ఉన్నత చదువులతోనే ఉత్తమ జీవితం | - | Sakshi
Sakshi News home page

ఉన్నత చదువులతోనే ఉత్తమ జీవితం

Published Mon, Sep 16 2024 1:04 AM | Last Updated on Mon, Sep 16 2024 1:04 AM

ఉన్నత చదువులతోనే ఉత్తమ జీవితం

పాలమూరు: చదువులో రాణించే వారికి భవిష్యత్‌లో ఉత్తమ జీవితం లభిస్తుందని, ఈ లోకంలో చదువుకు మించిన ఆస్తి లేదని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా సగర (ఉప్పర) సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని పట్టణంలోని ఏనుగొండలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీతోపాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి హాజరై విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాజకీయంగా అవకాశాలు రావాలంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని, నాయకుడు ఎప్పుడైనా ప్రజలతో కలిసి ఉండటం నేర్చుకోవాలన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు కీలకంగా మారిందన్నారు. మహబూబ్‌నగర్‌ ఎంపీగా నన్ను ఓడించడానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.కోట్లు ఖర్చు చేసినా ఓడించలేకపోయారని విమర్శించారు. పాలమూరు ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. సగరులు రాజకీయంగా ఎదిగేందుకు తనవంతు పూర్తి సహాయ, సహకారాలను అందిస్తానని చెప్పారు. సమాజంలో వేలూనుకున్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి కృషిచేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సగరులు పోటీ చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ అదనపు కలెక్టర్‌ చీర్ల శ్రీనివాస్‌, సగర సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్‌సాగర్‌, జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌సాగర్‌, రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆర్‌బీ ఆంజనేయులు, బీసీ సమాజ రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, సగర సేవా సమితి జిల్లా అధ్యక్షుడు పర్వతాలు, ప్రధాన కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement