విద్యుత్‌లోడ్‌కు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్లు | Sakshi
Sakshi News home page

విద్యుత్‌లోడ్‌కు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్లు

Published Tue, May 7 2024 1:00 AM

విద్యుత్‌లోడ్‌కు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్లు

● ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సత్యనారాయణ

జగిత్యాలఅగ్రికల్చర్‌: విద్యుత్‌ లోడ్‌కు అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించాలని ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సత్యనారాయణ సూచించారు. గతనెల 18 నుంచి ఈనెల 6 వరకు జిల్లాకేంద్రంలో 451మంది విద్యుత్‌ సిబ్బందికి బ్యాచ్‌ల వారీగా అంతర్గత శిక్షణ అందించారు. ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. అవసరమైన చోట సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వేసవిలో లోడ్‌ పెరిగే అవకాశం ఉన్నందున చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షకాలంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున లైన్ల మరమ్మతు పనులు చేసుకోవాలని సూచించారు. శిక్షణ ఇచ్చిన టెక్నికల్‌ డీఈ గంగారాం, మెట్‌పల్లి ఏడీఈ మనోహర్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజమల్లును సన్మానించారు. టెక్నికల్‌ ఏడీఈ నగేశ్‌కుమార్‌, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement