అనంతపురం మెడికల్: లింగ నిర్ధారణకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి పేర్కొన్నారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో లింగ నిర్ధారణ చట్టానికి సంబంధించి జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లింగ నిర్ధారణకు పాల్పడితే ఎదురయ్యే సమస్యలకు సంబంధించిన బోర్డులను ప్రజలకు కన్పించేలా ఏర్పాటు చేయాలని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు సూచించారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో స్కానింగ్ సెంటర్లు, గైనిక్ ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. లింగ నిర్ధారణకు పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే తక్షణం తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ యుగంధర్, డాక్టర్ సుజాత, డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ అనుపమజేమ్స్, గైనకాలజిస్టు డాక్టర్ రేణుక, చిన్నపిల్లల విభాగం హెచ్ఓడీ డాక్టర్ రవికుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరినాథ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సెలవులో డీఈఓ
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖ అధికారి బి.వరలక్ష్మీ ఈనెల 23 వరకు సెలవుపై వెళ్లారు. అనారోగ్య కారణంగా ఆమె సెలవు పెట్టినట్లు తెలిసింది. 24న విధుల్లో చేరనున్నారు. అప్పటిదాకా అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య ఇన్చార్జ్ డీఈఓగా వ్యవహరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment