పయ్యావుల అతి పెద్ద బ్లాక్‌మెయిలర్‌ | Sakshi
Sakshi News home page

పయ్యావుల అతి పెద్ద బ్లాక్‌మెయిలర్‌

Published Tue, May 7 2024 3:00 AM

పయ్యావుల అతి పెద్ద బ్లాక్‌మెయిలర్‌

ఉరవకొండ: స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అతి పెద్ద బ్లాక్‌మెయిలర్‌ అని, ఈ ఎన్నికల్లో ఓటమి భయంతో నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నాడని ఉరవకొండ నియోజకర్గ ఎన్నికల ఇన్‌చార్జ్‌ బెస్త రమణ ధ్వజమెత్తారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై పయ్యావుల కేశవ్‌ తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని వారు తప్పుబట్టారు. కో–ఆప్షన్‌ సభ్యుడు పామిడి సలీం, వడ్లసలీం, బొంబాయి సెట్‌ మైను మాట్లాడుతూ... మైనార్టీలు అత్యధికంగా నివసిస్తున్న 1వ వార్డులో టీడీపీ నేతలు కొంత మంది మహిళలను పంపి ఓటర్ల వ్యక్తిగత వివరాలు, వారి సెల్‌ నంబర్లు సేకరించారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని గమనించిన వైఎస్సాఆర్‌సీపీ నాయకులు అడ్డుకుని ప్రశ్నించడంతో తమపై కేశవ్‌ తప్పుడు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. ఇప్పటికే మతతత్వ బీజేపీతో కలిపి మైనార్టీల రిజర్వేషన్‌ రద్దు చేయడానికి సిద్దమైన టీడీపీ వైఖరిపై మైనార్టీలు అసహ్యంచుకుంటున్నారన్నారు. దీంతో ఓటమి భయం పట్టుకున్న కేశవ్‌ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు తెరలేపారన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వక్ఫ్‌బోర్డు డైరెక్టర్‌ జీఎంఎస్‌ మీరం బాషా, ఉరవకొండ పీఎసీఎస్‌ చైర్మన్‌ వడ్ల షెక్షావలి, పార్టీ మైనార్టీ విభాగం పట్టణ కన్వీనర్‌ పామిడి జాకీర్‌, జేసీఎస్‌ కన్వీనర్‌ బళ్లారి ఆసీఫ్‌, కపట్రాళ్ల బషీర్‌, జెండా జిలాన్‌, ఎంపీటీసీ వన్నూరుసాహెబ్‌, అయ్యర్‌ దాదు, జీఎంఎస్‌ షాకీర్‌, పామిడి తయ్యూబ్‌, బెళగళ్‌ షమ్ము, తాజు, టైలర్‌ శర్మాస్‌, యూసఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్‌ రమణ, మైనార్టీ నాయకులు

Advertisement

తప్పక చదవండి

Advertisement