కర్నూలు : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కర్నూలులో రెచ్చిపోయారు. దేవర సినిమా విడుదల సందర్భంగా గురువారం అర్ధరాత్రి శ్రీరామ థియేటర్ వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని సందడి చేస్తున్నారు. అందులో మద్యం సేవించిన కొందరు అటువైపు వస్తున్న తమిళనాడుకు చెందిన ప్రైవేటు బస్సుపై రాళ్లు రువ్వడంతో అద్దాలు పగిలిపోయాయి. బస్సులోని ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న క్యూఆర్టీ పోలీసులు అక్కడికి చేరుకోగా గుంపులో ఉన్న కొంతమంది అభిమానులు రెచ్చిపోయి క్యూఆర్టీ వాహనంపై కూడా రాళ్లు రువ్వి రోడ్డుకు అడ్డంగా నిలబడి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించారు. దీంతో విధుల్లో ఉన్న సిబ్బంది ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడు బస్సు,
క్యూఆర్టీ వాహనంపై రాళ్లతో దాడి
Comments
Please login to add a commentAdd a comment