కోలారు: శాంతి, సౌహార్ధత, సామరస్యం నడుమ పండుగలను ఆచరించాలని, ఈసారి జిల్లాలో బాగా పంటలు పండి రైతులు సంతోషంగా ఉండాలని ప్రార్థించాలని అంబేడ్కర్ నగర శ్రీ రేణుకా యల్లమ్మ ఆలయ ధర్మాధికారి డాక్టర్ ఎ కృష్ణప్ప తెలిపారు. నగరంలో దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా సమితి సంస్థాపక అధ్యక్షుడు దివంగత కెఆర్ ధనరాజ్ వేదికలో నిర్వహించిన గ్రామ దేవతల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కోలారు నగరంలో దసరా పండుగను వైభవంగా, అర్థవంతంగా కులమతాలకతీతంగా ఆచరించే వాతావారణాన్ని దసరా ఉత్సవ సమితి కల్పిస్తుండడం శ్లాఘనీయమన్నారు. కోలారు నగర దసరా ఉత్సవ సమితి అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ... కోలారు నగరంలో గత నాలుగు సంవత్సరాలుగా దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని, పోలీసు బందోబస్తు, భయం వాతావరణంలో పండుగలను నిర్వహించడం కాకుండా అందరం కలిసి పండుగలను ఆచరించే విధంగా ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment