ముగిసిన జోనల్‌ క్రీడలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన జోనల్‌ క్రీడలు

Published Sun, Oct 20 2024 12:18 AM | Last Updated on Sun, Oct 20 2024 12:18 AM

ముగిస

పాల్వంచరూరల్‌: ఐటీడీఏ పరిధిలోని గిరిజన పాఠశాలల విద్యార్థులకు రెండు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు శనివారం ముగిశాయి. ఉమ్మడి జిల్లాలోని పలు పాఠశాలల నుంచి బాలబాలికలు పోటీలకు హాజరై సత్తా చూపారు. పాల్వంచ మండల పరిధి కిన్నెరసానిలోని ఆశ్రమ క్రీడా పాఠశాలలో మొదటి రోజు బాలికలకు, రెండో రోజు బాలురకు క్రీడలు నిర్వహించారు. శనివారం కబడ్డీ వాలీబాల్‌, అథ్లెటిక్స్‌, ఆర్చరీ, ఖోఖో తదితర పోటీల్లో 400 మంది బాలురు పాల్గొన్నారు. క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరైన ఐటీడీఏ పీఓ రాహుల్‌ మధ్యాహ్నం సమయంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో మాట్లాడి మెనూ అమలు తీరుపై ఆరా తీశారు.

రాష్ట్రస్థాయికి 240 మంది ఎంపిక

గిరిజన పాఠశాలల జోనల్‌స్థాయి క్రీడాపోటీల్లో భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని అన్ని ఆశ్రమ పాఠశాలల నుంచి 800 మంది క్రీడాకారులు పాల్గొనగా 8 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించినట్లు ఐటీడీఏ డీడీ మణెమ్మ తెలిపారు. ప్రతిభ చూపిన 240 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామని పేర్కొన్నారు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన క్రీడల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్రీడలు మానసిక వికాసానికి దోహద పడతాయని అన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయాల్సిన బాధ్యత పీఈటీలు, కోచ్‌లదేనని అన్నారు. పాఠశాలలకు వాలీబాల్‌ కిట్లను అందజేస్తామని తెలిపారు. స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ బి.గోపాల్‌రావు, ఏసీఎంఓ రమణయ్య, ఏటీడీఓలు చంద్రమోహన్‌, జహీరుద్దీన్‌, అశోక్‌కుమార్‌, ఏఎస్‌ఓ వెంకటనారాయణ, హెచ్‌ఎం ఎల్‌.రామారావు పీఈటీలు, పీడీలు, కోచ్‌లు పాల్గొన్నారు.

రెండు రోజులపాటు గిరిజన

బాలబాలికలకు పోటీలు

కిన్నెరసాని స్పోర్ట్స్‌ స్కూల్‌లో

ఎనిమిది క్రీడాంశాల్లో నిర్వహణ

No comments yet. Be the first to comment!
Add a comment
ముగిసిన జోనల్‌ క్రీడలు1
1/1

ముగిసిన జోనల్‌ క్రీడలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement