తిమ్మాపూర్: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, పల్లెలు, పట్టణాల అభివద్ధికి నిఽ దులు తెస్తానని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్ అన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన్నెంపల్లి, పర్లపల్లి, మానకొండూర్ మండలం దేవంపల్లిలోని గురుకుల పాఠశాలలో శనివారం ప్రచారం నిర్వహించారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలంటూ వి ద్యావంతులను కోరారు. తాను మేయర్గా కరీంనగర్ను ఎంతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. పొన్నం అనిల్గౌడ్, కెంసారం తిరుపతి, ముప్పిడి సంపత్రెడ్డి, చిందం చంద్రమౌళి, సుద్దాల రాజేశ్, నార్ల అశోక్, వేణుకుమార్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment