ఐస్‌క్రీం తిని 100 మందికి అస్వస్థత | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీం తిని 100 మందికి అస్వస్థత

Published Tue, May 7 2024 1:30 AM

ఐస్‌క్రీం తిని  100 మందికి అస్వస్థత

దొడ్డబళ్లాపురం: వివాహ భోజనంలో వడ్డించిన ఐస్‌క్రీంలు తిని 100 మంది అతిథులు ఆస్పత్రి పాలైన సంఘటన చెన్నపట్టణలో చోటుచేసుకుంది. చెన్నపట్టణ పరిధిలోని టిప్పు నగర్‌లో ఆదివారం రాత్రి ముస్లింల ఇంట్లో పెళ్లి విందు జరిగింది. చెన్నపట్టణకు చెందిన వధువు, మాగడికి చెందిన వరునికి వివాహం జరిగింది. అతిథులకు భోజనాలతో పాటు ఐస్‌క్రీంలు ఇచ్చారు. అవి తిన్న కాసేపటికే వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పిల్లలే ఎక్కువమంది ఉన్నారు. వెంటనే అంబులెన్సులు, దొరికిన వాహనాల్లో మండ్య, రామనగర, చెన్నపట్టణ, మాగడి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. గడువు తీరిన ఐస్‌క్రీం కలుషితమైందని, దానిని తినడం వల్లే ఇలా జరిగిందని సమాచారం. పోలీసులు, ఆహారశాఖ అధికారులు ఐస్‌క్రీం శాంపిల్స్‌ను ల్యాబ్‌ పరీక్షలకు పంపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement