శంషాబాద్: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కిషన్గూడలో ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసిన ఘటనలో రూ.74 లక్షల విలువైన హెరాయిన్ పట్టుబడింది. శంషాబాద్ సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి విశ్వసనీయ సమాచారంతో శంషాబాద్, ఎస్ఐ రాజ్కుమార్ బృందం కిషన్గూడలోని ఓ ఇంటిపై దాడులు చేశారు. ఫర్నిచర్ వ్యాపారం చేసే అంబాలాల్ సూతార్ 618 గ్రాముల హెరాయిన్తో పట్టుబడ్డాడు. దాని విలువ రూ. 74 లక్షలు ఉంటుందని పోలీసులు నిర్ధారిచారు. హెరాయిన్తో పట్టుబడ్డ వ్యక్తి దానిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఫర్నిచర్ వ్యాపారంతో పాటు అతడు హెరాయిన్ను మత్తుకు బానిసలైన వారికి విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. రాజస్థాన్కు చెందిన మదన్ బిష్ణోయ్ లోహావత్, పరాస్జీ అనే వ్యక్తుల నుంచి అంబాలాల్ హెరాయిన్ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సరఫరా చేసిన ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment