ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం

Published Sun, May 5 2024 3:15 AM

ఎమ్మె

కరీంనగర్‌: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కొద్ది బీఆర్‌ఎస్‌ నాయకులు మరింత అఫ్రమత్తమవుతున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌ కుమార్‌ గెలుపే ధ్యేయంగా అలర్ట్‌ చేస్తున్నారు. తాజాగా శనివారం కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఎమ్మెల్యే గంగుల, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, మేయర్‌ సునీల్‌రావు, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్న వారిని గుర్తించే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. సరైన సమయంలో వారికి అండగా నిలుస్తామని హామీ ఇఛ్చారు.

ఇంటింటా ప్రచారం

కరీంనగర్‌: నగరంలోని మార్కండేయనగర్‌లో శనివారం 15వ డివిజన్‌ పార్టీ సీనియర్‌ ఉద్యమ కారుడు, యువజన విభాగం ప్రతినిధి వొడ్నాల రాజు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుపై ఓటు వేసి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. సీనియర్‌ మహిళా ప్రతినిధులు విజయ, రాజేశ్వరి, లావణ్య, పుష్పలత, అనిత, నవ్య, అఖిల, శివాజీ, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశ
1/1

ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశ

Advertisement
 
Advertisement