అనంతపురం అర్బన్: సాహిత్య ఉద్యమ కారుడు, తెలుగు భాష ఔన్నత్యానికి పాటుపడిన గురజాడ అప్పారావు చిరస్మరణీయుడని కలెక్టర్ వి.వినోద్కుమార్ కొనియాడారు. జిల్లా సమాచార శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గురజాడ అప్పారావు జయంతి నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యుదయ కవితా పితామహుడిగా తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు గురజాడ ఎంతగానో కృషి చేశార్నారు. సాంఘిక దురాచారాలు, మూఢ విశ్వాసాలపై సాహిత్య సమరం చేశారన్నారు. ఆంధ్ర సాహిత్య చరిత్రలో సంస్కర్తగా, యుగకర్తగా శాశ్వత స్థానం పొందారన్నారు. తెలుగు భాషకు గురజాడ చేసిన సేవలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ జి. రామకృష్ణారెడ్డి, జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ, డీఐపీఆర్ఓ గురుస్వామిశెట్టి, ఆకాశవాణి డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి, హౌసింగ్ పీడీ శైలజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణం చేపట్టాలి
అనంతపురం అర్బన్: పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. ‘మన ఇల్లు మన గౌరవం’ అనే అంశంపై కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావేదిక కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. వికసిత్ అనంత కింద గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇళ్లతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. వంద రోజుల లక్ష్యం కింద జిల్లాకు 2,835 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్దేశించగా, ఇప్పటివరకు 1,390 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారంటూ హౌసింగ్ పీడీని కలెక్టర్ అభినందించారు. మిగిలిన ఇళ్లు కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పీఎంఏవై అర్బన్, పీఎంఏవై గ్రామీణ్లో భాగంగా ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని చెప్పారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శైలజ, ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఎహసాన్బాషా, డిప్యూటీ కలెక్టర్లు శిరీష, కరుణకుమారి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్కుమార్, పీఆర్ ఎస్ఈ కేవీకేవీప్రసాద్, డ్వామా పీడీ విజయలక్ష్మి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment