ప్రమాదంలో ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో ఒకరి మృతి

Published Tue, May 7 2024 1:30 AM

-

గార్లదిన్నె: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన క్రిష్టప్ప(52) ఆదివారం గార్లదిన్నెలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు వచ్చాడు. రాత్రి కల్లూరుకు వెళ్లిన ఆయన అక్కడ పనిముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై గార్లదిన్నెకు రాంగ్‌ రూట్‌లో వస్తుండగా ఎగువపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై కల్లూరుకు చెందిన రైల్వే ఉద్యోగి నరేంద్ర ముంటిమడుగు నుంచి ద్విచక్ర వాహనంపై వెళుతూ ఢీకొన్నాడు. ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌ ద్వారా క్రిష్టప్పను అనంతపురం సర్వజనాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నరేంద్రను గుంతకల్లు రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ మహమ్మద్‌ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement