ఈహెచ్‌టీని ఢీ కొట్టిన లారీ | Sakshi
Sakshi News home page

ఈహెచ్‌టీని ఢీ కొట్టిన లారీ

Published Tue, May 7 2024 4:35 AM

ఈహెచ్‌టీని ఢీ కొట్టిన లారీ

పాల్వంచ: ట్రాన్స్‌కో ఈహెచ్‌టీ (ఎక్స్‌ట్రా హైటైన్షన్‌ టవర్‌)ను సోమవారం మట్టి లారీ ఢీ కొట్టింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని పాత పాల్వంచ చింతల చెర్వు నుంచి మట్టిని పొలాలకు లారీల ద్వారా తోలకం చేపట్టారు. లారీలు గోవర్ధనగిరి కాలనీలోని చిన్నపాటి సీసీ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ మట్టి లారీ కేటీపీఎస్‌ నుంచి బూడిదంపాడుకు వెళ్లే 220 కేవీ లైన్‌ ఈహెచ్‌టీని ఢీకొట్టగా భారీ శబ్దం వచ్చింది. దీంతో టవర్‌కు ఉన్న హ్యాంగ్లర్లు తెగిపోయాయి. కొన్ని హ్యాంగ్లర్లు వంగిపోయాయి. దీంతో స్థానికులు లారీలను కొద్ది సేపు నిలిపివేశారు. గొల్లగూడెం మీదుగా విశాలమైన రోడ్డు ఉన్నా, లారీలను ఇరుకుగా ఉండే సీసీ రోడ్డు మీదుగా తిప్పుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సమాచారం అందుకున్న ట్రాన్స్‌కో ఏఈ పీవీ అప్పారావు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. తగిన చర్యలు తీసుకుంటామని, నోటీసులు కూడా ఇస్తామని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement