ఉచితంగా ‘అందరికీ భగవద్గీత’ | - | Sakshi
Sakshi News home page

ఉచితంగా ‘అందరికీ భగవద్గీత’

Published Fri, Oct 18 2024 12:42 AM | Last Updated on Fri, Oct 18 2024 12:42 AM

ఉచితంగా ‘అందరికీ భగవద్గీత’

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ‘అందరికీ భగవద్గీత’ పుస్తకంతో పాటు భగవద్గీత కంఠస్థ పోటీల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ జిల్లా కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్‌ ఉత్తరపల్లి రామాచారి మాట్లాడుతూ డాక్టర్‌ విభీషణ శర్మ రచించిన ‘అందరికీ భగవద్గీత’ పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. భగవద్గీత పుస్తకాలను విద్యార్థుల కోసం పాఠశాల యాజమాన్యాలకు టీటీడీ కల్యాణ మండపంలో శుక్ర, శనివారం పంపిణీ చేస్తామని, ఆసక్తిగల వారు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ధార్మిక మండలి సభ్యులు కె.లక్ష్మినారాయణ, సురేష్‌చందర్‌ దూత్‌, బి.రాములు, దామోదర్‌రెడ్డి, ధర్మాచార్యులు ఎం.శ్రీరాములు, నరేష్‌, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement