3.50లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) ద్వారా ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు రూ.99 కోట్ల విలువైన 3.50 లక్షల క్వింటళ్ల ధాన్యం కొనుగోలు చేశామని చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు వెల్లడించారు. ఖమ్మంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలోని 29కేంద్రాల ద్వారా 2.56 లక్షల క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలోని 11కేంద్రాల ద్వారా 94వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా రైతుల వద్ద ధాన్యం ఉంటే డీసీఎంఎస్ కేంద్రాల్లో త్వరగా విక్రయించుకోవాలని సూచించారు. పాలకవర్గ సభ్యులు పరుచూరి రవికుమార్, జక్కుల లక్ష్మయ్య, కుంచపు వెంకటేశ్వర్లు, తోళ్ల కోటయ్య, మారుతి ఎట్టయ్య, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ కె.సందీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment