సత్తుపల్లి: వేగంగా వస్తున్న కారు డివైడర్ను ఢీకొని గాల్లోకి ఎగిరి పడిన ఘటన మండలంలోని గంగారం గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గంగారం గ్రామానికి చెందిన బెజవాడ చెన్నకేశవ, దేవేంద్రసాయి, ఎం.వెంకటకృష్ణ, కాలసాని శ్రీనివాసరావులు గణేశ్ నిమజ్జనాన్ని పూర్తి చేసుకొని కారులో మేడిశెట్టివారిపాలెం నుంచి గంగారం వస్తుండగా సాయిస్ఫూర్తి కళాశాల ఎదుట కారు వేగంగా డివైడర్ను ఢీకొంది. దీంతో కారు గాలిలోకి ఎగిరి పక్కనే తుప్పల్లో పడిపోయింది. కారులో ఉన్న కాలసాని శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఖమ్మం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment