గంగవరం : ఏజన్సీ డీఈవో, గంగవరం ఎంఈవో–1 వై.మల్లేశ్వరరావుకు చేయూత సంస్థ విశిష్ట విద్యా సేవా పురస్కారం అందజేసింది. కాకినాడ సూర్య కళామందిర్లో శనివారం జరిగిన చేయూత సేవా సంస్థ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా డీఈవో మల్లేశ్వరరావును సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో విశిష్ట విద్యా సేవా పురస్కారం అవార్డుతో ఘనంగా సన్మానించారు. విద్యాభివృద్ధికి మల్లేశ్వరరావు చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డు అందజేసినట్టు రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మల్లేశ్వరరావు మాట్లాడుతూ అవార్డు అందుకోవడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. చేయూత సేవా సంస్థ వ్యవస్థాపకులు తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావుకు ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ బేబీరత్నం, వైస్ ఎంపీపీలు గంగాదేవి, రామతులసి, ఎంపిడిఓ శ్రీనివాసులు, తహసీల్దార్ శ్రీనివాసరావు, యూటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రాంబాబు, వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి కృష్ణ, గౌరవాధ్యక్షులు రఘుబాబు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment