గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ప్రజలు బుక్ చేసుకున్న వెంటనే ఇసుక రవాణాకు చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉచిత ఇసుక విధానం అమలుపై గురువారం కలెక్టర్ సృజన జేసీ డాక్టర్ నిధి మీనాతో కలిసి గనులు భూగర్భ, రవాణా, ఇసుక లారీల యజమానుల సంఘం ప్రతి నిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలస్యం లేకుండా త్వరిత గతిన ఇసుక రవాణా జరిగేలా ఇసుక రవాణా వాహనదారులు సహకరించాలన్నారు. రీచ్ నుంచి వినియోగదారుల ఇంటి వద్దకే ఇసుకను రవాణా చేసిన వాహనాలకు జాప్యం లేకుండా సంబంధిత రుసుమును నేరుగా ఖాతాలో జమచేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇసుక రవాణాకు ఆసక్తి కలిగిన వాహనాలను ఏపీ శాండ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ దృష్ట్యా రాత్రి సమయంలో ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇసుక రవాణా చార్జీలను, నిర్వహణ ఖర్చులను మాత్రమే తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు, బుకింగ్ అనంతరం ఇసుక రవాణా, ఫెసిలిటేషన్ కేంద్రాల్లో గుర్తించిన సమస్యలు, ఐవీఆర్ఎస్ రిపోర్టు స్టేటస్, జీఎస్టీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. గనులు భూగర్భ శాఖ సహాయ సంచాలకుడు వీరాస్వామి, ట్రాఫిక్ ఏఎస్పీ ప్రసన్నకుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె.వెంకటేశ్వరరావు, రమణారావు, శాండ్ లారీ ఓనర్స్ సంఘ ప్రతినిధులు ఉన్నారు.
కలెక్టర్ డాక్టర్ జి.సృజన
Comments
Please login to add a commentAdd a comment