వైరా: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరామ్మకాలనీలో శుక్రవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా విస్తరించిందన్నారు. కార్యక్రమంలో శ్యామ్ రాథోడ్, కోటేశ్వరరావు, భద్రయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం విఫలం
కల్లూరురూరల్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులకు గురవుతుంటే సహకారం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జాతీయ నాయకులు, తమిళనాడు సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్రెడ్డి విమర్శించారు. స్వగ్రామం నారాయణపురంలో శుక్రవారం రాత్రి పోలింగ్ బూత్ నంబర్ 94, 95లలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే 18 కోట్ల మంతి బీజేపీ సభ్యత్వం పొందరాని, మరో 10 కోట్ల మందిని చేర్చాలనే లక్ష్యంతో పార్టీ పని చేస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment