పాలమూరులో రెడ్‌క్రాస్‌ అభివృద్ధికి సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

పాలమూరులో రెడ్‌క్రాస్‌ అభివృద్ధికి సహకరించాలి

Published Fri, Oct 18 2024 12:42 AM | Last Updated on Fri, Oct 18 2024 12:42 AM

పాలమూరులో రెడ్‌క్రాస్‌ అభివృద్ధికి సహకరించాలి

పాలమూరు: మహబూబ్‌నగర్‌లో రెడ్‌క్రాస్‌ సమీకృత భవనానికి సహకరించాలని రాష్ట్ర గవర్నర్‌ను స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గురువారం రెడ్‌క్రాస్‌ ప్రతినిధులతో కలిసి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను ఎమ్మెల్యే కలిశారు. పాలమూరు పట్టణంలో రెడ్‌క్రాస్‌ సంస్థను ఆధునికీకరణ చేయాలని, అలాగే విశాలమైన ప్రాంగణంలో రెడ్‌క్రాస్‌ భవన నిర్మాణానికి సహకరించాలని కోరారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న బ్లడ్‌ బ్యాంక్‌ను ఇంకా అభివృద్ధి చేసి, మల్టీపర్పస్‌ ఉండే విధంగా రెడ్‌క్రాస్‌ సంస్థలో ఒక అత్యాధునిక ఆస్పత్రిని ఏర్పాటు చేసి ప్రతిరోజూ అవుట్‌ పేషంట్స్‌కు వైద్యం అందించే విధంగా వైద్యులను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు అన్ని రకాల వసతులతో కూడిన డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు చేయడానికి అవకాశం కల్పించాలన్నారు. రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి నిర్వహణ కొనసాగించాలన్నారు. దీంతో పాటు మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న విద్యా అభివృద్ధిని ఎమ్మెల్యే గవర్నర్‌కు వివరించారు. ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న 200మంది పేద విద్యార్థులకు ఉచితంగా మెడికల్‌, ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే పదేళ్ల కాలంలో 20వేల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభం చేయన్నుట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ రాష్ట్ర చైర్మన్‌ శ్రీరాములు, జిల్లా చైర్మన్‌ నటరాజ్‌ పాల్గొన్నారు.

గవర్నర్‌ను కోరిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement