No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, May 7 2024 11:25 AM

No Headline

రేపల్లె అసెంబ్లీ అభ్యర్థ్ధి డాక్టర్‌ గణేష్‌

రాష్ట్రంలో ప్రజలకు వందేళ్లలో అందించాల్సిన సంక్షేమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి కేవలం ఐదేళ్లలో అందించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారని వైఎస్సార్‌ సీపీ రేపల్లె అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్‌ ఈవూరు గణేష్‌ అన్నారు. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు అదనంగా ప్రజావసరాలకు అనుగుణంగా అనేక పథకాల్ని విజయవంతంగా అమలు చేసింది జగనన్న మాత్రమేనని పేర్కొన్నారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రెండేళ్లపాటు దేశం అతలాకుతలమైనా రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం ఆగలేదని గుర్తు చేశారు. వైద్యరంగంలో నూతన సంస్కరణలు అమలు చేసి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. ఆరోగ్యశ్రీని రూ.5లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచి పేదల ముఖ్యమంత్రిగా జగనన్న గుర్తింపు పొందారని గుర్తు చేశారు. పేదల కోసం పలు సంక్షేమ పథకాల అమలు చేస్తున్న జగనన్నకు ప్రజలంతా సీఎం పదవిని గిఫ్ట్‌గా ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రేపల్లె ఎన్నికల పరిశీలకుడు అడపా శేషు, గాదె మధుసూదనరెడ్డి, వైఎస్సార్‌ సీపీ యువ నాయకులు మోపిదేవి రాజీవ్‌, ఈవూరు సృజన్‌ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement