బనశంకరి: ఓ మహిళ మృతి చెందగా అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వెలుగు చూసింది. ఈ ఘటన గదగ బేటగెరి లేఔట్ పోలీస్స్టేషన్ పరిదిలో ఆదివారం చోటుచేసుకుంది. గదగ్ నగరంలోని సాయినగరలో హసీనాబేపారి(40) అనే మహిళ ఇంట్లో కుప్పకూలి మృతి చెందినట్లు ఆమె భర్త అందరినీ నమ్మించాడు. దీంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
అంత్యక్రియల్లో భాగంగా మృతదేహానికి స్నానం చేయిస్తుండగా గొంతుపై గాయం, చేతి బొటనవేలిపై ఇంకు గుర్తు కనిపించాయి. దీంతో అంత్యక్రియలు జరగకుండ మృతురాలు తల్లిదండ్రులు అడ్డుకున్నారు. అనంతరం బేటగెరెలేఔట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గదత్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చదవండి క్రైమ్ బ్రాంచి పోలీసునని చెప్పి.. బిర్యానీ తెమ్మని.. ఇంతలో..
Comments
Please login to add a commentAdd a comment