మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం: కలెక్టర్‌

Published Sat, Sep 7 2024 1:32 AM | Last Updated on Sat, Sep 7 2024 1:32 AM

మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం: కలెక్టర్‌

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): పర్యావరణ పరిరక్షణతో పాటు, వాతావరణ సమతుల్యానికి ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేద్దామని కలెక్టర్‌ విజయేందిర పిలుపునిచ్చారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టితో తయారు చేసిన 2,500 మట్టి గణపతులను గురువారం ఆమె సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో సిబ్బందికి, కార్యాలయానికి వచ్చిన వారికి పంపిణీ చేశారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారుచేసిన విగ్రహాలను వాడడం వల్ల వాతావరణం కలుషితం అవుతుందన్నారు. అలాగే నిమజ్జనం చేసినప్పుడు నీరు సైతం కలుషితమవుతుందని, ఇది హాని కలిగిస్తుందననారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఇందిర, డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు కలెక్టర్‌ కార్యాలయ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement