దమ్మపేట: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ దుకాణాలపై ఫ్లయింగ్ స్క్వాడ్ టీం, పోలీసులు కలసి సంయుక్తంగా దాడి చేశారు. శనివారం మండలంలోని పాకలగూడెం, సీతారాంపురం, నాచారం, నాగుపల్లి గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. 82 క్వార్టర్ మద్యం సీసాలు, 18 బీర్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎఫ్ఎస్ టీం అధికారి కృష్ణ, ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు.
వివాహిత ఆచూకీ లభ్యం
అశ్వారావుపేటరూరల్: అదృశ్యమైన వివాహిత ఆచూకీ లభ్యమైనట్లు ఎస్ఐ ఎస్.శ్రీను తెలిపారు. మండల కేంద్రంలోని కాలింగుల బజారుకు చెందిన వివాహిత అనూష రెండు రోజుల క్రి తం ఓ పెళ్లి వేడుకకు వెళ్లి అదృశ్యమైంది. దీంతో కుటుంబీకులు శుక్రవారం ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం ఖమ్మంలో గుర్తించి, తీసుకొచ్చి కుటుంబీకులకు అప్పగించారు.