కరీంనగర్: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వయోవృద్ధుల ‘వాక్థాన్’ కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా జ్యోతిబాపూలే మైదానం నుంచి కలెక్టరేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ వాక్థాన్ను ప్రారంభించారు. వయోవృద్ధులు నిత్యం యోగా, వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, వయోవృద్ధుల సంక్షేమ సంఘాల బాధ్యులు సముద్రాల జనార్దన్రావు, మోసం అంజయ్య, పెండ్యాల కేశవరెడ్డి, సీడీపీవో సబిత, చైల్డ్లైన్ కో– ఆర్డినేటర్ సంపత్, డీహెచ్ఈడబ్ల్యూ కో–ఆర్డినేటర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment