ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించండి | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించండి

Published Sat, Sep 28 2024 2:28 AM | Last Updated on Sat, Sep 28 2024 6:28 PM

 సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు

జిల్లా ఉద్యాన అధికారి రామాంజనేయులు 

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు ను ప్రోత్సహించాలని, ఈ పంట సాగుకు ఉన్న అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు ఆదేశించారు. శుక్రవారం ఆయ న తన కార్యాలయంలో జిల్లాలోని ఉద్యాన అధికారులతో ఉద్యాన పథకాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్‌, ఆర్‌కేవీవై, ఆయిల్‌పామ్‌ సాగు తదితర వాటిపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో రాబోయే మూడు నెలల్లో ఉద్యానశాఖ చేపట్టే కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ఎంఐడీహెచ్‌, ఆర్‌కేవీవై కింద వివిధ కాంపోనెంటు కింద ఇచ్చిన లక్ష్యాలను సాధించడంపై దృష్టి సారించాలని తెలిపారు. 

ఇప్పటి వరకు ఈ ఏడాది 250 హెక్టార్లలో ఉద్యాన పంటల విస్తరణ చేపట్టామని, 70 హెక్టార్లలో పాత తోటల పునరుద్ధరణ జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 10 హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటడం పూర్తి అయిందని, వచ్చే మూడు నెలల్లో కనీసం 20 హెక్టార్లలో సాగు చేపట్టే విధంగా చూడాలన్నారు. సమావేశంలో ఉద్యాన సాంకేతిక అధికారి అనూష, ఉద్యాన అధికారులు నరేష్‌, ఇందిర, అపర్ణ, శ్రీవాణి, మదన్‌మోహన్‌గౌడు, దస్తగిరి పాల్గొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement