స్టేషన్ మహబూబ్నగర్: వినాయక చవితి ఉత్సవాలకు జిల్లాకేంద్రంలోని పాతపాలమూరు వినాయక ఉత్సవాలు ప్రత్యేకత చాటుకుంటోంది. పాతపాలమూరులోని జైల్ఖానా సమీపంలో శ్రీశివరామాంజనేయ భక్తసమాజం ఆధ్వర్యంలో ప్రతిష్ఠిస్తున్న గణేష్ ఉత్సవాలకు 66 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. గతంలో శివరామాంజనేయస్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్ఠిస్తున్నారు. ఈసారి వినాయకుడిని హైదరాబాద్ ధూల్పేటలోని దేశ్రాజ్సింగ్ కళాకార్ 26 అడుగుల వినాయకుడిని ప్రతిష్ఠించనున్నారు. ఖైరతాబాద్లో వినాయకుడి తరహాలో ముఖం, చెవులు, తొండం మాదిరిగా ఇక్కడి వినాయకుడిని తయారు చేయించారు. అయోధ్యలో బాలరాముడి కళ్లు మాదిరిగా ఈ వినాయకుడి కళ్లు రూపొందించడం విశేషం.
ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం
శివరామాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలను ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా ఎంతో వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమాలతో పాటు 9 రోజుల పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, భజన, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. నిమజ్జనం రోజు లక్కిడిప్లో గెలుపొందిన విజేతకు సన్మానం చేసి 51 కిలోల లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తాం. – గోరంట్ల మాల్యాద్రిరెడ్డి, గౌరవ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment