ఇద్దరు శిశువులను చంపిన వైనం
రామనగరలో ఘాతుకం
మహిళ, ప్రియుడు అరెస్టు
శివాజీనగర: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కారణంతో ఓ తల్లి రక్తపిశాచిగా మారి, కన్నబిడ్డలనే హత్య చేసిన ఘటన రామనగర పట్టణంలోని కెంపేగౌడ సర్కిల్ వద్ద ఉన్న ఓ ఇంట్లో జరిగింది. 3 ఏళ్ల కబిల్, 11 నెలల కబీలన్ మృతులు. వివరాలు.. స్వీటీ (21) అనే యువతికి కొన్ని సంవత్సరాల కిందట శివుతో పెళ్లయింది. కొన్ని నెలలుగా ఆమె భర్తను వదిలేసి గ్రెగొరి ఫ్రాన్సిస్ (30) అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరూ ఏకాంతంగా ఉండగా, పిల్లలు గట్టిగా ఏడవసాగారు. వారిని సముదాయించాలని ఎంత ప్రయత్నంచేసినా ఏడుపు ఆపలేదు. దీంతో ప్రియుడు ఫ్రాన్సిస్ ఆమె మీద విసుక్కోవడంతో ఆగ్రహం పట్టలేక పిల్లలిద్దరినీ గొంతు పిసికి చంపేసింది.
శ్మశానంలో బట్టబయలు
స్వీటీ, ఫ్రాన్సిస్ శనివారమంతా ఇంట్లోనే పిల్లల శవాలతో గడిపారు. ఆదివారం వారిని స్థానిక శ్మశానానికి తీసుకువచ్చారు. సిబ్బంది ఇద్దరూ ఒకేసారి ఎలా మృతిచెందారని ప్రశ్నించగా జ్వరం వచ్చింది, చనిపోయారు అని ఆమె చెప్పింది. శిశువుల దేహాలపై గాయాలను గుర్తించారు. మొబైల్లో ఫోటోలు తీసి పోలీసులకు కాల్ చేశారు. ఐజూరు పోలీసులు చేరుకుని స్వీటీ, ఫ్రాన్సిస్ను అరెస్ట్ చేసి విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. వారిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment