదవి రేసులో దూసుకుపోతున్న భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త, బిలియనీర్ వివేక్ రామస్వామి తన పిల్లలను చూసుకునేందుకు నానీ కోసం వెతుకు తున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీగా జీతాన్ని ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రిక్రూట్మెంట్ స్టాఫింగ్ వెబ్సైట్లోని జాబ్ లిస్టింగ్ ప్రకారం రామస్వామి తన పిల్లల్ని చూసుకునే నానీ (ఆయా)కోసం లక్ష డాలర్లు (రూ.80 లక్షల కంటే ఎక్కువ) లేదా అంతకంటే ఎక్కువ జీతాన్ని ఆందించనున్నారు. వివేక్ రామస్వామి అపూర్వ తివారీకి దంపతులకు కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు మగ పిల్లలున్నారు. వృత్తిరీత్యా అపూర్వ స్వరపేటిక నిపుణురాలు. (మరో వివాదంలో బిగ్ బీ అమితాబ్: ఇంత దారుణమా అంటూ తీవ్ర ఆగ్రహం) EstateJobs డాట్ కామ్ అనే వెబ్సైట్ ఉద్యోగ ప్రకటన ప్రకారం ఇది ఒక హై ప్రొఫైల్ ఫ్యామిలీలో చేరడానికి ఒక అసాధారణమైన అవకాశం, ప్రత్యేకమైన కుటుంబ సాహసాలలో పాల్గొంటూ వారి పిల్లల పెరుగుదల, అభివృద్ధికి దోహదపడాలి అని ఎస్టేట్ జాబ్స్ ఉద్యోగ ప్రకటన పేర్కొంది. ఈ యాడ్లో క్లయింట్ పేరు ప్రస్తావించక పోయినప్పటికీ, ఇది రామస్వామి కుటుంబానికి సంబంధించిందనే అంచనాలు భారీగా ఉన్నాయి. (2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?) ఈ ఉద్యోగానికి వారానికి 84 నుండి 96 గంటల పని అవసరం, ఆ తర్వాత వారం మొత్తం సెలవు ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన నానీ ఇతర చెఫ్, నానీలు, హౌస్ కీపర్, ప్రైవేట్ సెక్యూరిటీతో సహా ఇతర కీలకమైన టీంతో కలిసి పనిచేయాలి. అలాగే అబ్బాయిల ఆటలు, బొమ్మలు, దుస్తులను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుంది. (ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు) కాగా 2024 ఎన్నికల్లో జో బిడెన్తో తలపడేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ అభ్యర్థి రామస్వామి ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. (హ్యుందాయ్ కీలక నిర్ణయం: తొలి బ్రాండ్గా రికార్డ్) -
ట్రంప్కి సైతం వణుకుపుట్టించే స్థాయికి వివేక్ రామస్వామి
భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున రేసులో ఉన్న ఆయన... ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నారు. బయోటిక్ రంగంలో అమెరికాలో సంచలనం సృష్టించిన రామస్వామి... మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కూడా వణుకుపుట్టించే స్థాయికి ఎలా ఎదిగారు? రిపబ్లిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో భారత సంతకి అభ్యర్థి వివేక్ రామస్వామి దూసుకెళ్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తర్వాతి స్థానంలోకి చేరుకొన్నారు ఆయన. ఈమధ్యనే జరిగిన జీవోపీ పోల్స్లో ఇది వెల్లడైంది. ఇంతకుముందు మూడో ప్లేస్లో ఉన్న భారత సంతతికి చెందిన రామస్వామి తాజాగా రెండో స్థానానికి చేరుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు... అధ్యక్ష రేసు కోసం జరుగుతున్న ప్రైమరీ పోల్స్లో 39 శాతం మంది డొనాల్డ్ ట్రంప్కు మద్దతు ఇస్తున్నారు. రామస్వామికి 13 శాతం మంది సపోర్ట్ చేస్తున్నారు. దీన్నిబట్టి ట్రంప్కు రామస్వామే ముఖ్య పోటీదారుగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి నిక్కీహెలీ 12 శాతం ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ట్రంప్కు ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ రెండు స్థానాలు తగ్గి అనూహ్యంగా ఐదో స్థానానికి పడిపోయారు. న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ 11 శాతం మద్దతుతో నాలుగో స్థానంలో ఉన్నారు. మరోవైపు...వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 75 శాతం మందిని తొలగిస్తానని అనూహ్య ప్రకటన చేశారు రామస్వామి. అంతేకాదు FBI లాంటి అనేక సంస్థలను మూసేస్తాని కూడా స్పష్టంచేశారు. వచ్చే నాలుగేళ్లలో ఉద్యోగుల్ని తగ్గించడమే తన లక్ష్యమని కూడా చెప్పారు రామస్వామి.అంతేకాదు.. హెచ్-1 వీసా విధానంలో సంస్కరణలు తీసుకొస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ విభాగంలో సుమారు 22 లక్షల 50 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 75 శాతం మంది తొలగించడమంటే 16 లక్షల మందికి ఉద్వాసన పలనకడమేనన్నమాట. అంత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేస్తే బడ్జెట్లో వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయి. కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలు మూతపడే అవకాశముందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు... ఈమధ్య జరిగిన ప్రైమరీ పోటీల్లో పలు కీలక ప్రతిపాదనలు చేసిన వివేక్ రామస్వామి చాలా మంది మద్దతు సంపాదించారు. తర్వాత నిర్వహించిన పోల్లో 504 మంది స్పందన తెలియజేస్తే... అందులో 28 శాతం మంది రామస్వామిని ఉత్తమంగా పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల విషయానికి వస్తే ...రష్యా విషయంలో విభిన్న వైఖరిని ప్రకటించారు రామస్వామి. అమెరికాకు ప్రధాన అడ్డంకిగా మారిన చైనా ను ఎదుర్కొనే సమయంలో రష్యా చాలా కీలకమైందని ఆయన అభిప్రాయపడ్డారు. మాస్కోను ఎట్టి పరిస్థితుల్లో బీజింగ్ పక్షాన చేరనీయకూడదన్నారు. తాను ఎన్నికల్లో గెలిచి శ్వేత సౌధంలో అడుగుపెడితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రష్యాకు మంచి డీల్ను ఆఫర్ చేస్తానని కూడా ప్రకటించారు రామస్వామి. మాస్కోతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరిస్తానన్నారు. అప్పుడు చైనాతో అవసరం మాస్కోకు తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు రామస్వామి. మరోవైపు.. రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ ముందంజలోనే ఉన్నారు. కానీ ఆయనకు భారత సంతతికి చెందిన అభ్యర్థుల నుంచి చివరిదాకా గట్టిపోటీ తప్పేలాలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధ్యక్ష ఎన్నికల నాటికి పరిస్థితులు మారే అవకాశముందని కూడా అంచనావేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే ఏడాది నవంబరులో జరగుతాయి. గత అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. ఆసమయంలోనే తాను 2024 నాటి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున మళ్లీ పోటీచేస్తానని ప్రకటించారు ట్రంప్. ఇక.. రామస్వామి పూర్వీకులు భారత్కు చెందిన వారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా నుంచి అమెరికా వలసవెళ్లిన గణపతి రామస్వామి, గీతా రామస్వామికి 1985 ఆగస్టు 9న జన్మించారు వివేక్ రామస్వామి. హార్వర్డ్ నుంచి జీవశాస్త్రంలో డిగ్రీ తీసుకున్న వివేక్.. 2014లో రోవెంట్ సైన్సెస్ అనే సంస్థను స్థాపించారు. 2015లో అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ ఐపీఓకు వెళ్లారు. క్యాన్సర్, అల్జీమర్స్ లాంటి వ్యాధులకు విజయవంతంగా మందులు తయారుచేసి బయోటెక్ రంగంలో అమెరికాలో అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు. అమెరికాలోని టాప్ యువ బిలియనీర్లలో రామస్వామి ఒకరు. రిపబ్లికన్ పార్టీలో ఇప్పుడు ఆయన కీలక వ్యక్తిగా మారారు.