వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య

Published Tue, May 7 2024 4:35 AM

-

ఖమ్మంక్రైం: ఖమ్మంలోని రెండు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం వన్‌టౌన్‌, త్రీ టౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన కొంపల్లి శేఖర్‌(48) సుతారీ పనిచేస్తుండగా, భార్య శ్రీలతతో గొడవ పడేవాడు. ఆయన ఈనెల 1వ తేదీన ఖమ్మం మేదర్‌బజార్‌లో భార్యతో గొడవ పడి తల్లి వద్దకు వచ్చాడు. అక్కడ ఎలుకల మందు తాగిన శేఖర్‌ను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అలాగే, ఖమ్మం ప్రకాష్‌నగర్‌లో బండారి సంపత్‌కుమార్‌(39) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ భార్య హైమావతి, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. ఆయన మద్యానికి బానిస కావటంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఇదేక్రమంలో ఆదివారం రాత్రి కూడా మద్యం తాగి రావడంతో భార్యతో గొడవ జరగగా.. అందరూ నిద్రించాక బయటకు వెళ్లిపోయాడు. అర్ధరాత్రి తర్వాత గుర్తించిన కుటుంబీకులు వెతకగా ఇంటి బయట ఉరి వేసుకుని ఉండడంతో ఇంటి యజమాని సాయంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement