సీఎం వైఎస్‌ జగన్‌తోనే సువర్ణ పాలన | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌తోనే సువర్ణ పాలన

Published Tue, May 7 2024 11:20 AM

సీఎం

పొన్నూరు: గత ప్రభుత్వాలలో ఎన్నడూలేని విధంగా రాజకీయాలు, పార్టీలకతీతంగా.. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంట్లో సంక్షేమ లబ్ధి చేకూర్చిన ఏకై క సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని సీఎం వైఎస్‌ జగన్‌ బంధువు సునీతరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సతీమణి సజ్జల లక్ష్మి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రేపల్లె రోడ్డు నుంచి బాపట్ల రోడ్డు మీదుగా అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో సువర్ణ పాలన అందిస్తున్నారని అన్నారు. నవరత్నాల పథకాలతో ప్రతి ఒక్కరికీ మేలు చేకూరిందని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా వరికీ కష్టం లేకుండా పథకాలను అందించి దేశంలో ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ నిలిచారని కొనియాడారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పరిపాలన సాగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎం చేయాలని ఆకాంక్షించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ, ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యని గెలిపించాలని కోరారు. ప్రచారంలో అంబటి మురళీకృష్ణ కుటుంబ సభ్యులు ప్రత్యూష, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రూత్‌రాణి, రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ సభ్యులు షేక్‌ సైఫుల్లా, ఏఎంసీ చైర్మన్‌ ఆకుల వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు ఎంఏ మహమూద్‌, నాయకులు బొనిగల వేణుప్రసాద్‌, షేక్‌ నాజర్‌, వడ్రాణం ప్రసాద్‌, అమిరినేని సాంబశివరావు, షేక్‌ మాము, అంబటి వెంకటేశ్వర్లు, ఎందేటి వెంకట సుబ్బయ్య, బోయి నాగరాజు, మొల్ల కరీం, వట్టిప్రోలు రంగారావు, బొద్దులూరి రంగారావు, గేరా సంజీవ్‌, కుమారి, షేక్‌ షర్మిల, దేవరకొండ గోపి, అనీలా కుమారి, మండ్రు అనిత, కె.సుషోబిత, మూర్తి రాజు, షేక్‌. నయీంబాషా, షేక్‌ జానీబాషా, సుభాని, డక్కుమల్ల. రవి, గోపిశెట్టి నాగేశ్వరరావు, అల్లం సాంబయ్య పాల్గొన్నారు.

రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం ఖాయం కిలారి రోశయ్య, అంబటి మురళీకృష్ణలను మెజార్టీతో గెలిపించాలి వైఎస్‌ జగన్‌ బంధువు సునీత రెడ్డి, సజ్జల లక్ష్మి ప్రచారంలో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ

సీఎం వైఎస్‌ జగన్‌తోనే సువర్ణ పాలన
1/1

సీఎం వైఎస్‌ జగన్‌తోనే సువర్ణ పాలన

Advertisement

తప్పక చదవండి

Advertisement