22న ఒలింపిక్‌ సంఘం నూతన కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

22న ఒలింపిక్‌ సంఘం నూతన కమిటీ ఎన్నిక

Published Mon, Sep 16 2024 1:04 AM | Last Updated on Mon, Sep 16 2024 1:04 AM

-

మహబూబ్‌నగర్‌ క్రీడలు: తెలంగాణ రాష్ట్ర ఒలింపిక్‌ క్రీడా సంఘం ఆదేశానుసారం జిల్లాకేంద్రంలోని స్టేడియం మైదానంలో ఈ నెల 22న సర్వసభ్య సమావేశం, ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడానికి అడ్‌హక్‌ కమిటీ నిర్ణయించినట్లు కమిటీ కన్వీనర్‌ కురుమూర్తిగౌడ్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు నూతన ఒలింపిక్‌ కమిటీ ఎన్నిక ఉంటుందని, ఉమ్మడి జిల్లాలోని రిజిష్టర్‌ అయిన క్రీడా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు సమావేశంలో పాల్గొనాలని ఆయన కోరారు. అడ్‌హక్‌ కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ క్రీడాశాఖ వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement