విరిగిన 15 స్తంభాలు, 4 ట్రాన్స్‌ఫార్మర్లు | - | Sakshi
Sakshi News home page

విరిగిన 15 స్తంభాలు, 4 ట్రాన్స్‌ఫార్మర్లు

Published Tue, Nov 14 2023 1:38 AM | Last Updated on Tue, Nov 14 2023 8:29 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: రైతు పొలం నుంచి చెరుకు లోడ్‌తో వెళ్తున్న లారీకి విద్యుత్‌ స్తంభాల తీగలు తగిలి వరుసగా నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లు దిమ్మెల పైనుంచి కింద పడి, స్తంభాలు విరిగిన సంఘటన మహమ్మదాబాద్‌ మండలంలో చోటుచేసకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని అన్నారెడ్డిలో ఓ రైతు పొలంలో చెరుకు కోసుకుని లారీకి లోడ్‌ చేశారు.

అటు నుంచి రోడ్డుపైకి వచ్చి వెళ్తున్న లారీకి పైనున్న విద్యుత్‌ తీగలు తగిలాయి. గమనించకుండా లారీని తోలడంతో 15 విద్యుత్‌ స్తంభాలు, 4 ట్రాన్స్‌ఫార్మర్లు కిందపడిపోయాయి. దీంతో 20 మంది రైతుల వరకు బోరుమోటార్లు నడవకుండా నిలిచిపోయాయి. ఆ సమయంలో విద్యుత్‌ లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని రైతులకు పెనుప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలియజేశారు. విద్యుత్‌ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్‌ లైన్‌ పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement