No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, May 7 2024 10:20 AM

-

నవరత్న వెలుగులు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి.. గతంతో పోలిస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి.. సంక్షేమ పథకాల అమలుపై అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.. ఇదే క్రమంలో తమ పాలకుడిని ఎన్నుకోవడంలోనూ క్లారిటీగా ఉన్నాయి.. మేలు చేసేవారికే మద్దుతు ఇస్తామని స్పష్టంగా చెబుతున్నాయి.. సోమవారం నగరి నియోజకవర్గంలో శ్రీసాక్షిశ్రీ బృందం నిర్వహించిన విలేజ్‌ విజిట్‌లో ప్రజల నుంచి ఇవే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు చేపట్టిన రోడ్‌ షో ముందుగా విజయపురం మండలం నుంచి ప్రారంభమైంది. అనంతరం నిండ్ర..నగరి మండలం.. పట్టణం..పుత్తూరు మండలం.. పట్టణం మీదుగా వడమాలపేట మండలం అప్పలాయిగుంట వరకు కొనసాగింది. ఈ క్రమంలో రైతులు.. వ్యవసాయ కూలీలు..విద్యార్థుల తల్లిదండ్రులు.. మహిళలు.. కార్మికులు.. చిరువ్యాపారులను పలకరించింది. వారి మనసులో మాటను రాబట్టింది.

– నగరి

Advertisement

తప్పక చదవండి

Advertisement