women harrassement
-
మేడారం అటవీ ప్రాంతంలో దారుణం..
వరంగల్: పని కోసం రోడ్డుపై వెళ్తున్న ఓ వివాహితను కారులో ఎక్కించుకుని ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహిత అదే గ్రామానికి చెందిన మరో మహిళతో పని నిమిత్తం ఏప్రిల్ నెల 20వ తేదీ ఉదయం ఆరెపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపై వెళ్తుండగా.. ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన ఎస్.రవి అనేవ్యక్తి ఎ.రమేశ్ అనే వ్యక్తితో కలసి కారులో (తెల్లరంగు బ్రెజా) వచ్చి మహిళలిద్దర్నీ ఎక్కించుకుని ములుగు వైపు బయల్దేరారు. ఓ మహిళ మార్గమధ్యంలోనే దిగిపోగా, కొంతదూరం వెళ్లాక ములుగు జిల్లాకు చెందిన డి.నాగరాజు, హన్మకొండకు చెందిన బి.లక్ష్మణ్, వర్ధన్నపేటకు చెందిన బి.సుధాకర్ అనే యువకులు కారులో ఎక్కారు. ఈ ఐదుగురు కలసి కారులో ఉన్న మహిళను బెదిరిస్తూ మేడారం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ ముగ్గురు యువకులు అత్యాచారం చేయగా మిగిలిన ఇద్దరు యువకులు సహకరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆ మహిళను బెదిరించి ములుగు తీసుకొచ్చి అక్కడ బస్సు ఎక్కించి వెళ్లిపోయారు. సదరు బాధితురాలు ములుగురోడ్డు వద్ద బస్సుదిగి తన భర్తకు ఫోన్ చేసింది. ఎక్కడికి వెళ్లావని నిలదీయడంతో ఆమె భయపడి కరీంనగర్ జిల్లాలోని పుట్టింటికి వెళ్లిపోయింది. గత నెల 29న ఫిర్యాదు చేసిన భర్త.. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 25న ఏనుమాముల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పుట్టింటి దగ్గర ఉన్నట్లు భార్య చెప్పడంతో అక్కడకు వెళ్లిన భర్తకు సామూహిక అత్యాచారం సంగతి తెలిసింది. దీంతో బాధితురాలు, ఆమె భర్త ఏప్రిల్ 29న కలసి ఫిర్యాదు చేయగా పోలీసులు ఐదుగురు యువకులతోపాటు సామూహిక అత్యాచారానికి సహకరించిన మరో మహిళపై కూడా గ్యాంగ్రేప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అనంతరం ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మరో మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. ఇది కూడా చదవండి: నేను నిర్దోషిని.. దేవ్, సీతలు పిలిచారనే వెళ్లా.. థాయ్ పేకాట వ్యవహారంపై చికోటి స్పందన -
HCU: విదేశీ విద్యార్థినిపై లైంగికదాడియత్నం.. ప్రొఫెసర్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రొఫెసర్ రవిరంజన్పై కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా పోలీసులు సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఏసీపీ రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ.. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాము. హిందీ నేర్పిస్తానని థాయ్లాండ్ విద్యార్థిని ఇంటికి పిలిచి ప్రొఫెసర్ రవిరంజన్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సాఫ్ట్ డ్రింక్లో లిక్కర్ కలిపి అత్యాచారం చేయబోయాడు. విద్యార్థిని ప్రతిఘటించి పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. మరోవైపు.. విద్యార్థినిపై అత్యాచార ఘటన నేపథ్యంలో హిందీ ప్రొఫెసర్ రవిరంజన్ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇక, దారుణ ఘటన నేపథ్యంలో సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేట్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రవిరంజన్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
అలర్ట్: సరుకుల డెలివరీ కోసం వచ్చి.. మహిళతో అసభ్యకర ప్రవర్తన..
ఇటీవలే కొరియాకు చెందిన ఓ యూట్యూబర్తో కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించిన ఘటన మరువకముందే మహారాష్ట్రలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సరుకులు డెలివరీ చేసేందుకు ఓ కస్టమర్ట్ ఇంటికి వెళ్లిన డెలివరీ బాయ్.. మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా ఈ ఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించాడు. ఈ షాకింగ్ ఘటన ఖర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఖర్ పశ్చిమ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో సబీనా ఆమె కుటుంబంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో సరుకుల డెలివరీ కోసం ఆన్లైన్ డెలివరీ సంస్థను ఆశ్రయించింది. దీంతో, ఆన్లైన్ సంస్థకు చెందిన షాజాదే షేక్ సరుకులను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని డెలివరీ బాయ్ గమనించాడు. ఈ క్రమంలోనే సరుకుల డెలివరీ తర్వాత.. వీడియో తీయాలని చెప్పి ఫోన్లో వీడియో మోడ్ ఆన్చేశాడు. అనంతరం.. ఆమె చేయి పట్టుకుని అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. Another #Mumbai molestation horror as a delivery boy molests a girl who had ordered groceries via #Zepto App. The delivery boy entered the house forcefully.@AtkareSrushti reports | @ZeptoNow @zeptocares pic.twitter.com/vvNYbRD1rV — Mirror Now (@MirrorNow) December 2, 2022 దీంతో, ఒక్కసారిగా షాకైన బాధితురాలు.. వెంటనే కిచెన్లో ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ సాయంతో సెక్యూర్టీకి కాల్ చేసింది. వెంటనే స్పందించిన అక్కడికి వచ్చిన సెక్యూర్టీగార్డ్ అతడిని అడ్డుకున్నాడు. అనంతరం, అతడిలో చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని బాధితురాలు వీడియోను డిలీట్ చేసింది. ఇక, తనకు జరిగిన చేదు అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె తెలిపింది. ఈ క్రమంలో సదరు డెలివరి సంస్థపై బాధితురాలు సీరియస్ కామెంట్స్ చేసింది. ఇలాంటి వారితో రోజు ఇంకెంత మంది మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నారో అని ఆవేదన వ్యక్తం చేసింది. తర్వాత, సదరు బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. @CPMumbaiPolice @bombaytimes @timesofindia @MumbaiPolice @ZeptoNow #harssment #WomenSafety #womenharssment #justice #mumbai #zepto #harssment pic.twitter.com/gJop6NAk6T — Sabeena (@sabeenasyed8) December 1, 2022 ఇక, ఘటనపై సదరు డెలివరీ సంస్థ స్పందించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మేము ఇలాంటి విషయాలను సీరియస్గా తీసుకుంటాము. స్థానిక చట్టాన్ని అమలు చేసే సంస్థలతో ఘటనపై సమగ్ర విచారణ జరిపించి.. విచారణలో మేము కూడా పాల్గొంటున్నాము. ఇలాంటి ప్రవర్తనను త్రీవంగా ఖండిస్తున్నాము. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము’ అని తెలిపారు. Hi Sabeena, We take such matters with utmost seriousness. We are partaking in a thorough investigation of the incident with the local law enforcement bodies. We condemn such behavior. Stringent action will be taken on perpetrators based on facts. — Zepto Cares (@zeptocares) December 1, 2022 -
పట్టపగలే యూపీలో దారుణం.. షాకింగ్ వీడియో
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో రోజురోజుకూ మహిళలపై దాడులు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. రెండు క్రితమే యూపీలో కొందరు వ్యక్తులు ఓ మహిళకు మద్యం తాగించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన మరువకముందే మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం సరిగాలేని ఓ యువతి పట్ల కొందరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై మీరట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 19వ తేదీన కొందరు వ్యక్తులు పట్టపగలే ఓ యువతిని దారుణంగా కొట్టారు. ఇద్దరు వ్యక్తులు.. ఆమె కాళ్లు, చేతులను పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అనంతరం, వారు ఆమెపై దాడి చేశారు. ఈ క్రమంలోనే బాధితురాలు సహాయం కోసం వేడుకుంది. తనను వదిలేయాలని గట్టిగా అరుస్తూ కేకలు వేసింది. ఈ ఘటన సందర్భంగా చుట్టుపక్కలు చాలా మంది ఉన్నప్పటికీ ఆమెను ఎవరూ కాపాడలేదు. ఆమెపై దాడిని కొందరు మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. తాజాగా ఈ వీడియో పోలీసులకు చేరింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం బాధితురాలికి బరేలీలోని ఆసుప్రతిలో వైద్య చికిత్సలు అందిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితమే యూపీలోని బదోస్ రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగింది. బాధితురాలికి తెలిసిన వ్యక్తి ఆమెను.. తన భర్త పిలుస్తున్నాడని చెప్పి ఆమెను గ్రామ శివారులోని చెరువు వద్దకు తీసుకువెళ్లాడు.అప్పటికే అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. వారంతా తనకు తెలిసిన వారే కావడంతో మాట్లాడింది. అనంతరం, నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. ఆ తరువాత వరుసగా ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. దీంతో, కొన్ని రోజులు మౌనంగా బాధను దిగమింగిన మహిళ.. చివరకు ధైర్యం చేసి భర్తకు జరిగిన విషయం చెప్పింది. అనంతరం, వారు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. మరోవైపు.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా డేటా ప్రకారం.. ఉత్తరప్రదేశ్లో 2022 జనవరి నుండి ఆగస్టు వరకు మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 56,083 కేసులను నమోదు చేసింది, ప్రతి లక్ష జనాభాకు 50.5 నేరాల రేటుగా నమోదైంది. మహిళలపై నేరాలకు సంబంధించి దాదాపు 31,000 ఫిర్యాదులు గత ఏడాది జాతీయ మహిళా కమిషన్ (NCW)కి అందాయి. యూపీలో 2020తో పోలిస్తే 2021లో మహిళలపై నేరాల ఫిర్యాదులు 30 శాతం పెరిగాయి. -
విజయవాడలో దారుణం.. స్నేహితుల పనేనా..?
‘‘విజయవాడ పటమటలో నివసించే ఓ వివాహిత ఫొటోలను ఓ ఆగంతకుడు అసభ్యంగా మార్ఫింగ్ చేసి ఆమె వాట్సాప్కే పోస్ట్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. పలు దఫాలుగా రూ.25 వేలు వసూలు చేశాడు. ఆ తరువాత ఆమె వద్ద డబ్బులు లేవని తెలుసుకున్న ఆ కీచకుడు అవే ఫొటోలను ఆమె భర్తతో పాటు మరికొందరికి పోస్ట్ చేశాడు. బాధిత మహిళ భర్త సహకారంతో ఇటీవల సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల క్రితం ఆమెతో పాటు కాలేజీలో చదువుకున్న ఇద్దరు వ్యక్తులు ఈ సైబర్ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన మహిళ సోషల్ మీడియా మాయగాళ్ల వేధింపులతో కొన్ని నెలలు మానసిక వేదన అనుభవించింది. ఆ వేధింపులను తాళలేక ఈ గండం నుంచి కాపాడాలంటూ ఓ స్నేహితుడిని సాయం కోరింది. అయినా ఫలితం లేకపోవడంతో చేసేది ఏమీలేక ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో ఆ మహిళ సాయం కోరిన వ్యక్తే ఈ నేరానికి పాల్పడ్డాడని వెల్లడైంది. దీంతో ఆమె అవాక్కయింది. స్నేహంగా ఉన్నట్లు నటిస్తూనే ఆమె ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్కు పాల్పడ్డాడు ఆ కీచకుడు’’. విజయవాడ : ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాల్లో సైబర్ నేరాల పరంపర కొనసాగుతోంది. విద్యార్థునులు, యువ తులు, గృహిణులను లక్ష్యంగా చేసుకుని కొందరు కీచకులు వేధింపులకు పాల్పడుతున్నారు. బాధితులకు తెలిసిన వ్యక్తులే ఈ తరహా నేరాలకు పాల్పడుతుండటం గమనార్హం. యువతులు, మహిళలతో చనువుగా ఉంటూ వారి ఫొటోలను సేకరించి అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు పోగొట్టుకుని, కొన్నాళ్లు మానసిక వేదన అనుభవించాక బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసుల విచారణలో తమతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న వ్యక్తులే ఈ దారుణాలకు పాల్పడినట్లు తెలుసుకుని కంగుతింటున్నారు. గడిచిన 15 నెలల్లో ఒక్క విజయవాడలో 210 కేసులు వెలుగులోకి వచ్చాయి. స్వయంకృపరాధమే.. గృహిణులు, యువతులు, విద్యారి్థనులు అధిక సమయం స్మార్ట్ ఫోన్తోనే గడిపేస్తున్నారు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్లో వచ్చే వీడియోలు, షార్ట్ వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ తరహాలో తాము సైతం గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో వ్యక్తిగత ఫొటోలు, భర్త, పిల్లలతో సరదాగా తీసుకున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పరిచయాలను పెంచుకునే ప్రయత్నంలో తెలియని వారి ఫ్రెండ్ రిక్వెస్ట్లను కూడా ఆమోదిస్తున్నారు. అదును కోసం మాటు వేసిన సైబర్ నేరగాళ్లు వారితో పరిచయం పెంచుకుని మరిన్ని వీడియోలు, ఫొటోలను సేకరించి, ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఎడిటింగ్ యాప్ల సాయంతో అసభ్యకరంగా మారి్ఫంగ్ చేసి వేధింపులకు దిగుతున్నారు. ఇటీవల పెనమలూరు మండలం పోరంకి ప్రాంతానికి చెందిన ఓ వివాహిత ఇదే తరహాలో మోసపోయింది. తనతో పాటే చదువుకుంటున్న యువకుడు తన వీడియోను మారి్ఫంగ్ చేశాడని తెలియక సింగ్నగర్కు చెందిన మరో విద్యారి్థని మూడు నెలల పాటు మానసిక వేదన అనుభవించింది. మారి్ఫంగ్ వీడియోలు, ఫొటోల విషయం ఇంట్లో చెబితే ఏమంటారోనే భయంతో కీచకులు అడిగిన డబ్బు ఇవ్వడం, వారు చెప్పినట్లు చేస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. గతంతో నగరాలకే పరిమితమైన ఈ నేరాలు ప్రస్తుతం పల్లెలకూ పాకాయని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా నేరాల్లో బాధితులు అధికంగా విద్యావంతులే ఉంటున్నా, 25 శాతం మంది బాధితులే పోలీసులను ఆశ్రయిస్తున్నారని సమాచారం. పరువు పోతుందని కొందరు, సైబర్ నేరాలపై అవగాహన లేక మరి కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. అప్రమత్తంగా ఉండాలి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రా మ్లో ఎంతో మంది మోసగాళ్లు ఉంటారు. కొందరు మహిళలు పరిచయాలు పెంచుకునే క్రమంలో ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. సైబర్ నేరాల కట్టడికి కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ‘చేరువ’ వాహనం ద్వారా అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నాం. ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ ప్రొఫైల్కు లాక్ చేస్తే మంచిది. మన నుంచి వెళ్లిన ఫొటోలను మాత్రమే మోసగాళ్లు మారి్ఫంగ్ చేసి వేధిస్తారు. మన నుంచి మన ఫొటోలు వెళ్లకపోతే వారు ఏమీ చేయలేరు. – టి.కె.రాణా, పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా -
ఇండియాలో కంపెనీ పేరుతో దారుణం.. మహిళా ఉద్యోగుల ఇంటికి వెళ్లి..
తిరువళ్లూరు: కార్లకు కీ తయారు చేసే కంపెనీలో మహిళ ఉద్యోగినులపై తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కంపెనీ డైరెక్టర్ కియాంగ్ జూ లీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి బాధితులు ఫిర్యాదు చేసిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ తొడుగాడులో కార్లకు కీ తయారు చేసే పరిశ్రమ ఉంది. కాగా, ఈ కంపెనీలో 300 మంది పని చేస్తున్నారు. కంపెనీ డైరెక్టర్గా దక్షణ కొరియాకు చెందిన కియాంగ్ జూ లీ, హెచ్ఆర్గా రాము పని చేస్తున్నారు. కంపెనీలో పనిచేసే యువతులకు డైరెక్టర్ కియాంగ్ జూ లీ, హెచ్ఆర్ రాము సాయంతో తరచూ లైగింక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై బాధిత యువతులు మప్పేడు పోలీసులకు, మేనేజ్మెంట్కు గతంలో ఫిర్యాదు చేయగా పోలీసులు రాజీకుదిర్చినట్లు తెలిసింది. దీంతో కక్ష్యకట్టిన డైరెక్టర్ లీ, తనపై ఫిర్యాదు చేసిన వారిలో కొందరిని ఉద్యోగం నుంచి తొలగించాడు. మరికొందరిని అక్కడి నుంచి వేరే బ్రాంచీకి బదిలీ చేసినట్లు తెలిసింది. పోలీసుల హెచ్చరికతో కొద్ది రోజులు మౌనంగా ఉన్న లీ, ఇటీవల వేధింపుల పర్వానికి తెరతీశాడు. కంపెనీలో పనిచేసే యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించడం, నేరుగా యువతులు నివాసం ఉండే రూమ్లకు వెళ్లి వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. దీంతో వేధింపులు తాళలేక బాధిత యవతులు స్థానిక పోలీసులు, పంచాయతీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ప్రత్యేక విభాగానికి ఫిర్యాదులు చేశారు. తమపై లైగింక వేధింపులకు గురిచేస్తున్న కియాంగ్ జూ లీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆడియో వైరల్ కంపెనీలో పనిచేసే 27 ఏళ్ల యువతిపై రెండు నెలల నుంచి లీ వేధింపుల ఎక్కువైనట్లు తెలిసింది. యువతి నివాసం ఉండే ప్రాంతానికి వెళ్లిన లీ తనతో సహాజీవనం చేయాలని, లేనిపక్షంలో ఉద్యోగం నుంచి బయటకు పంపుతానని బెదిరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లీ బెదిరింపులపై యువతి కంపెనీ యాజమాన్యానికి ఫోన్ ద్వారా చేసిన ఫిర్యాదు ఆడియో ప్రస్తుతం వైరల్గా మారింది. “నాకు త్వరలోనే వివాహం కానుంది. ఈ సమయంలో లీ వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంటికి వచ్చి మరీ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని’ యువతి యాజమాన్యంతో మాట్లాడిన ఆడియో వైరల్గా మారింది. -
విధి వంచితురాలు!
తుమకూరు: భర్త మరణించడంతో అతని భార్య దళితురాలు అన్న కారణంతో భర్త కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆమె రెండున్నర ఏళ్ల కూతురితో కలిసి అత్తవారింటి ముందు ధర్నాకు దిగిన దారుణ ఘటన కర్నాటకలోని తుమకూరు నగరంలోని విద్యా నగరలో జరిగింది. అగ్రవర్ణాలకు చెందిన జితేంద్ర, బోవి సముదాయంకు చెందిన మంజుళ ప్రేమించి 2019 సెప్టెంబర్ 13వ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు. అయితే, భర్త జితేంద్ర అక్కలు తీవ్రంగా వ్యతిరేకించారు. విధి చిన్న చూపు చూసి.. జితేంద్ర నగరంలోని శ్రీశైల ఆగ్రో రైస్ మిల్లును నడిపించేవారు. అయితే ఈ జంటపై విధి చిన్నచూపు చూసింది. కామెర్ల వ్యాధితో జితేంద్ర 4 నెలల కిందట కన్నుమూశాడు. ఆ వెంటనే మంజుళను ఆడపడుచులు, అత్త బలవంతంగా ఇంటి నుంచి గెంటేశారు. నగరంలోని ఓ అద్దె ఇంట్లో తలదాచుకోగా ఆ యజమాని కూడా ఆమెను వెళ్లిపోవాలని కోరాడు. గత్యంతరం లేని ఆమె మళ్లీ భర్త ఇంటికి వెళ్లగా నువ్వు ఇంట్లోకి రావద్దు అని ఐదు మంది ఆడపడుచులు ఆమెను అడ్డుకున్నారు. తనకు న్యాయం చేయాలని ఆ ఇంటి ముందే ఫ్లెక్సీ కట్టుకుని ధర్నా చేపట్టింది. మంజుళకు మద్దతుగా ఆమె కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాలవారు వచ్చారు. -
కూతురుపైనే 32 ఏళ్లుగా తండ్రి అఘాయిత్యం.. పెళ్లైన తర్వాత కూడా..
దేశంలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కుటుంబ సభ్యులే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడంతో ఏళ్లు గడిచినా బాధితులు తమ ఆవేదనను బయటకి చెప్పుకోలేకపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి యూపీలో చోటుచేసుకుంది. తండ్రే.. తన కూతురుపై 32 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్కు చెందిన బాధితురాలు తండ్రి తన చిన్నతనంలోనే మరణించారు. దీంతో, తల్లి రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు బాధితురాలి వయస్సు ఏడేళ్లు. అనంతరం.. ఆమెపై కన్నేసిన తండ్రి.. బెదిరించి బలాత్కారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం తల్లికి చెబితే ఊరుకొమ్మని నోరు మూయించేది. దీన్ని ఆసరాగా తీసుకున్న కసాయి తండ్రి.. మరింత రెచ్చిపోయి ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో 2011లో ఆమెకు అలిగఢ్కు చెందిన ఓ జవానుతో వివాహం జరిగింది. తనకు వివాహం జరిగిన తర్వాతైన విముక్తి కలుగుతుందని భావించిన ఆమెకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె.. పుట్టింటికి వచ్చిన ప్రతీసారి తన లైంగిక వాంఛను తీర్చుకుంటూనే ఉన్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే భర్తపై తప్పుడు కేసులు బనాయించి జైలుపాలు చేస్తానని బెదిరించేవాడు. దీంతో, తన భర్త ఆమెను.. పుట్టింటికి వెళ్తావా అని అడిగిన ప్రతిసారీ భయంతో వణికిపోయేది. ఇదిలా ఉండగా.. ఇటీవలే తన భర్త ఆర్మీ నుంచి వీఆర్ఎస్ తీసుకొని అలిగఢ్లోనే ఓ చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఓరోజున తనకు జరిగిన దారుణాన్ని భర్తకు చెప్పి బోరున ఏడ్చేసింది. ఆమె మాటలు విని షాకైన భర్త.. భార్యకు సపోర్టుగా నిలిచాడు. అనంతరం, వారిద్దరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సవితా ద్వివేది మాట్లాడుతూ.. మహిళ ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్నాము. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
కాబోయే భర్తే కదా అని శారీరకంగా దగ్గరైంది.. కానీ, ఆ తర్వాతే..
అతనో పోలీస్.. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు. ఐ లవ్ యూ అంటూ ఆమెకు దగ్గరయ్యాడు. నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. తీరా పెళ్లి విషయం ఎత్తగానే ముఖం చాటేశాడు. దీంతో బాధిత కుటుంబ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఫిరోజాబాద్కు చెందిన యువతి(24)తో కానిస్టేబుట్ అమిత్ యాదవ్కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో యువతిని ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని అమిత్ తెలిపాడు. ఈ క్రమంలో కాబోయే భర్తే కదా అని ఆమె శారీరకంగా దగ్గరైంది. కాగా, పెళ్లి విషయం ఎత్తగానే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో, బాధితురాలు.. అమిత్ యాదవ్ ఇంటికి వెళ్లి అతడి తల్లిని అడుగగా.. 2021లో పెళ్లి చేసేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు. కానీ, కట్నం కారణంగా వాయిదా వేశారు. ఈ క్రమంలో మరోసారి పెళ్లి విషయమై అమిత్ను నిలదీయగా అదనపు కట్నం కావాలని కోరినట్టు తెలిపింది. ఈ సందర్బంగా బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘అమిత్, అతని తల్లి కూడా కట్నం డిమాండ్ చేసింది. అతని కుటుంబం రూ. 14 లక్షల కట్నం డిమాండ్ చేసింది. అమిత్తో నా వివాహం ఆగస్టు 2021కి నిర్ణయించారు. కట్నం కోసం అమిత్ పెళ్లిని వాయిదా వేయడమే కాకుండా, కట్నంగా రూ. 19 లక్షల ఇవ్వాలని కోరుతున్నాడు. ఇప్పుడు మా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో, ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుకు తెలపడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దర్యాప్తు ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫిరోజాబాద్ రూరల్ ఎస్పీ రణ్విజయ్ సింగ్ వెల్లడించారు. -
మహిళపై అత్యాచారం.. బీజేపీ నేతపై కేసు నమోదు చేయాలని కోర్టు సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతకు బిగ్ షాక్ తగిలింది. ఓ మహిళపై లైంగిక దాడి కేసులో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో, ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ 2018లో తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఢిల్లీకి చెందిన ఓ మహిళ దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ నేత తనపై అత్యాచారం చేశాడని, చంపేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు విముఖంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో, బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. కాగా, ఈ కేసులో విచారణలో భాగంగా గురువారం ఢిల్లీ హైకోర్టు.. షానవాజ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే, 3 నెలల్లో పోలీసులు విచారణ పూర్తి చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు విముఖంగా ఉన్నారని వాస్తవాలను పరిశీలిస్తే స్పష్టమవుతోందని ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. Delhi HC orders FIR against BJP leader Shahnawaz Hussain in rape case, chides police for ‘complete reluctance’https://t.co/kmI5D1X4TO pic.twitter.com/lRH46nmDqQ — Shining India News (@shiningindnews) August 18, 2022 ఇది కూడా చదవండి: కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు -
అప్పు కావాలి.. జూనియర్ ఆర్టిస్ట్ను నమ్మించి రూమ్లో ఫ్రెండ్స్తో కలిసి..
బంజారాహిల్స్: అప్పు కోసం వెళ్లిన జూనియర్ ఆర్టిస్ట్పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్లో నివసించే యువతి(22) సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవనం సాగిస్తోంది. కాగా, ఆదివారం మధ్యాహ్నం తనకు డబ్బులు అవసరమై బాలు నాయక్ అనే యువకుడిని అడిగింది. డబ్బులు ఇస్తానని లోపలికి పిలిచిన బాలు నాయక్ ఆమెను గదిలో బంధించి లైంగికదాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న తన స్నేహితుడితో కూడా గడిపితే రూ. 5 వేలు ఇస్తానంటూ షరతు విధించాడు. బాధితురాలు వారి బారి నుంచి తప్పించుకుని బయటికి వచ్చి తన బంధువుకు ఫోన్ చేసింది. ఇద్దరూ వెళ్లి అడిగేందుకు ప్రయత్నించగా అప్పటికే నిందితుడు గదికి తాళం వేసి ఉడాయించాడు. బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: బెంగళూరు యువతులతో హైటెక్ వ్యభిచారం -
ధర్మవరంలో టీడీపీ నేతపై లైంగిక వేధింపుల ఆరోపణలు
-
టీడీపీ నేత అకృత్యాలు.. వివాహితపై లైంగిక వేధింపులు
సాక్షి, శ్రీసత్యసాయి: టీడీపీ నేత రెచ్చిపోయాడు. ధర్మవరంలో చారుగుండ్ల ఓబిలేసు ఓ వివాహితను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అంతేకాకుండా ఆమె భర్తను బెదిరింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో వివాహిత భర్త భాషా.. మనస్థాపంతో ఆత్మహత్యయత్నం చేశాడు. రైల్వే ట్రాక్పై సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తనను చారుగుండ్ల ఓబిలేసు.. చంపేస్తానని బెదిరించినట్టు భాషా తెలిపాడు. -
మెట్రో స్టేషన్లో వికృత చేష్టలు.. మహిళ దగ్గరకు వచ్చి..
ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. యువతులు, మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. మెట్రో రైల్వే స్టేషన్లో మహిళ పట్ల ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జూన్ 2వ తేదీన చోటుచేసుకోగా.. 100 గంటలపాటు సీసీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఎల్లో లైన్లో జూన్ 2న ఒక మహిళ మెట్రో రైలులో ప్రయాణించింది. ఆమె స్టేషన్లో కూర్చుని ఉండగా.. ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఒక అడ్రస్ గురించి అడిగాడు. ఆ అడ్రస్ గురించి చెప్పిన ఆమె జోర్ భాగ్ మెట్రో స్టేషన్లో దిగింది. ఫ్లాట్ఫామ్పై ఒక చోట కూర్చొని క్యాబ్ బుక్ చేస్తున్నది. నిందితుడు కూడా.. అదే స్టేషన్లో దిగాడు. అనంతరం.. అతడు మళ్లీ ఆమె వద్దకు వచ్చి.. అడ్రస్ అడిగాడు. దీంతో, ఆమె.. అతడికి అడ్రస్ చెబుతుండగా.. నిందితుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. దీంతో షాకైన బాధితురాలు.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం, ఈ ఘటన గురించి సిబ్బందికి చెప్పింది. కానీ, వారు పట్టించుకోకపోవడంతో ట్విట్టర్ వేదికగా.. వరుస ట్వీట్స్ చేసింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దాదాపు 100 గంటలు సీసీ ఫుటేజీని చెక్ చేసిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. అతడిని కోట్లా ముబారక్పూర్లో నివాసం ఉంటున్న మానవ్ అగర్వాల్(40)గా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం నిందితుడు.. నేపాల్కు పారిపోయాడని తెలిపారు. Woman Molested Inside Delhi Metro Station, Horrific Act Caught on CCTV#DelhiMetro #JorBagh pic.twitter.com/iHKP2nMWwl — TIMES NOW (@TimesNow) July 6, 2022 ఇది కూడా చదవండి: మెట్రో స్టేషన్లో యువతిపై లైంగిక వేధింపులు.. మరీ ఇంత దారుణమా..? -
భువనగిరిలో దారుణం.. మహిళ ఫొటోలు తీసి బెదిరింపులు
సాక్షి, యాదాద్రి భువనగిరి: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండలంలోని కొర్ర తండాలో ఇద్దరు మైనర్ బాలురు దారుణానికి ఒడిగట్టారు. రెండు రోజుల క్రితం ఇంటి ముందు నిద్రిస్తున్న ఓ మహిళ(40) వస్త్రాలను తొలగించి ఇద్దరు మైనర్లు.. ఆమె నగ్న చిత్రాలను తీశారు. అనంతరం ఆ ఫొటోలను ఆమెకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా.. నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో వారి మిత్రులకు షేర్ చేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఒక మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: సూర్యాపేటలో ప్రైవేట్ ఆసుపత్రి సీజ్.. ఎందుకో తెలుసా..? -
మసాజ్ పేరుతో దారుణం.. భారత్ పరువు తీస్తున్నారు కదరా అయ్యా..
దేశంలో రోజురోజుకు మహిళలు, యువతులుపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. కొందరు మృగాలు భారత్ పరువును తీస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులపై లైంగిక దాడులకు పాల్పడుతూ.. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతిస్తున్నారు. తాజాగా గోవా ట్రిప్ కోసం వచ్చిన ఓ బ్రిటిష్ జంటకు చేదు అనుభవం ఎదురైంది. వివరాల ప్రకారం.. గోవాలోని అరాంబోల్ బీచ్కు బ్రిటన్కు చెందిన కపుల్స్ వచ్చారు. ఈ క్రమంలో వారికి టూరిస్ట్ గైడ్గా విన్సెంట్ డిసౌజా పరిచయం చేసుకుని బీచ్లు తిప్పాడు. అనంతరం.. అంతర్జాతీయ పర్యాటకులతో బాగా ప్రాచుర్యం పొందిన ఉత్తర గోవా జిల్లాలోని అరాంబోల్ బీచ్ సమీపంలో మసాజ్ చేపిస్తానంటూ వారిని అక్కడికి తీసుకెళ్లాడు. మసాజ్ చేస్తున్న క్రమంలో డిసౌజా.. భర్త కళ్ల ముందే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూన్ 2వ తేదీన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ దారుణ ఘటన అనంతరం బాధితులు.. బ్రిటన్లో ఉన్న తమ కుటుంబ సభ్యులను సంప్రదించి.. భారత్లోని బ్రిటిష్ రాయబార కార్యాలయం నుంచి సహాయం కోరిన తర్వాత బాధితులురాలు పెర్నెమ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కాగా. నిందితుడు గతంలో ఓ పాఠశాలలో లైబ్రేరియన్గా కూడా పనిచేశాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం రష్యా దేశానికి చెందిన యువతిపై ఓ భారతీయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది కూడా చదవండి: ఆన్లైన్లో రమ్మీకి బానిసై.. ఇంట్లో భర్త లేనప్పుడు.. -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: చిక్కిన నిందితులు.. వారి బ్యాక్ గ్రౌండ్ ఇదే..
జూబ్లీహిల్స్లో ఓ మైనర్పై అత్యాచార ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. పోలీసులే నిందితులకు అండగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇదిలా ఉండగా.. ఆదివారం ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అమ్నీషియా పబ్ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో మైనర్తో పాటు ఉమేర్ఖాన్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మైనర్లు, ఒక మేజర్ ఉన్నారు. కాగా, నిందితులంతా రాజకీయ నేతల కొడుకులుగా పోలీసులు గుర్తించారు. నిందితులు వీరే.. A1.. సాదుద్దీన్(ఎంఐఎం నేత కొడుకు) A2.. ఉమేర్ఖాన్(ఎమ్మెల్యే సోదరుడి కొడుకు) మైనర్-1.. వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు మైనర్-2.. ఎంఐఎం కార్పొరేటర్ కొడుకు మైనర్-3.. సంగారెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్ కొడుకు ఉన్నారు. ఇదిలా ఉండగా.. మైనర్పై అత్యాచార కేసుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరా రాజన్ స్పందించారు. ఈ ఘటనపై నివేదికను సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. 2 రోజుల్లో నివేదికను అందించాలని ఆదేశించారు. మరోవైపు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులు.. లైంగిక దాడి అనంతరం కారులో మొయినాబాద్కు వెళ్లారు. అక్కడ ఓ రాజకీయ నేతకు చెందిన ఫాంహౌస్లో ఆశ్రయం పొందారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: అత్యాచారం ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కేసీఆర్కు బండి లేఖ -
మెట్రో స్టేషన్లో యువతిపై లైంగిక వేధింపులు
దేశంలో యువతులు, మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించే సమయంలో కొందరు ఆకతాయిలు మహిళలను లైంగికంగా వేధిస్తూనే ఉన్నారు. తాజాగా మెట్రో స్టేషన్లో ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు.. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చేటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాధిత యువతి ఢిల్లీలోని జోర్బాగ్ మెట్రో స్టేషన్లో రైలు ఎక్కింది. అనంతరం రైలులో ఉన్న ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఓ అడ్రస్ గురించి అడిగాడు. ఈ క్రమంలో ఆమె అతడికి అడ్రస్ చెప్పింది. అనంతరం ఆమె దిగిపోవాల్సిన స్టేషన్ రాగా.. రైలు దిగి మరో రైలు కోసం ఎదురు చూస్తూ ప్లాట్ఫామ్ మీద ఉన్న బెంచి మీద కూర్చుంది. ఇంతలో అడ్రస్ అడిగిన వ్యక్తి మళ్లీ ఆమె వద్దకు వచ్చి.. మరోసారి అడ్రస్ను కోరి.. క్లియర్ చెప్పమని అడిగాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి.. బాధితురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తన శారీరక అవయవాలను ఆమెకు తాకిస్తూ దారుణంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు.. అతను ఏం చేస్తున్నాడో గమనించి.. ప్లాట్ఫామ్ మీది ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పింది అతను పట్టించుకోకుండా పై ఫ్లోర్లో ఉన్న స్టేషన్లో ఫిర్యాదు చేయమన్నాడు. దీంతో షాకైన యువతి.. మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని కూడా గుర్తించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకునేందుకు నిరాకరించారు. దానిని పెద్ద సీన్ చేయవద్దని ఆమెకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో, బాధితురాలు తనకు జరిగిన చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కు ఫిర్యాదు చేసింది. ఆమె ట్వీట్కు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. ఆ ఘటనపై తగు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. ఇక, ఈ ఘటనపై సీరియస్ అయిన ఢిల్లీ మహిళా కమిషన్.. కేసు సుమోటోగా స్వీకరిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. Zero-tolerance for any indecent behaviour, sexual harassment: DMRC on Jor Bagh station case In a statement, it also asserted that the Delhi Metro Rail Corporation, as an organisation has "zero-tolerance for any act amount... #News by #EconomicTimes https://t.co/wOyd25dCYK — Market’s Cafe (@MarketsCafe) June 4, 2022 In the context of the recent incident reported at Jorbagh, we have already taken up the issue with the concerned security agencies. Delhi Police has already taken cognizance of the complaint and are investigating into the matter. — Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) June 3, 2022 ఇది కూడా చదవండి: ‘ఆర్య సమాజ్’ మ్యారేజ్ సర్టిఫికెట్లు చెల్లవు -
తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న.. ఎవరూ లేని సమయంలో..
తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న దారుణానికి ఒడిగట్టాడు. అన్నాదమ్ములు ఇద్దరూ కవలలు కావడంతో.. దీన్ని ఆసరాగా తీసుకున్న అన్న.. మరదాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒకే రూపంతో ఉన్న అతడి విషయంలో మోసపోయిన ఆమె.. విషయం భర్తకు చెప్పడంతో అతడి సమాధానం విని షాకైంది. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా కేంద్రం శివాజీనగర్లో ఓ కుటుంబం నివసిస్తోంది. వారి కుటుంబంలో ఇద్దరు కవలసోదరులు ఉన్నారు. వారిని ఎవరు అని గుర్తించడమే పేరెంట్స్కే కొన్నిసార్లు సాధ్యపడేది కాదు. ఇదిలా ఉండగా.. వాళ్లకు పెళ్లీడు రావడంతో కుటుంబీకులు కవలలైన అమ్మాయిల జంట కోసం వెతికారు. అలా దొరక్కపోవడంతో ఎవరో ఒకరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కొద్దిరోజులు గడిచాక.. తనకు ఇప్పుడే పెళ్లి వద్దని పెద్దోడు చెప్పడంతో ఆరు నెలల కిందట చిన్నోడికి ఓ అమ్మాయితో వివాహం జరిపించారు. ఇప్పటి వరకు అంతా బాగానే సాగిన వ్యవహారం.. ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఓ సమయంలో అత్తారింట్లో కాపురానికి వచ్చిన మరదలిపై.. అన్న కన్నేశాడు. అన్నదమ్ములిద్దరూ ఒకేలా ఉండటంతో అతడికి అది వరమైంది. ఓ రోజు తమ్ముడు లేని సమయం చూసుకొని అతనిలా గదిలోకి దూరి మరదలితో లైంగిక దాడికి పాల్పడ్డాడు. భర్తే కదానే నమ్మకంతో ఆమె కూడా అడ్డుచెప్పలేదు. ఇలా ఆరు నెలలుగా వికృత ఉదంతం కొనసాగుతుండగా.. అనుమానం వచ్చిన ఆమె.. అసలు విషయం తెలుసుకుని షాకైంది. ఈ విషయాన్ని వెంటనే.. తన భర్త, అత్తమామలకు చెప్పేసింది. ఈ క్రమంలో భర్తతో సహా కుటుంభ సభ్యులందరూ అన్నకే మద్దతిచ్చారు. విషయం బయటికి తెలిస్తే కుటుంబం పరువు పోతుందని, కాబట్టి నోరు మూసుకుని మునుపటిలా సాగిపోమని భర్తతోపాటు మిగతా అందరూ ఆమెను బెదిరించారు. వారి బెదిరింపులను లెక్కచేయని బాధితురాలు.. తన పుట్టింటివాళ్లను పిలిపించి, వారి సాయంతో పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేసింది. బాధితురాల ఫిర్యాదుతో పోలీసులు కవల సోదరుడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు శివాజీనగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి దిలీప్ దొలారే తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం.. -
‘లవ్ యూ’ అంటూ దగ్గరయ్యాడు.. శారీరకంగా ఒక్కటయ్యాక..
ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. అతడి మాటలు నమ్మిన ఆమె.. శారీరకంగా దగ్గరైంది. తీరా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాక.. అతడి నిజస్వరూపం తెలుసుకొని బాధితురాలు షాకైంది. అనంతరం ఆమెను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసుల అధికారి అలోక్ శ్రీ వాస్తవ తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్లోని అశోకనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నిహల్ ఖాన్(30) అనే వ్యక్తి ఆసుపత్రిని రన్ చేస్తున్నాడు. ఆసుపత్రిలో బాధితురాలు(28) ఫిజియోథెరిపిస్టుగా పని చేస్తోంది. కాగా, కుటుంబ కలహాల కారణంగా బాధితురాలు 2018లో తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా బ్రతుకుతోంది. అయితే, ఆమె ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో నిహల్ ఖాన్లో క్లోజ్నెస్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వారిద్దరూ శారీరంగా ఒక్కటయ్యారు. తీరా పెళ్లి ప్రస్తావన తెచ్చాక.. తాను హిందు కాదని ముస్లిం అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాకైంది. నిహల్ ఖాన్ తనను మోసం చేశాడని గుర్తించింది. అనంతరం అతడిని ఎందుకిలా చేశావని నిలదీయగా.. మతం మార్చుకుంటే తనను పెళ్లి చేసుకుంటానని నిహల్ చెప్పడంతో ఖంగుతింది. ఈ క్రమంలో ఆమెను మతం మారాలని అతడు ఒత్తిడి చేస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నిహాల్ ఖాన్పై మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం, భారతీయ శిక్షాస్మృతి ప్రకారం అత్యాచారం ఆరోపణలపై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన మామిడికాయ పచ్చడి.. క్షణికావేశంలో -
మంత్రి కొడుకు అరాచకం.. మహిళపై అత్యాచారం చేసి..
మంత్రి కొడుకు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక.. నిందితుడు ఇంట్లో లేకపోవడంతో ఇంటికి పోలీసులు సమన్లు అంటించారు. ఈ ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషి(23) తనపై లైంగిక దాడి చేశాడని ఓ మహిళ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. గత ఏడాది జనవరి 8 నుంచి ఏప్రిల్ 17 వరకు పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే, జనవరి 8వ తేదీన రోహిత్ జోషిని ఆమె కలిసినప్పడు డ్రింక్లో మత్తు మందు కలిపి తనపై లైంగికదాడికి పాల్పడినట్లు తెలిపింది. ఆ సమయంలో తన నగ్న ఫొటోలు, వీడియోలు చూపించి బెదిరించి, బ్లాక్మెయిల్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం గతేదాడి ఆగస్ట్ 11న గర్భం దాల్చినట్లు తెలియడంతో అబార్షన్ మాత్ర వేసుకోవాలని రోహిత్ జోషి.. తనను బెదిరించినట్లు తెలిపింది. దీంతో, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. ఆదివారం రాజస్థాన్లోని రోహిత్ జోషి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులు.. అరెస్ట్ చేసేందుకు సమన్ల నోటీసును ఇంటి డోర్కు అంటించారు. లైంగిక దాడి కేసుపై విచారణకు మే 18లోగా హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: నువ్వు లేకపోతే చచ్చిపోతానని నమ్మించి.. పలుమార్లు లైంగిక దాడి -
లిఫ్ట్ పేరుతో టీచర్పై లైంగిక దాడి.. వీడియోలు తీసి ఆ తర్వాత..
దేశంలో ప్రతీరోజు ఎక్కడో ఒక చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ముస్లిం వ్యక్తి.. టీచర్పై లైంగిక దాడి చేసి వీడియోలు తీసి అనంతరం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. షహజాన్పూర్లో లిఫ్ట్ పేరుతో అమీర్ అనే వ్యక్తి గవర్నమెంట్ టీచర్(28) బైకుపై ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెకు మత్తుమందు వాసన చూపించి స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత అమీర్.. టీచర్పై అత్యాచారం చేసి వీడియోలు తీశాడు. ఇదిలా ఉండగా.. తమ కుమారుడిని కాపాడుకునేందు టీచర్ను మతం మారాలని, తనను పెళ్లి చేసుకోవాలని అమీర్ కుటుంబ సభ్యులు టీచర్ను బెదిరింపులకు గురిచేశారు. దీంతో.. సదరు మహిళ జరిగిన విషయాన్ని పోలీసులు తెలిపి అమీర్పై ఫిర్యాదు చేసింది. నిందితుడు అమీర్తో సహా ఐదుగురిపై ఉత్తరప్రదేశ్లో తీసుకువచ్చిన మత మార్పిడి నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. కాగా, ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఇది కూడా చదవండి: నరకం చూపించారు, బర్త్డే రోజే చంపేశారు: మోడల్ తల్లి -
బాలుడిపై మహిళ లైంగిక దాడి.. చివరకు భలే ట్విస్టు
బాలుడిని లైంగికంగా వేధించినందుకు ఓ మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్టు బాధితుడు పోలీసులకు వివరించాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ధారావికి చెందిన ఓ మహిళ(20)కు ఓ బాలుడి(17)తో సోషల్ మీడియాతో 2020లో పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె.. అతడికి తన లవ్ ప్రపోజ్చేసింది. కానీ, బాలుడు ఆమె ప్రపోజల్ను తిరస్కరించాడు. అనంతరం ఆమె ఫోన్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశాడు. ఆమె మాత్రం వేరే ఫోన్ నెంబర్లు, ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి అతడిని వేధించింది. ఇదిలా ఉండగా.. బాధిత బాలుడు జనవరి 19న ఉద్యోగం వెతుక్కుంటూ ముంబైలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ, అతడిని కలవాలని ధారవిలోని తన బాలుడిని ఇంటికి ఆహ్వానించింది. దీంతో ఆ బాలుడు ఆమె ఇంటికి రాగా.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడిపై లైంగిక దాడికి పాల్పడింది. అంతేకాకుండా తర్వాత కూడా వాషిలోని ఓ లాడ్జితో పాటు పలు ప్రాంతాలకు బాలుడిని పిలిపించుకొని ఆమె లైంగిక వేధింపులకు పాల్పడిందని బాధితుడు పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో బాలుడి ఫిర్యాదు మేరకు ఆమెపై పోక్సో చట్లంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మరోవైపు.. బాలుడి కుటుంబానికి ఆమె మరో షాకిచ్చింది. బాలుడితో పాటు అతని తండ్రి, నలుగురు మేనమామలు, బంధువు.. తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తూ నవీ ముంబై పోలీసులను ఆశ్రయించింది. నవీ ముంబై పోలీసులు కేసును ధారవి పోలీసులకు బదిలీ చేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇది కూడా చదవండి: మాజీ ప్రేయసి ఇంకొకరితో చనువుగా ఉందని.. -
టీడీపీ నేతల అకృత్యాలు.. నిద్రిస్తున్న మహిళ, యువతిపై అత్యాచారం
సాక్షి, తాడేపల్లి రూరల్/పీఎంపాలెం (భీమిలి): మహిళలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాష్టీకాలు కొనసాగుతున్నాయి. నిన్నటికి నిన్న గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో వివాహిత హత్య వ్యవహారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యూత్ సభ్యుడు సతీష్చౌదరి, అతడి స్నేహితుడు సాయిరామ్లు నిందితులన్న విషయం తెలిసిందే. ఈ దారుణాన్ని మరువక ముందే తాజాగా దుగ్గిరాల మండలం శృంగారపురంలో మరో టీడీపీ కార్యకర్త బరితెగించి మహిళపై లైంగికదాడికి యత్నించాడు. నిద్రిస్తున్న వివాహితపై అఘాయిత్యానికి యత్నం అనకాపల్లి జిల్లా నుంచి పనుల కోసం వలస వచ్చిన ఓ మహిళా కూలీ గురువారం అర్ధరాత్రి శృంగారపురంలోని తిరుపతమ్మ తల్లి గుడిలో నిద్రిస్తోంది. ఆ సమయంలో పూటుగా మద్యం తాగి వచ్చిన టీడీపీ కార్యకర్త మల్లెల కిరణ్ ఆమెను నిద్రలేపి.. నోరు మూసి.. పక్కకు లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. ఆ పెనుగులాటలో ఆ మహిళ భర్తతోపాటు బంధువులు నిద్రలేవడంతో ఆమెను అక్కడే వదిలి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వారంతా అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇంతలో మల్లెల కిరణ్ అనుచరులు, స్థానిక టీడీపీ నేతలు వచ్చి మహిళ భర్తకు నచ్చజెప్పి కిరణ్ను ఇంటికి తీసుకువెళ్లారు. జరిగిన ఘటనపై మహిళ శుక్రవారం తెల్లవారుజామున 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో విషయం బయటకొచ్చింది. ఆమె ఫిర్యాదుతో దుగ్గిరాల ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కిరణ్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మైనర్పై లైంగికదాడి.. ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ 5వ వార్డు పరిధి కొమ్మాది రాజీవ్ గృహకల్ప 130వ బ్లాకులో నివసిస్తున్న టీడీపీ నేత తోట నరేంద్ర (33) అదే కాలనీలో నివసిస్తున్న మైనర్(17)కు మాయమాటలు చెప్పి ఈనెల 12వ తేదీన లైంగికదాడికి పాల్పడ్డాడు. ఘటన వల్ల ఆరోగ్యపరంగా కొన్ని రోజులుగా బాలిక ఇబ్బంది పడుతుండడంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో లైంగికదాడి విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి శుక్రవారం ఉదయం పోలీసులకు నరేంద్రపై ఫిర్యాదు చేసింది. కాగా, నిందితుడ్ని అరెస్టు చేశామని సీఐ రవికుమార్ స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై పోక్సో కేసు -
టీడీపీ కార్యకర్త అరాచకం.. మహిళపై అత్యాచారయత్నం
సాక్షి, గుంటూరు: టీడీపీ క్రియాశీలక కార్యకర్త మల్లెల కిరణ్ దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళా కూలీపై అత్యాచారానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దుగ్గిరాల మండలం శృంగారపురంలో కిరణ్ శుక్రవారం.. ఓ మహిళా కూలీపై అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలిని పొలాల్లోకి లాక్కెళ్తుండగా తోటి కూలీలు గమనించారు. ఈ క్రమంలో డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని కిరణ్ను అరెస్ట్ చేశారు. -
వరసలు మరచిన మృగం.. చెల్లెల్లిని గర్భవతిని చేసి..
తిరువళ్లూరు: విద్యార్థినికి మాయమాటలు చెప్పి గర్భవతిని చేసిన అన్న (పెద్దమ్మ కుమారుడు)ను తిరువళ్లూరు మహిళ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ఆరణి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ప్లస్టూ చదువుతోంది. అయితే పాఠశాలకు వెళ్లి రావడానికి బస్సు సదుపాయం లేకపోవడంతో తిరువళ్లూరు సమీపంలోని రామతండలం గ్రామంలోని పెద్దమ్మ కర్పగం వద్ద ఉంటూ చదువుకుంటోంది. అయితే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో కర్పగం కుమారుడు నాగరాజ్ వరసకు చెల్లెలు అయ్యే విద్యార్థినికి మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల విద్యార్థిని అనారోగ్యానికి గురికావడంలో అనుమానించిన తల్లిదండ్రులు ఆమెను సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఆమె గర్భం దాల్చినట్టు నిర్ధారించారు. దీంతో, బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు తిరువళ్లూరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక గర్భం దాల్చడానికి ఆమె పెద్దమ్మ కొడుకు నాగరాజ్ కారణ అని తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేశారు. కాగా ఇది వరకే నాగరాజ్కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉండడం గమనార్హం. అత్యాచారానికి పాల్పడిన మైనర్కు వినూత్న శిక్ష మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో మైనర్ బాలుడికి తిరువళ్లూరు కోర్టు న్యాయమూర్తి రాధిక వినూత్న శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడు, అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. బాలిక తల్లి 2021లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణ తిరువళ్లూరులోని జువైనల్ కేసులను విచారించే ప్రత్యేక కోర్టులో సాగింది. విచారణలో నిందితుడి నేరం ఒప్పుకోవడంతో న్యాయ మూర్తి రాధిక తీర్పును వెలువరించారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో ఏడాది పాటు పళ్లిపట్టు ప్రభుత్వ వైద్యశాలలో పారిశుద్ధ్య పనులను చేపట్టాలని ఆదేశించారు. -
దారుణం.. ఉద్యోగాలు ఇప్పిస్తామని మహిళలను తీసుకెళ్లి..
దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలను లైంగికంగా వేధించడం, దాడులు చేయడం వంటివి మాత్రం ఆగడం లేదు. తాజాగా మహిళలను ఉద్యోగాల పేరుతో మోసం చేసి వారి చేత అశ్లీల నృత్యాలు చేయాలని బలవంతం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణం మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జబల్పుర్కు చెందిన సన్నీ సొంధియా, నిధీ సొంధియా దంపతులు, దర్భంగాకు చెందిన పింటూ కుమార్ ఠాకుర్లతో కూడిన ముఠా ఉద్యోగాల పేరుతో మహిళలను వేధింపులకు గురిచేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మహిళలు, యువతులను నమ్మించి వారిని వివిధ ప్రాంతాలకు అక్రమరవాణా చేస్తూ.. పెళ్లి వేడుకల్లో వారి చేత బలవంతంగా అశ్లీల నృత్యాలు చేయించేవారు. ఇదిలా ఉండగా.. ఉద్యోగాల పేరుతో కొందరు మహిళలను ఈనెల 11వ తేదీన ఈ ముఠా జబల్పూర్కు తరలిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బీహార్ పోలీసుల సాయంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించి మోతీహరీ ప్రాంతంలో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నలుగురు మహిళలను రక్షించారు. -
మహిళతో అసభ్యకర ప్రవర్తన.. పోలీసును చెప్పుతో కొట్టిన వీరనారి..
లక్నో: అతనో పోలీస్.. ప్రజలకు రక్షణగా ఉండాల్సిందిపోయి.. తాగిన మైకంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను బలంగా తోసేశాడు.. చివరకు ఆమె వీరనారిలా పోరాడింది. అందరూ చూస్తుండగానే పోలీసును తన చెప్పుతో చితకబాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ పోలీస్ కానిస్టేబుల్ మద్యం సేవించి హల్ చల్ చేశాడు. చార్ బాగ్ రైల్వే స్టేషన్లో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె ప్రతిఘటనకు దిగింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు, మహిళపై తన ప్రతాపం చూపించాడు. లాఠీతో దారుణంగా కొట్టాడు. ఈ క్రమంలో మహిళను తోసివేయగా ఆమె కిందపడిపోయింది. అనంతరం పైకి లేచిన సదరు మహిళ.. పోలీసులపై చెప్పుతో దాడికి దిగింది. ఈ సందర్భంలో వారి పక్కనే ఉన్న మరో మహిళా పోలీస్.. అతడిని వారిస్తున్న అదేమీ పట్టించుకోకుండా వారిపై కానిస్టేబుల్ దాడి చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఇతర పోలీసులు వచ్చి అతడిని అడ్డుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ తతంగమంతా అక్కడ ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. Drunk Black Sheep Beaten By Brave People. Sometimes We Need To Fight With Powerful To Raise Our Voice. Incident : Lucknow's Char Bagh station pic.twitter.com/KCPR2XBK2I — Binita Bhil (@BhilBinita) March 18, 2022 -
భార్యను ట్రోల్ చేస్తే ఊరుకుంటాడా.. ఏం చేశాడో తెలుసా?
Tarun Katial to launch women-only platform Eve World: విదేశాలతో పోలిస్తే.. మన దేశంలో మహిళలకు సంబంధించిన యాప్స్(ప్రైవేట్) చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా భద్రతకు సంబంధించిన యాప్స్ వేళ్ల మీద లెక్కపెట్టేవిగా ఉన్నాయి. ఈ తరుణంలో మీడియా దిగ్గజం తరుణ్ కటియాల్ ఏకంగా ఒక వర్చువల్ ప్రపంచాన్నే రూపొందించాడు. అందుకు ఆయనకి స్ఫూర్తి ఇచ్చింది.. స్వయంగా ఆయన భార్యకి ఎదురైన అనుభమే!. ఈవ్ వరల్డ్.. మహిళల భద్రత కోసం రూపొందించిన ప్లాట్ఫామ్. ఈ ప్రపంచంలోకి కేవలం మహిళలకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఆడవాళ్లు తమ అనుభవాల్ని పంచుకోవడం, ఓదార్పు కోరుకోవడం, సలహాలు ఇచ్చుకోవడం, ఇతర సమస్యలపై చర్చించుకోవడం కోసం ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రత్యేకంగా ఒక స్పేస్ ఏర్పాటు చేయడం ద్వారా అసలు సమస్య పరిష్కారం అవుతుందా? వాళ్లకు ఉపశమనం దొరుకుతుందా? అనే ప్రశ్నలకు.. తరుణ్ కటియాల్ సమాధానమిస్తున్నారు. ‘‘మేం వాళ్ల(మహిళల) ప్రపంచాన్ని పూర్తిగా మార్చలేకపోవచ్చు. కానీ, ఎంతో కొంత మంచి మాత్రం చేస్తాం. ఇదే మా ట్యాగ్ లైన్ కూడా అని చెప్తున్నారాయన. సమస్యకు పరిష్కారం చూపలేకపోయినా ఇంటర్నెట్లో, సంప్రదాయ సోషల్ మీడియా నెట్వర్క్స్లో ఎదుర్కొనే వేధింపుల గురించి మహిళలు బహిరంగంగా(పురుష సమాజంతో సంబంధం లేకుండా) చర్చించుకునేందుకు ఒక వేదికను అందిస్తున్నామని అంటున్నారాయన. భారత్లో మహిళల మీద ఆన్లైన్ వేధింపులు పెరిగిపోయాయి. గతంలో ఫిర్యాదులు 300 వచ్చేవి. కరోనా టైం నుంచి ఆ సంఖ్య ఐదు రెట్లు ఎక్కువైంది. - నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ రేఖా శర్మ తరుణ్ కటియాల్ గతంలో బిగ్ ఎఫ్ఎం, జీ5కు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పని చేశారు. స్టార్ ఇండియా, సోనీ ఎంటర్టైన్మెంట్, రియలన్స్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్లోనూ పని చేసిన అనుభవం ఉందాయనకు. ఆయన భార్య మోనిషా సింగ్ కటియాల్ కూడా మీడియా రంగంలోనే కొనసాగుతున్నారు. ఓసారి కొందరు వ్యక్తులు ఆమె నెంబర్ వాట్సాప్కి సందేశాలు పంపుతూ ట్రోల్ చేశారట. దీంతో పోలీసులను ఆశ్రయించాలని ఆయన నిర్ణయించుకున్నారు. కానీ, ‘ఫిర్యాదు చేసినా అతనిపై(నిందితుడి) ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి’ అంటూ భార్య చెప్పిన మాటలతో తరుణ్ కటియాల్ ఆలోచనలో పడ్డారట. అలా ఈవ్ వరల్డ్కు బీజం పడిందని చెప్తున్నారాయన. (క్లిక్: గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2021: మనోడు కాదు.. అయినా తెగ వెతికారు!) ఈవ్ వరల్డ్.. జూన్ 2021 నుంచి రియాలిటీలోకి వచ్చింది. ఇందులో మొదటి యూజర్గా చేరింది మోనిషా సింగ్ కటియాల్. మహిళా సాధికారికత సాధన ధ్యేయంగా రూపొందించిన ఈ ప్లాట్ఫామ్లో.. మహిళలు నిరభ్యంతరంగా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. కంటెంట్తో పాటు కమ్యూనిటీలను సైతం క్రియేట్ చేసుకోవచ్చు. పరిణామాలు, పర్యవసనాల్ని పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. పైగా ఈవ్ వరల్డ్లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. అదనంగా బ్లాక్చెయిన్ టెక్నాలజీని సైతం జత చేశారు. తద్వారా యూజర్ ప్రతీ చర్యకూ రివార్డులు దక్కుతుంటాయి. అవి పాయింట్లు, లేదంటే వర్చువల్ టోకెన్ల రూపంలో అందిస్తారు. వాటిని డాక్టర్ కన్సల్టింగ్ కోసం, మానసిక వైద్యులను సంప్రదించడం కోసం, షాపింగ్ లేదంటే ఎన్ఎఫ్టీలు కొనుగోలు చేయడం కోసం ఉపయోగించుకోవచ్చు. తద్వారా యూజర్తో పాటు ఈవ్ వరల్డ్కి ప్రమోషన్ ద్వారా ఆదాయమూ జనరేట్ అవుతుంది. (చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కొత్త రూల్స్ పాటించాల్సిందే!) - సాక్షి, వెబ్ స్పెషల్ -
ఫోన్ కాల్తో పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒకే ఒక్క ఫోన్ కాల్తో మహిళలకు చట్టబద్ధమైన పరిష్కారం లభిస్తోంది. ఏ మహిళకు కష్టమొచ్చినా వెంటనే పోలీస్ సహాయాన్ని కోరే స్థాయికి చైతన్యం పెరిగింది. రాష్ట్రంలో డయల్ 100, డయల్ 112, దిశ కాల్ సెంటర్లకు లభిస్తున్న స్పందనే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న ఏపీ పోలీస్ శాఖ.. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపడుతోంది. ప్రధానంగా అత్తమామలు, ఆడపడుచు, భర్త పెట్టే గృహహింస కేసులపై పోలీసులు తక్షణ చర్యలు చేపడుతున్నారు. గడచిన ఏడాది కాలంలో గృహహింస కాల్స్ అధికంగా వస్తుండగా.. వాటిపై పోలీసు శాఖ తక్షణ చర్యలు చేపడుతుండటం విశేషం. మహిళలు, విద్యార్థినులు డయల్ 100, 112, దిశ కాల్ సెంటర్ను పెద్ద సంఖ్యలోనే వినియోగించుకుంటున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. మహిళలపై వేధింపులు, దాడులు వంటి తదితర అంశాలకు సంబంధించి 100, 112, దిశ కాల్ సెంటర్లలో దేనికైనా ఫోన్కాల్ వచ్చిన క్షణం నుంచే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. కాల్ సెంటర్లో ఫిర్యాదు ఆటోమేటిక్గా వాయిస్ రికార్డు అవుతుండగా.. కాల్ సెంటర్ సిబ్బంది బాధితురాలు ఉండే ప్రాంతానికి సమీపంలోని పోలీస్ స్టేషన్కు తక్షణమే సమాచారం అందిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగుతున్న పోలీస్ టీమ్ బాధిత మహిళలకు తక్షణ సాయం అందించే చర్యలు చేపడుతోంది. గృహహింస వంటి కేసుల్లో సాధ్యమైనంత వరకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వేధింపులు తదితర నేరాలపై గట్టి చర్యలు చేపట్టి ఉక్కుపాదం మోపుతున్నారు. బాధిత మహిళల సమాచారాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. కౌన్సెలింగ్, హెచ్చరికలు, బైండోవర్ వంటి పద్ధతుల్లో నిందితులను దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా కేసుల్లో బాధిత మహిళ కోరితేనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. -
యూపీ కన్నా ఘోరంగా తెలంగాణ
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో దళితులపై అత్యాచార ఘటనలు పెరుగిపోతున్నాయని, వారిపై అత్యాచారాల విషయంలో ఉత్తర ప్రదేశ్ కన్నా ఘోరంగా తెలంగాణ మారిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. దళితులపై అత్యాచారాలు, హింసకు రాష్ట్రం కేంద్రబిందువుగా మారుతోందన్నారు. టీపీసీసీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలు అత్యాచార ఘటనల్లోని ఎనిమిది బాధిత కుటుంబాలను ఉత్తమ్తోపాటు పార్టీ నేతలు పరామర్శించారు. అనంతరం ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గాంధీ భవన్లో దళిత కుటుంబాల పరామర్శ సందర్భంగా ఒక్కో కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ఉత్తమ్ ప్రకటించారు. -
మహిళల రక్షణకు రవాణా శాఖ ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించేందుకు, వారికి పూర్తి భద్రత కల్పించేందుకు రవాణా శాఖ కొత్తగా యాప్ ఆధారిత ప్రాజెక్టు చేపట్టనుంది. ఆటోలు, క్యాబ్లలో ప్రయాణించే మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు దీన్ని అమలు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం భాగస్వామ్యంతో ప్రాజెక్టుకు నిధులు కేటాయించనున్నాయి. కేంద్రం తన వాటా నిధులు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్రం తన వాటాగా రూ.56 కోట్ల వరకు నిధులు కేటాయించినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.135 కోట్లు్ల వెచ్చించనున్నాయి. ప్రాజెక్టు అమలు ఇలా.. ► రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్లలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) బాక్స్లు అమరుస్తారు. వీటితోపాటు రవాణా శాఖ యాప్ను రూపొందిస్తుంది. ► మహిళలకు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే మొబైల్ యాప్ నుంచి వాహనం నంబర్ పంపితే వాహనం ఎక్కడుందో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ద్వారా ఇట్టే తెలుసుకుని పట్టుకోవచ్చు. ► రాష్ట్రంలో 4.50 లక్షల ఆటోలు, లక్ష వరకు క్యాబ్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ► ఈ వాహనాలకు దశల వారీగా ఐవోటీ బాక్సులు అమరుస్తారు. వీటిని రవాణా, పోలీస్ శాఖ సిబ్బంది పర్యవేక్షిస్తారు. ► ఐవోటీ బాక్సులను వాహనాల ఇంజన్ల వద్ద అమరుస్తారు. ఆ తర్వాత డ్రైవర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ కార్డులు జారీ చేస్తారు. ఈ కార్డులను ఐవోటీ బాక్సుకు స్వైప్ చేస్తేనే ఆటో స్టార్ట్ అవుతుంది. ► యాప్ వాడకం తెలియని మహిళలు ఐవోటీ బాక్స్కు ఉండే క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేస్తే వెంటనే కంట్రోల్ రూమ్కు అనుసంధానమవుతుంది. ► మహిళలకు ఇబ్బందులు ఎదురైతే ప్యానిక్ బటన్ నొక్కితే వెంటనే సమీప పోలీస్స్టేషన్కు సమాచారమందిస్తుంది. ► పైలెట్ ప్రాజెక్టుగా తొలుత విజయవాడలో అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. ► ఇక్కడ ముందుగా 100 ఆటోల్లో ఐవోటీ బాక్సులు ఏర్పాటు చేసి త్వరలో ప్రాజెక్టు అమలు తీరుతెన్నులు పరిశీలించనున్నారు. ► అక్టోబర్లో సీఎం జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు ఈ యాప్ను ప్రారంభించనున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడతాం గతంలో అమలు చేయలేకపోయిన ఈ ప్రాజెక్టుపై మంత్రి పేర్ని నానితో ఇప్పటికే చర్చించాం. మహిళల భద్రత ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడతాం. – పీఎస్సార్ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్ -
ఎస్ఐపై లైంగిక ఆరోపణలు
-
పొందూరు ఎస్ఐపై లైంగిక ఆరోపణలు
సాక్షి, శ్రీకాకుళం: మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ పోలీసు కామాంధుడి ఆగడాలు బయటపడ్డాయి. అక్రమ మద్యం అమ్ముతోందని ఓ కిరాణా షాపు మహిళ యజమానిని పొందూరు ఎస్ఐ రామకృష్ణ అదుపులోకి తీసుకొన్నాడు. ఇంటికి వచ్చి లైంగిక వాంఛ తీర్చితే ఆ కేసు నుంచి తప్పిస్తానని, లేదంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసి జైలుకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలితో ఎస్ఐ చేసిన ఫోన్ సంభాషణలు బయటపడటంతో ఆ కీచక ఎస్ఐ గుట్టురట్టైంది. వివరాలు.. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం రాపాక జంక్షన్ వద్ద బొడ్డేపల్లి మీనాక్షి అనే మహిళ కిరాణా దుకాణం నడుపోతున్నారు. అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందటంతో పొందూరు ఎస్ఐ ఆమె దుకాణంపై దాడి చేశారు. (మల్లెపూలలో మద్యం బాటిళ్లు) దీంతో మీనాక్షి దుకాణంలో 11 మద్య సీసాలు దొరికాయి. మద్య సీసాలతో పాటు ఆమెను కూడా పోలీసులు స్టేషన్కు తరలించి ఒక రోజంతా స్టేషన్లో కూర్చోబెట్టారు. అయితే ఈ కేసు విషయంలో తనను విడిచిపెట్టమని మీనాక్షి ఎంతో ప్రాధేయపడ్డారు. ఓ శుభకార్యం కోసం కొనుగోలు చేసిన సీసాలను పట్టుకొని కేసు పెట్టవద్దని వేడుకున్నారు. మీనాక్షిపై కామవాంఛ పెంచుకున్న ఎస్ఐ శుభకార్యం కోసం అయితే కేసు నుంచి విడిచిపెడతాను. నువ్వంటే నాకు ఇష్టం అంటూ తన ఇంటికి రావాలని ఆమెను ఆదేశించాడు. తనకు గౌరమైన కుంటుంబం, తండ్రి, పిల్లలు ఉన్నారని ఆమె తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని మీనాక్షి ఎస్ఐ రామకృష్ణని ప్రాధేయపడ్డారు. కానీ, ఎస్ఐ తన బుద్ధి మార్చుకోకుండా ఆమెకు పదే పదే ఫోన్లు చేసి వేధించాడని బాధితురాలు ఫోన్ వాయిస్ రికార్డింగ్లను మీడియాకు అందజేశారు. ఒక మహిళను బెదిరించి లోబరుచుకునే ప్రయత్నం చేసిన పొందూరు ఎస్.ఐ రామకృష్ణను సస్పెండ్ చేసినట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ చెప్పారు. ఎస్.ఐ పై తదుపరి కఠిన చర్యలు తీసుకోవాలని కోరాము. — Vasireddy Padma (@padma_vasireddy) August 24, 2020 ఎస్ఐను సస్పెండ్ చేశాం: ఎస్పీ శ్రీకాకుళం జిల్లా పొందూరు ఎస్ఐ కొల్లి రామకృష్ణను సస్పెండ్ చేసినట్టు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్ తెలిపారు. ఓ కేసులో మహిళా పట్ల ఫోన్లో అనుచితంగా వ్యహరించినట్లు వచ్చిన ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. ఎస్ఐ కొల్లి రామకృష్ణ పై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్టు ప్రకటించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ట్విటర్లో వెల్లడించారు. (వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి ) -
వేధిస్తే.. ‘లా’గి కొట్టడమే..!
► ఈ ఏడాది జూన్ 24వ తేదీ ఒడిశాలోని జోడా ప్రాంతం. పదో తరగతి చదువుతున్న బాలిక తమ బంధువుల ఇంటికి వెళ్లింది. సాయంత్రం వరకూ అక్కడే గడిపి తిరుగు ప్రయాణమైంది. ఒంటరిగా వెళ్తున్న, ఆమెను ఐదుగురు యువకులు గమనించి వెంటాడారు. నిర్జన ప్రదేశంలోకి చేరుకోగానే అపహరించుకెళ్లి అత్యాచారం చేశారు. ► ఈ ఏడాది జూన్ 6వ తేదీ ఒంగోలులోని బస్టాండులో ఒంటరిగా బస్సు దిగిన పదో తరగతి విద్యార్థినిపై ఓ దివ్యాంగుడు కన్నేశాడు. తన స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్న ఆమెను మాటలతో లోబర్చుకున్నాడు. ఆ స్నేహితుడు తనకు తెలుసునని నమ్మించి బస్టాండు సమీపంలోని గదికి పిలుచుకెళ్లాడు. ఆ రాత్రి అక్కడ తన మిత్రుడితో కలిసి ఆ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను మరో గదికి తరలించి, అక్కడ ఉంటున్న నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులతో కలిసి పైశాచికంగా అత్యాచారం చేశారు. ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా పది రోజుల పాటు బాలికను గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. మహిళల్లో ఉన్న నిరక్షరాస్యత కారణంగా వారిలో ప్రశ్నించే తత్త్వం లేకపోవడంతో వారిపై ఆకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పదునైన చట్టాలు ఎన్ని ఉన్నా.. అవేవీ బాధితులను ఆదుకోలేకపోతున్నాయి. చట్టాలపై కనీస అవగాహన లేకపోవడంతో అవి కాస్త దుర్వినియోగమవుతున్నాయి. ‘ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో... అక్కడ దేవతలు నాట్యం చేస్తారు’ ఇది ఓ మహానుభావుని మాట. ‘స్త్రీ అర్ధరాత్రి నిర్భయంగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు’ ఇది మహాత్మగాంధీ నినాదం. అదే కోవలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సైతం రాజ్యాంగానికి పదును పెట్టారు. హిందూకోడ్ బిల్.. చట్టసభల్లో రిజర్వేషన్ మహిళలకు గౌరవం కల్పించారు. అంతేకాక రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్ స్త్రీ స్వేచ్ఛకు పచ్చజెండా ఊపాయి. అయినా స్త్రీలపై హింస ఆగడం లేదు. భర్త రూపంలో... ప్రియుడి రూపంలో... అన్న... నాన్న... పక్కింటివాడు.. పొరుగింటివాడు... బస్సులో ఆకతాయిలు...రోడ్లపై రోమియోలు... స్కూళ్లలో కొందరు... ఇలా చెప్పుకుంటూపోతే మహిళా స్వేచ్ఛ అనేది ఎక్కడా కనిపించడం లేదు. బలహీనులైన అబలలపై బలవంతులైన మృగాళ్ల పెత్తనం నానాటికీ పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలోనే మహిళా హక్కుల పరిరక్షణకు నిర్భయ లాంటి పదునైన చట్టాలు వచ్చాయి. మహిళల రక్షణకు రూపొందించిన చట్టాల గురించి తెలుసుకుందాం రండి.. – కళ్యాణదుర్గం రూరల్ రాజ్యాంగం ఏమంటోంది.. ► సమాజపరంగా కానీ, కుటుంబపరంగా కానీ స్త్రీ పురుషులను వేర్వేరుగా చూడరాదు. ఈ విషయంపై రాజ్యాంగంలో ప్రత్యేక ఆర్టికల్ ఉంది. ► ఆర్టికల్ 14 ప్రకారం స్త్రీ పురుషులిద్దరూ సమానులే. ఇదే ఆర్టికల్ ప్రకారం సమాన రక్షణ పొందడానికి ఇద్దరూ అర్హులు. ► ఆర్టికల్ 15/1 ప్రకారం స్త్రీగా ఆమెపై ఎవరూ వివక్ష చూపకూడదు. దుకాణాల్లో, ప్రదర్శనశాలల్లో, ఫలహారశాలల్లో, వినోదం కలిగించే ప్రదేశాలలో వారిని వెళ్లకుండా అడ్డుకోవడానికి వీలులేదు. ► స్త్రీలతో గనుల్లో పని చేయించకూడదు. జీవించేందుకు సంపూర్ణ హక్కు ► స్త్రీ తాను జీవితాంతం వివాహం చేసుకోకుండా ఉండాలని నిర్ణయించుకుంటే.. దానిని హక్కుగా గౌరవించాలి. ► ఈ హక్కును కుటుంబంలోని అన్నదమ్ములు, తల్లిదండ్రులు అడ్డుకోలేరు. 18 సంత్సరాలు నిండిన స్త్రీ తన ఇష్టం వచ్చిన పురుషున్ని పెళ్లాడవచ్చు. అయితే నిషేధింపబడిన దగ్గర బంధువైనప్పుడు, భార్య ఉన్న పురుషుడిని పెళ్లాడడానికి వీలులేదు. ► హిందూ స్త్రీ తనకు 18 ఏళ్లు నిండే వరకూ వివాహం చేసుకోకుండా ఉండవచ్చు. ముస్లిం మహిళ తన 15 లేదా 18 సంవత్సరాలు నిండేలోపు జరిగిన వివాహాన్ని తిరస్కరించవచ్చు. ఈ హక్కును వాడుకోవాలనుకుంటే ఆమె తన భర్తతో లైంగిక సంబంధం కలిగి ఉండరాదు. ► స్త్రీని బలవంతంగా కాపురానికి తీసుకెళ్లే హక్కు ఎవ్వరికీ లేదు. ►18 సంవత్సరాలు నిండని బాలికను ప్రేమ పేరుతో తీసుకెళ్లి వివాహం చేసుకుంటే, సెక్షన్ 366 ప్రకారం యువకునికి పదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. ► ఏ స్త్రీ అయినా భర్త బతికి ఉండగా మరో వ్యక్తిని పెళ్లాడడానికి వీలు లేదు. అలా పెళ్లాడితే నేరమే. ముస్లిం స్త్రీల విషయంలో ఈ నిబంధన చెల్లదు. ► వివాహమైన (ఏ మతానికి చెందిన మహిళైనా) స్త్రీ భర్తతో కాక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోకూడదు. ► హేతుబద్ధ సమయాల్లో... ఆర్యోగానికి, సభ్యతకు భంగం కలుగని రీతిలో, ఇబ్బంది కలుగని సమయాల్లో, భార్య, భర్త లైంగిక పరమైన కోర్కెలు తీర్చుకోనివ్వాలి. ‘నిర్భయ’ంగా యావత్ దేశాన్ని నిర్భయ ఉదంతం కలిచివేసింది. రోడ్డుపై వెళుతున్న నిర్భయను బస్సులో తిప్పుతూ అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, మృతికి కారణమైన ఘటన యావత్ ప్రపంచాన్నే కదిలించింది. ఆమె ఆత్మకు శాంతి కలిగేలా... మహిళలకు మరింత రక్షణ కల్పించేలా 2013 మార్చి 19న నిర్భయ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్ట ప్రకారం స్త్రీ పట్ల ఏ పురుషుడైనా అసభ్యంగా ప్రవర్థించినా, అవమాన పరిచినా, వారి మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించినా సెక్షన్ 354 కింద కేసు నమోదు చేయవచ్చు. ముస్లిం స్త్రీలకు ప్రత్యేక హక్కులు ► భర్త మరణించిన తర్వాత (ఇద్దతు కాలంలో) మళ్లీ వివాహం కుదరదు. ► భర్త ఉన్న చోటే కాపురం చేయాలి. సహేతుకమైన కారణముంటే తప్ప వేరుగా జీవించేందుకు అవకాశం లేదు. ► ముస్లిం స్త్రీలకు మెహరు హక్కు. భర్త చేత నిరాదరణకు గురైనా, విడాకులు ఇచ్చినా... భరణం పొందే హక్కు, పోషణ హక్కు, భర్తను తనతో కాపురం చేయమనే హక్కు తనకు తన భర్తకు వేరే గది (వీలైనంతవరకూ) కావాలనే హక్కు, బంధువులను చూసి వచ్చే హక్కు, వారు ఆమెను చూసిపోయే హక్కు ఉంటుంది. నిరక్షరాస్యతే ఓ కారణం దేశంలో మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయి. అయితే వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. చట్టాల గురించి వారికి అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. మహిళల్లో అక్షరాస్యత తక్కువ. ఈ కారణంతోనే తమ రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి అవగాహన లేకుండా పోయింది. వేధింపులకు సంపూర్ణ అక్షరాస్యతతో అడ్డుకట్ట వేయవచ్చు. – నిర్మల, కేజీబీవీ ఎస్ఓ, శెట్టూరు చట్టాలు వినియోగించుకోగలగాలి అనేక సామాజిక కట్టుబాట్ల మధ్య మహిళలు నలిగిపోతున్నారు. తమపై జరుగుతున్న లైంగిక దాడులు, గృహహింస, వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించలేకపోతున్నారు. కట్టుబాట్ల సంకెళ్లు తెంచుకుని చట్టాలను సమర్థవంతంగా వినియోగించుకోగలగాలి. అప్పుడే గృహ హింసను నిర్మూలించేందుకు వీలవుతుంది. – సంధ్యారాణి, ఆర్ఎంపీ వైద్యురాలు, ములకలేడు, కళ్యాణదుర్గం మం. -
చిత్తూరు పోలీసుల వినూత్న ఆలోచన
సాక్షి, తిరుపతి(చిత్తూరు) : రాష్ట్రంలో మహిళలపై వేధింపులు అధికమవుతున్న నేపథ్యంలో.. చిత్తూరు జిల్లాలో పోలీసులు నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ సలహాపై జిల్లా మొత్తం ఫిర్యాదు బాక్స్లను అమర్చారు. ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసులకు మధ్య మెరుగైన సంబంధాలు ఏర్పడాలనే ఉద్దేశంతో జిల్లా పరిధిలో మొత్తం 95 ఫిర్యాదు బాక్స్లను ఏర్పాటు చేశామని, జన సందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈ బాక్స్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. రద్దీ ప్రదేశాలైన పాఠశాలలు, బస్టాండ్స్, మార్కెట్, ఆలయాలు వంటి ప్రాంతాలతోపాటు, ప్రతి పోలీస్ స్టేషన్లో 5 ఫిర్యాదు బాక్స్లను అమర్చారని పేర్కొన్నారు. వీటి పర్యవేక్షణ పూర్తిగా స్పెషల్ బ్రాంచ్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రతిరోజు ఫిర్యాదు బాక్స్లను తెరిచి ఫిర్యాదులను ఎస్పీ గారికి తెలియజేస్తామని, అంతేకాక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
నవ నిర్మాణ దీక్షలో మహిళకు వేధింపులు
పార్వతీపురం టౌన్ : టీడీపీ చేపడుతున్న నవనిర్మాణ దీక్షలు వేధింపుల దీక్షలుగా మారుతున్నాయి. దీక్షలకు జనాన్ని తీసుకురావాలని ప్రజాప్రతినిధులు అంగన్వాడీ, వెలుగు, ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. జనాలను తీసుకురాని సిబ్బందిపై దుర్భాషలాడుతున్నారు. ఇందులో భాగంగా పార్వతీపురం పురపాలక సంఘంలోని 5వ వార్డులో సోమవారం జరిగిన నవనిర్మాణ దీక్ష వేదిక సాక్షిగా అదే వార్డుకు చెందిన ఓ అంగన్వాడీ కార్యకర్తపై అసభ్యకరంగా మాట్లాడిన వార్డు కౌన్సిలర్ చొక్కాపు వెంకటరావును కార్యకర్త భర్త కొట్టిన సంఘటన సమావేశానికి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. సమావేశంలో కౌన్సిలర్ వెంకటరావు మాట్లాడడానికి సిద్ధపడుతుండగా, బాధితురాలైన అంగన్వాడీ కార్యకర్త భర్త కలుగజేసుకుని మహిళలంటే అంత చులకనా నీకు.. ఎంతకాలం వేధింపులకు గురి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో టీడీపీ నాయకులు కలుగజేసుకుని కార్యకర్త భర్తను అక్కడ నుంచి పంపించివేశారు. అంతకుముందు జనాలను తీసుకురావడంలో విఫలమైందని ఆరోపిస్తూ సదరు కౌన్సిలర్ వెంటకరావు అంగన్వాడీ కార్యకర్తను దుర్భాషలాడారు. దీంతో బాధితురాలు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది. రాజీ ప్రయత్నాలు జరిగిన విషయంపై అంగన్వాడీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎలాగైనా ఇరువర్గాలను రాజీ కుదర్చి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. నలిగిపోతున్న ఉద్యోగులు... నవనిర్మాణ దీక్షలకు జనాన్ని తీసుకువచ్చే విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు, బీఎల్ఓలు, వెలుగు సిబ్బంది నలిగిపోతున్నారు. మండుతున్న ఎండలో పెడుతున్న సమావేశాలకు జనం తీసుకురావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే అధికార పార్టీ నాయకులు ఎక్కడ మండిపడతారోననే ఉద్దేశంతో సిబ్బంది ఏదో ఒక రకంగా ప్రజలను తీసుకువస్తున్నారు. -
ఊరు మెచ్చిన కోడలు
‘‘ఏమిటీ? దాన్ని ఇంట్లోనా?’’ ముఖం చిట్లించిందొకామె. ‘‘దేవుడి గది, వంటగదితోపాటు అది కూడా ఇంట్లోనేనా,భగవంతుడా!’’ మరొకామె. ‘‘ఇల్లు దాటి పదడుగులు వేస్తే పొలాలే.కావల్సినంత ఖాళీ ఉంది. చెట్ల మరుగుఉంది. మా ఊరికి దాంతో పనిలేదు’’ఇంకొకామె. ‘‘చెరువు గట్టున చేయాల్సినపని ఇంట్లోనా, ఛీఛీ’’ మరో పెద్దాయన.‘దేవుడా, వీళ్లకు ఎలా చెప్పాలి?! తామెలాంటి స్థితిలో జీవిస్తున్నదీ వీళ్లకు తెలియడం లేదసలు’.. ఇంటికి వచ్చి తల పట్టుకుని కూర్చుంది విమలా కాదమ్. మరుసటి రోజు ఎప్పటిలాగానే కాలేజ్కి వెళ్లింది విమల. తన ఫ్రెండ్స్ పాతికమందికి ఈ సంగతి చెప్పింది. అంతా అంగీకరించారు. ఇంటికి వచ్చి మూడు ప్రశ్నలతో ఒక ప్రశ్నావళి తయారు చేసింది. ఆ ప్రశ్నలివి.. ‘గడచిన ఐదేళ్లుగా గ్రామంలో పాముకాటు మరణాలెన్ని? అవి ఎప్పుడు జరిగాయి?’‘ఆడవాళ్ల మీద అఘాయిత్యాలెన్ని? ఎప్పుడు?’‘నీటి కాలుష్యం కారణంగా వానలు కురిసినప్పుడు రోగాల పాలయిన వాళ్లెందరు?’ఆ తర్వాత విమలా కాదమ్ తన ఫ్రెండ్స్ బృందాన్ని ఊళ్లో దించింది. స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా ఇళ్ల మీద వాలిపోయారు. ఇంట్లో వాళ్ల మీద ఈ మూడు ప్రశ్నలతో దాడి చేశారు. చెరువు గట్టునే చేటు! బలాత్కారాలు, పాము కాట్లన్నీ బహిర్భూమి కోసం పొలాల్లోకి, చెట్ల మరుగుకు వెళ్లినప్పుడే జరిగాయని బదులిచ్చారు గ్రామస్థులు. ఇక నీటి కాలుష్యం వల్ల వచ్చిన అనారోగ్యాలకైతే లెక్కే లేదు. వానాకాలంలో అతిసార వంటి రోగాల రూపంలో ప్రాణాలు తీస్తున్నది చెరువు గట్టు ‘వాడకమే’నని వారికి తెలియజెప్పారు స్టూడెంట్స్. గ్రామస్థులను చైతన్యవంతం చేయడానికి జరిగిన ఈ దాడిలాంటి ప్రయత్నం మంచి ఫలితాలనిచ్చే సూచనలు కనిపించాయి. వేడెక్కిన ఇనుము చల్లబడక ముందే దానిని మలుచుకోవాలి. ఇక అందరికీ నచ్చ చెప్పే పని మొదలైంది. దేవుడి పూజ గది ఉన్నంత మాత్రాన ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి ఉండకూడదనే అపోహను మొత్తానికి వారు తుడిచేయగలిగారు. ‘దీపం’ ఉండగానే ఆలోచన విద్యార్థులను చూసి గ్రామ పెద్దలు ముందుకు వచ్చారు. ‘‘స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఇంటింటికీ మరుగుదొడ్డి కట్టించాలని ప్రభుత్వ ఆదేశం. నిధులు కూడా దండిగా ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమానికంటే ముందే ఎవరికివారే మరుగుదొడ్డి కట్టించుకున్న ఇరవై శాతం మంది మినహా స్వచ్ఛభారత్ ప్రయత్నంలో ఒక్క దొడ్డిని కూడా కట్టించలేకపోయాం. ఈ చైతన్యోద్యమంలో మేమూ నడుస్తాం’ అని ఆ పెద్దలు చొరవ చూపారు. తమ వంతుగా ఇంటికి పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయల డబ్బు ఇచ్చారు. స్కీమ్ ఉండగానే కట్టించుకోవడం మేలని గ్రామస్థులు కూడా మరుగుదొడ్ల నిర్మాణానికి సిద్ధం అయ్యారు. మరో ఆరు మిగిలే ఉన్నాయి నాలుగు వేల ఐదొందల జనాభా ఉన్న ఆ గ్రామంలో ఇప్పుడు 800 మరుగుదొడ్లు ఉన్నాయి. మరో వంద మంది కూడా నిర్మాణం పనులు మొదలుపెట్టారు. ఆ గ్రామం పేరు ఉమ్రాని. కర్ణాటక రాష్ట్రం, చిక్కోడి తాలూకాలో ఉంది. విమల కాదమ్ చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో అక్కడి అధికారులకు ఆమె ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తోందిప్పుడు. ‘‘మరో ఆరు గ్రామాలు ఇలాగే కొరకరాని కొయ్యలుగా మిగిలి ఉన్నాయి, ఆ గ్రామాలకు వెళ్లి వాళ్లకూ చెప్పండి ప్లీజ్’ అని రిక్వెస్ట్ చేశారు తాలూకా ఆఫీసర్. పరీక్షలై పోయిన తర్వాత తన ‘చైతన్య యాత్ర’ ప్రారంభించబోతోంది విమలా కాదమ్. ►అధికారులు చెయ్యలేని పనిని కళాశాల విద్యార్థిని విమలా కాదమ్ చేయగలిగింది! మరుగుదొడ్డ నిర్మాణానికి మొరాయించిన గ్రామస్థుల మనసును ఆమె మార్చగలిగింది. ►కర్ణాటక, హుబ్లీలో ఇటీవల జరిగిన యువ సదస్సులో విమలా కాదమ్ ‘బెస్ట్ లీడర్ 2018’ అవార్డు అందుకున్నారు. అయితే ఆమె తనను గోప్యంగా ఉంచుకోడానికే ఇష్టపడడంతో సదస్సు నిర్వాహకులు మీడియాను ఫొటోలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ►మరుగుదొడ్ల నిర్మాణం కోసం విమలా కాదమ్ నేతృత్వంలో గ్రామస్థులలో చైతన్యం తెచ్చేందుకు బయల్దేరిన సహ విద్యార్థులు. ►అక్షయ్కుమార్ నటించిన ‘టాయిలెట్’ సినిమాలోని ఒక సన్నివేశం: ఈ చిత్రంలో చూసిన దృశ్యాలు అత్తగారి ఊరిలో విమలా కాదమ్కు నిత్యమూ కనిపించేవట. ‘ఇదా! నా మెట్టినూరు!!’ విమలా కాదమ్ 2016లో పెళ్లి కారణంగా చదువును మధ్యలో ఆపేసింది. పెళ్లి తర్వాత మళ్లీ చదువుకోవడానికి అత్తగారింటికి దగ్గరలో చిక్కోడి తాలూకాలో ఉన్న ఎ.ఎ.పాటిల్ ఉమెన్స్ కాలేజ్లో చేరింది. అక్షయ్కుమార్ నటించిన ‘టాయిలెట్’ సినిమాలో ఆమె చూసిన దృశ్యాలు అత్తగారి ఊరిలో నిత్యమూ కనిపించేవి. ఓసారైతే వయసు మళ్లిన మహిళలు ముధోల్– నిప్పని స్టేట్ హైవే దగ్గర బారుగా నిలబడి ఉన్నారు. రోడ్డు దాటితే అంతా ఖాళీ పొలాలే. వాళ్లు వెళ్తున్నది టాయిలెట్ అవసరం తీర్చుకోవడానికి అని తెలిసి నివ్వెరపోయింది విమల. తాను కోడలిగా వచ్చింది ఇలాంటి ఊరికా అనిపించింది ఆమెకు. ఏదో ఒకటి చేసి తీరాలనుకుంది. అనుకున్న పని చేసి చూపించింది. దాంతో ఊరు స్వచ్ఛ గ్రామంగా మారింది. విమల ఊరు మెచ్చిన కోడలు అయింది. ఇటీవలే ఆమె హుబ్లీలో జరిగిన 8వ ‘యువ సదస్సు’లో ‘బెస్ట్ లీడర్ (ఇన్ కమ్యూనిటీ ఇంపాక్ట్) 2018’ అవార్డు అందుకుంది. – మంజీర -
చూసే కళ్లుంటాయ్..! స్వేచ్ఛగా వెళ్లమంటాయ్
‘నిర్భయ’ నుంచి నిధులు: ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలన్నింటినీ ‘సేఫ్ సిటీ’ ప్లాన్లోకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈ బిబిఎమ్పి అధికారులు స్మార్ట్ ఐస్ను అమరుస్తున్నారు. ఇందుకోసం 667 కోట్ల నిర్భయ నిధులు మంజూరయ్యాయి. అవే కళ్లు... నిఘా కళ్లు... డేగ చూపులకంటే తీక్షణమైన చూపులు. ఈ మాటలన్నీ విలన్ని సూచిస్తుంటాయి. రాబోయే ప్రమాదానికి ఉపోద్ఘాతంలా ఉంటాయి. కానీ ఇవన్నీ ఇక మహిళలకు ఫ్రెండ్లీ కళ్లు. ఆ చూపులు ఆడవాళ్లకు అన్నయ్యల్లాంటి చూపులు. ఆ చూపుల కింద ఆడవాళ్లు ధైర్యంగా నడిచి వెళ్లవచ్చు. అది అర్ధరాత్రయినా అపరాత్రయినా సరే! బెంగళూరు పోలీసు వ్యవస్థ చొరవతో రూపొందిన ‘చురుకైన కళ్ల’ ప్రోగ్రామ్ అది. పేరు.. ‘స్మార్ట్ ఐస్’ మహానగరంలో మహిళ బెంగళూరు అనగానే టెక్నాలజీ హబ్ గుర్తొస్తుంది. హైదరాబాద్ నగరం ఐటి అడుగులు నేర్చుకునేటప్పటికే బెంగళూరులో సాఫ్ట్వేర్ రంగం వేళ్లూనుకున్నది. పొరుగు రాష్ట్రాల వలసలతో ఆ నగరం రోజు రోజుకీ విస్తరిస్తోంది. ప్రధానమైన రోడ్డు మీద ఎడమ నుంచి కుడివైపుకి వెళ్లాలంటే యు టర్న్ కోసం కిలోమీటర్లు ప్రయాణించాలి. అలాంటి మహానగరంలో మగవాళ్లతోపాటు మహిళలు కూడా అదే స్థాయిలో ఉద్యోగాలు చేస్తుంటారు. ఇరవై నాలుగ్గంటలూ షిఫ్టులుంటాయి. ఎవరి డ్యూటీ టైమ్కి వాళ్లు ఇళ్ల నుంచి బయలు దేరాలి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఇళ్లకు చేరాలి. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆపదలు, టీజింగ్లు ఎదురైనా సరే ఇట్టే పట్టేయడానికి వీలుగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది పాలన వ్యవస్థ. అర్ధరాత్రి అయినా సరే మిట్టమధ్యాహ్నమే అన్నంత ధైర్యంగా ఆడవాళ్లు సంచరించవచ్చు. మాయగాళ్లపై నిఘా! ఇప్పటికే ఉన్న ‘సురక్ష మిత్ర’ పథకంలో భాగంగా బెంగళూరు నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, ముఖ్యమైన హాస్పిటళ్లు, ఇతర పబ్లిక్ ప్రదేశాలు... అన్నీ కలుపుకుని మొత్తం 4,500 ప్రదేశాల్లో పదివేల నిఘా కెమెరాలను అమరుస్తోంది బిబిఎమ్పి (బృహత్ బెంగళూరు మహానగర పాలికె). జేబుదొంగలు, ఆకతాయిలు, రౌడీషీటర్లు, ట్రాఫికింగ్కు పాల్పడే కరడుగట్టిన నేరగాళ్ల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికి ఈ ‘స్మార్ట్ ఐస్’ ఆలోచన రూపుదాల్చింది. రోజులో 24 గంటలూ ఈ కళ్లు పని చేస్తూనే ఉంటాయి. వీటిని ‘ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిస్టమ్’ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఉదాహరణకు నగరంలో ఒక వ్యక్తి రోజూ ఒక రోడ్డు మీద ప్రయాణిస్తూ, అదే వ్యక్తి ఒక్కరోజు ఊహించని మరోచోట సంచరించినట్లయితే ఆ ‘మార్పు’ కూడా వెంటనే రికార్డు అవుతుంటుంది. అవసరమైతే కెమెరా బ్యాకప్తో విశ్లేషించడానికి సాధ్యమవుతుంది. అలా నగరంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తి మీద మూడో కంటికి తెలియకుండానే పోలీస్ నిఘా మొదలవుతుంది. – మను -
ప్రూఫ్ లెస్ సిమ్లతో యువతులకు వేధింపులు
నెల్లూరు: ప్రూఫ్లు లేని సిమ్లను వినియోగిస్తూ ఫోన్ల ద్వారా కొందరు యువకులు మహిళలను వేధిస్తున్నారు. జిల్లాలోని తోటపల్లిగూడూరు మండల పరిధిలోని నరుకూరు, సాలిపేట, మహాలక్ష్మీపురంలలో కొందరు యువకులు అర్ధరాత్రి యువతులకు కాల్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. నరుకూరు సెంటర్కు చెందిన ఓ యువతి(19)కి కొందరు ఆకతాయిలు 8008702817, 9966541870, 9573306361 నంబర్ల నుంచి కాల్ చేసి వేధించారు. దీంతో బెదిరిపోయిన ఆమె తల్లిదండ్రులకు ఫోన్ ఇవ్వడంతో వారిని కూడా దుర్భాలాడాడు. మరో ఘటనలో సాలిపేటకు చెందిన ఓ మహిళకు ఫోన్ చేసిన ఆకతాయి అసభ్యకరంగా మాట్లాడాడు. ప్రూఫ్లు లేని సిమ్లతో ఆకతాయిలు కాల్ చేస్తుండటంతో వారిని గుర్తించడం కష్టంగా మారుతోంది. దీంతో ప్రూఫ్లు లేని సిమ్లు అమ్ముతున్న సెల్ షాపుల ఓనర్లతో పాటు, ఆకతాయిలను ఎలాగైనా పట్టుకోవాలని స్ధానికులు పోలీసులను కోరుతున్నారు.